
Gaddar Awards: రేవంత్ రెడ్డి సాక్షిగా చంద్రబాబుకి చిరంజీవి రిక్వెస్ట్!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025’ వేడుక హైదరాబాద్ లో వైభవంగా జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో ఈ ఏడాది 'ఎన్టీఆర్ నేషనల్ అవార్డు'ను మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) అందుకున్నారు. చిరంజీవికి ఈ అవార్డును రేవంత్ రెడ్డి ప్రధానం చేశారు. (Gaddar Awards) 'ఎన్టీఆర్ నేషనల్ అవార్డు' అందుకున్న అనంతరం చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఎక్కడైతే కళాకారులు గౌరవించబడతారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని అంటారు. దానిని రేవంత్ రెడ్డి గారు సరిగ్గా అర్థం చేసుకున్నారు. కొన్నేళ్లుగా నిర్లక్ష్యం చేయబడ్డ సినిమా అవార్డులను మళ్ళీ పునరుద్ధరించారు." అంటూ రేవంత్ పై ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబుకి చిరంజీవి ఓ విజ్ఞప్తి చేశారు. సినిమా అవార్డుల విషయంలో తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ వెనుకబడిందని అభిప్రాయపడ్డారు. సినిమా వాళ్ళకు అతి దగ్గరగా ఉండే చంద్రబాబు గారు.. దీనిని స్ఫూర్తిగా తీసుకొని కళాకారులను ప్రోత్సహిస్తూ అవార్డులు ఇస్తే బాగుంటుందని చిరంజీవి రిక్వెస్ట్ చేశారు. అవార్డుల జాబితా: ఉత్తమ చిత్రం - రాజు వెడ్స్ రాంబాయి రెండవ ఉత్తమ చిత్రం - దండోరా మూడవ ఉత్తమ చిత్రం - ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఉత్తమ పర్యావరణ చిత్రం - ఇగ్వా ఉత్తమ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ - లిటిల్ హార్డ్స్ ఉత్తమ వినోదాత్మక చిత్రం - సంక్రాంతికి వస్తున్నాం ఉత్తమ సోషల్ మెసేజ్ చిత్రం - కోర్టు ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ మూవీ - మిరాయ్ ఉత్తమ బాలల చిత్రం - అనగనగా ఉత్తమ నటుడు- నాగచైతన్య (తండేల్) ఉత్తమ నటి - రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్ ) ఉత్తమ దర్శకుడు - సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి) ఉత్తమ సహాయ నటుడు - శివాజీ (దండోరా) ఉత్తమ సహాయ నటి - భూమిక (యుఫోరియా ) ఉత్తమ సంగీత దర్శకుడు- మార్క్ కె. రాబిన్ (దండోరా) ఉత్తమ మేల్ సింగర్- అనురాగ్ కులకర్ణి (రాజు వెడ్స్ రాంబాయి) ఉత్తమ ఫిమేల్ సింగర్- సాహితి చాగంటి (కన్నప్ప) ఉత్తమ కమెడియన్ - శ్రీ కృష్ణ తేజ (జిగ్రిస్) ఉత్తమ బాలనటుడు - రోహన్ (ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ) ఉత్తమ స్టోరీ రైటర్ - గుణశేఖర్ (యుఫోరియా ) ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ - అనిల్ రావిపూడి ఉత్తమ గేయ రచయిత - నందకిశోర్ (కుబేర) ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - కార్తిక్ ఘట్టమనేని (మిరాయ్) ఉత్తమ ఎడిటర్- శ్రీకర్ ప్రసాద్ (మిరాయ్) ఉత్తమ ఆడియోగ్రాఫర్ - ఎం.ఆర్ రాధాకృష్ణన్ (కిష్కిందపురి) ఉత్తమ కొరియోగ్రాఫర్ - గిర గిర గిర (ఛాంపియన్) ఉత్తమ ఆర్ట్ డైరక్టర్ - తోట తరణి (ఛాంపియన్) ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ - గోవింద్ (అఖండ) ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ - చంద్రకాంత్ (ఛాంపియన్) స్పెషల్ జ్యూరీ అవార్డులు.. శ్రీరాజ్ రాచకొండ (23 మూవీ) చైతు జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి) రోషన్ మేక (ఛాంపియన్) అనంతిక సనీల్ కుమార్ (8 వసంతాలు) స్పెషల్ అవార్డులు.. ఎన్టీఆర్ నేషనల్ అవార్డు - చిరంజీవి పైడి జైరాజ్ అవార్డు - కమల్ హాసన్ బీఎన్రెడ్డి ఫిల్మ్ అవార్డు- సింగీతం శ్రీనివాసరావు నాగిరెడ్డి చక్రపాణి అవార్డు - అశ్వనీ దత్ కాంతారావు అవార్డు - ఆర్. నారాయణమూర్తి రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు - రమేష్ ప్రసాద్ సి.నారాయణరెడ్డి ఫిల్మ్ అవార్డు - సుద్దాల అశోక్ తేజ అక్కినేని నాగేశ్వరరావు ఫిల్మ్ అవార్డు - జయసుధ
Mar 19, 2026
Gaddar Awards: సారీ విజయ్ దేవరకొండ.. రష్మికతో దేవిశ్రీ ప్రసాద్ స్టెప్పులు!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025’ వేడుక హైదరాబాద్ లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ అవార్డుల వేడుకలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్, రామ్ చరణ్, నాగ చైతన్య, రష్మిక మందన్న, దిల్ రాజు, అల్లు అరవింద్, అనిల్ రావిపూడి సహా ఎందరో సినీ సెలబ్రిటీలు ఈ ఈవెంట్ లో సందడి చేశారు. (Gaddar Awards) నిధి అగర్వాల్, దేవి శ్రీ ప్రసాద్ వంటి వారు తమ స్టేజ్ పర్ఫార్మెన్స్ లతో అలరించారు. దేవి శ్రీ ప్రసాద్ తాను స్టెప్పులు వేయడమే కాకుండా, పలువురు స్టార్స్ చేత స్టెప్పులు వేయించడం విశేషం. ముఖ్యంగా రష్మికతో కలిసి డ్యాన్స్ చేయడం హైలైట్ గా నిలిచింది. 'గోంగూర తోట కాడ కాపు కాసా' సాంగ్ కి డ్యాన్స్ చేశారు. రష్మికను డ్యాన్స్ చేయడానికి పిలిచే ముందు.. సారీ విజయ్ దేవరకొండ అని దేవిశ్రీ ప్రసాద్ ఫన్నీగా చెప్పాడు. కాగా, విజయ్-రష్మిక ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అవార్డుల జాబితా: ఉత్తమ చిత్రం - రాజు వెడ్స్ రాంబాయి రెండవ ఉత్తమ చిత్రం - దండోరా మూడవ ఉత్తమ చిత్రం - ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఉత్తమ పర్యావరణ చిత్రం - ఇగ్వా ఉత్తమ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ - లిటిల్ హార్డ్స్ ఉత్తమ వినోదాత్మక చిత్రం - సంక్రాంతికి వస్తున్నాం ఉత్తమ సోషల్ మెసేజ్ చిత్రం - కోర్టు ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ మూవీ - మిరాయ్ ఉత్తమ బాలల చిత్రం - అనగనగా ఉత్తమ నటుడు- నాగచైతన్య (తండేల్) ఉత్తమ నటి - రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్ ) ఉత్తమ దర్శకుడు - సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి) ఉత్తమ సహాయ నటుడు - శివాజీ (దండోరా) ఉత్తమ సహాయ నటి - భూమిక (యుఫోరియా ) ఉత్తమ సంగీత దర్శకుడు- మార్క్ కె. రాబిన్ (దండోరా) ఉత్తమ మేల్ సింగర్- అనురాగ్ కులకర్ణి (రాజు వెడ్స్ రాంబాయి) ఉత్తమ ఫిమేల్ సింగర్- సాహితి చాగంటి (కన్నప్ప) ఉత్తమ కమెడియన్ - శ్రీ కృష్ణ తేజ (జిగ్రిస్) ఉత్తమ బాలనటుడు - రోహన్ (ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ) ఉత్తమ స్టోరీ రైటర్ - గుణశేఖర్ (యుఫోరియా ) ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ - అనిల్ రావిపూడి ఉత్తమ గేయ రచయిత - నందకిశోర్ (కుబేర) ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - కార్తిక్ ఘట్టమనేని (మిరాయ్) ఉత్తమ ఎడిటర్- శ్రీకర్ ప్రసాద్ (మిరాయ్) ఉత్తమ ఆడియోగ్రాఫర్ - ఎం.ఆర్ రాధాకృష్ణన్ (కిష్కిందపురి) ఉత్తమ కొరియోగ్రాఫర్ - గిర గిర గిర (ఛాంపియన్) ఉత్తమ ఆర్ట్ డైరక్టర్ - తోట తరణి (ఛాంపియన్) ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ - గోవింద్ (అఖండ) ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ - చంద్రకాంత్ (ఛాంపియన్) స్పెషల్ జ్యూరీ అవార్డులు.. శ్రీరాజ్ రాచకొండ (23 మూవీ) చైతు జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి) రోషన్ మేక (ఛాంపియన్) అనంతిక సనీల్ కుమార్ (8 వసంతాలు) స్పెషల్ అవార్డులు.. ఎన్టీఆర్ నేషనల్ అవార్డు - చిరంజీవి పైడి జైరాజ్ అవార్డు - కమల్ హాసన్ బీఎన్రెడ్డి ఫిల్మ్ అవార్డు- సింగీతం శ్రీనివాసరావు నాగిరెడ్డి చక్రపాణి అవార్డు - అశ్వనీ దత్ కాంతారావు అవార్డు - ఆర్. నారాయణమూర్తి రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు - రమేష్ ప్రసాద్ సి.నారాయణరెడ్డి ఫిల్మ్ అవార్డు - సుద్దాల అశోక్ తేజ అక్కినేని నాగేశ్వరరావు ఫిల్మ్ అవార్డు - జయసుధ
Mar 19, 2026
Gaddar Awards: చిరంజీవి, సురేఖ ఫన్నీ మూమెంట్.. అసలు నేను వంట చేస్తేనే కదా!
