jagan assets

జగన్ మోహన్ రెడ్డి 143 కోట్ల ఆస్తులు జప్తు

      జగన్ అక్రమ ఆస్తుల కేసులో 143 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ మెంట్ చేసినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రకటించింది. గతంలో భారతి సిమెంట్, జనని ఇన్ ఫ్రా కు సంబంధించిన రూ.51 కోట్ల ఆస్తులు అటాచ్ చేశారు. రాంకీ సంస్థకు చెందిన రూ.133 కోట్ల ఆస్తులతో పాటు, ఆ సంస్థ జగతి పబ్లికేషన్స్ లో పెట్టిన రూ.10 కోట్ల ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ కేసులో వేసిన చార్జ్ షీట్ ఆధారంగా ఈ ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో చేసిన ఆస్తుల అటాచ్ మెంట్ చెల్లదని జగన్ తరపు సంస్థలు కోర్టులలో పిటీషన్లు వేశాయి. తాజాగా ఇంత పెద్ద ఎత్తున ఆస్తులు అటాచ్ చేయడం జగన్ కు, ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ విషయం మింగుడు పడని అంశమే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.  

Akbaruddin owaisi mla disqualification

అక్బరుద్దీన్ ఫై ఎంఎల్ఏ గా అనర్హత వేటు ?

      ఇటీవల నిర్మల్ లో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగించిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసిఫై ఎంఎల్ఏ గా కొనసాగే అర్హత లేకుండా వేటు వేసే అవకాశం కనిపిస్తోంది. తాను చేసిన ప్రసంగాల ద్వారా ఆయన రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా వ్యవహరించారని శాసన సభ నైతిక విలువలు, ప్రవర్తన నియమావళి సంఘం ప్రాధమికంగా అభిప్రాయపడింది.   బందరు సత్యానంద రావు అధ్యక్షతన నిన్న ఈ కమిటీ అసెంబ్లీ ప్రాంగణంలో సమావేశం అయింది. అక్బర్ చేసిన ప్రసంగాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకు వెళ్లి ఆయనఫై చర్య తీసుకోవాలని సిఫార్సు ఆ సంఘం భావిస్తోంది. ఈ కమిటీ తన నిర్ణయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకు వెళ్ళిన సమయంలో తనకు కూడా ఈ విషయంలో ఫిర్యాదులు అందాయని మనోహర్ అన్నట్లు తెలిసింది. అయితే, ఇతర రాష్ట్రాల్లో ఉన్న నియమావళిని కూడా పరిశీలించాలని ఈ కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. ఏదేని సభ్యుని ప్రవర్తన ఆధారంగా చర్య తీసుకోవాలని సిఫారసు చేసే అధికారం తమ కమిటీకి ఉందని బండారు అన్నారు.   అయితే, అక్బర్ పేరును నేరుగా ప్రస్తావించకుండా ఓ సభ్యుడు చేసిన మత విద్వేషాల ప్రసంగాలు చర్చకు వచ్చాయని బండారు అన్నారు. ఏ సభ్యుడు అయినా, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగేలా వ్యవహరిస్తే, ఆ సభ్యుని శాసనసభ్యత్వం రద్దు చేయాలని సిఫారసు చేసే అధికారం తమ కమిటీకి ఉందని బండారు అన్నారు.

