దహీ వెర్సెస్ తయిర్‌.. తమిళనాట బీజేపీకి గడ్డు సమస్యే

తమిళుల భాషాభిమానం  గురించి  కొత్తగా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు.  తమిళ ప్రజలు దేన్నైనా సహిస్తారు కానీ, మాతృ భాషకు అవమానం జరిగితే ఊరుకోరు. మాతృ భాషకు అవమానమనే కాదు, జాతీయ భాష హిందీ డామినేషన్  ను సైతం ఇసుమంతైనా  సహించరు. అలా తమిళ భాషకు ఏ చిన్న అవమానం జరిగినా వెంటనే తమిళ జనం రోడ్డు ఎక్కేస్తారు. రాజకీయాలకు అతీతంగా తమిళులంతా ఏకమైపోతారు. అసలు ద్రవిడ పార్టీల పుట్టుకకు హిందీ వ్యతిరేక ఆందోళనలే ప్రధాన కారణం. 1965లో హిందీని ఏకైక జాతీయ భాషగా ప్రకటిస్తూ,కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తమిళనాడులో  సుమారు రెండు నెలలకు పైగా ఆందోళనలు జరిగాయి. సుమారు 70 మంది ప్రాణాలు కోల్పోయారు. చివరకు కేంద్ర ప్రభుత్వం దిగి రాక తప్పలేదు. ప్రధాన మంత్రి లాల్‌ బహదూర్ శాస్త్రి హిందీ భాషేతర రాష్ట్రాలు కోరే వరకూ ఇంగ్లీష్‌ అధికారిక భాషగా కొనసాగుతుందని హామీ ఇచ్చి తమిళులను శాతింప చేశారు.   అయినా ఆందోళనల ఫలితంగా తమిళనాడు రాష్ట్రం రాజకీయ ముఖ చిత్రం ఒక్కసారిగా మారి పోయింది. ఆ తర్వాత 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అంతవరకు తిరుగు లేని శక్తిగా రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడి పోయింది. ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకే) గెలుపొందింది.  ఇక అంతే .. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ,  ఆమాట కొస్తే మరో జాతీయ పార్టీ కూడా రాష్ట్రంలో అధికారంలోకి రాలేదు.  ఇక ప్రస్తుతం లోకి వస్తే తమిళ నాడులో మరో మారు, తమిళ్ సెంటిమెంట్ రాజకీయ దుమారం రేపుతోంది.అయితే ప్రస్తుత వివాదానికి ‘దహీ’ (పెరుగు) కేంద్ర బిందువు.. కావడం విశేషం. తమిళనాడుతో పాటుగా ఎన్నికలు జరుగతున్న కర్ణాటకలోనూ ‘దహీ’ దావానలం రగులుతోంది. ఆ రెండు రాష్ట్రాల్లో డెయిరీ ఉత్పత్తులు విక్రయించే ఆహార విక్రయ సంస్థలు, ఇంతవరకు పెరుగు ప్యాకెట్లపై కర్డ్‌ అనే ఇంగ్లీష్ పదంతో పాటు తైర్‌ (తమిళం), మొసరు (కన్నడం) అనే పదాలను కూడా ముద్రిస్తున్నాయి. అయితే, పెరుగు ప్యాకెట్లపై కర్డ్‌కు బదులు ‘దహీ’ అనే పదాన్ని ప్రముఖంగా  ముద్రించాలనీ కర్డ్‌ అని గానీ, ఇతర ప్రాంతీయ భాషల్లోని పేర్లను గానీ ‘దహీ’ పక్కన బ్రాకెట్‌లో ముద్రించాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ ) మార్చి 10న ఆదేశించింది.  ‘కర్ణాటక కో-ఆపరేటివ్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ ఫెడరేషన్‌ (కేఎంఎఫ్‌), బెంగళూరు రూరల్‌ అండ్‌ రామనగర డిస్ట్రిక్ట్‌ కో-ఆపరేటివ్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ సొసైటీస్‌ యూనియన్‌ లిమిటెడ్‌, తమిళనాడు కో-ఆపరేటివ్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ ఫెడరేషన్‌, హట్సన్‌ అగ్రో ప్రోడక్ట్స్‌ లిమిటెడ్‌ సంస్థలకు ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ ఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే.. తమిళనాట ఆవిన్‌ అనే బ్రాండ్‌ పేరుతో పెరుగును, ఇతర పాల ఉత్పత్తులను విక్రయించే ‘తమిళనాడు కో-ఆపరేటివ్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ ఫెడరేషన్‌’ ఈ ఆదేశాలను పాటించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. తాము విక్రయించే పెరుగు ప్యాకెట్లపై హిందీ పదమైన ‘దహీ’ని వాడబోమని.. తమిళ పదమైన ‘తైర్‌’నే ముద్రిస్తామని తేల్చిచెప్పింది. దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కూడా స్పందించారు. హిందీని బలవంతంగా రుద్దడంలో భాగంగానే ‘దహీ’ పదాన్ని పెరుగు ప్యాకెట్లపై తప్పనిసరిగా ముద్రించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిందని మండిపడ్డారు. అటు కన్నడనాట కూడా ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ ఆదేశాలపై ప్రజాగ్రహం పెల్లుబికింది. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కూడా కేంద్రంపై వరుస ట్వీట్లతో ధ్వజమెత్తారు. కర్ణాటక కో-ఆపరేటివ్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ ఫెడరేషన్‌ విక్రయించే నందిని బ్రాండ్‌ పాల ఉత్పత్తుల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.‘‘నందినీ బ్రాండ్‌ కన్నడిగుల ఆస్తి. అది కన్నడిగుల గుర్తింపు. కన్నడిగుల జీవరేఖ.. హిందీని బలవంతంగా రుద్దడాన్ని కన్నడిగులు తీవ్రంగా వ్యతిరేకిస్తారని తెలిసి కూడా నందిని బ్రాండ్‌ పెరుగు ప్యాకెట్లపై హిందీ పదమైన దహీని వాడాలంటూ ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ కేఎంఎ్‌ఫకు ఆదేశాలివ్వడం తప్పు’’ అని కుమారస్వామి మండిపడ్డారు. ‘దహీ’  అనేది హిందీ పదం కాదని, సంస్కృతం నుంచి వచ్చిన పదమని, దాని అర్థం పాల ఉత్పత్తి అని కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చినా నిరసనలు చల్లారలేదు.దీంతో, ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ తన పాత నిబంధనలను సడలించింది. ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థలు విక్రయించే పెరుగు ప్యాకెట్లపై ‘కర్డ్‌’ అని ఆంగ్లంలో ముద్రించి, దాని పక్కన ప్రాంతీయ భాషా పదం (పెరుగు/తైర్‌/మొసరు/దహీ వంటివి) కూడా చేర్చుకోవచ్చని స్పష్టం చేసింది.  అయినా కూడా దహి వివాదం బీజేపీకి తమిళనాడులో చేయగలిగినంత నష్టం ఇప్పటికే చేసేసిందని చెప్పాలి.   తమిళ నాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌, ఇందుకు బాధ్యులైన వారిని (కేంద్రాన్ని) శాశ్వతంగా బహిష్కరిస్తామని హెచ్చరించారు.  మరో వంక తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై దహి  నిర్ణయాన్ని తప్పుపట్టారు.   ప్రాంతీయ భాషలను ప్రోత్సహించాలనే ప్రధాని మోదీ విధానాలకు ఇది విరుద్దంగా ఉందని వ్యాఖ్యానించారు.. అయినా పేస్ బుక్ లో మిత్రులు కొందరు సూచించిన విధంగా పెరుగు ప్యాకెట్‌ మీద ఇంగ్లీష్‌, తమిళ్‌, హిందీ మాత్రమే ఎందుకు ఉండాలి. ఏ రాష్ట్రంలో అయినా అమ్మకునేందుకు వీలుగా భారతీయ భాషలన్నింటిలో రాయాలని FSSAI ఆదేశించి ఉండాల్సిందన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. 

