
Gayathri Gupta: పెళ్ళైన వారానికే విడాకులు.. ఇండస్ట్రీలో చేదు అనుభవాలు.. గాయత్రి గుప్త సంచలన ఇంటర్వ్యూ!
టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి గాయత్రి గుప్త (Gayathri Gupta). కెరీర్ పరంగా ఎంత ధైర్యంగా కనిపిస్తారో, వ్యక్తిగత జీవితంలో అంతకు మించిన పోరాటాన్ని ఎదుర్కొన్నారు. తాజాగా ఆమె తెలుగువన్(TeluguOne)కు ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో తన జీవితంలోని చీకటి కోణాలను బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిత్యం కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే గాయత్రి వెనుక ఇంతటి వేదన ఉందా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ ఇంటర్వ్యూలో గాయత్రి తన బాల్యం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. తన తండ్రి చాలా కఠినంగా ఉండేవారని, చిన్నతనంలో తన తల్లిని కొట్టడమే కాకుండా.. ఏకంగా కరెంట్ షాక్లు పెట్టడం, వాతలు పెట్టడం వంటి భయంకరమైన పరిస్థితుల మధ్య తాను పెరిగానని చెబుతూ ఆనాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కేవలం 16 ఏళ్ల వయసుకే తన తల్లికి తాను పుట్టానని, ఆ పరిస్థితుల్లో తన తల్లి కూడా ఎన్నో ఇబ్బందులు పడిందని గాయత్రి వివరించారు. ఇక తన వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ మరో సంచలన విషయాన్ని బయటపెట్టారు. తనకు పెళ్లైన వారం రోజులకే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. అది ఒక టాక్సిక్ మ్యారేజ్ అని, అక్కడ శారీరక, మానసిక వేధింపులు ఎక్కువగా ఉండటం వల్లే అంత త్వరగా ఆ బంధం నుంచి బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. పెళ్లి అనేది ఒక పెద్ద స్కామ్ అని, ఆడపిల్లలకు రక్షణ లేని చోట ఉండటం కంటే ఒంటరిగా పోరాడటమే మిన్న అని ఆమె తన అభిప్రాయాన్ని చెప్పారు. సినిమా ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను కూడా గాయత్రి నిర్మొహమాటంగా పంచుకున్నారు. టాలెంట్ ఉన్నప్పటికీ నిజాలు మాట్లాడటం వల్లే తనను కమర్షియల్ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేశారని ఆమె ఆరోపించారు. కాస్టింగ్ కౌచ్ వంటి ఇష్యూలపై గళం ఎత్తడం వల్ల కొన్ని పెద్ద ప్రొడక్షన్ హౌస్లు తనను పక్కన పెట్టాయని, అయినప్పటికీ తాను వెనకడుగు వేయలేదని స్పష్టం చేశారు. టాలెంట్ చూసి అవకాశాలు ఇవ్వాలి కానీ, ఒక అమ్మాయిని శారీరకంగా ఉపయోగించుకోవాలి అనుకోవడం కరెక్ట్ కాదని ఫైర్ అయ్యారు. ప్రస్తుతం 'ఫస్ట్ టైమ్' అనే సినిమాలో ఒక ఆసక్తికరమైన పాత్ర పోషిస్తున్నానని, త్వరలోనే సొంతంగా ఒక ప్రేమకథను డైరెక్ట్ చేయాలనే లక్ష్యంతో ఉన్నానని ఆమె వెల్లడించారు. గాయత్రి గుప్త ఫుల్ ఇంటర్వ్యూతో పాటు, మరిన్ని ఆసక్తికర ఇంటర్వ్యూల కోసం తెలుగువన్ (TeluguOne) యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
May 07, 2026
Bellamkonda Sai Sreenivas: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భార్య కావ్య రెడ్డి చేసే బిజినెస్ ఇదేనా!
బెల్లంకొండసాయి శ్రీనివాస్(Sai Sreenivas)వివాహం కావ్య రెడ్డి(Kavya Reddy)తో జరిగిన విషయం తెలిసిందే. జనరల్ గా మనకి తెలిసిన వాళ్లే పెళ్లి చేసుకుంటే ఈ రోజుల్లో భార్య భర్తలిద్దరూ సంపాదించాలి కాబట్టి అబ్బాయ్, అమ్మాయి ఏ వర్క్ చేస్తుంటారని అడిగే పరిస్థితి. అలాంటిది సాయి శ్రీనివాస్ చేసుకున్న కావ్య రెడ్డి ఏ పని చేస్తుందో తెలుసుకోవాలని కూడా ఉంటుంది కదా! మరి అలా తెలుసుకోవాలనే వాళ్లందరి కోసం కొన్ని డీటెయిల్స్ కావ్యరెడ్డి ఒక లాయర్. మరోవైపు అరటి చెట్టు నుంచి వచ్చే నారని దారాలుగా మార్చి చీరలను తయారు చేసి విదేశాలకి పంపిస్తుందంట. దీంతో కావ్యకి నెలకు సుమారు 90 లక్షల ఆదాయం వస్తుందట. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు కానీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ విషయంలో పూర్తి క్లారిటీ రావాలంటే సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డినే స్పందించాలి. కావ్యరెడ్డి హైదరాబాద్ కి చెందిన ప్రముఖ న్యాయవాది కూతురు అనే విషయం తెలిసిందే. Also read: Rajinikanth: అభిమానులని బాధకి గురి చేస్తున్న రజీనీకాంత్ మాటలు
May 07, 2026
Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్కు మరో షాక్.. వచ్చే ఏడాదికి వాయిదా పడిన ఫౌజీ..?