putaparthi

పుటపర్తి బాబా మహా సమాధికి అపచారం

  ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఆరాద్యదైవంగా కొలిచే పుటపర్తి సత్యసాయిబాబా నిర్యాణానికి నెలరోజుల ముందునుంచే పుటపర్తి వివాదాలకి కేంద్రబిందువుగామారిన సంగతి తెలిసిందే. అయన నిర్యాణంతరము కూడా చాల రోజులు పుటపర్తి అనేక వివాదలాలవల్ల వార్తలలో నిలిచింది. అయితే,గత కొన్ని నెలలుగా అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొనడం అయన భక్తులందరికీ సంతోషం కలిగించింది.   మళ్ళీ, నిన్న అనగా ఆదివారంనాడు పుటపర్తిలో కలకలం రేగింది. బాబా భక్తుల మనసులు గాయపరిచే సంఘటన ఒకటి పుటపర్తిలో చోటుచేసుకొంది.   గత ఆరు సంవత్సరాలుగా పుటపర్తిలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో హ్రుదయ్యరోగ నిపుణుడిగా సేవలందిస్తున్న డా.నవనీత్ అనే ఆయన బాబా భాకుతుడు కూడా. అయన రోజూ ఉదయం సాయంకాలం తెండు పూతల బాబా దర్శనం చేసుకొంటాడు కూడా. నిన్న ఆదివారనాడు కూడా రోజూలాగే దర్శనం కొచ్చిన ఆయన, భక్తులందరూ ప్రార్ధనల అనంతరం ఒకరొకరిగా బయటకి వెళ్ళిపోతున్నసమయంలో బాబా మహా సమాదిపై తన మూత్రం చిలకరిస్తుంటే, భక్తులు నివ్వెరపోయి వెంటనే అతనిని పట్టుకొని పుటపర్తి పోలీసులకి అప్పజెప్పారు.   ఆయనని దాదాపు గంట సేపు విచారించిన పోలీసులు అతనికి మతి స్థిమితం తప్పిందని చెపుతూ వదిలేసారు.గానీ భక్తులు గట్టిగా ప్రశ్నించడంతో అతనిని మళ్ళీ సోమవారం నాడు పిలిచి విచారిస్తామని తెలిపారు. అయితే, అతని మీద కేసు నమోదు చేసి చర్య తీసుకోవాలంటే, ట్రస్ట్ కు సంబందించిన వారుగానీ, బాబా భక్తులుగానీ తమకు పిర్యాదు చేస్తే తప్ప ఏమి చేయలేమని చెప్పారు. అయితే, ఇంతవరకు ఎవరూ పిర్యాదు చేయలేదని సమాచారం.   బాబా భక్తులు ఆ డాక్టర్ నిజంగా మతి స్థిమితం లేని వాడయితే అటువంటి వ్యక్తీ ఆసుపత్రిలో రోగులకు అదికూడా హృద్రోగులకు వైద్యం ఎలా చేస్తున్నాడని, అటువంటి వ్యక్తీ చేతిలో రోగుల ప్రాణాలు ఏవిదంగా పెడుతున్నారని ప్రశ్నిస్తే వాటికి సమాధానం లేదు. అంటే గాకుండా వేలాది భక్తులు దర్శనం చేసుకొనే బాబా మహా సమాధిని సరయిన భద్రతా కల్పించకుండా ట్రస్ట్ వారు ఏమిచేస్తున్నారని ఆగ్రహంతో భక్తులు ప్రశ్నించేరు.

 Akbar arrest cm

అక్బరుద్దీన్ ఓవైసి విషయంలో సిఎం ఆచి తూచి ?

    మత విద్వేషాలను రేచ్చగొట్టాడనే విషయంలో పోలీస్ కేసు నమోదు అయిఉన్న ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే, ఆయన హైదరాబాద్ విమానాశ్రయంలో దిగిన వెంటనే జరిగిన పరిణామాలు మరింత చర్చనీయాంసంగా ఉన్నాయి.   అక్బర్ శంషాబాద్ లో దిగిన వెంటనే ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వారి నినాదాల మధ్య అక్బర్ తన జుబ్లీ హిల్స్ నివాసానికి ఓ హీరో లా వెళ్లి పోయారు తప్ప, ఆయనను అరెస్టు చేసే ప్రయత్నమేదీ పోలీసులు చేయలేదు ! ఆయనఫై ఐపిసి సెక్షన్లు 153 (A), 121 కింద కేసులు నమోదు అయి ఉన్నాయి. ఇవి తీవ్రమైన సెక్షన్లు.   అక్బర్ నిర్మల్ పోలీస్ స్టేషన్ లో హాజరవుతారని పోలీసులు మొదట భావించారు. అయితే, ఆయన అక్కడికి వెళ్ళకుండా ఆరోగ్యం బాగోలేదంటూ తన లాయర్లను పంపించారు. అయితే, ఈ విషయంలో ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జోక్యం చేసుకొన్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. అక్బర్ ను అరెస్టు చేస్తే, నగరంలో మత ఘర్షణలు చోటు చేసుకొనే అవకాశం ఉండటంతో ‘నెమ్మది’ గా పోవాలని ఆయన పోలీసులకు సూచించినట్లు తెలుస్తోంది.   అందుకే, కోర్టు ఆదేశాల కోసం వేచి చూడాలని పోలీసులకు సలహాలు ఉన్నాయని సమాచారం.

 Dasari narayana rao comments

దాసరి మరో బాంబు !