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో ఒక సరదా సన్నివేశం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సతీమణి సురేఖ తన వంటల టాలెంట్ గురించి, చిరు దోసెల గురించి ఫన్నీ కామెంట్స్ చేశారు. ఆ సమయంలో చిరంజీవి ఎక్స్ ప్రెషన్స్ హైలైట్ గా నిలిచాయి. (Gaddar Awards) గద్దర్ అవార్డ్స్ ఈవెంట్ ను ప్రముఖ యాంకర్స్ సుమ, ప్రదీప్ హోస్ట్ చేశారు. వేడుకకు హాజరైన సినీ ప్రముఖులను సరదాగా పలకరిస్తూ.. సురేఖ దగ్గరకు వెళ్ళి, ఉగాది కదా ఈరోజు ఇంట్లో పులిహోర చేశారా అని అడిగారు. దానికి సురేఖ చేశామని సమాధానమిచ్చారు. ఆ తర్వాత "మీరు చేసే వంటల్లో చిరంజీవి గారికి ఇష్టమైన వంట ఏది?" అని సుమ అడగగా.. "అసలు నేను చేస్తేనే కదా" అంటూ నవ్వుతూ ఆన్సర్ ఇచ్చారు సురేఖ. "అయితే చిరంజీవి గారు దోసెలు వేసే వీడియోలు నిజమేనా?" సుమ అనడంతో.. "దోసెలు వేయడం ఆయనే నేర్పించారమ్మా" అని సురేఖ చెప్పారు. సురేఖ అలా చెబుతున్న సమయంలో చిరంజీవి ఎక్స్ ప్రెషన్స్ భలే ఉన్నాయి. ప్రస్తుతం ఈ క్యూట్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, గద్దర్ అవార్డ్స్ లో 'ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు'ను ఈ ఏడాది చిరంజీవి అందుకోవడం విశేషం. https://www.instagram.com/reel/DWEc0iKhaZO/
Mar 19, 2026
Gaddar Awards: బాలీవుడ్ను ఏలిన పైడి జైరాజ్ గురించి తెలుసా?
సినీ ప్రతిభను ప్రోత్సహిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గద్దర్ అవార్డులను ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఏడాది ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు ఇవ్వడమే కాకుండా.. సినీ దిగ్గజాల పేరిట కొన్ని ప్రత్యేక అవార్డులు కూడా అందిస్తుంది. అందులో 'పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డు'(Paidi Jairaj Film Award) ఒకటి. సినీ రంగంలో విశేష సేవలు అందించిన వారికి ఈ అవార్డుని అందిస్తున్నారు. గతేడాది ప్రముఖ దర్శకుడు మణిరత్నం అందుకోగా, ఈ ఏడాది కమల్ హాసన్ ను ఈ అవార్డు వరించడం విశేషం. (Gaddar Awards) ఈ తరం వారికి పైడి జైరాజ్(Paidi Jairaj) గురించి పెద్దగా తెలియపోవచ్చు కానీ, ఆయన ఒక లెజెండ్. తొలి పాన్ ఇండియా హీరో. తెలంగాణ గడ్డపై పుట్టి, బాలీవుడ్ ను ఏలిన సూపర్ స్టార్. భారతీయ సినిమా అత్యున్నత పురస్కారం 'దాదా సాహెబ్ ఫాల్కే' అందుకున్న తొలి తెలంగాణ వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఇలా పైడి జైరాజ్ ఎన్నో ఘనతలు సాధించారు. తెలుగు దిగ్గజాలు అనగానే మనకు ముందుగా ఎన్టీఆర్, ఏఎన్నార్ గుర్తుకు వస్తారు. కానీ, వీరికంటే ముందే.. అంటే మూకీ సినిమాల కాలంలోనే హిందీ చిత్రసీమలో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నారు పైడి జైరాజ్. పైడి జైరాజ్ 1909, సెప్టెంబర్ 28న సిరిసిల్లలో జన్మించారు. ఆయన అసలు పేరు పైడిపాటి జైరాజ్. హైదరాబాద్లోని నిజాం కాలేజీలో చదువుకున్న ఆయనకు.. చిన్నప్పటి నుంచే నాటకాలపై ఇష్టం ఉండేది. సినిమాల్లో నటించాలనే కోరికతో తన 19వ ఏట 1928లో ముంబై వెళ్లారు. అక్కడ మొదట కెమెరా అసిస్టెంట్గా పనిచేశారు. 1929లో 'స్టార్ క్లింగ్ యూత్' అనే మూకీ సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు. మాతృ భూమి, ఆల్ ఫర్ లవర్, మై హీరో వంటి సినిమాల్లో నటించారు. వరుస సినిమాలు చేస్తూ స్టార్ గా ఎదిగారు. జైరాజ్ తన గంభీరమైన స్వరం, ఎత్తైన విగ్రహంతో చారిత్రక వీరుల పాత్రల్లో ఒదిగిపోయేవారు. పృథ్వీరాజ్ చౌహాన్, మహారాణా ప్రతాప్, అమర్ సింగ్ రాథోడ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి గుర్తుండిపోయే పాత్రలు ఎన్నో చేశారు. యాక్షన్ సీన్స్ కి కేరాఫ్ అడ్రెస్ అనేలా జైరాజ్ ఉండేవారట. ఇప్పుడు చిన్న చిన్న యాక్షన్ సీక్వెన్స్ లకే డూప్లను వాడుతున్నారు. కానీ ఆ రోజుల్లోనే జైరాజ్ డేంజర్ సీక్వెన్స్ లను కూడా డూప్ లేకుండా స్వయంగా చేసేవారట. కత్తిసాము, గుర్రపు స్వారీ వంటి విద్యలు కూడా ఆయనకు తెలుసు. ఆ కాలంలోనే బాడీ బిల్డింగ్, ఫిట్నెస్పై ఆయనకు చాలా పట్టు ఉండేది. ఆయన ఆహార్యం, క్రమశిక్షణ చూసి అప్పట్లో కుర్రాళ్ళు జిమ్ల వైపు అడుగులు వేసేవారట. 60 ఏళ్ళు పైబడిన తర్వాత కూడా ఆయన ఎంతో ఆరోగ్యంగా, చురుకుగా ఉండేవారని చెప్తారు. జైరాజ్ హిందీ, మరాఠీ, గుజరాతీ వంటి భాషల్లో 300కు పైగా చిత్రాల్లో నటించారు. భారతీయ సినీ రంగానికి ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ 1980లో ప్రభుత్వం ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందించింది. పైడి జైరాజ్ కేవలం నటుడే కాదు, దర్శకుడిగా, నిర్మాతగా కూడా తన ముద్ర వేశారు. 2000వ సంవత్సరంలో 90 ఏళ్ళ వయసులో ఆయన కన్నుమూశారు.