'సీతారామం' ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న భారీ పీరియడ్ డ్రామా 'ఫౌజీ' (Fauzi)పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం రిలీజ్ డేట్ విషయంలో వార్తల్లో నిలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ ఏడాది చివర్లో రావాల్సిన ఈ మూవీ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. రిలీజ్ వాయిదాకు కారణాలు: ఈ చిత్రం హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో సాగే యుద్ధ నేపథ్యంలో తెరకెక్కుతోంది. సహజంగానే ఇలాంటి సినిమాలకు వీఎఫ్ఎక్స్ అత్యంత కీలకం. యుద్ధ సన్నివేశాలు, పీరియడ్ సెట్టింగ్స్ను అత్యంత నాణ్యంగా తెరపైకి తీసుకురావడానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు భారీగా ఉన్నాయి. విజువల్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని దర్శకుడు హను రాఘవపూడి భావిస్తున్నారు. దీనివల్ల మొదట అనుకున్న దసరా 2026 లేదా డిసెంబర్ విడుదల తేదీలు దాటిపోయే పరిస్థితి కనిపిస్తోంది. 2027లో రానుందా? ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, 'ఫౌజీ' సినిమాను 2027 ప్రారంభంలో విడుదల చేసే యోచనలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మిగిలి ఉన్న 20 శాతం షూటింగ్ తో పాటు, వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టవచ్చు. ఈ జాప్యం ప్రభాస్ తదుపరి ప్రాజెక్ట్ అయిన సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' (Spirit) పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. 2027 మార్చి 5న 'స్పిరిట్' ఉండటంతో.. దానికి అడ్డు రాకుండా, గ్యాప్ ఉండేలా 'ఫౌజీ' విడుదలను ప్లాన్ చేసుకోవాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడిగా కనిపిస్తారని సమాచారం. ఇమాన్వి హీరోయిన్గా పరిచయం అవుతుండగా, మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ వంటి హేమాహేమీలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వాయిదా వార్త ప్రభాస్ అభిమానులకు కొంత నిరాశ కలిగించే విషయమే అయినప్పటికీ, అవుట్పుట్ అద్భుతంగా రావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సినిమా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా వస్తే, బాక్సాఫీస్ వద్ద 'ఫౌజీ' సృష్టించే విధ్వంసం మామూలుగా ఉండదు. మరి ఈ వార్తలపై చిత్ర యూనిట్ ఎప్పుడు స్పందిస్తుందో వేచి చూడాలి.
May 07, 2026
Rajinikanth: అభిమానులని బాధకి గురి చేస్తున్న రజీనీకాంత్ మాటలు
అగ్ర నిర్మాత ఆర్ బి చౌదరి(Rb Choudary)రోడ్ యాక్సిడెంట్ లో ఆకస్మిక మరణానికి గురవ్వడం ప్రతి ఒక్కర్ని ఎంతగానో కలిచి వేస్తుంది. ఈ రోజు ఉదయం ఆర్ బి చౌదరి పార్థివ దేహాన్ని సూపర్ స్టార్ రజినీకాంత్ సందర్శించి తన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చౌదరి గారితో తనకున్న అనుబంధాన్ని రజినీ కాంత్(Rajini Kanth)గుర్తు చేసుకున్నారు. రజినీ మాట్లాడుతూ నేను చౌదరి గారి బ్యానర్ లో చేయకపోయినా మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది.అప్పుడపుడు కలుసుకునే వాళ్ళం. నాలుగు నెలల క్రితం జైలర్ 2 షూటింగ్ సెట్స్ కి వచ్చి కలిశారు. నాతో మాట్లాడుతూ 99 వ సినిమా చేస్తున్నాను. 100 వ సినిమా చేసి రిటైర్ అవుతా. ఆ సినిమాలో నన్ను చెయ్యాలని అన్నారు. తప్పకుండా చేస్తానని మాట ఇచ్చానని రజినీకాంత్ చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ మాటలు చౌదరి గారి అభిమానులని బాధాసప్తంలో ముంచుతున్నాయి. also read: Laila: లైలా పట్టుబట్టారు.. 22 ఏళ్ళ తర్వాత అదృష్టవంతులుగా తెలుగు ప్రేక్షకులు
May 07, 2026జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే సొసైటీ బాగుపడుతుందని చెప్పే ఆపరేషన్ అరుణారెడ్డి మూవీ!