దిగి వచ్చిన కేంద్రం.. దహిపై వెనుకడుగు

కేంద్రం, రాష్ట్రాల మధ్య 'పెరుగు'పై నెలకొన్న వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న కర్నాటక రాష్ర్టం నుంచి వ్యక్తమైన తీవ్ర వ్యతిరేకత కారణంగా కేంద్రంలోని మోడీ సర్కార్ దిగి వచ్చింది. పెరుగుకు హిందీ పదం 'దహీ'కి బదులుగా 'కర్డ్' అని వాడుకోవచ్చని కేంద్ర ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ అనుమతి ఇచ్చింది.  రాష్ట్రాల నుంచి 'దహీ' అన్న పేరుకు తీవ్ర వ్యతిరేకత రావడంతో  కేంద్రం దిగిరాక తప్పలేదు.  కర్ణాటక, తమిళనాడుల్లోని పాల సహకార సంఘాలు, ప్రైవేటు డైరీలు 'కర్డ్' కు బదులుగా 'దహీ' అని వాడాలని, బ్రాకెట్లలో ఆయా స్థానిక భాషల్లో వాడే పదాలను ఉంచాలని ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ ఈ నెల10న ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అంటే పెరుగు ప్యాకెట్లపై 'దహీ ' (కర్డ్-ఇంగ్లిష్), దహీ (మోసారు-కన్నడ), దహీ (తాయిర్-తమిళం), దహీ (పెరుగు-తెలుగు) అని వాడాలని సదరు సంస్థ ఆ ఆదేశాల్లో పేర్కొంది. అయితే ఇది బలవంతంగా హిందీని రుద్దడమే అని   కర్ణాటక, తమిళనాడుల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. తమిళనాడు 'నహీ టు దహీ' అనే నినా దాన్ని ముందుకు తెచ్చింది. పెరుగు ప్యాకెట్లపై 'దహీ' అనే పదం వాడేది లేదని తమిళనాడు ప్రభుత్వ పాల సరఫరాదారు  ఎవిన్ స్పష్టం చేసింది.  ముఖ్య మంత్రి స్టాలిన్ కేంద్ర నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. హిందీ పదాన్ని వ్యతిరేకిస్తూ ట్వీట్ చేశారు. ఆశ్చర్యకర విషయం ఏమంటే.. తమిళనాడు భాజపా శాఖ కూడా 'దహీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తమ పార్టీ హై కమాండ్ ను కోరింది.  డీఎంకే నేతలూ 'దహీ'' సహీ పోడా' పేరుతో సామాజిక మాధ్యమాల్లో హిందీ వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక.. కర్ణాటకలో కూడా దహీకి నహీ అంటూ తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమార స్వామి 'దహీ' పదంపై మండిపడ్డారు. కన్నడిగులపై 'హిందీ'ని రుద్దడానికి ప్రయత్నం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పలు పాల ఉత్పత్తిదారుల సంఘాలూ కేంద్రానికి లేఖలు రాశాయి. సంస్థ నిర్ణ యాన్ని ఉపసంహరించుకోవాలని కోరాయి. దీంతో ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ దిగి రాక తప్పలేదు.. 'దహీ'కి బదులుగా 'కర్డ్'ను, బ్రాకెట్లలో స్థానిక భాషలను వాడవచ్చని గురువారం ఆదేశాలను సవరించింది. తాజా సవరణ ప్రకారం.. కర్డ్ (దహీ-హిందీ), కర్డ్ (మోసారు-కన్నడ), కర్డ్ (తాయిర్-తమిళం), కర్డ్ (పెరుగు-తెలుగు) పదాలను వాడవచ్చని సూచించింది. పలు వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 

డైవర్షన్ కే విస్తరణ.. ముందస్తుకే జగన్ మొగ్గు?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నోటితో చెప్పేదొకటి.. చేతల్లో చేసేదొకటి. గత నాలుగేళ్లుగా ఆయన పాలన సాగిస్తున్న విధం ఇదే. ఇప్పుడు తాజాగా పార్టీ సర్కిల్స్ లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పుడ ఇహనో ఆయన కేబినెట్ రీషఫుల్ చేస్తారనీ, కొత్తగా నలుగురైదుగురికి కేబినెట్ లోకి తీసుకుంటారనీ పార్టీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. అదే సమయంలో కొందరికి ఉద్వాసన తప్పదనీ అంటున్నారు. సరే ఇన్ ఎవరు.. ఔట్ ఎవరు అన్న చర్చను పక్కన పెడితే.. మంత్రివర్గ విస్తరణ అనేది ఒక వ్యూహం మాత్రమేననీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగేందుకు వీలుగా ఆయన పావులు కదుపుతున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ తో ముందస్తు ముచ్చటకు జగన్ చెల్లుచీటీ పాడేశారన్న భావన విపక్షాలలో కలిగించడమే ఆయన వ్యూహంగా చెబుతున్నారు. వైనాట్ 175 ధీమా పూర్తిగా పోయిన తరుణంలో ఆయన వైనాట్ ఎర్లీ ఎలక్షన్స్ అన్న వ్యూహంతో పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. వివేకా హత్య కేసు విషయం అలా ఉంచితే.. కేవలం పక్షం రోజుల వ్యవథిలో ఆయన రెండు సార్లు హస్తినకు వెళ్లి చక్కబెట్టుకోవడానికి ప్రయత్నించిన రాచకార్యం ముందస్తే అని పరిశీలకులు అంటున్నారు. అందుకోసమే ఆయన తాజా ఢిల్లీ పర్యటనలో హడావుడిగా అమిత్ షా అప్పాయింట్ మెంట్ తీసుకున్నారనీ, అర్ధరాత్రి ఆయన నివాసానికి వెళ్లి మరీ సుదీర్ఘ భేటీ జరిపారనీ అంటున్నారు.   ఈ సందర్భంగా ఏపీలో పరిస్థితిని జగన్ అమిత్ షాకు పూసగుచ్చినట్లు వివరించడమే కాకుండా, విపక్షాలు ప్రమత్తంగ ఉన్న సమయంలోనే ముందస్తుకు వెళితే ఏదో మేరకు అధికారపార్టీకి లాభం ఉంటుందని వివరించారని అంటున్నారు. అందుకోసం.. ఈ డిసెంబర్ లోనే అంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగితే.. తెలుగుదేశం పార్టీకి ఇటు ఏపీలోనూ, అటు తెలంగాణలోనూ కూడా ప్రచారం, అభ్యర్థుల ఎంపిక, పొత్తులు తదితర విషయాలలో కాన్ సన్ ట్రేట్ చేసే అవకాశం ఉండదని జగన్ అమిత్ షాకు వివరించి ఉంటారని పరిశీలకులు చెబుతున్నారు. అసలు తెలంగాణతో పాటే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించాలన్న తన అభిమతాన్ని కేంద్రానికి చెప్పి అనుమతి, అంగీకారం తీసుకునేందుకే స్వల్ప వ్యవధిలో రెండు సార్లు జగన్ హస్తినకేగి వచ్చారని విశ్లేషిస్తున్నారు.   జగన్ ముందస్తు నిర్ణయానికి రావడానికి కారణం ఇటీవల ఆయన స్వయంగా చేయించుకున్న సర్వే ప్రకారం ముందస్తు ఎన్నికలు జరిగితే జగన్ బొటాబొటిగా, అంటే అత్తెసరు మెజారిటీలో అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉందని తేలిందనీ, అదే నిర్దిష్ట గడువు వరకూ ఆగితే.. ప్రభుత్వ వ్యతిరేకత మరింత పెరిగి.. మొదటికే మోసం వస్తుందన్న సర్వే ఫలితం కారణంగానే ముందస్తు అడుగుల జోరు పెంచారని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే  ఆరు నెలల అధికారాన్ని వదులుకుని మరీ ముందస్తుకు జగన్ మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. అన్నిటికీ మించి ముందస్తుకు తొందరపడకపోతే.. ఏపీలో 2014 నాటి సీన్ పునరావృతమౌతుందన్న భయం జగన్ లో గూడుకట్టుకుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంటే తెలంగాణ ఎన్నికల తరువాత ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే.. ఏపీలో బీజేపీ కూడా తెలుగుదేశం, జనసేన కూటమితో కలిసి పోటీ చేయాల్సిన పరిస్థితులు వస్తాయన్నది జగన్ భావనగా చెబుతున్నారు. అంటే తెలంగాణలో సపోజ్.. ఫర్ సపోజ్ హంగ్ వస్తే ( తెలంగాణలో హంగ్ కే ఎక్కువ అవకాశాలున్నాయని సర్వేలు చెబుతున్నాయి) అప్పుడు బీజేపీ అధికారం కోసం తెలుగుదేశం మద్దతు తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా ఏపీలో బీజేపీ మద్దతు కోసం తెలంగాణలో ఆ పార్టీకి మద్దతు ఇవ్వడానికి ఇసుమంతైనా వెనుకాడదని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నాయి. ఆ విషయంలో బీజేపీకి సంకేతం ఇవ్వడానికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో వంద స్థానాలలో పోటీకి తెలుగుదేశం ఇప్పటికే రెడీగా ఉందని ఇటీవల హైదరాబాద్ లో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రకటించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే జగన్ ముందస్తుకు తొందరపడుతున్నారనీ, ఏలాగైనా సరే కేంద్రాన్ని ఈ విషయంలో ఒప్పించేందుకే వరుస హస్తిన పర్యటనలనీ అంటున్నారు.  