Mar 19, 2026
Ustaad Bhagat Singh: 'ఉస్తాద్ భగత్ సింగ్' చూసి హరీష్ శంకర్ కి ఫోన్ చేసిన పవన్ ఫ్యాన్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందిన 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) సినిమా ఉగాది కానుకగా నేడు(మార్చి 19) థియేటర్లలో అడుగుపెట్టింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మాస్ ఎంటర్టైనర్.. పరవాలేదు అనే టాక్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ మెచ్చేలా ఈ సినిమాని హరీష్ శంకర్ తెరకెక్కించాడని టాక్ వచ్చింది. వింటేజ్ పవర్ స్టార్ ని స్క్రీన్ మీద చూశామంటూ ఎందరో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఇక 'తొలిప్రేమ' సినిమాలోని 'ఈ మనసే' సాంగ్ ను సెకండ్ హాఫ్ లో ఉపయోగించడం ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజ్ అనిపించింది. యూఎస్ లో ఉంటున్న ఓ పవన్ అభిమాని.. సినిమా చూసి వెంటనే హరీష్ శంకర్ కి ఫోన్ చేసి.. ఈ సాంగ్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అవ్వడం విశేషం. 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ టీమ్ తాజాగా సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ.. "ఓ అబ్బాయి ఫోన్ చేసి.. ఎప్పుడు తొలిప్రేమ అన్నా.. టచ్ చేశావన్నా. అమెరికా నుంచి అర్జెంటుగా హైదరాబాద్ వచ్చి మళ్ళీ థియేటర్లో సినిమా చూడాలని ఉందన్నా అంటూ ఎమోషనల్ అయిపోయాడు" అని హరీష్ తెలిపాడు. మరికొందరు ఫ్యాన్స్ చేసిన మెసేజ్ ల గురించి కూడా హరీష్ చెప్పాడు. చైల్డ్ ఎపిసోడ్ కే ఫిదా అయిపోయి.. ఆ చిన్నబ్బాయిని చూస్తుంటే హీరోని చూస్తున్నట్టే ఉందన్నా అని ఒక ఫ్యాన్స్ మెసేజ్ లు పెట్టారని హరీష్ తెలిపాడు. కొంతమంది సెకండ్ హాఫ్ బాగుందని మెసేజ్ లు చేస్తున్నారని.. దానర్థం ఫస్ట్ హాఫ్ బాలేదని కాదని, ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ బాగుందని హరీష్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి హరీష్ శంకర్ కి వస్తున్న ఫోన్లు, మెసేజ్ లు చూస్తుంటే.. ఫ్యాన్స్ కి ఉస్తాద్ భగత్ సింగ్ బాగా నచ్చిందని అర్థమవుతోంది. Also Read: 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ రివ్యూ
Mar 19, 2026మోహన్బాబు బర్త్డే స్పెషల్: ‘ది ప్యారడైజ్’ నుంచి షికంజా మాలిక్ గ్లింప్స్ రిలీజ్!
- నాని సినిమాలో విలన్గా కలెక్షన్ కింగ్ - మోహన్బాబు 'షికంజా' లుక్ అదిరిపోయింది! - 32 ఏళ్ల తర్వాత విలన్గా మోహన్బాబు - శ్రీకాంత్ ఓదెల మ్యాజిక్ మామూలుగా లేదుగా! కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ మోహన్బాబు పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రియులకు ఒక క్రేజీ అప్డేట్ లభించింది. నేచురల్ స్టార్ నాని హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ మూవీలో మోహన్బాబు ఒక కీలకమైన, పవర్ఫుల్ విలన్ పాత్రను పోషిస్తున్నారు. నేడు ఆయన పుట్టినరోజు కావడంతో, చిత్ర యూనిట్ 'షికంజా మాలిక్' గ్లింప్స్ను విడుదల చేస్తూ మోహన్బాబుకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపింది. దాదాపు 32 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మోహన్బాబు మళ్లీ పూర్తిస్థాయి ప్రతినాయకుడి పాత్రలో మెరవబోతున్నారు. ఈ గ్లింప్స్లో ఆయన లుక్ మరియు మేకోవర్ చూస్తుంటే, శ్రీకాంత్ ఓదెల ఆయనను చాలా పవర్ఫుల్గా ప్రెజెంట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. "డైరెక్టర్ శ్రీకాంత్ నన్ను మాయ చేశాడు" అంటూ మోహన్బాబు స్వయంగా ఈ పాత్ర గురించి మాట్లాడటం విశేషం. సుమారు 46 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఆయన పాత్రకు సంబంధించిన సన్నద్ధతను చూపించారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ.. ఈ తరం ప్రేక్షకులకు మోహన్బాబు సత్తా ఏంటో సరిగ్గా తెలియకపోవచ్చని, కానీ ‘ది ప్యారడైజ్’ సినిమాతో ఆయన విశ్వరూపం అందరికీ అర్థమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో ‘దసరా’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ కాంబినేషన్, ఇప్పుడు మరోసారి పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్తో రాబోతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మోహన్బాబు గతంలో ‘పెదరాయుడు’, ‘అసెంబ్లీ రౌడీ’ వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక మేనరిజం, డైలాగ్ డెలివరీని క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ విలనిజం పండించడానికి సిద్ధమవ్వడం పట్ల ఆయన అభిమానులు సోషల్ మీడియాలో భారీగా స్పందిస్తున్నారు. షికంజా మాలిక్ గ్లింప్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండటం మరో అదనపు ఆకర్షణ. నాని, మోహన్బాబుల మధ్య వచ్చే సన్నివేశాలు వెండితెరపై మంటలు పుట్టించడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీ మరియు ఇతర వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.
Mar 19, 2026ముగ్గురు ప్రాణ స్నేహితుల మధ్య ప్రాణాంతక రహస్యం.. అదే ఇంపర్ఫెక్ట్ ఉమెన్
ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో సైకలాజికల్ థ్రిల్లర్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా ఆపిల్ టీవీ ప్లస్ వేదికగా ఇంపర్ఫెక్ట్ ఉమెన్(Imperfect Women) అనే హై-వోల్టేజ్ డ్రామా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అరామింటా హాల్ రాసిన పాపులర్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్, ముగ్గురు మహిళల మధ్య ఉండే సంక్లిష్టమైన స్నేహం, వారి జీవితాల్లోని చీకటి కోణాలను ఆవిష్కరిస్తోంది. ఈ కథ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ చుట్టూ తిరుగుతుంది. దశాబ్దాలుగా ఎంతో సన్నిహితంగా ఉండే వీరి జీవితాల్లో ఒక మరణం పెను తుఫానును సృష్టిస్తుంది. వారిలో ఒకరైన నాన్సీ అనుమానాస్పద స్థితిలో మరణించడంతో, మిగిలిన ఇద్దరు స్నేహితులైన ఎలియనోర్, మేరీల జీవితాలు ఒక్కసారిగా తలకిందులవుతాయి. ఈ ఇన్వెస్టిగేషన్ సాగుతున్న కొద్దీ ఒకరి గురించి ఒకరికి తెలియని షాకింగ్ నిజాలు బయటపడటం ఈ సిరీస్లో ప్రధానాంశం. హాలీవుడ్ స్టార్ నటీమణులు ఎలిజబెత్ మాస్, కెర్రీ వాషింగ్టన్ మరియు కేట్ మారా ఈ సిరీస్లో ప్రధాన పాత్రల్లో నటించారు. ముఖ్యంగా ఎలిజబెత్ మాస్ తన అద్భుతమైన నటనతో మరోసారి ఆకట్టుకోగా, కెర్రీ వాషింగ్టన్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్తో మెప్పించింది. వీరిద్దరూ నటనతోనే కాకుండా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా కూడా ఈ ప్రాజెక్ట్లో భాగస్వాములు కావడం విశేషం. దర్శకత్వం విషయానికి వస్తే, 'ఫిజికల్' ఫేమ్ అన్నీ వైస్మాన్ ఈ సిరీస్ను అత్యంత ఉత్కంఠభరితంగా రూపొందించారు. గతంలో ఎన్నో సూపర్ హిట్ సిరీస్లను అందించిన ఆమె, ఈసారి మహిళా మనస్తత్వాలను, వారి మధ్య ఉండే ఈర్ష్య, ద్వేషం మరియు రహస్యాలను చాలా లోతుగా విశ్లేషించారు. నాన్సీ భర్తగా జోయల్ కిన్నమన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. సోషల్ మీడియాలో ఈ సిరీస్ పట్ల మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు దీనిని 'బిగ్ లిటిల్ లైస్' వంటి సిరీస్లతో పోలుస్తుండగా, మరికొందరు నటీమణుల నటనను ఆకాశానికెత్తుతున్నారు. కథనం నెమ్మదిగా సాగినా, వచ్చే ట్విస్టులు మాత్రం ప్రేక్షకులను సీట్ ఎడ్జ్లో కూర్చోబెడతాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఎనిమిది ఎపిసోడ్ల సుదీర్ఘ ప్రయాణంగా సాగే ఈ మిస్టరీ థ్రిల్లర్, ప్రస్తుతం ఆపిల్ టీవీ ప్లస్లో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ మరియు సస్పెన్స్ కథలను ఇష్టపడే వారికి ఈ వారాంతంలో ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. తదుపరి ఎపిసోడ్లలో ఎలాంటి సంచలన నిజాలు బయటపడతాయో అని మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు
Mar 19, 2026‘మా ఇంటి బంగారం’ సమంత ‘షడ్రుచుల’ సందడి - ఒక ఆత్మీయ ప్రయాణం!