      ఏదో వ్యాఖ్యలతో ఈ మధ్య వరుసగా వార్తల్లో ఉంటూ వస్తున్న దర్శక రత్న దాసరి నారాయణ రావు మరో సంచలన వ్యాఖ్య చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో కొంత మంది ‘పెద్దోళ్ళు’ చిత్ర పరిశ్రమ పేరు చెప్పుకొని ఉన్నత స్థానాల్లోకి వెళ్లారని, అయితే, వారు ఎవ్వరూ తెలుగు వారి గొప్పతనాన్ని చాటి చెప్పే ఒక్క సినిమా కూడా తమ కేరీర్లలో తీయలేదని దుయ్యబట్టారు.     వీరు చిత్ర పరిశ్రమలో వచ్చిన తమ ఆదాయాన్ని ఇతర కార్యకలాపాలలోకి మళ్లిస్తున్నారని దాసరి అన్నారు. ఇలాంటి వారంతా ధియేటర్లను, స్టూడియోలను అద్దెకు ఇస్తున్నారని దాసరి వ్యాఖ్యానించారు. ఇలాంటి వాళ్ళంతా, రాష్ట ప్రభుత్వం నుండి, సినీ పరిశ్రమ నుండి అనేక రకాలుగా రాయితీలు పొంది కూడా తెలుగు చిత్ర పరిశ్రమ కోసం ఏమీ చేయడం లేదని దాసరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.   తనికెళ్ళ భరణి దర్శకత్వం వహించిన ‘మిధునం’ సినిమా విజయోత్సవంలో పాల్గొన్న దాసరి గతంలో ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినీ పరిశ్రమలోని కొంత మంది తన వ్యతిరేకులను అప్పుడప్పుడూ ఇలా దుమ్మెత్తి పోస్తూ ఉండటం ఆయనకు అలవాటు అయిపొయింది. ఆ తర్వాత వాళ్ళను అనలేదని సంజాయిషీ ఇవ్వడమూ ఆయనకు అలవాటు అయిపొయింది. ఆ మధ్య సురేష్ కృష్ణ రాసిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కూడా ఏదో వ్యాఖ్య చేసి, ఆ తర్వాత అవి అక్కినేని ని గానీ, రామ్ చరణ్ ను కానీ ఉద్దేశించి చేయలేదని ‘సంజాయిషీ’ ఇచ్చేసారు.   మరి ప్రస్తుతం దాసరి చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేసిన్చినవో తెలుసుకోవాలంటే కొంచెం సమయం పడుతుందేమో !

 Kavuri sambasiva rao case

కావూరి ఫై కొల్లేరు లో కేసు నమోదు

      ఏలూరు పార్లమెంట్ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కావూరి సాంబశివ రావు ఫై పశ్చిమ గోదావరి జిల్లా కొల్లేరు లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన వన్య ప్రాణి చట్టం లోని కొన్ని నిభందనలను అతిక్రమించారని అటవీ శాఖ అధికారులు ప్రకటించారు.   కోమటిలంక రోడ్డు వివాదానికి సంభందించి ఈ కేసు నమోదు అయింది. ఆ గ్రామం వద్ద జరుగుతున్న రోడ్డు నిర్మాణాన్ని అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడానికి ప్రయత్నించిన సమయంలో వారిఫై కావూరి దౌర్జన్యం చేశారనే ఫిర్యాదుతో ఈ కేసు నమోదు అయింది. కోల్లెరు లో కాంటూర్ తగ్గించాలంటూ స్థానికంగా ప్రజలు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు కావూరి తన మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.     సీనియర్ పార్లమెంట్ సభ్యుడు అయి ఉండి, ఇలా అధికారులఫై చేయి చేసుకోవడం ఎంత వరకూ సమంజసమో ఆయనో నిర్ణయించుకోవాలి. ప్రజల తరపున పోరాడటాన్ని ఎవరూ తప్పు బట్టరు. అయితే, ఇలా చట్టాన్ని అమలు పరిచే అధికారులఫై చేయి చేసుకోవడం మాత్రం తప్పే అవుతుంది.

Minister kasu telangana

ప్రత్యెక రాష్ట్రం ఇస్తే రాజీనామా : కాసు వార్నింగ్..!

    కేంద్రం ప్రత్యెక తెలంగాణా రాష్ట్రం ఇస్తే తాను వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని రాష్ర్ట సహకార శాఖ మంత్రి కాసు కృష్ణా రెడ్డి ప్రకటించారు. నిన్న గుంటూరు జిల్లా చిలకలూరిపేట లో విలేఖరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.   తాను సమైఖ్యాంధ్ర ను కోరుకొనే కుటుంబంలో పుట్టానని కాబట్టి ఆ వాదమే తనకు ముఖ్యమని, పదవులు అసలు తనకు ఎంత మాత్రం ముఖ్యం కాదని కాసు అన్నారు. సమైఖ్యాంధ్ర కోసం తన బాబాయి ముఖ్య మంత్రి పదవినే కాసు బ్రహ్మానంద రెడ్డి త్యాగం చేసారని ఆయన గుర్తు చేశారు. తాను మంత్రి పదవికన్నా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కలిగి ఉండటమే ముఖ్యమని కాసు ప్రకటించారు.   కాసు చేసిన ఆ ప్రకటనను సమైఖ్యాంధ్ర జెఏసి స్వాగతించింది. మంత్రి చేసిన ఆ ప్రకటనను జెఏసి నాయకులు స్వాగతించారు. అప్పట్లో బ్రహ్మానంద రెడ్డి చాలా బలంగా నిలబడి రాష్ట్రం విడిపోకుండా చూసారనే అభిప్రాయం ఉంది. కాబట్టి కాసు ప్రస్తుతం ఇలా ప్రకటన చేయడం పెద్ద ఆశ్చర్యం కాకపోవచ్చు.