మళ్లీ బూతుల పంచాంగం విప్పిన కొడాలి నాని

కొడలి నాని, మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మళ్లీ తన బూతుల పంచాంగం దుమ్ము దులిపారు. మంత్రిగా ఉన్న సమయంలో నిత్యం విపక్ష నేతపై విమర్శలతో విరుచుకుపడిన నాని.. మంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యాకా.. తన వాగ్ధాటికి కొంత బ్రేక్ వేశారు. మంత్రి పదవి నుంచి ఊడబీకినందుకు అసంతృప్తో, నిరసనో తెలియదు కానీ, ఆయన ఒకింత మౌనం పాటించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ హెల్త్ వర్శిటీగా మార్చిన సమయంలో స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరినప్పటికీ ఆ నిర్ణయాన్ని సమర్ధిస్తూ మీడియా సమావేశం పెట్టలేదు. అలాగే మంత్రి పదవి ఊడిన తొలి నాళ్లలో ఓ విధమైన వైరాగ్యం ప్రదర్శించారు. పశువుల పాకలో పడుకున్నారు. అప్పట్లో అందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి కూడా. అప్పట్లో ఓ పశువుల కొట్టంలో  మంచమేసుకొని.. రెండు దిండ్లు ప‌రుచుకుని.. హాయిగా రిలాక్స్ అవుతున్న ఫొటో బాగా సర్క్యులేట్ అయ్యింది. అప్ప‌టి వ‌ర‌కూ ప‌శువుల కొట్టంలో ప‌ని చేసి..చేసి అల‌సిపోయి  కాసేపు ఇలా సేద‌తీరుతున్న‌ట్టు ఉందీ ఫోటో అంటూ అప్పట్లో నెటిజన్లు సెటైర్లు కూడా వేశారు. అంతేనా.. మంత్రి ప‌ద‌వి పోయింద‌నే ఫ్ర‌స్టేష‌న్‌లో ఉన్న‌ట్టున్నారు. జ‌గ‌న్ కోసం అంత చేసిన నా ప‌ద‌వే పీకేస్తాడా అంటూ తెగ ఫైర్ మీదున్నట్లున్నాడు అని కొందరు కామెంట్లు చేస్తే.. ఇక‌పై ప్రెస్‌మీట్లు ఉండవు, బూతులు మాట్లాడే ఛాన్స్ రాదు అన్న బాధ అనుకుంటా అంటూ మరి కొందరు వ్యాఖ్యలు చేశారు. కార‌ణం ఏమో తెలీదు కానీ.. ఆయ‌న తీవ్ర అసంతృప్తితో, ఆవేద‌న‌తో ఉన్నార‌ని అప్పట్లో కొడాలి నాని అనుచ‌రులు గట్టిగా చెప్పారు. అలాంటి నాని ఒక్క సారిగా మళ్లీ బూతుల పంచాంగం విప్పారు. తెలుగు అధినేత చంద్రబాబుపై  విమర్శలు ఎక్కుపెట్టారు. సిద్ధాంతాలు కలిగిన వ్యక్తి దివంగత ఎన్టీఆర్ అయితే... చంద్రబాబు ఒక 420 అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని టీడీపీలో చేరిన చంద్రబాబు... ఆయన బతికుండగానే సీఎం పదవి నుంచి తప్పించారని అన్నారు. తిన్నింటి వాసాలు లెక్కపెడతారని చంద్రబాబును ఉద్దేశించి ఎన్టీఆర్ ఆనాడే చెప్పారని తెలిపారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి సీఎం సీటును లాక్కున్నారని దుయ్యబట్టారు.  ఎన్టీఆర్ రక్తం పంచుకుని పుట్టామని చెప్పుకుంటున్నవాళ్లు సిగ్గులేకుండా చంద్రబాబు వెనుక తిరుగుతున్నారని కొడాలి నాని విమర్శించారు. ఎన్టీఆర్ లా చాలా పౌరుషం ఉన్న వ్యక్తి హరికృష్ణ మాత్రమేనని చెప్పారు. ఎన్టీఆర్ లా సొంతంగా పార్టీ పెట్టి సీఎం అయిన వ్యక్తి జగన్ మాత్రమేనని అన్నారు. చంద్రబాబుకు స్వార్థం ఎక్కువని... ఎన్టీఆర్ పేరు చెప్పుకుని ఇప్పుడు కూడా ఓట్లు దండుకోవాలని అనుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు కనుసన్నల్లోనే అమరావతి రైతుల పాదయాత్ర కొనసాగిందని ఆరోపించారు. ఇంత హఠాత్తుగా కొడాలి నాని తన గొంతు సవరించుకుని మరీ విమర్శల చిట్టా విప్పి మీడియా ముందుకు రావడానికి కారణం నేడో, రేపో, రేపో, మాపో జగన్ మంత్రి వర్గ విస్తరణ చేపట్టే అవకాశాలున్నాయన్న సమాచారమేనని పరిశీలకులు అంటున్నారు. ముచ్చటగా మూడో సారి జగన్ చేపట్ట నుంచి మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో కొడాలి నానికి కచ్చితంగా బెర్త్ దొరుకుతుందన్న సమాచారంతోనే నాని ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారని చెబుతున్నారు. అందుకే ఇటీవలి కాలంలో ఒకింత సైలెంట్ గా ఉంటూ వస్తున్న నాని మళ్లీ బూతుల మంత్రిగా తనకు ఉన్న ఫేమ్ ను పూర్తిగా ఉపయోగించుకునేందుకు రెడీ అయిపోయారని అంటున్నారు. 

విద్యార్థులకు ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు

తెలంగాణ స్కూళ్లకు ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకూ రాష్ట్రంలోని విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటిస్తే విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.  తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు   హాలిడేస్‌ను డిక్లేర్ చేసిన విద్యాశాఖ. 2023-24 విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభం అవుతుందని పేర్కొంది. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 12 నుంచి 20వ తేదీ వరకు ఎస్ఏ-2 ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.21 నుంచి 24వ తేదీ వరకు మూల్యాంకనం చేయనున్నారు. వచ్చేనెల 25న పేరెంట్స్ మీట్ నిర్వహించి.. విద్యార్థుల మార్కులు వెల్లడిస్తారు. కాగా  వచ్చేనెల 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే.

రాజమహేంద్ర వరానికి మహానాడుతో పసుపుశోభ

వేదంలా ఘోషించే గోదావరి... అమర ధామంలా శోభిల్లే  రాజమహేంద్రి... శతాబ్దాల  చరితగల  సుందర  నగరం .. గత  వైభవ  దీప్తులతో  కమ్మని  కావ్యం.. అలాంటి రాజమహేంద్రవరం మహానగరం పసుపు శోభ సంతరించుకోనుంది. తెలుగుదేశం మరికొద్ది రోజుల్లో పసుపు కళ సంతరించుకోనుంది. మే 28 విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జయంతి. అలాగే ఆ   మహానాయకుడి శత జయంతోత్సవ సంవత్సరం.  ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి మహా పండగ అయిన మహానాడును రాజమండ్రిలో నిర్వహించాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇటీవల జరిగిన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించారు. దీంతో రాజమండ్రి వేదికగా  మహానాడు బహిరంగ సభకు పార్టీ అధిష్టానం కమిటీని  ఏర్పాటు చేయనుంది.   అలాగే ఎన్టీఆర్ శత జయంతి సందర్బంగా 100 సభలు నిర్వహించాలని నిర్ణయించింది. ఆ సభలలో ఒకటి హైదరాబాద్ వేదికగా ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ 100 సభలు నిర్వహించాలని నిర్ణయించిన తెలుగుదేశం.. తెలుగురాష్టరాలలోని 42 నియోజకవర్గాల కేంద్రాలలోనూ ఒక్కో సభ నిర్వహించాలని నిర్ణయించింది. మిగిలిన 58 సభలో వివిధ నగరాలు, పట్టణాలలో నిర్వహిస్తుంది. వందో సభ మహానాడు సభతో ముగుస్తాయి.   ఇక జగన్ ప్రభుత్వం అలంబిస్తున్న ప్రజా వ్యతికేర విధానాలపై టీడీపీ ఇప్పటికే ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి, బాదుడే బాదుడు వంటి కార్యక్రమాలను ప్రజల్లోకి  బలంగా తీసుకు వెళ్లింది. అలాగే ఈ సారి ఎన్నికల మేనిఫెస్టో విభిన్నంగా ఉండడమే కాకుండా, ప్రజలందరికీ చేరువ అయ్యే పథకాలతో రూపొందించే దిశగా ఆ పార్టీ అగ్రనేతలు కసరత్తు చేస్తున్నారు. ఆ క్రమంలో ఆర్థిక అసమానతలు లేకుండా.. ఆదాయాన్ని అందరికీ పంచే విధంగా పథకాల రూపకల్పన చేయాలని నిర్ణయించారు.  ఎప్పుడు ఎన్నికలు వచ్చినా .. ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులను సంసిద్దం చేసేందుకు టీడీపీ అధినాయకత్వం   ముందుకెళ్తోంది. ఇక ఎన్టీఆర్ శతజయంతి వేళ.. ఆయన పేరిట 100 రూపాయిల నాణాన్ని  విడుదల చేయనున్నట్లు కేంద్రం గెజిట్ విడుదల చేసింది.  మరోవైపు గతేడాది ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ నిర్వహించిన మహానాడు గ్రాండ్ సక్సెస్ అయింది. అలాగే తెలంగాణలో ఖమ్మం వేదికగా జరిగిన శంఖారావ సభ సైతం సూపర్ సక్సెస్ అయింది. ఆ క్రమంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం. ఇక మార్చి 29న హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన పార్టీ ఆవిర్భావ సభ గ్రాండ్ సక్సెస్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.   తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా, వాటిలో 100 స్థానాలలో  ఇప్పటికిప్పుడు అభ్యర్థులను దింపేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు...బీఆర్ఎస్, బీజేపీలలో కలవరం రేపాయి.  ఇంకోవైపు ఏపీలో ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నలుగురు ఘన విజయం సాధించారు. దీంతో అధికార జగన్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఈ ఎన్నికల ఫలితాల ద్వారా క్లియర్ కట్‌గా స్పష్టమైందని తేటతెల్లమైంది. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరిట చేపట్టి పాదయాత్ర ప్రభంజనంలో దూసుకుపోతోంది. ఇక తెలుగుదేశం మహానాడును రాజమండ్రిలో  నిర్వహించాలని నిర్ణయించడం వెనుక ఆ పార్టీ అధినేత చంద్రబాబు పకడ్బందీ వ్యూహం ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి ఉభయ గోదావరి జిల్లాలు కంచుకోట అన్న సంగతి అందరికీ తెలిసిందే.    2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీతో కలిసి టీడీపీ ఎన్నికలకు వెళ్లింది. దాంతో పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 స్థానాలకుగాను.. 14 స్థానాలను టీడీపీ గెలుచుకోగా.. ఒక్క స్థానం నుంచి తెలుగుదేశంతో పొత్తులో ఉన్న బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు.  అలాగే తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ స్థానాలకుగాను.. 12 టీడీపీ, ఒకటి బీజేపీ గెలుపొందిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఈ ఉభయ గోదావరి జిల్లాలోని మొత్తం అన్ని స్థానాలను  గెలుచుకునే వ్యూహంలో భాగంగానే మహానాడు ను గోదావరి ఒడ్డున ఉన్న రాజమహేంద్రవరంలో నిర్వహించనున్నారనే చర్చ సైతం ఊపందుకొంది.