మన జీవితం అంటేనే ఒక ఉగాది పచ్చడి. అందులో తీపి ఉంటుంది, చేదు ఉంటుంది, కారం ఉంటుంది... ఇలా అన్ని రుచులు కలిస్తేనే అది పరిపూర్ణం అవుతుంది. సమంత తన కొత్త చిత్రం ‘మా ఇంటి బంగారం’తో మన ముందుకు వస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సుమతో ఆమె పంచుకున్న నవ్వులు, ఎమోషన్లు మరియు సినిమా వెనుక ఉన్న కష్టాన్ని చూస్తుంటే, ఈ సినిమా కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు, ప్రతి ఇంటి కథ అనిపిస్తోంది. ఉగాది పచ్చడి చేసే క్రమంలో సమంత ఒక గొప్ప విషయాన్ని చెప్పారు. జీవితం అంటే కేవలం తీపి మాత్రమే కాదు, అందులో ఉప్పు, పులుపు, చేదు ఇలా అన్నీ ఉండాలి. అప్పుడే అది అసలైన జీవితం అవుతుంది. ‘మా ఇంటి బంగారం’ సినిమాలో కూడా కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ షడ్రుచుల్లా నిండి ఉన్నాయి. ఇది ప్రేక్షకులకు ఒక ‘ఫుల్ మీల్స’ లాంటి అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం నమ్మకంగా చెబుతోంది. ఈ సినిమాలో మనం సమంతని సరికొత్త యాక్షన్ అవతార్లో చూడబోతున్నాం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆమె ఎటువంటి డూప్ లేకుండా సొంతంగా ఫైట్స్ చేశారు. ముఖ్యంగా చీర కట్టుకుని ఫైట్స్ చేయడం ఎంతో కష్టమైనా, ప్రతి మహిళా పోరాట యోధురాలే అనే స్ఫూర్తితో ఆమె ఆ కష్టాన్ని అధిగమించారు. షూటింగ్ సమయంలో ఎన్ని దెబ్బలు తగిలినా, ఎంత నొప్పి ఉన్నా ఓర్చుకుని, సినిమా కోసం ప్రాణం ఇచ్చి పనిచేశారు. ఆమె పట్టుదల చూస్తుంటే సినిమాపై ఉన్న ప్రేమ అర్థమవుతోంది. ‘మా ఇంటి బంగారం’ సినిమాలో కేవలం సమంత మాత్రమే కాదు, గౌతమి అత్తగా, శ్రీలక్ష్మి బామ్మగా, శ్రీముఖి తోడికోడలిగా, మంజుష స్నేహితురాలిగా నటిస్తున్నారు. స్త్రీల మధ్య ఉండే స్నేహం, హాస్యం మరియు భావోద్వేగాలను ఈ సినిమాలో చాలా కొత్తగా చూపించబోతున్నారు. మే 15న ‘మా ఇంటి బంగారం’ విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచేసింది. ఒక మధ్యతరగతి ఇంటి కథగా, ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యే ఎమోషన్లతో రాబోతున్న ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని అందరూ కోరుకుంటున్నారు. నవ్వులు, చిలిపి పనులు, మనసుని హత్తుకునే మాటలతో సాగిన సమంత, సుమ ఈ ఇంటర్వ్యూ మనకు సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. జీవితంలోని కష్టసుఖాలను సమానంగా స్వీకరిస్తూ ముందుకు సాగాలనే సందేశాన్ని ఈ సినిమా ఇస్తుందని ఆశిద్దాం.
Mar 19, 2026‘ధురంధర్ 2’ రివ్యూ ఇచ్చిన అల్లు అర్జున్.. కలెక్షన్ల సునామీ ఖాయమన్న ఐకాన్ స్టార్!
- బాక్సాఫీస్ వద్ద రణవీర్ విధ్వంసం.. సినిమాను ఆకాశానికెత్తేసిన బన్నీ! - ఇంటర్నేషనల్ స్వ్యాగ్.. ‘ధురంధర్ 2’పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ కామెంట్స్ వైరల్. - రణవీర్ సింగ్ యాక్టింగ్కు ఫిదా అయిన పుష్పరాజ్ బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్, టాలెంటెడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్లో రూపొందిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసల జల్లు కురిపించారు. పెయిడ్ ప్రివ్యూల ద్వారానే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తుండటంతో ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సినిమా చూసిన వెంటనే బన్నీ తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఇదొక ‘అంతర్జాతీయ స్థాయి స్వ్యాగ్’ కలిగిన దేశభక్తి చిత్రమని కొనియాడారు. ప్రతి భారతీయుడు గర్వపడేలా ఈ సినిమాను తీర్చిదిద్దారని, థియేటర్లలో ఈలలు, చప్పట్లతో హోరెత్తిపోయే సీన్లు ఎన్నో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రణవీర్ సింగ్ లాంటి విలక్షణ నటుడు మన దేశంలో ఉండటం గర్వకారణమని బన్నీ ప్రశంసించడం విశేషం. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు ఆర్. మాధవన్ పర్ఫార్మెన్స్పై కూడా అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాధవన్ నటన అద్భుతమని, సాంకేతికంగా సినిమా టాప్ క్లాస్లో ఉందని ప్రశంసించారు. దర్శకుడు ఆదిత్య ధర్ ఈ సీక్వెల్తో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారని, ఒక ఇండియన్ స్టోరీని గ్లోబల్ స్టాండర్డ్స్లో ప్రెజెంట్ చేశారని బన్నీ కితాబిచ్చారు. మరోవైపు ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ లెక్కలు ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నాయి. కేవలం పెయిడ్ ప్రివ్యూల ద్వారానే ఈ చిత్రం సుమారు రూ. 44 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. గతంలో విడుదలైన మొదటి భాగం రూ. 1300 కోట్లకు పైగా కలెక్ట్ చేయగా, ఇప్పుడు రెండో భాగం అంతకు మించి వసూళ్లు రాబడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘ధురంధర్ 2’ మేనియా నడుస్తోంది. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సినిమాను సపోర్ట్ చేయడంతో అటు రణవీర్ అభిమానులు, ఇటు బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. భారీ బడ్జెట్, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్లతో రూపొందిన ఈ చిత్రం లాంగ్ రన్లో మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
Mar 19, 2026వివాదాల నుంచి జాతీయ అవార్డుల దాకా.. ఒక ‘బందిపోటు రాణి’ సంచలన ప్రయాణం!
- 17 నిమిషాల రేప్ సీన్తో ప్రకంపనలు.. - భారతీయ సినిమాను షేక్ చేసిన ‘బండిట్ క్వీన్’ - నిషేధం విధించినా తగ్గేదేలే.. - బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన శేఖర్ కపూర్ మూవీ! భారతీయ సినీ చరిత్రలో కొన్ని సినిమాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా, సమాజంలో పెద్ద ఎత్తున చర్చను కూడా లేవనెత్తుతాయి. అటువంటి చిత్రాల్లో అగ్రస్థానంలో నిలుస్తుంది 'బండిట్ క్వీన్'. వాస్తవ గాధల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం, అప్పట్లో ఎదుర్కొన్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. కానీ అన్ని అడ్డంకులను దాటుకుని ఈ సినిమా సాధించిన విజయం నేటికీ ఒక అద్భుతమనే చెప్పాలి. బందిపోటు రాణిగా పేరుగాంచిన ఫూలన్ దేవి జీవిత కథ ఆధారంగా ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ ఈ చిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. 1994లోనే సిద్ధమైన ఈ సినిమాలో సుమారు 17 నిమిషాల పాటు సాగే అత్యంత దారుణమైన అత్యాచార సన్నివేశాలు ఉండటంతో సెన్సార్ బోర్డ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఈ సినిమాపై అప్పట్లో నిషేధం కూడా విధించారు. ముఖ్యంగా ఈ చిత్రంలో హింస, నగ్నత్వం మోతాదుకు మించి ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. సాక్షాత్తు ఫూలన్ దేవి కూడా ఈ సినిమా విడుదలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఒకానొక దశలో ఈ చిత్రం విడుదల కాదని అందరూ భావించారు. అయితే, ఎట్టకేలకు కొన్ని కట్స్ తర్వాత 1996లో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాలో ఫూలన్ దేవి పాత్రలో సీమా బిశ్వాస్ పరకాయ ప్రవేశం చేశారనే చెప్పాలి. ఆమె నటనకు ఫిదా అయిన జ్యూరీ, ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందించారు. అలాగే ఈ చిత్రం ఉత్తమ హిందీ చిత్రంగా కూడా నేషనల్ అవార్డును కైవసం చేసుకుంది. అప్పట్లో మహిళల కోసం ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించడం ఈ సినిమా సాధించిన మరో అరుదైన ఘనత. ప్రస్తుతం ఈ సినిమా మరోసారి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సెన్సేషనల్ మూవీ ఇప్పుడు యూట్యూబ్లో ఉచితంగా అందుబాటులో ఉండటంతో నెటిజన్లు ఆనాటి సినిమా క్వాలిటీని, శేఖర్ కపూర్ దర్శకత్వ ప్రతిభను కొనియాడుతున్నారు. అప్పట్లో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, నేడు ఇది ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక ల్యాండ్ మార్క్ మూవీగా మిగిలిపోయింది. ఓటీటీ వేదికలైన అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. బోల్డ్ కంటెంట్ మరియు రా ఎమోషన్స్ చూడాలనుకునే వారు ఈ క్లాసిక్ మూవీని మిస్ అవ్వకండి. రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని బయోపిక్స్పై చిత్ర పరిశ్రమలో ఆసక్తి పెరుగుతోంది.