 Delhi gang rape victim

ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలి వివరాలు వెల్లడించండి

      ఢిల్లీలో ఇటీవల సామూహిక అత్యాచారానికి గురై సింగపూర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన 23 ఏళ్ళ యువతి కేసును శనివారం కోర్టు విచారణకు తీసుకునే ప్రక్రియలో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బాధితురాలి వివరాలను బహిర్గతం చేయాలని ఒక వ్యక్తి డిమాండ్‌ చేశారు. అత్యాచార బాధితుల కోసం ఒక సంస్ధను నిర్వహిస్తూ దానికి వ్యవస్థాపక ఛైర్మన్‌గా ఉన్న స్వామి ఓం జీ కోర్టుకు చేసుకున్న దరఖాస్తులో బాధితురాలి వివరాలను, సమాచారాన్ని బహిర్గతం చేయాలని కోరారు. అంతేకాక ఛార్జిషీటు కాపీలను ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాకు పంపిణీ చేయాలన్నారు. ”నేను భారత దేశ పౌరుడ్ని. అత్యాచారానికి లోనై హత్య చేయబడిన యువతి భారత దేశానికి కూతురులాంటిది. ఆమె స్నేహితుడు శుక్రవారం టివి ఛానల్‌లో కనిపించాడు. అందువలన ఇందులో దాచాల్సినదేమీ లేదు” అని ఆయన మెట్రోపాలిటిన్‌ మెజిస్ట్రేట్‌ నమ్రత అగర్వాల్‌ కోర్టులో ఆయన వాదించారు. అయితే స్వామి ఓం జి అభ్యర్థనకు ప్రాసిక్యూషన్‌ అభ్యంతరం తెలిపింది. ఈ కేసులో అతని ఆసక్తిని ప్రశ్నించింది.

chandrababu padayatra

వైఎస్ రికార్డ్ బ్రేక్...పోరాట యోధుడికి సెల్యూట్: లోకేష్

      తన తండ్రి నారాచంద్రబాబు నాయుడు 63 ఏళ్ల వయస్సులో 1,500 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేయడం పట్ల కొందరు ఆశ్చర్యపోయారని, తనకు మాత్రం ఎలాంటి ఆశ్చర్యం కలగలేదని, 63 ఏళ్ల వయస్సులో ప్రజల కోసం పరితపిస్తున్న పోరాట యోధుడికి సెల్యూట్ చేయాలని నారా లోకేష్ ట్విటర్ లో కామెంట్ పెట్టాడు. చంద్రబాబు వరంగల్ జిల్లా దస్రూనాయక్ తండా వద్ద తన పాదయాత్రలో 1500 కి.మీ. మైలురాయి కూడా దాటి సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. కొత్త రికార్డులను సృష్టించడమేగాకుండా, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చేసిన 1468 కి.మీ. పాదయాత్ర రికార్డును కూడా అయన అధిగమించారు. రాజశేఖర్ రెడ్డి 53 సం.ల వయసులో 1468 కి.మీ. పాదయాత్రచేయగా, చంద్రబాబు 63 సం.ల వయసులో1500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఒక కొత్త రికార్డు సృష్టించి అందరినీ సంభ్రమాశ్చర్యాలలోముంచెత్తారు.

 Jagan bail

వైఎస్ జగన్ బెయిల్ ఫై విచారణ వాయిదా

    అక్రమాస్తుల కేసులో అరెస్టు అయి చంచల్ గూడా జైలులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సాధారణ బెయిల్ పిటీషన్ ఫై విచారణను కోర్టు ఈ నెల 22 కు వాయిదా వేసింది. నిన్న ఉదయం జగన్, సిబిఐ న్యాయవాదుల మధ్య వాదనలు ప్రారంభం అయిన వెంటనే జగన్ తరపున వాదించిన నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు విచారణను మధ్యాహ్నానికి తొలుత వాయిదా వేసారు.   ఆ తర్వాత హైకోర్టు సూచన మేరకు సిబిఐ తరపు న్యాయవాది కేశవ రావు సిబిఐ ఇప్పటివరకూ చేసిన విచారణ ప్రోగ్రెస్ రిపోర్ట్ ను కోర్టుకు తీసుకువచ్చారు. అయితే, దానిని బహిర్గతం చేస్తే, తదుపరి విచారణకు ఆటంకాలు వస్తాయని కేశవ రావు కోర్టుకు విన్నవించారు. అదనపు సాలిసిటర్ జనరల్ సెలవులో ఉన్నారని, అందువల్ల తన వాదన వినిపించడానికి విచారణను వాయిదా వేయాలని ఆయన కోర్టును కోరడంతో కోర్టు తదుపరి విచారణను ఈ నెల 22 వ తేదీకి వాయిదా వేసింది.   అయితే, సిబిఐ ఉద్దేశపూర్వకంగానే ఈ కేసును వాయిదా వేయాలని చూస్తోందని నిరంజన్ రెడ్డి కోర్టుకు తెలియచేసారు.