రేపో మాపో జగన్ కేబినెట్ విస్తరణ? కొడాలి, బాలినేనిలకు మళ్లీ చాన్స్?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ముచ్చటగా మూడోసారి తన  కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమయ్యారా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇందుకోసం ముహూర్తం కూడా ఖరారైందని అందుకే ఇటీవల గవర్నర్  అబ్దుల్ నజీర్‌తో భేటీ అయ్యారనీ, ఆ భేటీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గురించే ఆయనతో చర్చించారనీ అంటున్నారు.  రేపో మాపో..ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మార్చి 31 లేదా ఏప్రిల్ మొదటి వారంలో జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని చెబుతున్నారు.  ఈ సారి కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ముగ్గురు నుంచి ఐదుగురి వరకూ కొత్త వారికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు.  కొడాలి నాని, బాలినేని శ్రీనివాసరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితోపాటు ఉత్తరాంధ్ర, పశ్చిమ, తూర్పు రాయలసీమ ప్రాంతాల నుంచి ఇద్దరిని తీసుకునే అవకాశం ఉందనే   చర్చ పార్టీ వర్గాలలో జోరుగా కొనసాగుతోంది. అలాగే ఇద్దరు ముగ్గురు ప్రస్తుత మంత్రులకు ఉద్వాసన కూడా ఉంటుందని అంటున్నారు.  కొడాలి నానికి మరోసారి మంత్రిగా అవకాశం ఇవ్వాలని సీఎం డిసైడైపోయారని చెబుతున్నారు.  ముఖ్యమంత్రి వైయస్ జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే.  ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విపక్షాలపై ఘాటు విమర్శలు చేయాలంటే కొడాలి వంటి మంత్రి తన కేబినెట్ లో ఉండాలని జగన్ భావిస్తున్నారని చెబుతున్నారు.  అదీకాక   జగన్ రెండోసారి... తన కేబినెట్ కూర్పులో.. కొడాలి నాని సామాజిక వర్గానికి చెందిన వారిని తీసుకోదు. ఇదే అంశాన్ని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు బహిరంగంగానే సీఎం జగన్‌పై విమర్శలు సైతం గుప్పించిన సంగతి తెలిసిందే. అలాంటి వేళ కొడాలి నానినీ మళ్లీ కేబినెట్‌లోకి తీసుకుంటే.. అన్ని నొప్పులకు ఒకటే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ లాగా... అందరికీ.. అన్నిటికి ఒకటే సమాధానం అవుతుందని సీఎం జగన్ భావిస్తున్నారన్న టాక్ అయితే పార్టీలో గట్టిగా వినిపిస్తోంది.    ఇక ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి.. జగన్ తొలి కెబినెట్‌లో మంత్రిగా పని చేశారు. అదీకాక ముఖ్యమంత్రి జగన్‌కు సమీప బంధువు. కానీ రెండో సారి కేబినెట్ కూర్పులో క్యాస్ట్ ఈక్వేషన్ కారణంగా.. ఆయనను తప్పించడంతో.. బాలినేని శ్రీనివాసరెడ్డి అలా ఇలా కాదు.. ఓ రేంజ్‌లో హర్ట్ అయి బుంగ మూతి  పెట్టుకొన్నారు. బహిరంగంగా నిరసన కూడా వ్యక్తం చేశారు.  నెల్లూరు, తిరుపతి,   కడప జిల్లాలకు పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్‌గా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహరిస్తున్నారు.  అయితే ఉమ్మడి నెల్లూరు జల్లాలోని ఫ్యాన్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు మిన్నంటాయి. ఆ క్రమంలో ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థి విజయం నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డిలపై పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది.  అలాగే ఇదే జిల్లాకు చెందిన కొవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితోపాటు మరి కొందరు కూడా పార్టీకి గుడ్ బై చెప్పేస్తారంటూ  సామాజిక మాధ్యమంలో ఓ రేంజ్ లో కథనాలు అయితే వెలువడుతున్న నేపథ్యంలో  నెల్లూరు జిల్లాలో  పార్టీలో ఉన్న అసమ్మతిని తగ్గించి.. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో మళ్లీ పార్టీ క్లీన్ స్వీప్ చేయించేందుకు బాలినేనితోపాటు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని కేబినెట్‌లోకి తీసుకోవాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.   ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు సీట్లు.. గంపగుత్తగా టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోయాయి. దీంతో అటు ఉత్తరాంద్ర, ఇటు తూర్పు పశ్చిమ రాయలసీమ ప్రాంతాల నుంచి ఇద్దరిని కేబినెట్‌లో తీసుకొంటారని.. ఆ క్రమంలోనే ఆయా ప్రాంతాలకు చెందిన ప్రస్తుత కేబినెట్‌లోని మంత్రులకు ఉద్వాసన తప్పదన్న చర్చ జోరుగా సాగుతోంది.  మార్చి 14న జరిగిన కేబినెట్ భేటీలో.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో మన పార్టీ అభ్యర్థులే గెలవాలని.. మంత్రుల పని తీరును గమనిస్తున్నానని.. ఈ ఎన్నికల్లో తేడా వస్తే.. కేబినెట్‌లో మార్పులు చేర్పులు తథ్యమంటూ   ముఖ్యమంత్రి  జగన్ హెచ్చరించిన విషయాన్ని పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  

ఉపాధ్యాయులపై కోపంతో పిల్లల ప్రాణాలతో చెలగాటమా?

 రౌడీయిజం, ఫ్యాక్షనిజంలో కక్షలు కార్పణ్యాలు ఉంటాయి. అందులోనూ రాయలసీమ రాజకీయాల్లో ఫ్యాక్షనిజం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అది అభిలషణీయం కాదు. అయినా  అదొక రకం. ఇప్పుడు విషయం అది కాదు.  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయులపై కక్ష సాధింపు కోసం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయులపై కక్ష సాధింపు కోసం ఎండలు మండుతున్నా ఒంటిపూట బడులు ప్రారంభించలేదని ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖలో ఆరోపించారు.  ఎండలు మండుతున్నా ఒంటిపూట బడులు ఎందుకు నిర్వహించరని, ఉపాధ్యాయులపై కక్ష సాధింపు కోసం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడతారా? అని ఆ లేఖలో అనగాని సత్యప్రసాద్  ప్రశ్నించారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం మార్చి మొదటి లేదా రెండో వారంలో ఒంటిపూట బడులు పెట్టడం దశాబ్ధాలుగా అమలులో ఉంది. అయితే ఒంటిపూట బడుల కోసం అడిగిన ఉపాధ్యాయులపై  మంత్రి బొత్స ఆగ్రహించడం సిగ్గుచేటు అని ఎమ్మెల్యే సత్యప్రసాద్‌ మండిపడ్డారు. అయితే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి  ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విధంగా  ఫ్యాక్షనిస్టు రాజకీయాలతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు ఉన్నాయా, లేవా అనే విషయాన్ని పక్కన పెడితే జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది మొదలు కక్ష సాధింపు దాడులకు,  హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారనే ఆరోపణ అయితే బలంగా వినిపిస్తోంది. ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన జగన్ రెడ్డి కుల్చివేతల పాలనలో గీతం యూనివర్సిటీ సహా అనేక మంది ప్రతిపక్ష నాయకుల ఇళ్లూ, వాకిళ్ళ కూల్చివేతల సంఘటనలు అనేకం వెలుగు చూశాయి. రాజకీయ ప్రత్యర్ధులపై  భౌతిక దాడులు నిత్య కృత్యంగా సాగుతున్నాయనే ఆరోపణ ఎటూ ఉండనే వుంది. అలాగే, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అనేక మంది హత్యలకు గురయ్యారనే ఆరోపణలున్నాయి. ఈ నాలుగు సంవత్సరాలలో జరిగిన పరిణామాలను గమనిస్తే  వైసేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందనే అభిప్రాయం  సామాన్య ప్రజలలో బలంగా వ్యక్తం అవుతోంది.  ఈ నేపథ్యంలో  ప్రభుత్వం పట్ల ధిక్కార స్వరాన్ని గట్టిగా వినిపిస్తున్న ఉపాధ్యాయులపై  ముఖ్యమంత్రి  కట్టారని, అందుకే, ఇరుగు  పొరుగు రాష్ట్రాలలో ఎప్పటినుంచో ఒంటి పూట  బడులు నిర్వహిస్తున్నా రాష్ట్రంలో మాత్రం నిర్ణయం ఇంకా నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. మరోవంక   పిల్లల తల్లితండ్రులు ఎండలు తీవ్ర స్థాయికి చేరిన పరిస్థితిలో మీ రాజకీయాల కోసం పిల్లలు ప్రాణాలతో చెలగాటం వద్దని అంటున్నారు.

సొమ్మొక్కడిది సోకొకడిదీ అన్నట్లు.. కష్టం బాబుది..క్రెడిట్ జగన్ కా?