Mar 19, 2026
Ustaad Bhagat Singh Review: ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ
తారాగణం: పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశి ఖన్నా, పార్థిబన్, కె.ఎస్. రవికుమార్, రావు రమేష్, గౌతమి, టెంపర్ వంశీ తదితరులు సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం: ఎస్. తమన్ కథనం: కె. దశరథ్, రమేష్ రెడ్డి ఎడిటర్: కార్తిక శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్టర్: ఆనంద్ సాయి రచన, దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్ నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్ విడుదల తేదీ: మార్చి 19, 2026 గబ్బర్ సింగ్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందిన మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). సెన్సేషనల్ కాంబో కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మూవీ టీమ్ కూడా, ఇది ఒక బిగ్ స్టార్ నుంచి చాలా కాలం తర్వాత వస్తున్న పక్కా కమర్షియల్ ఫిల్మ్ అని, వింటేజ్ పవన్ కళ్యాణ్ ను చూస్తారని చెప్పుకొచ్చింది. మరి ఉస్తాద్ భగత్ సింగ్ ఆ రేంజ్ లో ఉందా? గబ్బర్ సింగ్ మ్యాజిక్ ని రిపీట్ చేసిందా (Ustaad Bhagat Singh Review) కథ: ప్రజా సేవే జీవితంగా బ్రతికే ముఖ్యమంత్రి చంద్రశేఖర్(కె.ఎస్. రవికుమార్)పై హత్యాయత్నం జరుగుతుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆయనను మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తరలిస్తారు. ఈ దాడికి కారకుడు క్రూరుడైన రాజకీయ నాయకుడు నల్ల నాగప్ప(పార్థిబన్). సీఎం కుర్చీపై అతనికి మోజు. దానికోసం ఎంతకైనా తెగిస్తాడు. అలాంటి నాగప్ప, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఈ ఆనందంలో నాగప్ప కొడుకు తన ఫ్రెండ్స్ తో కలిసి నల్లమల ఫారెస్ట్ ఏరియాలో ఎంజాయ్ చేయడానికి వెళ్తాడు. అక్కడ తన మనిషికి చెందిన 25 టన్నుల గంజాయిని ఒక సీఐ సీజ్ చేయడంతో.. పోలీస్ స్టేషన్ పై దాడి చేస్తాడు. ఈ విషయం తెలిసి ఉస్తాద్ భగత్ సింగ్(పవన్ కళ్యాణ్) రంగంలోకి దిగుతాడు. నాగప్ప మనుషులను కొట్టడమే కాకుండా, అతని కొడుకుని బందీగా ఉంచుకుంటాడు. అసలు ఉస్తాద్ భగత్ సింగ్ ఎవరు? అతనికి, సీఎం చంద్రశేఖర్ కి మధ్య అనుబంధం ఏంటి? ఉస్తాద్ కి, నాగప్పకు మధ్య విరోధం ఏంటి? నాగప్పతో యుద్ధంలో ఉస్తాద్ గెలిచాడా? ఇందులో లీల(శ్రీలీల), శ్లోక(రాశి ఖన్నా) పాత్రలు ఏంటి? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి. విశ్లేషణ: 10-15 ఏళ్ళ క్రితం స్టార్ హీరోలు ఎక్కువగా కమర్షియల్ సినిమాలే తీసేవారు. అదిరిపోయే ఇంట్రడక్షన్ సీన్, డ్యాన్స్ లు, ఫైట్లు, కామెడీ ఇలా అన్ని అంశాలు ఉండేలా చూసుకునేవారు. పాన్ ఇండియా ట్రెండ్ రావడం, ప్రేక్షకులు సినిమా చూసే విధానం మారడంతో.. ఇప్పుడు ఆ కమర్షియల్ సినిమాలకు దాదాపు కాలం చెల్లింది. ఇలాంటి టైములో వింటేజ్ వైబ్స్ చూపిస్తామంటూ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాటులో 'ఉస్తాద్ భగత్ సింగ్' చేయడం ఒక రకంగా సాహసమే. ఇప్పుడు కమర్షియల్ సినిమా చేయడం తప్పు కాదు. కానీ, ఈ తరాన్ని మెప్పించేలా తీయడం కత్తి మీద సాము లాంటిది. ఆ విషయంలో ఉస్తాద్ టీమ్ పూర్తిస్థాయిలో అయితే మెప్పించలేకపోయిందే చెప్పాలి. రొటీన్ కథను తీసుకొని, దానిని అంతే రొటీన్ గా ప్రెజెంట్ చేశారు. సీన్స్ లో ఫ్రెష్ నెస్ కనిపించలేదు. తెలిసిన కథ, తెలిసిన సన్నివేశాలే మళ్ళీ చూస్తున్నాము అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ చైల్డ్ హుడ్ ఎపిసోడ్ తో కథ మొదలవుతుంది. ఈ ఎపిసోడ్ బాగానే ఉన్నప్పటికీ, నిడివి ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది. ఇక పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తుంది అనడంలో డౌట్ లేదు. ఆయన చేసే ఫైట్లు, చెప్పే డైలాగ్స్ ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయిస్తాయి. అయితే రాశి ఖన్నా ట్రాక్ మాత్రం ఆకట్టుకునేలా లేదు. ఆ ట్రాక్ సినిమా నిడివిని పెంచడంతో పాటు, కథనాన్ని నెమ్మదించేలా చేసింది. ఫస్ట్ హాఫ్ లో ఎప్పుడైతే ఉస్తాద్ గతం గురించి, అతను చేసే పని గురించి రివీల్ అవుతుందో అప్పటి నుంచి కథలో వేగం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ కి ముందు సన్నివేశాలు మెప్పించాయి. సెకండ్ హాఫ్ లో చెప్పుకోదగ్గ ఎపిసోడ్స్ ని బాగానే ప్లాన్ చేసుకున్నారు. ముఖ్యంగా ఉస్తాద్ ఒక్కడే పాతబస్తీకి వెళ్ళి, వందల మందిని భయపెట్టి ఒక టెర్రరిస్ట్ ని తీసుకొచ్చే సీక్వెన్స్ హైలైట్ గా నిలిచింది. అలాగే నిర్భయ ఘటనను గుర్తుచేసే ఒక ఎపిసోడ్ కూడా కంటతడి పెట్టించేలా ఉంది. ఇక ఉస్తాద్-లీల లవ్ ట్రాక్ లో వచ్చే 'ఈ మనసే' సాంగ్ ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ట్రీట్ అని చెప్పవచ్చు. పతాక సన్నివేశాలు బాగానే ఉన్నాయి. లవ్, కామెడీ, ఎమోషన్ ఇలా ఒక కమర్షియల్ సినిమాకి కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. కానీ వాటిని బలంగా రాసుకోలేకపోయారు. కామెడీ పండలేదు. లవ్ ట్రాక్ ఇంకా బెటర్ గా రాసుకోవచ్చు. ఎమోషన్ వర్కౌట్ అయినప్పటికీ.. ఆ తరహా ఎపిసోడ్ ఇప్పటికే చాలా సినిమాల్లో చూసేసి ఉన్నాం. అందుకే రచన విషయంలో శ్రద్ధ పెట్టాల్సింది. సన్నివేశాల్లో కొత్తదనం, ఆసక్తికర కథనం తోడైతే అవుట్ పుట్ ఇంకా బెటర్ గా ఉండేది. కమర్షియల్ సినిమాల్లో లాజిక్స్ వెతక్కూడదు అంటారు. అదే సూత్రాన్ని పాటిస్తూ.. లాజిక్స్ కి దూరంగా ఈ సినిమా ఉంటుంది. లాజిక్స్ గురించి ఆలోచిస్తే.. కొంచెం కూడా ఎంజాయ్ చేయలేము. తెరపై పవన్ కళ్యాణ్ మ్యాజిక్ చూడటానికి మాత్రమే ఈ సినిమా చూడాలి. నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు: ఈ సినిమాకి ప్రధాన బలం పవన్ కళ్యాణ్ అనడంలో సందేహం లేదు. తన లుక్స్, ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఆయన తెరపై కనిపించిన తీరు , డైలాగ్స్, డ్యాన్స్, ఫైట్స్ ప్రతిదీ ఫ్యాన్స్ ని అలరిస్తాయి. లీల పాత్రలో శ్రీలీల బాగానే రాణించింది. రాశి ఖన్నా పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఉస్తాద్ ని ఢీ కొట్టే నల్ల నాగప్ప పాత్రలో పార్థిబన్ ఆకట్టుకున్నాడు. హెడ్ మాస్టర్ గా, చీఫ్ మినిస్టర్ గా చంద్రశేఖర్ రోల్ లో కె.ఎస్. రవికుమార్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్ కనబరిచారు. రావు రమేష్, గౌతమి, టెంపర్ వంశీ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. దర్శకుడిగా హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ మ్యాజిక్ ని రిపీట్ చేయలేకపోయాడు. వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చూపిస్తూ ఫ్యాన్స్ కి ట్రీట్ కి ఇవ్వాలన్న ఆలోచన బాగుంది కానీ, రైటింగ్ ఈ జనరేషన్ కి తగ్గట్టుగా లేదు. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు బాగానే ఉన్నప్పటికీ, గబ్బర్ సింగ్ రేంజ్ అయితే ఏ మాత్రం కాదు. తమన్ కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయాడు. అయనంక బోస్ సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. కార్తిక శ్రీనివాస్ ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్: పవన్ కళ్యాణ్ లుక్, పర్ఫార్మెన్స్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే మూమెంట్స్ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ మైనస్ పాయింట్స్: రొటీన్ కథాకథనాలు ప్రారంభ సన్నివేశాలు ఫైనల్ గా... పవన్ కళ్యాణ్ ఎనర్జిటిక్ పర్ఫామెన్స్, కొన్ని సీన్స్ మెప్పించాయి కానీ.. ఫుల్ మీల్స్ సినిమా అయితే కాదు. వింటేజ్ పవన్ కళ్యాణ్ తెరపై కనిపించాడు కాబట్టి, ఫ్యాన్స్ ఈ సినిమాను ఎంజాయ్ చేసే అవకాశముంది. రేటింగ్: 2.5/5 Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.