chandrababu padayatra

మొగుడు కొట్టినందుకు కాదు

  ‘మొగుడు కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకే బాధ’ అన్నట్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిన్న 1500 కి.మీ. పాదయాత్ర పూర్తిచేయడం, దానిని మీడియాలో ప్రముఖంగా చర్చించి, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేకర్ రెడ్డి తో పోల్చుతూ విశ్లేషణలు వ్రాయడం, ఒకవైపు తమ అధినేత జైల్లో మగ్గుతుంటే మరో వైపు ఈవిధంగా తెలుగు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు తమనాయకుడి సాధించిన ఘనవిజయానికి సంభరాలు చేసుకోవడం చూస్తున్న, కొందరు వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ నేతలు సహజంగానే భగభగమని మండిపోయారు.   తమ నాయకురాలు ఆరోగ్య కారణాలచేతనో లేక తెలంగాణావాదులకు జడిసో మధ్యలోనే  పాదయాత్రకి ఫుల్ స్టాప్ పెట్టేస్తే, 63 ఏళ్ళ వయసులో కూడా చంద్రబాబు ఇంకా పాదయాత్ర కొనసాగిస్తుండటం వై.యస్సార్ పార్టీ నేతలకి అసూయ కలిగించడం సహజమే.       మానాయకుడు మండు వేసవిలో మహాప్రస్థానం సాగిస్తే, మీ నాయకుడు చక్కటి చలికాలం ఎంచుకొని, తాపిగా అడుగులో అడుగేసుకొంటూ కబుర్లు చెప్పుకొంటూ, మీకోసం వస్తున్నానని ఎన్ని కి.మీ.లు నడిచినా మా నాయకుడి పాదయాత్రకు సాటి రాదు అని తీర్మానించేశారు. అప్పుడు రాజశేకర్ రెడ్డి ప్రజలకోసం (?) పాదయాత్ర చేయగా, ఇప్పుడు చంద్రబాబు కేవలం రికార్డు సృష్టించడానికే చేస్తున్నట్లు కూడా వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ నేతలు కనిపెట్టి ప్రజలకు ఆ విషయం తెలియజేసారు.   కోటి సంతకాలతో జైల్లో ఉన్న తమ నేతని విడిపించుకోవచ్చనే ఒక సరికొత్త ఐడియాని కనిపెట్టిన వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ నేతలకి 63 సం.ల వయసుగల వ్యక్తి 1500 కి.మీ. పాదయాత్ర చేయడం ఒక పాత ఐడియాగానే కనిపించడంలో వింతేమి ఉంది.

chandrababu tdp

వైఎస్ రికార్డును బ్రేక్ చేసిన చంద్రబాబు

      తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కొత్త సంవత్సరంలో కొత్త రికార్డ్ ను సృష్టించారు. వరంగల్ జిల్లా దస్రూనాయక్ తండా వద్ద తన పాదయాత్రలో 1500 కి.మీ. మైలురాయి కూడా దాటి సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. కొత్త రికార్డులను సృష్టించడమేగాకుండా, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చేసిన 1468 కి.మీ. పాదయాత్ర రికార్డును కూడా అయన అధిగమించారు. రాజశేఖర్ రెడ్డి 53 సం.ల వయసులో 1468 కి.మీ. పాదయాత్రచేయగా, చంద్రబాబు 63 సం.ల వయసులో1500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఒక కొత్త రికార్డు సృష్టించి అందరినీ సంభ్రమాశ్చర్యాలలోముంచెత్తారు. తనకంటే వయసులో ఏంతో చిన్నవ్యక్తి అయిన ప్రతిపక్షపార్టీ నేత ఆరోగ్యకారణాలతో పాదయాత్ర చేయలేక మద్యలోనే విరమించుకొంటే, చంద్రబాబు ఈ వయసులో కూడా ఉత్సాహంగా పాదయాత్ర కొనసాగించడం అందరిని ఆకర్షించింది.

Dk aruna telangana

‘టి’ విషయంలో డికె అరుణ సొంత అజెండా ?