 రాష్ట్ర విభజన తర్వాత, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే, అది తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్న తొలి ఐదేళ్లలోనే జరిగింది. అలాగే  రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చాయన్నా, అదీ ఆ ఐదేళ్ల కాలంలోనే అంటే చంద్రబాబు హయాంలోనే. ఇందులో మరో అభిప్రాయానికి తావు లేదు. అవార్డులు అబద్ధం చెప్పవు. తెలుగు దేశం  అధినేత, నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉన్న పరిపాలనా అనుభవం, అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, జాతీయ రాజకీయాలో చక్రం తిప్పిన నాయకునిగా దేశ విదేశాలలో ఆయనకు ఉన్న గుర్తింపు, గౌరవం ఈ అన్నిటినీ మించి విశ్వసనీయత, నిజాయతీ ఆధారంగా  అనేక విదేశీ సంస్థలు, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందు కొచ్చాయి. ఆ విధంగా చంద్రబాబు ఐదేళ్ల పాలనా కాలంలో అనేక దేశ విదేశీ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. పరిశ్రమలు స్థాపించాయి. అందులో, ‘ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2023’ అవార్డ్ గెలుచుకున్న కియా మోటార్స్ ఒకటి. తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో అనంతపూర్ జిల్లా, పెనుకొండ నియోజకవర్గ పరిధిలోని మునిమడుగులో రూ.13 వేల కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టు  ప్రారంభమైంది.  అయితే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసేపీ కియా ప్రాజెక్టు వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించింది. అదొక దండగమారి ప్రాజెక్టని ఎద్దేవా చేసింది. తెలుగు దేశం ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తిపడి, స్థానికులకు పట్టుమని పది ఉద్యోగాలు అయినా ఇవ్వని కార్ల ప్రాజెక్టుకు విలువైన భూములను కట్ట బెట్టిందని వైసీపీ నేతలు ఆరోపించారు. ముఖ్యంగా అప్పట్లో అన్నిటా నెంబర్ 2గా ఉన్న విజయసాయి రెడ్డి, ట్వీట్ల మీద ట్వీట్లతో టీడీపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. ‘కార్లు అమ్ముడుపోని కారణంగా కియా మోటార్స్ చైనాలోని అతి పెద్ద ప్లాంటును మూసేసింది. మరి అనంతపూర్ లో ఏర్పాటవుతున్న ప్లాంట్ సంగతేమిటో? అంటూ వ్యంగం ఒలక పోశారు. అంతే కాదు, కమీషన్ల కక్కుర్తితో కియా మోటార్స్ కు చంద్రబాబు నాయుడు రెండు వేల కోట్ల రూపాయల రాయితీ  ఇచ్చారు. కంపెనీ ఉద్యోగుల్లో వంద మంది కూడా స్థానికులు లేరని  ట్వీటారు.    అయితే  ఇప్పడు అదే విజయసాయి, నాలుక మడతేశారు. చంద్రబాబు నాయుడు ముందు చూపు, దార్శనికతతో రూపుదిద్దుకున్న  కియా మోటార్స్  అనంతపూర్ యూనిట్ లో తయారైన కియా కారేన్స్  కారుకు వచ్చిన ‘ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2023’ అవార్డ్ క్రెడిట్ ను వైసీపీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. ‘మేడ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’ కార్    కియా కారేన్స్ కు అవార్డు రావడం గర్వ కారణం అని పేర్కొన్నారు. అంతే కాదు, 2019లో 57,719 కార్లతో ఉత్పత్తి ప్రారంభించిన అనంతపూర్ కియా యూనిట్, ఉత్పత్తి 2021 నాటికి, 2.27 లక్షల కార్లను ఉత్పత్తి చేసే స్థాయికి చేరిందనీ, అదేదో తమ ప్రభుత్వం సాధించిన ఘన కార్యం అన్నట్లుగా  చంకలు గుద్దుకున్నారు. అయితే, కియా విజయం చంద్రబాబు నాయుడు దార్శనికకు నిదర్శనం అనేది  కాదనలేని నిజం. అందులో ఎలాంటి సదేహం లేదు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్, తమ పాదయాత్రలో 55వ రోజైనా గురువారం (మార్చి 30)   మునిమడుగులోని కియా ఫ్యాక్టరీ వద్ద ఉద్యోగులతో కలసి సెల్ఫీ తీసుకున్నారు.  కియా పరిశ్రమ ఇది.. ఏపీలోనే అతిపెద్ద సింగిల్ మేనిఫ్యాక్చరింగ్ ప్లాంట్.. భారతదేశంలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పెట్టిన సంస్థ అని ట్వీట్ చేశారు. పెట్టుబడి రూ.13వేల కోట్లు.. ప్రత్యక్షంగా, పరోక్షంగా 40వేల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. అలాగే మీడియాతో మాట్లాడుతూ, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కియా సహా పెద్ద సంఖ్యలో పరిశ్రమలు తెచ్చి లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తే.. ఇప్పుడు అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని లోకేష్ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వానికి కియా పరిశ్రమ ఎదుట సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. చంద్రబాబు కృషి, అప్పుడు మంత్రిగా పనిచేసిన అమరనాథ్ రెడ్డి, అధికారుల శ్రమకు కియా నిదర్శనమన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాకా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఈ నాలుగేళ్ళలో  తెచ్చిన పెట్టుబడులు, పరిశ్రమలు  ఏమిటో చెప్పాలని సవాల్ విసిరారు. అదేమిటో కానీ, నవ్విపోదురుగాక నాకేటి సామెతను గుర్తు చెస్తూ  మంది బిడ్డను మా బిడ్డని మురిసిపోయిన వైసీపీ పెద్దలు, లోకేష్ సవాల్ కు మాత్రం సమాధానం ఇవ్వలేదు. సైలెంట్ అయి పోయారు.

వయనాడ్ నుంచి రంగంలోని ప్రియాంక.. ఉపఎన్నిక ఎప్పుడు?

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు నేపథ్యంలో ఖాళీ అయిన కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతుంది? ఉప ఎన్నిక జరిగితే కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తారు? అనే విషయంలో ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి కర చర్చ జరుగుతోంది. ఉప ఎన్నిక ఎప్పుడు జరిగినా, ప్రియాంకా వాద్రా పోటీచేసే అవకాశం ఉందని  కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. అలాగే, ఆమె పోటీ చేయక పోవచ్చని, గతంలో వరసగా రెండు పర్యాయాలు ఇదే నియోజక వర్గం నుంచి గెలిచిన  కేరళ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్  ఎంఐ షనవాస్ పోటీ చేస్తారనే వార్తలు కూడా వినవస్తున్నాయి.  అయితే  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీని ప్రకటించిన ఎన్నికల కమిషన్ వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గ ఉపఎన్నిక విషయంలో మాత్రం సస్పెన్స్ పాటించింది. ఫిబ్రవరి వరకూ ఉన్న వేకెన్సీలను క్లియర్ చేసినట్టు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు. వయనాడ్ వేకెన్సీని మార్చిలో నోటిఫై చేశామని, రాహుల్ గాంధీ తనకు రెండేళ్ళ జైలు శిక్షపై  అప్పీల్ చేసుకునేందుకు 30 రోజుల సమయం ఉన్నందున తాము తొందరపడటం లేదని చెప్పారు. ప్రజాప్రాతినిథ్య చట్టం-1951 ప్రకారం ఏ సీటైనా ఖాళీ అయితే ఆరు నెలల్లోపు దానిని భర్తీ చేయాల్సి ఉంటుంది,   రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై నిరసన కార్యక్రమాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ... ఇదే సమయంలో కర్ణాటకతో పాటు వయనాడ్ ఉప ఎన్నికను కూడా ఎన్నికల సంఘం ప్రకటించినట్లయితే న్యాయపోరాటం జరపాలనే ఆలోచన చేసింది. పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు గత రాహుల్‌ను దోషిగా నిర్దారిస్తూ, ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు రాహుల్‌కు 30 రోజుల గడువు ఇచ్చింది. రాహుల్ విజ్ఞప్తిపై ఆయనకు బెయిల్ సైతం మంజూరు చేసింది. అయితే, సూరత్ కోర్టు తీర్పు వెలువరించిన మరుసటి రోజే రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, రెండేళ్ల జైలుశిక్షపై 30 రోజుల్లోగా అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని, ఆయనకు విధించిన జైలుశిక్షను పైకోర్టు నిలిపివేసినట్లయితే ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడం జరుగుతుందని కాంగ్రెస్ చెబుతోంది.  కాగా రాహుల్ ఎదుర్కొంటున్న తరహా కేసులోనే లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్‌పై పడిన అనర్హత వేటును లోక్‌సభ సెక్రటేరియట్  బుధవారం (మార్చి 29) ఉపంసంహరించుకుంది. గతంలో సెషన్స్ కోర్టు తీర్పు నేపథ్యంలో ఫైజల్‌ను ఎంపీ పదవి నుంచి తొలగిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని కేరళ హైకోర్టులో ఆయన సవాలు చేశారు. దానిని విచారించిన కోర్టు ఆయనకు విధించిన శిక్షపై స్టే విధించింది. అయినప్పటికీ ఆయనపై అనర్హతను లోక్‌సభ సెక్రటేరియట్ ఎత్తివేయలేదు.తాను పార్లమెంటుకు వచ్చినప్పటికీ తనను భద్రతా సిబ్బంది అనుమతించలే దంటూ ఆయన ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ పెండింగ్‌లో ఉండగానే ఎంపీ అనర్హత వేటును ఉపసంహరించుకుంటూ లోక్‌సభ ఉత్తర్వులు జారీ చేసింది. ఫైజల్ పిటిషన్‌ను సీజేఐ డివై చంద్రచూడ్ విచారణకు స్వీకరించిన నేపథ్యంలో లోక్‌సభ సచివాలయం ఫైజల్ అనర్హతపై దిగొచ్చి, అనర్హత నోటిఫికేషన్ ను ఉపసంహరించుకుంది. ఈనేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం వాయనాడ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు.

ఏపీ తలరాత ఇంతే!