Mar 19, 2026
Dhurandhar 2 Review In Telugu: ధురంధర్ 2 సినిమా రివ్యూ
సినిమా పేరు: ధురంధర్ 2 నటీనటులు: రణవీర్ సింగ్, సారా అర్జున్, సంజయ్ దత్, అర్జున్ రామ్ పాల్, మాధవన్, రాకేష్ బేడీ, మనవ్ గోహ్లి, గౌరవ్ గెరా తదితరులు సినిమాటోగ్రఫీ: వికష్ నౌలఖా ఎడిటింగ్: శివ్ కుమార్ మ్యూజిక్: సాస్వత్ సచ్ దేవ్ నిర్మాత: ఆదిత్య దర్, లోకేష్ దర్, జ్యోతి దేశ్ పాండే బ్యానర్స్: జియో స్టూడియోస్, b 62 స్టూడియోస్ రచన,దర్శకత్వం: ఆదిత్య ధర్ రిలీజ్ డేట్ : మార్చి 19 2026 ఇండియన్ సినీ ప్రేమికులతో పోటీపడుతు తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ధురంధర్ 2 (Dhurandhar 2) సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యింది. ప్రీమియర్స్ నుంచే వాళ్ళ కల నెరవేరడంతో థియేటర్స్ మొత్తం ధురంధర్ అభిమానులతో కిటకిటలాడాయి. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ రెహ్మాత్ డెకాయత్(అక్షయ్ ఖన్నా) చనిపోయిన తర్వాత ల్యారీ ఏరియాకి ఉజైర్ (దనిష్ పండోర్) ని లీడర్ గా చేస్తాడు హంజా అలీ మజారి ఉరఫ్ జస్కిరాత్. ( రణవీర్ సింగ్). కానీ ఉజైర్ ని దుబాయ్ లో పోలీసులు అరెస్ట్ చేయడంతో జైలు పాలవుతాడు. హంజా మావయ్య ప్రముఖ రాజకీయనాయకుడు జమీల్ జమాల్ (రాకేష్ బేడీ) పిఏపి పార్టీ నుంచి మరో పార్టీలో జాయిన్ అవుతాడు. హంజానే జాయిన్ చేస్తాడు. దీంతో హంజా పాకిస్థాన్ లో బలమైన శక్తిగా తన సామ్రాజ్యాన్ని పెంచుకుంటాడు. మేజర్ ఇక్బల్(అర్జున్ రాంపాల్) యువకుల్ని తీవ్రవాదులుగా చేసే ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తాడు. హంజాని ఇండియాలో పుట్టి పాకిస్థాన్ లో ఉంటూ ఇండియాని నాశనం చెయ్యాలని చూసే దావుద్ ఇబ్రహీం దగ్గరకి తీసుకెళ్తాడు. పోలీస్ ఆఫీసర్ ఎస్ పి అస్లాం చౌదరి( సంజయ్ దత్) కి హంజాపై డౌట్ వస్తుంది. హంజా భార్య ఎలినా(సారా అర్జున్) కి అయితే హంజా ఇండియన్ అని తెలుస్తుంది. దాంతో హంజాని ఒక కోరిక కోరుతుంది. ఎలినా కోరిన కోరిక ఏంటి? హంజా బలమైన శక్తిగా ఎదిగిన తర్వాత అతనికి ఏర్పడిన శత్రువులు ఎవరు? పాకిస్థాన్ లో ఏ లక్ష్యంతో ఉంటున్నాడో, ఆ లక్ష్యాన్ని ఎలా సాధించాడు? తద్వారా ఇండియాకి ఎలాంటి మంచి జరిగింది? ఇండియన్ ఇంటిలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ అజయ్ సన్యాల్(మాధవన్) క్యారక్టర్ ఏంటి? హంజాగా ఉన్న జస్కి రాత్ గతం ఏంటి? చివరకి అతను సంతోషకరమైన జీవితంలో ఉన్నాడా? లేక విషాదకరమా? అనేదే ధురంధర్ 2 ఎనాలసిస్ పార్ట్ 1 అయితే సూపర్ గా ఉంది కదా పార్ట్ 2 లో ఏముంటుందిలే అని చాలా మంది అనుకోని ఉంటారు. కానీ మొదటి భాగం కంటే రెండవ భాగం ఇంకా బాగుంది. మన దేశంలో జరిగిన రియల్ ఇన్సిడెన్స్ కి లింక్ పెడుతూ కథనం వచ్చే సరికి ఆశ్చర్యపోతాం. ఇదా అసలు నిజమని తెలిసాక ఎన్నో డౌట్స్ కి ఫుల్ స్టాప్ పడుతుంది. ఫస్ట్ హాఫ్ ప్రారంభం నుంచే పిన్ డ్రాప్ సైలెన్స్ తో కథలోకి లీనమైపోతాం. పంజాబ్ స్టేట్ లోని పఠాన్ కోట్ ఎంఎల్ఏ ఇంట్లోకి జస్కిరాత్ వెళ్లి సృషించే మారణహోమంతో పార్ట్ 2 ఎంత సైలెంట్ ని మెయింటైన్ చేస్తుందో, అంతే వైలెంట్ కూడా ఇస్తుందని చెప్పినట్లయింది. ఈ సందర్భంగా వచ్చిన ఫ్లాష్ బ్యాక్ హృదయాల్ని కట్టిపడేస్తుంది. అదే టెంపోతోనే తర్వాతి సీన్స్ వచ్చాయి. వచ్చే ప్రతి సీన్ లో కూడా హంజా గతం ఎలా బయటపడుతుందనే టెన్షన్ మైంటైన్ అవుతూనే వచ్చింది. ఎస్పి అస్లాం చౌదరితో వచ్చే సీన్స్, ఉజైర్ ని ఇరికించే సీన్స్, బలోచి సీన్స్, జస్కి రాత్ బెస్ట్ ఫ్రెండ్ సొంత దేశం ఇండియానే దెబ్బ కొట్టడానికి పంజాబ్ నుంచి పాకిస్థాన్ రావడం, అతన్ని హంజాగా ఉన్న జస్కి రాత్ చంపడం ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని సీన్స్ బాగున్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సూపర్. సెకండ్ హాఫ్ లో హంజా విధ్వంసం స్టార్ట్ కావడంతో పాటు ప్రతి నిమిషం ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ సీన్ టూ సీన్ పెరిగింది. ఎలినాకి హంజా గురించి అసలు నిజం తెలిసాక కథనం జెట్ స్పీడ్ వేగంతో కదిలింది. దావుద్ ఇబ్రహీం ఎపిసోడ్ తో పాటు అస్లాం చౌదరి. మేజర్ ఇక్బల్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అతి పెద్ద ఎసెట్. నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు హంజా అలీ మజారి, జస్కి రాత్ సింగ్ గా రణవీర్ సింగ్(Ranveer singh) పెర్ఫార్మ్ రేంజ్ ని చెప్పుకోవాలంటే మాటలు చాలవు. పార్ట్ 1 ని మించి తన నట ప్రస్థానం కొనసాగింది. బహుశా తన ఎంటైర్ కెరీర్ లో మళ్ళీ ఇలాంటి క్యారక్టర్ రణవీర్ కి రాదేమో. ముఖ్యంగా జస్కి రాత్ సింగ్ గా చేసిన సెటిల్డ్ పెర్ఫార్మ్ నభూతో నభవిష్యత్. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కన్నీళ్లు తెప్పించాడు. సారా అర్జున్ కూడా పార్ట్ 1 లో నా పెర్ఫార్మ్ చూసింది మీరు తక్కువ ఇది నా పెర్ఫార్మ్ అనే రీతిలో నాచురల్ పెర్ఫార్మ్ తో మెప్పించింది. సంజయ్ దత్ కూడా అంతే. ఎస్ పి చౌదరి అస్లాంగా తగ్గేదెలే అనే విధంగా మెస్మరైజ్ చేసాడు. మేజర్ ఇక్బల్ గా అర్జున్ రామ్ పాల్, ఐబి చీఫ్ అజయ్ సన్యాల్ గా మాధవన్ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ లో కూడా ప్రదర్శించిన అద్భుతమైన పెర్ఫార్మ్ కి హాట్స్ హాఫ్ చెప్పవచ్చు. మిగతా ఆర్టిస్ట్స్ కూడా తమ క్యారెక్టర్స్ మాత్రమే కనపడేలా మెస్మరైజ్ చేసారు. దర్శకుడిగా, రచయితగా ఆదిత్య ధర్(Aditya Dhar)ఇంకో మెట్టు పైకి ఎక్కాడు. క్యారెక్టర్స్ ని ఉపయోగించుకున్న తీరుగాని, పకడ్బందీ స్క్రీన్ ప్లే విషయంలో గాని తన ఇంటెలిజెన్స్ ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. కథకి లొకేషన్స్ ప్రధాన ప్లస్ కాబట్టి అందుకు తగ్గ కథనాన్నే సృష్టించుకున్నాడు. భారీ డ్యూరేషన్ అనే విషయాన్నీ తెలియనీయకుండా కూడా ఆదిత్య ధర్ టేకింగ్ సాగింది. డైలాగ్స్ క్యారెక్టర్స్ రేంజ్ కి తగ్గట్టుగా ఎప్పుడు ఎలా మాట్లాడాలో అలానే ఉన్నాయి. ఫొటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పార్ట్ 1 కి ఎలా అయితే హెల్ప్ అయ్యాయో, ధురంధర్ 2 కి అంతే హెల్ప్ అయ్యాయి. ఇంకా చెప్పాలంటే అంతకు మించి. నిర్మాణ విలువలు కూడా ఒక రేంజ్ లో ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ 1 . కథ 2 . కథనం నడిచిన విధానం 3 . రణవీర్ సింగ్ తో పాటు ఆల్ ఆర్టిస్ట్స్ పెర్ ఫార్మెన్స్ 4 . ఆదిత్య దర్ డైరెక్షన్ 5 .యాక్షన్ సీక్వెన్స్ 6 . ప్రీ క్లైమాక్స్ 7 . క్లైమాక్స్ 8 .ఫొటోగ్రఫీ తో పాటు ఆల్ డిపార్ట్మెంట్స్ 9 . ఇండియాలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ చూపించడం 10 .దావుద్ ఇబ్రహీం ఎపిసోడ్ బలహీనతలు 1 . హంజా గురించి అసలు నిజాన్ని సిల్లీగా చూపించడం ఫైనల్ గా చెప్పాలంటే పార్ట్ 1 ని మించి మెప్పించే విధంగా పార్ట్ 2 ఉంది. రణవీర్, ఆదిత్య ధర్ తో పాటు 24 క్రాఫ్ట్స్ సినిమా విజయానికి ప్రాణంగా నిలిచాయి. రేటింగ్ 3 .25 /5 అరుణాచలం