- "ఆపరేషన్ అరుణారెడ్డి" సినిమాకు రాజకీయాలతో సంబంధం లేదు - అన్ని పార్టీల వారు ఈ సినిమాను చూడొచ్చు, బూతు మాటలు, అసభ్యకర సన్నివేశాలు ఉండవు - నా కెరీర్ లో బెస్ట్ స్క్రీన్ ప్లే, దేశంలోనే ఒక మంచి స్క్రీన్ ప్లే మూవీ అవుతుంది - అప్పటికున్న బెటర్ పొలిటీషయన్ కు సపోర్ట్ చేస్తూ వచ్చా, ఎవరి దగ్గరా ఏమీ ఆశించలేదు - అందరి సహకారంతో మంచి చిత్రాలు చేయాలని అనుకుంటున్నా - ప్రెస్ మీట్ లో పోసాని కృష్ణమురళి ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా "ఆపరేషన్ అరుణారెడ్డి". ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, ఎడిటింగ్ బాధ్యతలు కూడా పోసాని కృష్ణమురళి వహిస్తుండటం విశేషం. హిందోళ చక్రవర్తి, కాజల్ శర్మ, ఆయేషా ఖాన్, బీజేపీ నేత రఘునందన్ రావు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో "ఆపరేషన్ అరుణారెడ్డి" చిత్ర విశేషాలు తెలిపారు దర్శక నిర్మాత నటుడు పోసాని కృష్ణమురళి. నటుడు, దర్శక, నిర్మాత పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ - ఇది నిజాయితీపరులైన జర్నలిస్టుల కథ. జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే సొసైటీ బాగుపడుతుంది అనేది ఈ చిత్ర కథాంశం. హిందోళ చక్రవర్తి అరుణారెడ్డి అనే జర్నలిస్ట్ క్యారెక్టర్ లో నటిస్తోంది. ఆమెది లీడ్ రోల్. రాజకీయాల్లోకి ప్రజాసేవ కోసం ఎవరు వచ్చారో, వ్యాపారం కోసం ఎవరు వచ్చారో ఆమె పాత్ర ప్రజల్ని హెచ్చరిస్తుంది. ఆ జర్నలిస్టు చేసిన హెచ్చరికలతో ప్రజలు ఎలా అప్రమత్తమయ్యారు, రాజకీయ నాయకుల ఎంపికలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేది ఈ చిత్రంలో ఆసక్తికరంగా తెరకెక్కించాం. ఉన్నది ఉన్నట్లు మాట్లాడేవారు సమాజంలో ఉండకూడదు అనుకుంటారు చాలామంది. ఇలాంటి మంచి జర్నలిస్టు కొందరు చేసిన రాజకీయాలకు రోడ్డున పడే పరిస్థితి వస్తే ఒక మంచి ముఖ్యమంత్రి ఆమెకు హెల్ప్ చేస్తాడు. ఇలాంటి అమ్మాయి జర్నలిజంలో ఉండాలని అండగా నిలబడతాడు. ఆ సీఎం పాత్రలో ఎంపీ రఘునందన్ రావు గారు నటించారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమాకు పాలిటిక్స్ కు ఎలాంటి సంబంధం లేదు. వందశాతం సిన్సియర్ గా చేసిన సినిమా ఇది. ఆపరేషన్ అరుణారెడ్డి మూవీ స్క్రీన్ ప్లే..ఇండియాలోనే ఒక బెస్ట్ స్క్రీన్ ప్లే అవుతుందని గర్వంగా చెప్పగలను. నా కెరీర్ లో కూడా ఇది బెస్ట్ స్క్రీన్ ప్లేగా పేరు తెచ్చుకుంటుంది. సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా ఏం జరుగుతుందో ఊహించలేరు. ఈ సినిమా ప్రజలకు బాగా నచ్చుతుందని నమ్ముతున్నా. అన్ని వర్గాల ప్రేక్షకులు భయం లేకుండా ఈ సినిమాను చూడొచ్చు. తెలుగుదేశం, వైసీపీ, కాంగ్రెస్, జనసేన, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు..ఇలా అందరూ ఈ చిత్రాన్ని చూడొచ్చు. వాళ్లందరికీ నచ్చే చిత్రమిది. వంద చిత్రాలకు కథా స్క్రీన్ ప్లే రాసిన అనుభవం నాకుంది. అలాగే ఎడిటింగ్ అంటే ఇష్టం. నేను ఏం చేయగలనో అదే ఈ చిత్రంలో చేశాను. రఘునందన్ రావు గారు అంటే నాకు ఇష్టం. నేనంటే ఆయనకు అభిమానం. ఈ చిత్రంలో సీఎం పాత్ర ఆయన చేస్తే బాగుంటుందని అనిపించింది. రఘునందన్ రావు గారు కూడా కథ విని బాగుంది మురళి నేను చేస్తా అన్నారు. ఈ సినిమాతో ఆయనకు ఇంతే సంబంధం. ఈ సినిమాలో ఒక్క బూతు గానీ, ఒక్క అసభ్యమైన సన్నివేశం గానీ ఉండదు. తమిళనాట విజయ్ లాంటి మంచి వ్యక్తి గెలవడం సంతోషంగా ఉంది. అతన్ని డీఎంకే, ఎన్నాడీఎంకే లాంటి పార్టీలు అనవసరంగా టార్గెట్ చేస్తున్నాయి. రాజకీయంగా బెటర్ అనుకున్నవారికి సపోర్ట్ చేశా. ఈ క్రమంలో ఎన్టీఆర్, చంద్రబాబు, చిరంజీవి, జగన్ ఇలా అందరి నాయకులకు సహకారం అందించా. అయితే ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించలేదు. ఏ పదవులూ తీసుకోలేదు. ఏ పార్టీలో నాకు సభ్యత్వం లేదు. వైసీపీ ప్రభుత్వంలో ఎఫ్ డీసీ ఛైర్మన్ గా పనిచేశా. అది కూడా నంది అవార్డ్స్ ను సక్రమంగా నిర్వహించాలని అప్పటి ప్రభుత్వం కోరితే ఆ పదవి తీసుకున్నా. నా అధ్వర్యంలో నిర్వహించిన నంది అవార్డ్స్ కార్యక్రమాన్ని అప్పటి విపక్ష మీడియా కూడా అభినందించింది. మీ అందరి సహకారంతో మరిన్ని మంచి చిత్రాలు చేయాలని అనుకుంటున్నా. అన్నారు. హీరోయిన్ హిందోళ చక్రవర్తి మాట్లాడుతూ - ఆపరేషన్ అరుణారెడ్డి చిత్రంలో పోసాని గారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఆయనతో కలిసి నటించడం వల్ల కేవలం నటన మాత్రమే కాదు డెడికేషన్, సినిమాను కొత్తగా చూసే విధానం నేర్చుకున్నాను. పోసాని గారు ఈ కథ చెప్పినప్పుడు అరుణారెడ్డి పాత్రను ఎంతో ఇష్టపడ్డాను. అరుణ ఒక పవర్ ఫుల్ వుమెన్, సెన్సిటివ్, ఎమోషనల్ ను బ్యాలెన్స్ చేసుకుంటుంది. అరుణ లాంటి అమ్మాయిలు ఇప్పటి సమాజంలో ఉండాల్సిన అవసరం ఉంది. తెలుగు డైలాగ్స్, అరుణ పాత్ర స్వభావం ఎలా ఉండాలి అనేది పోసాని గారు ఎంతో సహనంతో నేర్పించారు. ఇలాంటి మంచివారితో కలిసి పనిచేసే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. అన్నారు
May 07, 2026
Sundeep Kishan: సందీప్ కిషన్ బర్త్డేకు ‘శంబాల’ డైరెక్టర్ స్పెషల్ గిఫ్ట్!