14వ ఆర్థిక సంఘం ప్రత్యేక కేటగిరీ హోదా రాష్ట్రాలు, సాధారణ కేటగిరీ రాష్ట్రాల మధ్య వివక్ష చూలేదు కనుకే అందుకే ప్రత్యేక కేటగిరీ హోదా స్థానంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని కేటాయించినట్టు కేంద్ర స్పష్టం చేయడం ఏపీకి ఏవిధంగా నైనా షాకింగ్ న్యూస్ కాదు.. గత కొన్నేళ్లుగా కేంద్ర చెబుతునన మాట ఇదే. మరో సారి  ఇదే విషయాన్ని రాజ్య సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు  విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. కేంద్ర ఆదాయాన్ని రాష్ట్రాలతో పంచుకోవాలన్న ఫైనాన్స్ కమిషన్ సీఫారుసుల మేరకు 2015-20 మధ్య కాలంలో రాష్ట్రాల వాటా 32 శాతం నుంచి 42 శాతానికి పెరిగిందని మంత్రి సెలవిచ్చారు.  15 వ ఆర్థిక సంఘం 2020-26 కాలానికి ఎటువంటి ముఖ్యమైన మార్పులు చేయలేదని, జమ్మూకాశ్మీర్ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించడంతో కోటా స్వల్పంగా 42 శాతం నుంచి 41 శాతానికి తగ్గించిన విషయాన్ని మంత్రి  వివరించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఏపీ ఉన్నప్పుడు.. ఏపీ లోని పారిశ్రామికవేత్తలు భారీగా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టి, అనేక మంది జీవనోపాధిని కల్పించారు.  పెద్ద పరిశ్రమలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. 2014లో ఏపీ రెండుగా చీలిపన్నప్పుడు అభివృద్ధి చెందిన హైదరాబాద్  తెలంగాణలో ఉండిపోగా.. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అనాధలా మిగిలిపోయిందనే వాదన ఇప్పుడు కూడా వివనస్తూనే ఉంది.    విభజన సమయంలో హైదరాబాద్ ను ఆంధ్రప్రదేశ్ కోల్పోయినట్లుగా బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్ లు విభజనల ద్వారా    తమ రాజధానులను కోల్పోలేదు. అయితే కేంద్రం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన లోపభూయిష్టంగా జరిగిందని ఒక వైపు చెబుతూనే, ఆ లోపభూయిష్ట విభజన కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవడానికి ఏ విధంగానూ ముందుకు రావడం లేదు. ఈ విషయంలోనే గత తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రంలో విభేదించి ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. మెజారిటీ ఇవ్వండి ప్రత్యేక హోదా సాధించుకువస్తామంటూ వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన వైసీపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం అటుంచి.. కేంద్రం తానా అంటే తందానా అంటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మంత్రి మరోసారి రాష్ట్ర సభలో కుదరదని స్పష్టం చేశారు. ఇక ఏపీ గతి ఇంతే అని ఆయన చెప్పకనే చెప్పేశారు. 

హైదరాబాద్ పై ఉగ్రపంజా?దసరా సందర్భంగా విధ్వంసానికి కుట్ర

దసరా పర్వదినాన హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చార్జిషీట్ దాఖలు చేసింది. పేలుళ్ల ద్వారా మారణహోమం సృష్టించేందుకు లష్కరే తొయిబాకు చెందిన ముగ్గురు  ఉగ్రవాదులు కుట్ర పన్నారని అందులో పేర్కొంది.   భారీ పేలుడు పదార్ధాలతో పేలుళ్లకు ముష్కరులు పథకం రూపొందించారని ఎన్ఐఏ చార్జ్ షీట్ లో పేర్కొంది.  దేశంలో అత్యంత రద్దీగా ఉండే నగరమైన హైదరాబాద్ లో  పేలుళ్లకు కుట్ర కేసులో పట్టుబడిన ఉగ్రవాదులలో నగరానికి చెందిన మహ్మద్ అబ్దుల్ వాజిద్, సమీయుద్దీన్, హసన్ ఫరూక్ లు ఉన్నారు. వీరి నుంచి నగదు, హ్యండ్ గ్రెనేడ్ లను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఇద్దరు పాకిస్థాన్ కు చెందిన ఎల్ ఇటీ ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరీ, అతని సహచరులు సిద్ధిక్ బిన్ ఉస్మాన్, అబ్దుల్ మజీద్ తో పాటు ఇతర లష్కరే తొయిబా ఉగ్రవాదులతో టచ్ లో ఉన్నారని ఎన్ఐఏ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. రద్దీగా ఉండే ప్రాంతాలను ముష్కరులు టార్గెట్ చేసి పేళుళ్లక పాల్పడాలన్నది వీరి పథకంగా పేర్కొంది.  

అమృత్ పాల్ సింగ్ సరిహద్దు దాటేశాడా?

ఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ ను పట్టుకోవడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు.   రోజుకో వేషంతో పంజాబ్ పోలీసులకు చుక్కలు చూపిస్తున్న అమృత్ పాల్ సింగ్ పూటకో వేషం మార్చి దేశంలోనే దర్జాగా తిరుగుతున్నాడన్న వార్తలు ఒకవైపు  దేశం విడిచి ఎప్పుడో పారిపోయాడన్న సమాచారం మరోవైపు జనాలను అయోమయానికి గురి చేస్తోంది. తాజాగా ఖలిస్థాన్ నేత అమృత్ పాల్ సింగ్ ఢిల్లీలోని ఓ మార్కెట్ లో సంచరిస్తున్నట్లుగా ఓ సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. దాంతో అమృత్ పాల్ సింగ్ తన సహచరుడు పాపల్ ప్రీత్ సింగ్ తో కలిసి తలపాగా లేకుండా మాస్కు, నల్ల  కళ్ల అద్దాలు ధరించి దర్జాగా తిరుగుతున్నట్టుగా ఉంది. అయితే దానిని పోలీసులు ధృవీకరించలేదు. యథాప్రకారంగా అమృత్ పాల్ సింగ్ ను త్వరలో పట్టుకుంటాం అన్న అరిగిపోయిన రికార్డునే వినిపించారు.   అదలా ఉంటే.. అమృత్ పాల్ సింగ్ ను తప్పకుండా పట్టుకుంటామని పంజాబ్, హర్యానా హైకోర్టుకు పంజాబ్ ప్రభుత్వం మంగళవారం( మార్చి 28) తెలిపింది.   అయితే అమృత్ పాల్ సింగ్ పోలీసుల కస్టడీలోనే  ఉన్నాడని, ఆచూకీ చెప్పాలంటూ ఇమాన్ సింగ్ ఖారా అనే న్యాయవాది హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.  ఇదిలా ఉంటే అమృత్ పాల్ సింగ్ దేశం విడిచి ఎప్పుడో పారిపోయాడనే వాదన కూడా గట్టిగా  వినిపిస్తోంది.  ప్రస్తుతం అతడు నేపాల్ లో ఉన్నాడంటున్నారు.   మరోవైపు పలు దేశాల్లో ఖలిస్థాన్ సానుభూతిపరులు భారత్ ఎంబసీల మీద దాడులకు దిగుతున్నారు. అమెరికా, యూకే, ఫిలిప్పీన్స్ లో ఖలిస్థాన్ మద్దతుదారులు  తన నిరసనలతో  ప్రపంచ దృష్టిని ఆకర్షించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. 70,80వ దశకం తరువాత అణగారిపోయిందనుకున్న ఖలిస్తాన్ ఉద్యమం  మళ్లీ ఇన్నాళ్ల తరువాత మళ్లీ తెరపైకి రావడం నిస్సందేహంగా భారత్ కు ఇబ్బందికరమే.  దీనిని ఆదిలోనే నిరోధించకుంటే.. మరో బ్లూస్టార్ ఆపరేషన్ వంటిది అనివార్యమౌతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

హైదరాబాద్ మెట్రో-2కు కేంద్రం మోకాలడ్డు

హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. రెండో దశ మెట్రో రైలు ప్రస్తుత తరుణంలో సాధ్యం కాదంటూ కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది.  దీనిపై మంత్రి కేటీఆర్   కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి రాసిన లేఖలో  అనేక సార్లు కేంద్ర ప్రభుత్వ పట్టణ అభివృద్ధి శాఖకు మెట్రో రైలు రెండో దశకు అవసరమైన అన్ని రకాల సమాచారాన్ని అందించడంతో పాటు ప్రాజెక్ట్ సవివర నివేదిక సైతం పంపించామని పేర్కొన్నారు. మరోసారి కూడా సమగ్ర సమాచారాన్ని, పూర్తి వివరాలు, పత్రాలు, నివేదికలను కేంద్రానికి  పంపుతున్నట్లు  చెబుతూ,   అత్యంత రద్దీ కలిగిన నగరమైన హైదరాబాద్ కు మెట్రో రైలు ప్రాజెక్ట్ రెండో దశ కష్టమని కేంద్రంచెప్పడం సబబు కాదన్నారు. కేంద్రం పక్షపాత ధోరణితో మెట్రో రైలు ప్రాజెక్టులు ఇస్తోందని ఆ లేఖలో ఆరోపించారు. గాంధీనగర్, కొచ్చి, బెంగళూరు, చెన్నై వంటి నగరాలతో పాటు చాలా తక్కువ జనాభా ఉన్న లక్నో, ఆగ్రా,  వారణాసి, కాన్పూర్, ప్రయాగ్ రాజ్, మీరట్ వంటి   చిన్న పట్టణాలకు కూడా మెట్రో ప్రాజెక్టులను కేటాయించి వాటికి అన్ని అర్హతలూ ఉన్నాయని చెబుతూ,   హైదరాబాద్ కు మెట్రో రైలు విస్తరణ అర్హత లేదనడం దుర్మార్గమని కేటీఆర్ ఆ లేఖలో విమర్శించారు. హైదరాబాద్ లో ప్రయాణికుల సంఖ్య చాలా తక్కువ అని కేంద్రం చెప్పడం అర్థరహితమని విమర్శించారు.  తెలంగాణ నేడు శరవేగంతో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. తెలంగాణకు అన్ని అర్హతలు, అనుకూలతలు ఉన్నా వివిధ రంగాలలోని ప్రాజెక్టులు, కేటాయింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షను అనేక సార్లు కేంద్ర ప్రభుత్వ దృష్టికి సీఎం కేసీఆర్, తాను తీసుకెళ్లినట్టు మంత్రి కేటీఆర్ ఆ లేఖలో వివరించారు. సంబంధిత కేంద్ర మంత్రికి వ్యక్తిగతంగా కలిసి హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ ప్రాధాన్యాన్ని వివరించేందుకు అనేక సార్లు ప్రయత్నించినా ఆయన కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. ఇప్పటికైనా హైదరాబాద్ నగర మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర ఆమోదముద్ర వేస్తుందని ఆశి స్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.    