      ప్రత్యెక తెలంగాణా రాష్ట్రం విషయంలో మంత్రి డి.కె.అరుణ ఇతర తెలంగాణా కాంగ్రెస్ నేతలతో సంభందం లేకుండా తన సొంత అజెండాతో ముందుకు వెళ్ళాలని భావిస్తున్నారని సమాచారం. అఖిల పక్ష సమావేశం తర్వాత ప్రస్తుతం తెలంగాణా అంశం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేతిలో ఉన్న విషయం తెలిసిందే.   ఈ అంశంఫై ఓ నెల రోజుల్లో తమ నిర్ణయం వెల్లడిస్తామని కేంద్ర మంత్రి షిండే ప్రకటించారు. అయితే, రాష్ట్ర విభజన అసలు జరగదని సీమంధ్రా కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ విషయాలతో కొంత ఆందోళనకు గురి అయిన తెలంగాణా కాంగ్రెస్ నేతలు నిర్ణయాన్ని తమకు అనుకూలంగా రప్పించేందుకు అధిష్టానంఫై వత్తిడి తేవాలని నిర్ణయించారు. దీనికి తగిన కార్యాచరణను ఖరారు చేసేందుకు ఈ రోజు హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో వారు సమావేశం అవుతున్నారు.   ఈ సమావేశానికి ఎంఎల్ఏ లు, ఎంఎల్సి లు హాజరవుతారని భావిస్తున్నారు. అయితే, మంత్రుల విషయం మాత్రం ఇంకా తేలలేదు. అసలు హైదరాబాద్ బ్రదర్స్ దానం, ముకేష్ లకు ఆహ్వానం అందలేదని సమాచారం.   తెలంగాణా విషయంలో వీరితో చేతులు కలపడం ఇష్టం లేని మంత్రి అరుణ ఈ సమావేశం జరుగుతున్న సమయంలోనే మరో సమావేశం నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Narayana cpi

తెలంగాణాలో పట్టుకు సిపిఐ వ్యూహరచన !

    తెలంగాణా ప్రాంతంలో పట్టు కోసం సిపిఐ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో టిఆర్ఎస్ కు చెక్ పెట్టడానికి అవసరమైతే బిజెపి తో కూడా చేతులు కలపాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కెసిఆర్ వ్యవహరిస్తున్న తీరు పట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ఇప్పటికే పలుమార్లు విమర్శలు చేశారు.   నిన్న జరిగిన పార్టీ సమావేశంలో ఈ విషయంలో బిజెపితో జత కట్టాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టిఆర్ఎస్ అధినేత వాదనలకు విలువ ఇవ్వకుండా,అవసరమైతే కాంగ్రెస్, తెలుగు దేశం, జగన్ పార్టీలను కూడా కలుపుకుపోవాలని నారాయణ పధక రచన చేసినట్లు సమాచారం. తెలంగాణా విషయంలో కాంగ్రెస్ పార్టీఫై వత్తిడి తెచ్చేందుకు ఈ పార్టీలు అన్నింటితోను జత కట్టాలని ఆయన భావించినట్లు తెలుస్తోంది.   నెల రోజుల్లో తెలంగాణా విషయంలో ఓ ప్రకటన చేస్తామని హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించిన నేపధ్యంలో ఈ నెల రోజుల్లోపు చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాలను కూడా సిపిఐ ఇప్పటికే ఖరారు చేసినట్లు సమాచారం.   ఒక వేళ ఆయన ప్రత్యెక రాష్ట్రానికి వ్యతిరేకంగా ప్రకటన చేస్తే, ఆ తర్వాత చేపట్టాల్సిన ఉద్యమ కార్యక్రమాలఫై కూడా నారాయణ తన పార్టీ నేతలతో చర్చిస్తునట్లు తెలుస్తోంది.

congress party

కాంగ్రెస్ తెలంగాణా ఇచ్చేనా?

  కేంద్రం రాష్ట్ర విభజనపై తన నిర్ణయం ప్రకటించేందుకు నెలరోజుల గడువు ప్రకటించిన నాటినుండి రాష్ట్రంలో ఒక అనిశ్చిత వాతావరణం నెలకొంది. మిగిలిన పార్టీలకన్నా కూడా ఎక్కువగా కాంగ్రేసు పార్టీలోనే తెలంగాణా అంశంపై రాద్దాంతం జరుగుతోంది. కాంగ్రేసులో కొందరు రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో విడిపోయే ప్రసక్తే లేదని గట్టిగా చెపుతుంటే, మరి కొందరు ఆవాదనలు బలపరుస్తూ మాట్లాడుతున్నారు. ఈ పరిణామాలకి ఆందోళన చెందుతున్న తెలంగాణా కాంగ్రెస్ నేతలు తమ పార్టీ వారి మాటలు ఖండించలేకపోవడంతో, తెరాస వంటి పార్టీల ముందు చులకనయిపోతున్నారు. అందుకే, రేపు తెలంగాణా కాంగ్రెస్ నేతలు సమావేశం కావాలని నిర్ణయించుకొన్నారు.   సమైక్యంద్రవాదిగా పేరుపడిన లగడపాటి రాగోపాల్ ఈ రోజు విజయవాడలో పత్రికల వారితో మాట్లాడుతూ తెలుగు ప్రజలను, నేలను, నీటిని ఎవరూ కూడా విడదీయలేరన్నారు. రాష్ట్ర విభజన ఎట్టి పరిస్థితుల్లో జరగబోదని, పార్టీ తీసుకోబోయే నిర్ణయంపై తమకు స్పష్టమైన సంకేతాలు అందాయని తెలియజేస్తూ, తమకు అర్ధమయిన ఈ విషయం, ఇతరులకి ఎందుకు అర్థం కాలేదో తెలియదని అన్నారు.   పూర్తీ విశ్వాసంతో చెపుతున్న అయన మాటలువిన్న తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, హైదరాబాదులో మీడియా వారితో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తప్ప తాము ఎలాంటి ప్యాకేజీలు, అభివృద్ధి మండళ్లకు అంగీకరించబోమని తెలిపారు. తద్వారా ఆయనకూడా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణా ఈయబోదని నమ్ముతున్నట్లు తెలుస్తోంది.   ఇంతవరకు, రాష్ట్ర కేంద్ర మంత్రులు మాట్లాడిన తీరు చూసినట్లయితే కాంగ్రెస్ తెలంగాణాకి ప్రత్యెక ప్యాకేజి వంటిదేదో ప్రకటించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది తప్ప, ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పరిచే ఆలోచన ఉన్నట్లు కనిపించట్లేదు. ఇక, ఈ ఊహాగానాలకు తెరపడాలంటే ఈ నెలాకరు వరకు వేచిచూడవలసిందే.