‘శంబాల’ బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు యుగంధర్ ముని, సందీప్ కిషన్(Sundeep Kishan)తో ఓ ప్రాజెక్ట్ చేయబోతోన్న సంగతి తెలిసిందే. సందీప్ కిషన్ నటిస్తున్న 23వ చిత్రమిది (SK33). ఈ మూవీని షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ అందరిలోనూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. అడివికి రాజైన సింహం, తోడేలు మధ్య జరిగే పోటీలా ఈ సినిమాలో అడ్వంచర్స్ ఉంటాయని టీం హింట్ ఇచ్చింది. ఇక ఇప్పుడు సందీప్ కిషన్ బర్త్ డే సందర్భంగా మరో పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లోని ఓ బిడ్డ, ఖడ్గం, సింహం ఇవన్నీ చూస్తుంటే ఇదొక ఫారెస్ట్ అడ్వంచర్ చిత్రం అని అర్థం అవుతోంది. ఇక ఇందులో సింహంలాంటి యోధుడిగా సందీప్ కిషన్ కనిపిస్తాడని తెలుస్తోంది. ఏ లెజెండ్ ఈజ్ బార్న్ అంటూ వదిలిన ఈ పోస్టర్ ఆడియెన్స్లో ఒక్కసారిగా అంచాల్ని రెట్టింపు చేసింది. ఈ ఫాంటసీ అడ్వంచర్ను తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరగుతున్నాయి. ఆగస్ట్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని గతంలోనే ప్రకటించారు. మరి కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సందీప్ కిషన్ కు ఈ సినిమా విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.
May 07, 2026
Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈరోజు హెడ్ లైన్స్..
1. శ్రీతేజ్ ఇంటికి అల్లు అర్జున్ సతీమణి.. 'పుష్ప 2' ప్రీమియర్ షో తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్ నివాసానికి.. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి వెళ్లారు. ప్రస్తుతం కోలుకుంటున్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని.. ఆ కుటుంబానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీతేజ్ సోదరి చదువుకు అయ్యే పూర్తి ఖర్చులను తానే భరిస్తానని అల్లు అరవింద్ హామీ ఇచ్చారు. 2. ‘ఫౌజీ’ రిలీజ్ పై కొత్త ట్విస్ట్.. ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ ‘ఫౌజీ’. సుమారు 80 శాతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమాకి భారీ వీఎఫ్ఎక్స్ పనులు మిగిలి ఉండటంతో.. రిలీజ్పై కొత్త అనుమానాలు మొదలయ్యాయి. దసరా లేదా ఈ ఏడాది చివర్లో రావాల్సిన ‘ఫౌజీ’.. 2027కు వాయిదా పడే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. 3. ముందుగానే 'పెద్ది' సందడి.. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం 'పెద్ది'. ఈ సినిమాకు సంబంధించిన ఎడిటింగ్ వర్క్ పూర్తయినట్లు చిత్ర యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది. జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా.. ఒకరోజు ముందుగానే అంటే జూన్ 3న భారీ స్థాయిలో ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. 4. అల్లు అర్జున్ రాక ఎప్పుడంటే? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న భారీ చిత్రం “రాకా” రిలీజ్ పై కొత్త టాక్ మొదలైంది. భారీ వీఎఫ్ఎక్స్ పనుల కారణంగా సినిమా వచ్చే ఏడాది వేసవి తర్వాత విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పారలెల్ గా కొనసాగుతున్నాయి. 5. కార్తీ కొత్త తెలుగు మూవీ లాంచ్.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో కోలీవుడ్ స్టార్ కార్తీ హీరోగా రూపొందనున్న కొత్త చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. 'మ్యాడ్' ఫేమ్ కళ్యాణ్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. 6. 'బ్లడీ రోమియో'కు బ్రేకులు.. నాని, సుజీత్ కాంబినేషన్లో అనౌన్స్ అయిన క్రేజీ ప్రాజెక్ట్ 'బ్లడీ రోమియో' వాయిదా పడినట్లు తెలుస్తోంది. నాని నటిస్తున్న 'ది ప్యారడైజ్' ఆలస్యమవ్వడమే దీనికి కారణమని సమాచారం. ఈ గ్యాప్ను ఉపయోగించుకుంటూ.. సుజీత్ తన పూర్తి దృష్టిని పవన్ కళ్యాణ్ 'ఓజీ పార్ట్ 2' పనులపై మళ్లించారు. ప్రస్తుతం 'ఓజీ-2' స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారు. 'బ్లడీ రోమియో' ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది. 7. వెన్నులో వణుకు పుట్టిస్తోన్న 'అగాధ' టీజర్ ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ హర్రర్ థ్రిల్లర్ 'అగాధ' టీజర్ తాజాగా విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. క్షుద్ర పూజలు, నిగూఢమైన రహస్యాల చుట్టూ సాగుతూ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. టీజర్లోని విజువల్స్, భయానక వాతావరణం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో అలరించేందుకు సిద్ధమవుతోంది. 8. 'రాజ రాజ చోర' దర్శకుడితో రవితేజ మాస్ మహారాజా రవితేజ, యంగ్ డైరెక్టర్ హసిత్ గోలి కాంబినేషన్లో ఒక సినిమా రానుంది. 'రాజ రాజ చోర', 'స్వాగ్' చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హసిత్ గోలి చెప్పిన వైవిధ్యమైన స్క్రిప్ట్కు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. ప్రస్తుతం రవితేజ 'ఇరుముడి' షూటింగ్లో బిజీగా ఉండగా, అది పూర్తయిన వెంటనే ఈ కొత్త సినిమా ప్రారంభం కానుంది. 9. ఓటీటీలోకి 'తిమ్మరాజుపల్లి టీవీ' యువ హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారిన తొలి సినిమా 'తిమ్మరాజుపల్లి టీవీ' డిజిటల్ ప్రీమియర్కు సిద్ధమైంది. మునిరాజు దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా.. మే 15న ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఆహా గోల్డ్ సబ్స్క్రైబర్లు 24 గంటల ముందే, అంటే మే 14 నుంచే ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు. 10. షారుఖ్-దీపికా సాంగ్ వీడియో లీక్ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ 'కింగ్' షూటింగ్ స్పెయిన్లో శరవేగంగా జరుగుతుండగా, లీకుల బెడద చిత్ర యూనిట్ను కలవరపెడుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి షారుఖ్ ఖాన్-దీపికా పదుకొణె పాల్గొన్న ఒక సాంగ్ షూటింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాంగ్ తో పాటు కొన్ని కీలక యాక్షన్ సీక్వెన్స్ లు కూడా లీక్ అయినట్లు సమాచారం.