డిఫ్యాక్టో సీఎం సజ్జలకు కౌంట్ డౌన్ మొదలయ్యిందా?

సజ్జల రామకృష్ణా రెడ్డి స్వతాహాగా రాజకీయ నాయకుడు కాదు.ఆయన ఒక జర్నలిస్ట్. జర్నలిస్ట్ గా జీవితం ప్రారంభించిన ఆయన వ్యాపార వేత్తగా ఎదిగారు. ఆ పైన వ్యాపార భాగస్వామ్యాన్ని రాజకీయాలతో ముడివేసి రాజకీయ నాయకుడయ్యారు. అయితే  సజ్జల  జర్నలిస్ట్ జీవితాన్ని పక్కన పెడితే వ్యాపార, రాజకీయ ప్రయాణంలో ఆయన ప్రయాణమంతా  వైఎస్ కుటుంబంతో కలిసే సాగింది. ఇక రాజకీయ ప్రయాణం అయితే పూర్తిగా  జగన్ మోహన్ రెడ్డి తోనే   సాగి, సజ్జలయ ముఖ్యమంత్రికి ముఖ్య సలహాదారు స్థాయికి ఎదిగారు.   అంతవరకు అన్ని వ్యవహరాలలో నెంబర్ 2 గా ఉన్న విజయసాయిని   పక్కకు నెట్టి మరీ సజ్జల ఆ స్థానాన్ని దక్కించుకున్నారు.  . నిజానికి ఆయన పేరుకే ముఖ్యమంత్రి సలహాదారు కానీ, వాస్తవంలో ఆయన ఇంటర్నల్ స్టేటస్ ఇంకా చాలాచాలా ఎక్కువని, అంటారు. అలాగే, సర్వ శాఖల మంత్రిగా ప్రసిద్ది చెందిన సజ్జల  పార్టీ, ప్రభుత్వ రాజకీయాలపైనే కాకుండా  తాడేపల్లి ప్యాలెస్ రాజకీయాలపై కూడా పట్టు సాధించారనీ అందుకే, ఆయన ముఖ్యమంత్రి కార్యాలయంలో అత్యంత ‘ముఖ్య’ నేతగా చక్రం తిప్పుతుండడమే కాకుండా ఒక విధంగా డిఫ్యాక్టో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని  ఆయన అంటే గిట్టని పార్టీ నేతలు అంటారు. అందుకే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, పార్టీ కీలక నేతలతో సహా చాలా మంది నాయకులు ఆయన పట్ల చాలా గుర్రుగా ఉన్నారని చెబుతున్నారు.  అదలా ఉంటే ఇప్పుడు, ఎమ్మెల్సీ ఎన్నికల పరాభవం నేపథ్యంలో అధికార వైసీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాల వెనక సజ్జల హస్తం ఉందనే  అభియోగం బలంగా వినిపిస్తోంది. ఒక విధంగా సజ్జల ముఖ్యమంత్రి కళ్ళకు గంతలు కట్టి, వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని పార్టీ నేతలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. వైసీపీ ప్రస్తుతం ఎదుర్కుంటున సంక్షోభానికి సజ్జలే కారణం అనే అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే కాకుండా, తాడేపల్లి ప్యాలెస్ వర్గాల్లో   కూడా వినవస్తునట్లు చెబుతున్నారు.   ముఖ్యంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ చేశారనే ఆరోపణపై సస్పెన్షన్ కు గురైన నలుగురు ఎమ్మెల్యేలు, సజ్జలనే దోషిగా నిలబెడుతున్నారు.  సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అన్నారం నారాయణ రెడ్డి అయితే తాము టీడీపీకి అమ్ముడు పోయామని సజ్జల చేసిన ఆరోపణపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. సజ్జల ఎవరు? అయన చరిత్ర ఏమిటి? అని ప్రశ్నించారు. అంతే కాదు, సజ్జలను వదిలే ప్రసక్తిలేదని, సస్పెన్షన్  గురైన ఇతర ఎమ్మెల్యేలతో చర్చించి, సజ్జలపై పరవు నష్టం దావా వేస్తామని  అన్నారు. అలాగే, ఆయన సజ్జల టార్గెట్’ గా తీవ్ర ఆరోపణలు చేశారు.  అలాగే  సస్పెన్షన్ వేటుకు గురైన మహిళా ఎమ్మెల్యే శ్రీదేవి సజ్జల తనను హత్య చేయిస్తారన్న అనుమానం వ్యక్తం చేశారు. సజ్జల వల్ల ప్రాణహాని ఉందన్న భయంతోనే హైదరాబాద్ లో తల దాచుకుంటున్నానన్నారు.   నిజానికి, చాల కాలంగా సజ్జల వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయనీ, అయితే ఎందుకనో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆ ఫిర్యాదులను అంతగా పట్టించుకోలేదని అంటారు.  ముఖ్యంగా జగన్ రెడ్డి కుటుంబ సభ్యులు రాజకీయంగా ఎదగకుండా చేయడంలో సజ్జల కీలక పాత్ర పోషించారనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.  అదలా ఉంటే ఇంతకాలం సరైన  సమయం కోసం ఎదురు చూస్తున్న సజ్జల బాధితులంతా ఏకమయ్యేందుకు, తెర వెనక ప్రయత్నాలు మొదలయ్యాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ ప్రయత్నాల వెనక, జగన్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటుగా, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మ మిత్రులు, వైఎస్ కు సన్నిహితంగా మెలిగిన మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.  అదలా ఉంటే  జగన్ రెడ్డి కూడా కొంచెం ఆలస్యంగానే అయినా సజ్జల రాజకీయ ఎత్తులను పసిగట్టినట్లు తెలుస్తోంది. అందుకే, సజ్జల చెక్ పెట్టే ఆలోచన చేస్తున్నారని, ఆదిశగా పావులు కదులుతున్నాయని అంటున్నారు.

రాహుల్ అనర్హతపై స్పీకర్ పునరాలోచన?

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగతున్న నేపధ్యంలో వెలుగులోకి వచ్చిన, లక్షద్వీప్‌ ఎన్సీపీ ఎంపీ మహ్మద్‌ ఫైజల్‌  అనర్హత వేటు  వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్‌సీపీ నేత మహమ్మద్‌ ఫైజల్‌ పై గతంలో వేసిన అనర్హత వేటును లోక్‌సభ సచివాలయం ఎత్తివేసింది. ఆయనపై  అనర్హతను ఉపసంహరించుకుంటున్నట్లు, ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు లోక్‌సభ సెకట్రేరియట్  బుధవారం(మార్చి 29) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఫైజల్‌ అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టు లో విచారణ జరుగుతుండగానే.. ఈ నోటిఫికేషన్‌ రావడం గమనార్హం.  ఫైజల్‌ లోక్‌సభ సభ్యత్వం విషయంలో.. లోక్‌సభ సెక్రటేరియెట్‌ వెనక్కి తగ్గింది. సుప్రీం కోర్టులో  బుధవారం(మార్చి 29) వాదనలు జరగడానికి కొన్ని గంటల ముందే బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఫైజల్‌పై అనర్హత వేటు ఎత్తేస్తున్నట్లు లక్షద్వీప్‌ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు లోక్‌సభ సెక్రటేరియెట్‌ జనరల్‌  ఓ నోటిఫికేషన్‌ను రిలీజ్‌ చేసింది.  2016, జనవరి 5వ తేదీన ఫైజల్‌పై అండ్రోథ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఓ హత్యాయత్నం కేసు నమోదైంది. ఆ కేసు కొనసాగుతుండగానే.. 2019లో ఆయన లోక్‌సభ ఎంపీగా నెగ్గారు. అయితే.. ఈ ఏడాది జనవరి 11వ తేదీన ఫైజల్‌తో పాటు మరో ముగ్గురికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది కోర్టు. దీంతో జనవరి 13వ తేదీన లోక్‌సభ సచివాలయం ఫైజల్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ.. అనర్హత వేటు వేసింది. దీంతో ఆయన కోర్టుకు ఆశ్రయించగా.. నిర్దోషిగా తేలుస్తూ... కేరళ కోర్టు  సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని ఆదేశించింది. కానీ, లోక్‌సభ సెక్రటేరియట్‌ అనర్హత వేటు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో బుధవారం ( మార్చి 29) ఫైజల్‌ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరగనున్న నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటును ఎత్తివేసింది లోక్ సభ. ఇదిలా ఉంటే.. తాజాగా రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు పడడంతో.. ఫైజల్‌ కేసులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయో, అవి రాహుల్‌ కేసులోనూ వర్తించే అవకాశాలున్నాయన్న చర్చ నడుస్తోంది. కాగా..  కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వ అనర్హతపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగుతున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాహుల్‌ గాంధీ కేసులో ఇది ప్రభావం చూపించనుందని భావిస్తున్నారు. అయితే, రాహుల్ గాంధీ అనర్హత విషయంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వినిపించడంతో పాటుగా, ఈ విషయంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో విపక్షాలు ఉన్నట్టు వార్తలు వస్తున్న నేపధ్యంలో లోక్ సభ సెక్రటేరియట్ పునరాలోచనలో పడిందని అంటున్నారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని విపక్షాలన్నీ తప్పుపడున్న విష్యం తెలిసిందే. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన విపక్షాల సమావేశంలో రాహుల్ విషయంలో స్వీకర్ తొందరపడ్డారనే అభిప్రాయం  వ్యక్తమైందని చెబుతున్నారు.  2019 పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధించింది. ఆ వెంటనే పార్లమెంట్ సెక్రటేరియట్ ఆయనపై అనర్హత వేటు వేసింది. దీంతో ఓం బిర్లాపై విపక్షాలన్నీ అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ఉన్నట్లు వార్త లొచ్చాయి. ఖర్గే నివాసంలో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశానికి కొనసాగింపుగా   మంగళ వారం (మార్చి 28) జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎంపీల సమావేశంలో స్పీకర్ పై  అవిశ్వాస తీర్మానం ప్రతిపాదన చేశారు. ఇదే అంశంపై ఇతర పార్టీల నేతలతో కాంగ్రెస్  చర్చించి ఏప్రిల్ 3న అవిశ్వాస తీర్మానాన్ని  ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో లక్షదీప్ ఎన్సీపీ ఎంపీ మహమ్మద్‌ ఫైజల్‌ పై గతంలో వేసిన అనర్హత వేటును లోక్‌సభ సచివాలయం ఎత్తివేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తెలంగాణ మంత్రులకు నిరుద్యోగుల సెగ