జగన్ పార్టీలోకి చింతల రామ చంద్ర రెడ్డి

          తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత,మాజీ శాసనసభ్యుడు చింతల రామచంద్ర రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్దం అయింది. ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ని ఆయన నేడు చంచల్ గూడ జైలులో కలవనున్నారు. ఆ వెంటనే పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మను కూడా కలుస్తారు. ఈ నెల మూడో వారంలోగానీ, నాలుగో వారంలోగానీ ఆయన పీలేరులో ఓ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, వై ఎస్ విజయమ్మ సమక్షంలోఆ పార్టీలో చేరాలని చింతల భావిస్తున్నారు.   ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తో చింతల కు దీర్ఘకాలంగా రాజకీయ వైరం ఉంది. అయితే, కిరణ్ తో తాను చేస్తున్న రాజకీయ పోరాటానికి చంద్ర బాబు నుండి, టిడిపి నేతల నుండి సహాయ నిరాకరణ ఎదురవుతూ ఉండటంతో జగన్ పార్టీలో చేరాలని ఆయన భావించినట్లు తెలుస్తోంది. 2004లో పార్టీ చింతలకు బదులుగా పదవీ విరమణ చేసిన ఓ న్యాయమూర్తికి టికెట్ ఇచ్చింది. అలాగే, 2009 ఎన్నికల్లో కూడా పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వకుండా మొండి చెయ్యి చూపించింది. దీనితో, ఆయన ప్రజా రాజ్యం పార్టీలో చేరి, ఆ పార్టీ తరపున పోటీ చేశారు.   చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో, ఆ పార్టీలో చేరడం ఇష్టం లేని చింతల కొంత కాలం తటస్థంగా ఉండిపోయారు. ఆ సమయంలో చంద్ర బాబు నాయుడు తిరిగి ఆయనను స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు. అయితే, ఆ తర్వాత జరిగిన కొన్ని రాజకీయ పరిణామాల వల్ల ఆయన తెలుగు దేశం పార్టీ నాయకత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.   గత కొంత కాలంగా జగన్ పార్టీలో చేరే విషయాన్ని చింతల పరిశీలిస్తున్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్న ఆయన మద్దతుదారులు చింతలకు జగన్ పార్టీలో చేరాలని సూచించినట్లు తెలుస్తోంది.

చిరంజీవి ఫై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

      కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి చిరంజీవిఫై మాజీ మంత్రి, శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకట రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సామజిక న్యాయం పేరు చెప్పి సొంత పార్టీని స్థాపించి, పదవుల కోసం అదే పార్టీని అమ్ముకొన్న చిరంజీవి ఎలా గొప్ప వ్యక్తి కాగలడని ఆయన ప్రశ్నించారు.   ఆయనకు కేంద్ర మంత్రి పదవి వచ్చినంత మాత్రాన సామజిక న్యాయం వచ్చినట్లా అని కోమటిరెడ్డి అన్నారు. ప్రత్యెక తెలంగాణా రాష్ట్రం విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్న చిరంజీవి, ఆ మాట తప్పితే, హైదరాబాద్ నగరంలో తిరగనివ్వబోమని ఆయన హెచ్చరించారు. తన కుమార్తె ఇంట్లో రూ.80 కోట్లు పట్టుబడితే, సోనియా గాంధీ వద్దకు వెళ్లి ఆమెను బతిమలాడి విడిపించుకొన్నారని కోమటిరెడ్డి ఆరోపించారు.   చిరంజీవిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గొప్ప వ్యక్తిగా అభివర్ణించడాన్ని ఆయన తప్పు బట్టారు. చిరంజీవి ఇలాగే ఉంటే, రాజకీయాలు వదిలేసి మళ్ళీ మద్రాసు కు వెళ్లి సినిమాల్లో నటించాల్సి ఉంటుందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.   అయితే, చిరంజీవిని రాజకీయంగా విమర్శిస్తే తప్పు ఉండదని, కేంద్ర మంత్రిగా ఉన్న ఆయనను ఇలా ఓ ప్రాంతంలో తిరగనివ్వబోమని వ్యాఖ్యానించడం మాత్రం సరి కాదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