May 07, 2026
Laila: లైలా పట్టుబట్టారు.. 22 ఏళ్ళ తర్వాత అదృష్టవంతులుగా తెలుగు ప్రేక్షకులు
మాఘమాసం ఎప్పుడొచ్చిందో అని ఆడిపాడి పెళ్లీడుకొచ్చిన యువతీ, యువకులు అర్జెంట్ గా పెళ్లి చేసుకునేలా చేసింది లైలా(Laila)..ఇప్పుడు మళ్ళీ అలాగే చేయాలనే ఉద్దేశ్యంతో సెకండ్ ఇన్నింగ్స్ లో 'గోదారి గట్టుపైన'(Godari Gattupaina)అనే చిత్రంతో రేపు థియేటర్స్ లో అడుగుపెడుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక రీసెంట్ గా హైదరాబాద్లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేడుకలో లైన తన ఉత్సాహభరితమైన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. లైలా మాట్లాడుతూ, తెలుగు ప్రేక్షకులు చూపించే ఆదరణ ఎప్పటికీ మర్చిపోలేను. తెలుగు నా మాతృభాష కాకపోయినా, ఇక్కడి వారు నన్ను తమ ఇంటి అమ్మాయిలా ఆదరించారు. మళ్ళీ మీ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. గోదావరి తీర ప్రాంతంలోని గ్రామీణ వాతావరణం, అక్కడి మనుషుల మధ్య ఉండే అనుబంధాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఒక పవర్ఫుల్, ఎమోషనల్ క్యారక్టర్ ని పోషించాను. నా కెరీర్లో ఇది ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుంది. Also read: Allu arjun: మాటలు మారాయి.. రాకా తాజా న్యూస్ నిజమేనా! రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు పాత రోజులు గుర్తొచ్చాయి. అక్కడి భోజనం ఆతిథ్యం అద్భుతం. దర్శకుడు సుభాష్ చంద్ర నేను నటించాలని పట్టుబట్టి మరి ఒప్పించాడని చెప్పుకొచ్చారు. లైలా 22 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇస్తుంది. జగపతి బాబు, సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్, రాజీవ్ కనకాల కీలక రోల్స్ లో కనిపిస్తున్నారు.
May 07, 2026
Valathu Vashathe Kallan Review : వలతు వశతే కన్నన్ మూవీ రివ్యూ
మూవీ : వలతు వశతే కన్నన్ నటీనటులు: జోజూ జార్జ్, బిజూ మీనన్, లీనా, లియోనా లిశోయ్, వైష్ణవి రాజ్, నిరంజన అనూప్, షజూ శ్రీధర్ తదితరులు ఎడిటింగ్: వినాయక్ సినిమాటోగ్రఫీ: సతీష్ కురుప్ మ్యూజిక్: విష్ణు శ్యామ్ నిర్మాతలు: షాజీ నదేసన్ దర్శకత్వం: జీతు జోసెఫ్ ఓటీటీ : అమెజాన్ ప్రైమ్ వీడియో కథ : కేరళలోని ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐగా 'ఆంటోని' (బిజూ మీనన్) పనిచేస్తుంటాడు. అక్కడ ఉండే మురళి అనే రాజకీయనాయకుడు చెప్పినట్టుగా ఆంటోని నడుచుకుంటాడు. అందువలన మురళి కొడుకు 'రాజీవ్' చేసే తప్పులను కవర్ చేస్తుంటాడు ఆంటోని. అలాంటి వాటిలో 'దీప్తి' కేసు కూడా ఒకటి. అయితే రాజీవ్ తో చేరి తన కొడుకు 'ఫిలిప్' కూడా చెడిపోతున్నాడనే ఒక ఆందోళన ఆంటోనికి ఉంటుంది. ఈ విషయంలో అతను ఫిలిప్ ను ఎంతగా మందలించినా ప్రయోజనం లేకుండా పోతుంది. అయితే ఆ తరువాత ఓ నిర్జన ప్రదేశంలో శామ్యూల్ కూతురు డెడ్ బాడీ దొరుకుతుంది. దీప్తి కేసు విషయంలో తన కూతురు సీఐ ఆంటోనికి వ్యతిరేకంగా పనిచేస్తుందనే విషయం అప్పుడే శామ్యూల్ కి అర్థమవుతుంది. తన కూతురు చనిపోవడం వెనుక ఆంటోని హస్తం ఉండొచ్చని శామ్యుల్ అనుకుంటాడు. అప్పుడు శామ్యూల్ ఏం చేస్తాడు? అసలైన నేరస్థులు ఎవరనేది కనిపెడతాడా లేదా అనేది మిగతా కథ. విశ్లేషణ : క్రైమ్ థ్రిల్లర్ గా సాగే ఈ కథ స్క్రీన్ ప్లే బాగుంది. అయితే దృశ్యం సినిమా చూసిన వారికి ఇది కాపీ అనిపిస్తుంది. కానీ అది వేరే ఇది వేరే. ఈ సినిమాలో శామ్యూల్ తన కూతురు దారుణంగా హత్య చేయబడిందని తెలుసుకునేంత వరకూ కథ చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. ఆ తరువాత నుంచి కథ రొటీన్ గా మారిపోతుంది. శామ్యూల్ తనకి జరిగిన అన్యాయానికి ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడో అనే కుతూహలంతో ఉన్న ఆడియన్ కి రొటీన్ సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. దానితో పాటు గతంలో అమ్మాయిల మిస్సింగ్ వ్యవహారాలను తెరపైకి తీసుకురావడంతో మెయిన్ పాయింట్ గాడితప్పింది. అసలైన శామ్యూల్ హాస్పిటల్లో బెడ్ పై ఉంటాడు. ఆంటోని పోలీస్ స్టేషన్ కి పరిమితమవుతాడు. ఈ మధ్యలో మిగతా పోలీసుల హడావిడి తప్ప, ఆడియన్స్ ను కదిలించే సన్నివేశాలైతే కనిపించవు. అప్పటివరకూ ఆడియన్స్ కి పరిచయం లేని పాత్రల పేర్లు చెప్తూ ఆ కేసులను ఈ కేసుతో ముడిపెడుతూ అయోమయాన్ని కలిగించారు. ప్రథమార్ధంలో కొన్ని సీన్లు బాగున్నప్పటికి మధ్యలో సీన్లు మరీ చప్పగా సాగాయి. క్లైమాక్స్ పర్వాలేదనిపిస్తుంది. దృశ్యం సినిమా చూసినవారికి ఈ సినిమా స్క్రీన్ ప్లే ఈజీగా అర్థమవుతుంది. అది చూడనివారికి ఇది మంచి ఎంగేజింగ్ సినిమా అనిపిస్తుంది. అయితే కొన్ని సీన్లు స్లోగా సాగుతాయి. అడల్ట్ సీన్లు లేవు. అసభ్య పదజాలం వాడలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సతీశ్ కురుప్ సినిమాటోగ్రఫీ బాగుంది. విష్ణు శ్యామ్ మ్యూజిక్ ఒకే. వినాయక్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. నటీనటుల పనితీరు: జోజూ జార్జ్ - బిజూ మీనన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఈ సినిమాలో వీరిద్దరి పర్ఫామెన్స్ ది బెస్ట్ అనే చెప్పాలి. మిగతా వాళ్ళు తమ పాత్రల పరిధి మేర నటించారు. ఫైనల్ గా: క్రైమ్ థ్రిల్లర్ మూవీ లవర్స్ కి ఈ 'వలతు వశతే కన్నన్' నచ్చేస్తుంది. వన్ టైమ్ వాచెబుల్. రేటింగ్ : 2.25/ 5 ✍️. దాసరి మల్లేష్
May 07, 2026
Godari Gattupaina: 'గోదారి గట్టు పైన' టైటిల్ పెట్టడానికి మహేష్ బాబు కారణమా?
షార్ట్ ఫిలిం ప్రపంచం నుంచి వచ్చి సిల్వర్ స్క్రీన్ పై తనదైన ముద్ర వేయడానికి సిద్ధమయ్యారు దర్శకుడు సుభాష్ చంద్ర. అనన్య, ప్రియాంక జవాల్కర్ వంటి టాలెంటెడ్ హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు సుభాష్ చంద్ర, ఇప్పుడు 'గోదారి గట్టు పైన' (Godari Gattupaina) అనే అందమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సుమంత్ ప్రభాస్ హీరోగా, నిధి ప్రదీప్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం మే 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ 'తెలుగువన్ సినిమా'తో ముచ్చటిస్తూ ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. గోదారి గట్టు పైన.. పేరు వెనుక ఆంతర్యం సినిమా టైటిల్ గురించి దర్శకుడు సుభాష్ చంద్ర మాట్లాడుతూ, "గోదావరి గట్టు మీద నలుగురు స్నేహితులు సాయంత్రం వేళ కూర్చుని కబుర్లు చెప్పుకుంటే ఎంత హాయిగా ఉంటుందో, ఈ సినిమా కూడా ప్రేక్షకులకు అంతే చల్లని అనుభూతిని ఇస్తుంది" అని తెలిపారు. మహేష్ బాబు పాట ప్రభావం కన్నా, కథలోని సహజత్వమే ఈ టైటిల్ పెట్టడానికి ప్రధాన కారణమని ఆయన స్పష్టం చేశారు. కేవలం వినోదం మాత్రమే కాకుండా, ఒక స్వచ్ఛమైన భావోద్వేగపూరిత ప్రయాణాన్ని ఈ సినిమా అందిస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. హీరోయిన్ నిధి ప్రదీప్ మెమరీ పవర్ కి డైరెక్టర్ ఫిదా! తమిళ నేపథ్యం ఉన్నప్పటికీ, తెలుగు డైలాగులను నిధి ప్రదీప్ నేర్చుకున్న తీరు పట్ల దర్శకుడు ప్రశంసల వర్షం కురిపించారు. నిడివి ఎక్కువున్న డైలాగులను కూడా నిధి సింగిల్ టేక్లో చెప్పేదని, చివరకు పక్కన ఉన్న ఆర్టిస్టులు డైలాగ్ తప్పు చెబితే కూడా ఆమె కరెక్ట్ చేసేదని సుభాష్ గుర్తు చేసుకున్నారు. నిధి మాట్లాడుతూ, తన పాత్ర తండ్రి గౌరవానికి ప్రాణమిచ్చే ఒక బాధ్యతాయుతమైన అమ్మాయి అని, ప్రతి అమ్మాయి తన పాత్రకు కనెక్ట్ అవుతుందని ధీమా తెలిపారు. జగపతి బాబు, లైలా వంటి దిగ్గజాలతో.. ఈ సినిమాలో జగపతి బాబు మరియు లైలా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జగపతి బాబు పాత్ర గురించి చెబుతూ, సునీల్ నారాయణ్ గారు సూచించిన వెంటనే ఆయన ఈ కథలోకి వచ్చారని, చాలా నేచురల్ అండ్ హంబుల్ పాత్రలో ఆయన కనిపిస్తారని దర్శకుడు తెలిపారు. సీనియర్ నటుల రాకతో సినిమా స్థాయి మారిందని ఆయన పేర్కొన్నారు. "వేసవి కాలంలో ఒక చల్లని గాలిలా, అచ్చమైన తెలుగింటి భోజనం తిన్న తృప్తిని ఈ సినిమా ఇస్తుంది" అని సుభాష్ చంద్ర ముగించారు. తరుణ్ భాస్కర్, సుజిత్ వంటి తన స్నేహితుల ప్రోత్సాహం కూడా ఈ ప్రాజెక్ట్కు మెండుగా ఉందని ఆయన గుర్తు చేసుకున్నారు. మరి మే 8న థియేటర్లలో ఈ గోదావరి గట్టు పైన సాగే ప్రేమకథ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి! మరిన్ని ఆసక్తికర ఇంటర్వ్యూలు, సినిమా అప్డేట్స్ కోసం 'తెలుగువన్ సినిమా' (TeluguOne Cinema) ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.