Mar 18, 2026
తెలంగాణలో థియేటర్ పార్కింగ్ ఫీజుపై హైకోర్టు కీలక తీర్పు.. ప్రేక్షకులకు బిగ్ షాక్!
తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం సినిమా థియేటర్ పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవచ్చు పాత ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఏషియన్ కోనార్క్ మినహా అన్ని థియేటర్లలో పార్కింగ్ ఫీజు తెలంగాణలోని సినీ ప్రియులకు హైకోర్టు షాకింగ్ న్యూస్ చెప్పింది. సింగిల్ స్క్రీన్స్/ స్టాండ్ అలోన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజులు వసూలు చేయకూడదంటూ ఉన్న నిబంధనపై తాజాగా ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఈ కేసులో థియేటర్ యజమానుల తరఫున సీనియర్ అడ్వొకేట్ ఎస్. నిరంజన్ రెడ్డి, అడ్వొకేట్ సిర్గపూర్ సాహిల్ రెడ్డి వాదనలను వినిపించారు. థియేటర్లను ప్రభావితం చేసే ఈ ఆదేశాన్ని, థియేటర్ యజమానుల వాదనలు వినకుండా జారీ చేశారని వారు కోర్టుకు తెలిపారు. దీనివల్ల థియేటర్ల నిర్వహణ భారమవుతుందని వారు పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు, ఈ వివాదంలో ఒక కీలకమైన సాంకేతిక అంశాన్ని లేవనెత్తింది. అసలు పిటిషనర్ ఒక నిర్దిష్ట థియేటర్ (ఏషియన్ కోనార్క్) లో వసూలు చేస్తున్న ఫీజుపై మాత్రమే కేసు వేశారని, కానీ ఆ ఉత్తర్వును రాష్ట్రంలోని అన్ని థియేటర్లకు వర్తింపజేయడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. ఆ ఆదేశం కూడా ఆ ఒక్క థియేటర్కే పరిమితం కావాలని పేర్కొంది. ప్రస్తుత తీర్పు ప్రకారం, హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లో ఉన్న ఏషియన్ కోనార్క్ థియేటర్ మినహా, తెలంగాణ రాష్ట్రంలోని మిగిలిన అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజులు వసూలు చేసుకోవచ్చు. ఇది థియేటర్ యజమానులకు పెద్ద ఊరటనిచ్చే విషయమే అయినప్పటికీ, సామాన్య ప్రేక్షకులకు మాత్రం అదనపు భారంగా మారనుంది. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. ఇప్పటికే టికెట్ ధరలు, క్యాంటీన్ రేట్లు పెరిగిపోయాయని, ఇప్పుడు మళ్లీ పార్కింగ్ ఫీజు కూడా తోడైతే సామాన్యుడు థియేటర్కు రావడం కష్టమని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. మరోవైపు థియేటర్ యజమానులు మాత్రం నిర్వహణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఇది తప్పనిసరి అని వాదిస్తున్నారు.
Mar 18, 2026
Chitti Babu: నందమూరి ఫ్యామిలీ రహస్యాలు బయటపెట్టిన చిట్టిబాబు!
హరికృష్ణతో కలిసి సిగరెట్ తాగుతూ ఎన్టీఆర్కు దొరికిపోయిన చిట్టిబాబు! హరికృష్ణ అంటే ఎన్టీఆర్ తండ్రికి ఎందుకు అంత ప్రాణం? చిట్టిబాబు ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు! నందమూరి తారకరామారావు క్రమశిక్షణకు మారుపేరు. తన లాగే తన చుట్టూ ఉన్న వారు కూడా క్రమశిక్షణతో ఉండాలి అనుకుంటారు. తాజాగా సీనియర్ నటుడు చిట్టిబాబు(Chitti Babu) తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నందమూరి కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా హరికృష్ణతో కలిసి చేసిన అల్లరి, ఎన్టీఆర్ కి దొరికిపోయిన సందర్భాలను ఆయన మనసు విప్పి మాట్లాడారు. షూటింగ్ సమయంలో హరికృష్ణ, చిట్టిబాబు మంచి స్నేహితులు. ఒకసారి 'బ్రహ్మంగారి చరిత్ర' షూటింగ్ జరుగుతున్నప్పుడు, ఇద్దరూ కలిసి ఎవరికీ తెలియకుండా ఒక చెట్టు వెనుక సిగరెట్ తాగుతున్నారట. అయితే, అటుగా వచ్చిన ఎన్టీఆర్ చెట్టు వెనుక నుంచి పొగ రావడం చూసి, "ఏమిటి ఆ చెట్టు పక్కన పొగ వస్తోంది.. ఏదో అంటుకున్నట్లుంది చూడండి" అని గట్టిగా అరిచారట. ఆ గంభీరమైన స్వరం వినగానే హరికృష్ణ తో సహా చిట్టిబాబు భయంతో సిగరెట్ పారేసి అక్కడి నుంచి పరుగులు తీశారట. ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ చిట్టిబాబు నవ్వుకున్నారు. కేవలం సరదా ముచ్చట్లే కాదు, ఎన్టీఆర్ కి తన కొడుకుల పట్ల ఉన్న డెడికేషన్ గురించి కూడా చిట్టిబాబు ఆసక్తికర విషయాలు చెప్పారు. హరికృష్ణకి డ్రైవింగ్ అంటే ప్రాణం అని, ఎంతటి క్లిష్టమైన కొండ ప్రాంతాల్లోనైనా జీపును అవలీలగా తోలేవారని కొనియాడారు. డ్రైవర్లు ఎక్కించలేని కొండ మీదకు కూడా హరికృష్ణ జీపును అని తీసుకువెళ్లేవారని, అది చూసి ఎన్టీఆర్ కూడా మురిసిపోయేవారని తెలిపారు. ఎన్టీఆర్ గారి తండ్రికి (హరికృష్ణ తాతగారికి) కూడా మనవళ్లందరిలోకి హరికృష్ణ అంటేనే అమితమైన ప్రాణమని చిట్టిబాబు వెల్లడించారు. షూటింగ్ సెట్కి వచ్చినప్పుడు బాలకృష్ణ కంటే హరికృష్ణకే ఎక్కువ ఫైట్ సీన్లు ఇవ్వమని డైరెక్టర్తో సరదాగా అనేవారట. నందమూరి కుటుంబంలో ఉన్న అనుబంధాలు, వారి మధ్య ఉన్న ప్రేమానురాగాలను చిట్టిబాబు ఈ ఇంటర్వ్యూలో కళ్ళకు కట్టినట్లు వివరించారు. అలాగే బాలకృష్ణ గురించి మాట్లాడుతూ.. 'బ్రహ్మంగారి చరిత్ర' షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను వివరించారు. ఒక సీన్ కోసం బాలయ్య చెప్పులు లేకుండా ముళ్ళ పొదల్లో పరిగెత్తాల్సి వచ్చిందట. ఆ సమయంలో కాలికి ముళ్ళు గుచ్చుకుని రక్తం కారుతున్నా, ఎన్టీఆర్ మాత్రం "ఏం బాలా.. రెడీనా?" అని అడిగారట. తండ్రి క్రమశిక్షణకు తలవంచి బాలయ్య అలాగే రక్తసిక్తమైన పాదాలతో షూటింగ్ పూర్తి చేశారని, ఆ తర్వాతే ఎన్టీఆర్ ప్యాకప్ చెప్పి కొడుకును హాస్పిటల్ కి తీసుకెళ్లారని చిట్టిబాబు చెప్పారు. చిట్టిబాబు చేసిన ఈ వైరల్ కామెంట్స్ చూస్తుంటే, అప్పట్లో షూటింగ్ సెట్స్ ఎంత సందడిగా ఉండేవో అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ నెట్టింట హల్చల్ చేస్తోంది. నందమూరి అభిమానులు ఈ పాత జ్ఞాపకాలను చూసి మురిసిపోతున్నారు. చిట్టిబాబు పూర్తి ఇంటర్వ్యూ కోసం, మరిన్ని ఆసక్తికర సినిమా అప్డేట్స్ కోసం మా 'తెలుగువన్'(TeluguOne) యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకోండి.