ఇది ఒకరిదో ఇద్దరిదో   సమస్య కాదు, దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగ విద్యార్ధులకు సంబందించిన సమస్య. ముప్పై లక్షల కుటుంబాల సమస్య. అయినా  టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల రద్దు  విషయంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించవలసిన తీరున స్పందించలేదని విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆవేదన చెందుతున్నారు. ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు నిరసనలకు దిగారు. పలుచోట్ల మంత్రుల క్యాంప్ కార్యాలయాలను ముట్టడించారు. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు, సూర్యాపేటలో మంత్రి  జగదీశ్ రెడ్డి క్యాంపు  కార్యాలయాలతో మాటు పాటు  కరీంనగర్లో మంత్రి గంగుల ఇంటినీ ముట్టడించారు.  ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీల నాయకులు తమపై చేసిన విమర్శలకు రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానంటున్నమంత్రి కేటీఆర్  వీధిన పడిన తమ జీవితాలకు ఏమి సమాధానం చెపుతారని  నిరుద్యోగ యువకులు, విద్యార్ధులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి మొదలు మంత్రులు ఎవరూ పేపర్ లీకేజీపై ఎందుకు స్పందించరని నిలదీస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అనుమనితురాలిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న ముఖ్యమంత్రి కుమార్తె,  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణకు సందర్భంగా కట్టకట్టుకుని ఢిల్లీ వెళ్ళిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు విద్యార్ధుల వద్దకు ఎందుకు వెళ్లరని ప్రశ్నిస్తున్నారు.   అదలా ఉంటే సిద్దిపేటలోని మంత్రి హరీశ్ రావు క్యాంపు ఆఫీసును ఏబీవీపీ ముట్టడించింది. ఏబీవీపీ ఉమ్మడి మెదక్ జిల్లా విభాగ్ కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మంత్రి హరీశ్ రావు ఇంతవరకు లీకేజీ ఘటనపై స్పందించకపోవడం సిగ్గు చేటన్నారు. విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్టులు చేయిస్తున్న మంత్రులు..ఎందుకు టీఎస్పీఎస్ చైర్మన్ జనార్దన్ రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్ ను విచారించట్లేదని మండిపడ్డారు.  టీఎస్పీఎస్సీ లీకేజీపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మరోవంక సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మంత్రి జగదీశ్ రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ఏబీవీవీ నాయకులు ముట్టడించేందకు యత్నించగా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ గ్రూప్స్ పేపర్ లీకేజీలపై  సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు.  దాదాపు 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలు రోడ్లపాలు చేసి వారి జీవితాలను అంధకారం లోకి నెట్టారన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే ప్రగతి భవన్  ముట్టడించడానికి వెనకాడబోమని హెచ్చరించారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని మంత్రి గంగుల కమలాకర్ ఇంటిని విద్యార్థులు ముట్టడించారు. లీకేజీ కి రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ ను వెంటనే తొలగించి హైకోర్టు జడ్జితో లేదా సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. సిట్ దర్యాప్తుపై తెలంగాణ యువతకు ఎలాంటి నమ్మకం లేదన్నారు. నిజానికి  గతంలో నయీం కేసు, డ్రగ్స్ కేసు లకు సంబందించి,  అలాగే భూ కుంభకోణాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు  కొండను తవ్వి  ఎలకను కూడా పట్టని నేపథ్యంలో 30 లక్షల మంది జీవితాలతో ముడిపడిన కేసును సిట్ పరిష్కరిస్తుందని తాము నమ్మడం లేదని విద్యార్థులు తేల్చి చెబుతున్నారు. 

తెలుగుదేశం కోసం నందమూరి ఫ్యామిలీ

తెలుగుదేశం పార్టీకి బాసటగా నిలిచేందుకు నందమూరి ఫ్యామిలీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. నందమూరి కుటుంబం నుంచి నుంచి నందమూరి రామకృష్ణ, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినితోపాటు నందమూరి చైతన్య కృష్ణ.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోసం ప్రచార రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయని పొలిటికల్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతోంది. అయితే నందమూరి ఫ్యామిలీ ఇలా ఎంట్రీ ఇవ్వడం ద్వారా పార్టీకి అదనపు బలం చేకూర్చినట్లు అవుతోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.  మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితేనేమీ... ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితేనేమీ తెలుగుదేశం  అభ్యర్థులు ఘన విజయం సాధించారు. అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అధికార పార్టీ అభ్యర్థులకు టీడీపీ అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురై... చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా వైసీపీ విజయం సాధించగలిగామని వైసీపీలోనే చర్చ జోరుగా సాగుతోంది.   ఈ మొత్తం ఎపిసోడ్‌లో జగన్ ప్రభుత్వంపై గ్రాడ్యుయేట్లలోనే కాదు.. వైసీపీలోని  ఎమ్మెల్యేల్లో సైతం తీవ్ర వ్యతిరేకత ఉందని క్లియర్ కట్‌గా స్పష్టమైందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.   మరో వైపు  జగన్ ప్రభుత్వ వ్యవహార శైలిపై ఓ వైపు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి, బాదుడే బాదుడు తదితర కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి బలంగా వెళ్తుండగా.. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. యువగళం పేరుతో పాదయాత్ర చేస్తూ.. నిత్యం ప్రజల మధ్యే ఉంటూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్  తీరును జనం మధ్యే ఎండగడుతోన్నారు.  అదీకాక.. ఎన్నికలకు ఇంకా దాదాపు ఏడాది ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి సమయంలోనే నందమూరి ఫ్యామిలీ  రంగంలోకి దిగి.. జగన్ గద్దెనెక్కిన తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకొన్న వరుస పరిణామాలను.. ప్రజల మధ్యకు వెళ్లి వివరించడం.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులు.. తీసుకు వచ్చిన సంక్షేమ పథకాలు.. అలాగే వైయస్ జగన్ గద్దెనెక్కిన తర్వాత జరిగిన అభివృద్ధి పనులను బేరీజు వేసి  వివరించగలిగితే.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభంజనం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే నందమూరి కుటుంబ సభ్యులు కూడా.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడమే కాకుండా.. రాష్ట్రంలోని ఓ బలమైన నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకొని.. ఇంకా వివరంగా చెప్పాలంటే.. గుడివాడ, గన్నవరం లాంటి నియోజకవర్గాల్లో అభ్యర్థులుగా నిలబడితే.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి కాదు తెలుగుదేశం పార్టీకి వైనాట్ 175 అనుకునే పరిస్థితి వస్తుందని పరిశీలకులు చెబుతున్నారు.  మరోవైపు వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని నందమూరి తారకరత్న స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన లక్ష్యాన్ని ముందుకు తీసుకు వెళ్లే క్రమంలో నందమూరి ఫ్యామిలీ రంగంలోకి దిగాల్సిన అవశ్యకత మాత్రం  ఉందనే ఓ అభిప్రాయం పోలిటికల్ సర్కిల్‌లో వ్యక్తమవుతోంది.

పార్లమెంటులో తెలుగుదేశం ఆవిర్భావ వేడుకకు నడ్డా

పార్లమెంటు ఆవరణలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి.  పార్లమెంటులో ఎన్టీ ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన  టిడిపి ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని, కనకమేడల కేక్ కట్ చేసి పార్టీ ఆవిర్భావ  వేడుకలు నిర్వహించారు. అనూహ్యంగా ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా హాజరయ్యారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన తెలుగుదేశం ఎంపీలకు అభినందనలు తెలియజేశారు.  వాజ్ పేయి హయాంలో టిడిపి,  బిజెపి అనుబంధాన్ని తెలుగుదేశం ఎంపీలు నడ్డాకు వివరించారు.  బీజేపీ, తెలుగుదేశం   స్నేహ సంబంధాల గురించి తనకు తెలుసునని నడ్డా ఈ సందర్భంగా అన్నారు. ఇటీవల అండమాన్ మేయర్ ఎన్నికల్లో టిడిపి బిజెపి పొత్తుపై నడ్డా ప్రస్తావించారు.