May 07, 2026
VIjay: పీచే ముడ్.. విజయ్ పై ప్రకాష్ రాజ్ ఆసక్తికర ట్వీట్
వర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్(Praksh Raj)ఇటీవల విజయ్(VIjay)గెలుపుని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ సమాజం అపహాస్యంతో నిండిపోయింది. ఎవరకి ఓట్లు వేస్తున్నామో కూడా తెలియని పరిస్థితి. రాజకీయాలని అభిమానులు నడిపిస్తున్నారనే వ్యాఖ్యలు చేసాడు. సదరు వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో ప్రకాష్ రాజ్ నెక్స్ట్ విజయ్ గురించి ఎలాంటి మాటలు మాట్లాడతాడో అని అందరు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ గురించి మళ్ళీ మాట్లాడాడు. విజయ్ సిఎం అవ్వకుండా డిఎంకె, అన్నా డిఏంకె పార్టీలు ఒక్కటవుతాయనే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ విజయ్ చేత ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎందుకు జాప్యం జరుగుతుంది. విజయ్ అసెంబ్లీ సాక్షిగా తన బలాన్ని చూపించుకునే హక్కు ఉంది.అన్నిటికంటే విజయ్ కి ప్రజల మద్దతు ఉందని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసాడు. Also read: Sai Pallavi: ఏక్ దిన్ ప్లాప్ పై సాయి పల్లవి వ్యాఖ్యలు వైరల్.. అమీర్ ఖాన్ కి ఏమని చెప్పారు
May 07, 2026
Sai Pallavi: ఏక్ దిన్ ప్లాప్ పై సాయి పల్లవి వ్యాఖ్యలు వైరల్.. అమీర్ ఖాన్ కి ఏమని చెప్పారు
సాయి పల్లవి(Sai pallavi),అమీర్ ఖాన్(Aamir Khan)కుమారుడు జునైద్ ఖాన్(JUnaid Khan)ఈ నెల 1 న 'ఏక్ దిన్'(Ek Din)తో థియేటర్స్ ల్యాండ్ అయ్యారు. డిజాస్టర్ టాక్ ని తెచ్చుకోగా కనీస కల్లెక్షన్స్ కి కూడా రాబట్టలేకపోతుంది. ఈ విషయంపై ట్రేడ్ వర్గాల వారు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో ఈ చిత్రం పరాజయం గురించి సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ ప్రీమియర్ షో చూసిన తర్వాత 'ఏక్ దిన్ లోని క్యారక్టర్ కి సరిపోలేదని అనిపించింది. ఇదే విషయాన్నీ అమీర్ సార్ తో చెప్పాను. సదరు క్యారక్టర్ కి నన్ను కాకుండా చురుగ్గా, హుషారుగా ఉండే అమ్మాయిని ఎంపిక చేయాలసింది. అలాంటి నటి అయితే ఆ క్యారక్టర్ కి సరైన న్యాయం చేసే వాళ్ళని చెప్పానని చెప్పింది. ఇప్పుడు ఈ మాటలు సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి. ALso read: Nani: నాని ఫ్యాన్స్ కి నిరాశ.. ఆ అగ్ర హీరో ప్రాజెక్ట్ నే కారణమా! సాయి పల్లవి ప్రస్తుతం రామాయణలో సీతమ్మ తల్లిగా చేస్తున్న విషయం తెలిసిందే. ఏక్ దిన్ హిందీలో తొలి మూవీ. అమీర్ ఖాన్ నే నిర్మించగా సునీల్ పాండే దర్శకత్వం వహించాడు.
May 07, 2026
Peddi: 'పెద్ది' ఎడిట్ లాక్.. జూన్ 4 కాదు.. ముందుగానే బాక్సాఫీస్ విధ్వంసం!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) అభిమానులకు అదిరిపోయే వార్త. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi) షూటింగ్ పూర్తి చేసుకుని ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వేగం పెంచింది. తాజాగా ఈ సినిమా ఎడిటింగ్ వర్క్ పూర్తయినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. 'పెద్ది' సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. 1980ల నాటి ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ గ్రామీణ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో చరణ్ సరికొత్త లుక్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్ సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని పెంచగా.. తాజాగా సినిమా ఎడిటింగ్ లాక్ అయిందనే వార్త ఫ్యాన్స్లో జోష్ నింపింది. ఏ సినిమాకైనా ఎడిటింగ్ పూర్తవ్వడం అనేది కీలకమైన ఘట్టం. 'పెద్ది' చిత్రానికి సంబంధించి డైరెక్టర్ బుచ్చిబాబు, ఎడిటర్ నవీన్ నూలి అవుట్పుట్ విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా నిడివి, సీన్ల ఫ్లో అద్భుతంగా కుదిరిందని టాక్. ఇక కేవలం వీఎఫ్ఎక్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని సమాచారం. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం. చిత్ర యూనిట్ ప్రకటించిన ప్రకారం, జూన్ 4న 'పెద్ది' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. అంతకంటే ఒకరోజు ముందు అంటే జూన్ 3న ఓవర్సీస్ తో పాటు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో భారీ స్థాయిలో ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సమ్మర్ ఎండింగ్లో చరణ్ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం చరణ్ కెరీర్లోనే మైలురాయిగా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పక్కా లోకల్ కథను గ్లోబల్ స్థాయిలో ప్రెజెంట్ చేస్తున్న బుచ్చిబాబు, 'పెద్ది'తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. https://x.com/vriddhicinemas/status/2052277987257749764
May 07, 2026
Karthi: సైలెంట్గా కార్తీ తెలుగు మూవీ లాంచ్.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాకవుతారు!