కిరణ్ బలిపశువును చేశారు: మోపిదేవి

        జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్టు అయి చంచల్ గూడ జైలు నుండి మధ్యంతర బెయిల్ ఫై బయటకు వచ్చిన మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ రావు ను నిన్న మంత్రులు బొత్స సత్యానారాయణ, ఆనం రామ నారాయణ రెడ్డిలు కలిసారు. ఆ సమయంలో మోపిదేవి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడంతో పాటు, తన ఆవేదనను వ్యక్తం చేసినట్లు సమాచారం.   నిన్న ఉదయం ఇద్దరు ఆయనను కలవగా, సాయంత్రం మాత్రం బొత్స ఒక్కరే మోపిదేవిని కలిసారు. ‘దివంగత ముఖ్య మంత్రి వై ఎస్ రాజ శేఖర రెడ్డి చెప్పినట్లే చేశాను తప్ప ఇందులో నా తప్పేమీ లేదు. ఆయన చెప్పినట్లే ఫైళ్ల మీద సంతకాలు చేసాను. నన్ను అరెస్టు చేసే అవకాశం ఉందని తెలిసి సముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వద్దకు వెళ్తే, ఏమీ కాదని ఆయన అన్నారు. అయినా నన్ను అరెస్టు చేశారు. ప్రస్తుతం నేను బలిపశువును అయ్యాను’, అని మోపిదేవి తన మంత్రివర్గ మాజీ సహచరుల వద్ద ఆవేదనను వ్యక్తం చేశారు.   మంత్రి ధర్మాన ప్రసాద రావు విషయంలో తీసుకున్న జాగ్రత్తలు తన విషయంలో ఎందుకు తీసుకోలేదని మోపిదేవి వారిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీనితో వారిద్దరూ ఆయనను ఓదార్చారు. తనకు బెయిల్ ఇస్తే, జగన్ కూడా బయటకు వస్తారనే కారణంతో తనకు బెయిల్ ఇవ్వడంలేదని కొంత మంది అంటున్నారని, బెయిల్ విషయంలో తనకు, జగన్ కు ఏమి సంభందం ఉందని ఆయన మంత్రులను ప్రశ్నించారు.   బెయిల్ గడువు నేటితో ముగియనున్డటంతో మోపిదేవి ఈ రోజు కోర్టులో లొంగి పోవాల్సి ఉంటుంది.

పరిటాల శ్రీరామ్ కోసం వెతుకుతున్న పోలీసులు

      కాంగ్రెస్ నేత సుధాకర రెడ్డి హత్యా ప్రయత్నం కేసులో నిందితునిగా ఉన్న పరిటాల రవి తనయుడు శ్రీరామ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గత నెల 29 న మారణాయుధాలతో పట్టుబడిన నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ధర్మవరం రూరల్ పోలీసులు శ్రీరామ్ ఫై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.   తెల్లవారుజామునే తన ఇంట్లోకి పోలీసులు వచ్చి తనిఖీలు నిర్వహించడం దారుణమని ఎంఎల్ఏ పరిటాల సునీత అన్నారు. తాను మహిళా ఎంఎల్ఏని అని కూడా చూడకుండా పోలీసులు వ్యవహరించిన తీరుకు ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో తన భర్తను కూడా ఇలాగె పోలీసులు సోదాలతో వేధించారని, చివరకు ఆయన హత్య చేయబడ్డారని, ప్రస్తుతం తన కుమారుడి విషయంలో కూడా తనకు ఆందోళనగా ఉందని సునీత అన్నారు. స్పీకర్ అనుమతి లేకుండా ఓ ఎంఎల్ఏ ఇంటిని ఎలా తనిఖీ చేస్తారని ఆమె ప్రశ్నించారు.   మరోవైపు జిల్లా ఎస్ పి విలేఖరులతో మాట్లాడుతూ అంత చట్టానికి లోబడే జరుగుతోందని, ఎలాంటి రాజకీయ వత్తిడులకు తలొగ్గడం లేదని వ్యాఖ్యానించారు.   పరిటాల కుటుంబానికి, సుధాకర్ రెడ్డి కి మధ్య ఎలాంటి ఫ్యాక్షన్ తగాదాలు లేవని, అలాంటప్పుడు ఆయనను చంపాల్సిన అవసరం ఏముంటుందని టిడిపి ఎంఎల్ఏ పయ్యావుల కేశవ్ అన్నారు.