Mar 18, 2026
The Traitors: తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో.. ఎన్టీఆర్ రంగంలోకి దిగుతున్నాడా?
తెలుగులోకి ఇంటర్నేషనల్ రియాలిటీ షో 'ది ట్రెయిటర్స్' సరికొత్త కాన్సెప్ట్తో వస్తున్న తెలుగు వెర్షన్! టాలీవుడ్ టాప్ హీరోతో అమెజాన్ ప్రైమ్ భారీ స్కెచ్! తెలుగులో సరికొత్త రియాలిటీ షో రాబోతుంది. ఇప్పటివరకు మనం చూసిన రియాలిటీ షోలకు భిన్నంగా, అత్యంత ఉత్కంఠభరితమైన అంతర్జాతీయ షో "ది ట్రెయిటర్స్" (The Traitors) తెలుగులో అడుగుపెట్టబోతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్న ఈ షోను ఒక టాలీవుడ్ టాప్ స్టార్ హీరో హోస్ట్ చేయబోతున్నారనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. 'ది ట్రెయిటర్స్' అనేది నెదర్లాండ్స్లో పుట్టిన ఒక మైండ్ గేమ్ రియాలిటీ షో. ఇందులో సుమారు 20 మంది సెలబ్రిటీలు ఒక కోటలో నివసిస్తారు. వారిలో కొందరిని హోస్ట్ రహస్యంగా 'ట్రెయిటర్స్' (నమ్మక ద్రోహులు)గా ఎంపిక చేస్తారు. మిగిలిన వారు 'ఫెయిత్ ఫుల్స్' (నమ్మకస్తులు). ప్రతి రాత్రి ట్రెయిటర్స్ ఒకరిని 'మర్డర్' చేస్తారు, అంటే షో నుండి పంపించేస్తారు. పగలు అందరూ కలిసి చర్చించి ఎవరైతే ట్రెయిటర్ అనుకుంటారో వారిని ఓటింగ్ ద్వారా బయటకు పంపిస్తారు. ఈ షోలో నమ్మకం, వెన్నుపోటు, మైండ్ గేమ్స్ ప్రధాన భూమిక పోషిస్తాయి. ఇప్పటికే యూకే, యూఎస్ వంటి దేశాల్లో ఇది సూపర్ హిట్ అయ్యింది. ఇండియాలోనూ అడుగుపెట్టింది. హిందీ వెర్షన్కు కరణ్ జోహార్ హోస్ట్గా వ్యవహరిస్తుండగా, ఇప్పుడు తెలుగు వెర్షన్ కోసం అమెజాన్ ప్రైమ్ ఒక స్టార్ హీరోతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఆ స్టార్ హీరో హోస్టింగ్ చేస్తే షో రేంజ్ మరో స్థాయిలో ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు. బిగ్ బాస్ వంటి షోల కంటే ఇది మరింత పకడ్బందీగా, విభిన్నంగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేర్పులు చేసి, భారీ బడ్జెట్తో ఈ షోను నిర్మించబోతున్నారు. ఇప్పటికే కొంతమంది ప్రముఖ సెలబ్రిటీలను కంటెస్టెంట్స్గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ షోపై సోషల్ మీడియాలో కూడా భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ ఎవరైనా ఈ షోను హోస్ట్ చేస్తారా? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో బిగ్ బాస్ హోస్ట్ గా ఎన్టీఆర్ సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అందుకే ఎన్టీఆర్ హోస్ట్ అయితే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి ఈ గ్రాండ్ రియాలిటీ షోకు హోస్ట్ ఎవరు అనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ షోకు సంబంధించిన ప్రోమోను విడుదల చేసే అవకాశం ఉంది.
Mar 18, 2026
Dragon: ఎన్టీఆర్ 'డ్రాగన్' మూవీ బడ్జెట్ పై నిర్మాత షాకింగ్ కామెంట్స్.. రోజుకు కోటిన్నర ఖర్చు!
జూనియర్ ఎన్టీఆర్ 'డ్రాగన్' కోసం భారీ బడ్జెట్ విజువల్ వండర్ గా తీర్చిదిద్దుతున్న మేకర్స్ రోజుకు కోటి నుండి కోటిన్నర వరకు ఖర్చు టికెట్ ధరల పెంపు లేకపోతే ఎలా? జూనియర్ ఎన్టీఆర్(Jr NTR), డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న 'డ్రాగన్'(Dragon) సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్ యెర్నేని ఈ ప్రతిష్టాత్మక చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా మేకింగ్, బడ్జెట్ విషయంలో తాము ఏమాత్రం రాజీ పడటం లేదని ఆయన స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) మూవీ ఉగాది కానుకగా రేపు(మార్చి 19) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత నవీన్ యెర్నేని టికెట్ ధరల పెంపు అంశంపై మాట్లాడుతూ 'డ్రాగన్' మూవీ అప్డేట్ ఇచ్చారు. విజువల్స్ విషయంలో 'డ్రాగన్' ఒక అద్భుతంలా ఉండబోతోందని నవీన్ పేర్కొన్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం ప్రతిరోజూ దాదాపు కోటి నుండి కోటిన్నర రూపాయల వరకు ఖర్చు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇంత భారీ స్థాయిలో ఖర్చు చేస్తూ ప్రేక్షకులకు ఒక విజువల్ ఫీస్ట్ అందించాలనే సంకల్పంతో ఉన్నామని చెప్పారు. ఎన్టీఆర్ ఇమేజ్కు తగ్గట్టుగా, ప్రశాంత్ నీల్ విజన్ను వెండితెరపై ఆవిష్కరించడానికి భారీ బడ్జెట్ కేటాయించినట్లు తెలిపారు. టికెట్ ధరల విషయంలో కూడా నవీన్ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఫ్లెక్సిబుల్ రేట్లు అందుబాటులో ఉన్నాయని, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది అమలు కావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బాంబే, ఢిల్లీ వంటి నగరాల్లో సినిమాను బట్టి టికెట్ ధరలు నిర్ణయించుకునే వెసులుబాటు ఉందని గుర్తు చేశారు. సంవత్సరానికి వచ్చే ఐదారు భారీ సినిమాలకు మాత్రమే టికెట్ రేట్ల పెంపు అవసరమని, చిన్న సినిమాలకు రేట్లు పెంచాల్సిన పని లేదని ఆయన స్పష్టం చేశారు. వారణాసి, పెద్ది, అల్లు అర్జున్-అట్లీ కాంబో మూవీ, ఫౌజీ మరియు ఎన్టీఆర్ డ్రాగన్ వంటి భారీ చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నప్పుడు, ఆ మేరకు రిటర్న్స్ రావాలంటే టికెట్ రేట్లలో మార్పులు ఉండాలని కోరారు. త్వరలోనే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను సంప్రదించనున్నట్లు నవీన్ తెలిపారు. టికెట్ ధరలపై ఒక శాశ్వత పరిష్కారం వస్తుందని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ వెసులుబాటు కల్పిస్తే ఇండస్ట్రీకి ఎంతో మేలు జరుగుతుందని నవీన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Mar 18, 2026
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com