తమిళ హీరో కార్తీ(Karthi)కి తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. విభిన్నమైన కథలను ఎంచుకోవడంలో ఆయన రూటే సెపరేటు. ఇప్పుడు ఆయన టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్(Kalyan Shankar)తో జతకట్టారు. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈరోజు హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది. సితార ఎంటర్టైన్మెంట్స్ (Sithara Entertainments), ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నేడు జరిగిన పూజా కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ముహూర్తపు షాట్కు క్లాప్ కొట్టి సినిమాను అధికారికంగా ప్రారంభించారు. ఈ సినిమాలో కార్తీ సరసన టాలెంటెడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. వీరిద్దరి ఫ్రెష్ కాంబినేషన్ ఈ సినిమాపై అంచనాలను పెంచుతోంది. 'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్' వంటి సినిమాలతో తనదైన కామెడీ టైమింగ్, టేకింగ్తో ఆకట్టుకున్న కళ్యాణ్ శంకర్, ఈసారి కార్తీ కోసం ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కార్తీ నటన, కళ్యాణ్ శంకర్ మార్క్ హ్యూమర్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద సందడి ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్కు వెళ్లనుంది. కార్తీ మార్కెట్, సితార బ్రాండ్ వాల్యూ తోడవ్వడంతో ఈ సినిమా ట్రేడ్ వర్గాల్లో అప్పుడే హాట్ టాపిక్గా మారింది. ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి.
May 07, 2026
Nani: నాని ఫ్యాన్స్ కి నిరాశ.. ఆ అగ్ర హీరో ప్రాజెక్ట్ నే కారణమా!
నాచురల్ స్టార్ నాని(Nani)ఓజి సుజీత్(Sujeeth)కాంబోలో 'బ్లడీ రోమియో'(Bloody Romeo)అనే ప్రాజెక్ట్ అధికారకంగా అనౌన్స్ మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అభిమానుల అంచనాలు ఒక రేంజ్ లో ఏర్పడ్డాయి. వాళ్ళ అంచనాలు అక్షర సత్యమనేలా మూవీ ప్రకటన రోజు వచ్చిన పోస్టర్ నిలిచింది. దీంతో త్వరగా ఈ చిత్రం షూటింగ్ ని పూర్తి చేసుకొని తమ ముందుకు రావాలని ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కానీ బ్లడీ రోమియోకి సంబంధించిన కీలక అప్డేట్ ఒకటి బయటకి వచ్చింది. అనుకోని కొన్ని కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడినట్లు సమాచారం. దీనికి ప్రధాన కారణం దర్శకుడు సుజీత్ తన పూర్తి సమయాన్ని 'OG' సిక్వెల్ పై కేటాయించడమేనని తెలుస్తోంది. ఆల్రెడీ స్క్రిప్ట్ పనులు వేగవంతంగా జరుగుతున్న్నాయని టాక్. 'OG'వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుని పూర్తి చేయడం సుజీత్కి అత్యంత కీలకంగా మారింది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ షెడ్యూల్స్ మధ్య షూటింగ్ని సకాలంలో పూర్తి చేయాలనే ఒత్తిడి ఉండటంతో బ్లడీ రోమియోని తాత్కాలికంగా పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్తున్నారు. పూర్తిగా 'OG' సిక్వెల్ పైకి మళ్లించడం వెనుక ఒక బలమైన ప్లాన్ ఉన్నట్లు అర్థమవుతోంది. మొదటి భాగం విడుదల కాకముందే రెండో భాగంపై కసరత్తులు మొదలుపెట్టడం సినిమా స్కేల్ని సూచిస్తుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా సుజీత్ మేకింగ్ స్టైల్ పై నమ్మకంతో ఉన్నారు. Also read: janu lyri: యూట్యూబ్ని షేక్ చేస్తున్న తెలంగాణ ఫోక్ సాంగ్.. మిలియన్ల వ్యూస్తో సెన్సేషన్ 'బ్లడీ రోమియో' వాయిదా పడటం నాని అభిమానులకి కొంత నిరాశ కలిగించవచ్చు. కానీ ఎప్పుడు వచ్చినా 'బ్లడీ రోమియో' బంపర్ ప్రాజెక్ట్ గా నిలవడంతో పాటు సూపర్ హిట్ అవ్వడం ఖాయం. నాని ప్రెజెంట్ ది పారడైజ్ తో బిజీగా ఉన్నాడు. ఆగస్టు 21 న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా లాంగ్వేజెస్ లో రిలీజ్ కానుంది.
May 07, 2026
Thimmarajupalli TV: ఓటీటీలోకి 'తిమ్మరాజుపల్లి టీవీ'.. మాయమైన ఆ టీవీ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి?
టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లో ఒక ఊరికి టీవీ రావడం అంటే అదొక పెద్ద పండుగ. అలాంటి ఒక ఆసక్తికరమైన పాయింట్ను తీసుకొని, దానికి సస్పెన్స్ ఎలిమెంట్ జోడించి తెరకెక్కించిన సినిమానే 'తిమ్మరాజుపల్లి టీవీ' (Thimmarajupalli TV). కిరణ్ అబ్బవరం సమర్పణలో, వి. మునిరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ థియేటర్లలో మంచి స్పందన పొంది, ఇప్పుడు 'ఆహా' వేదికగా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. కథా నేపథ్యం: ఈ కథ 1996వ సంవత్సరంలో తిమ్మరాజుపల్లి అనే ఒక మారుమూల గ్రామంలో సాగుతుంది. గ్రామస్తులంతా తలా కొంత డబ్బు వేసుకొని టీవీ కొనుక్కుంటారు. ఊరంతా కలిసి ఒకే చోట టీవీ చూడటం, ఆ వినోదాన్ని పంచుకోవడం ఒక ఎమోషన్. అయితే, అనూహ్యంగా ఆ టీవీ మాయమవుతుంది. ఆ దొంగతనం నింద ఒక వ్యక్తిపై పడుతుంది. అసలు టీవీని దొంగిలించింది ఎవరు? ఆ టీవీ వెనుక ఉన్న రహస్యాలేంటి? ఆ పల్లెటూరి అమాయకత్వంలో దాగి ఉన్న నిజం బయటపడిందా? అన్నదే ఈ సినిమా ప్రధానాంశం. సాయి తేజ్, వేదా జలంధర్, ప్రదీప్ కొట్టే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం అప్పటి పల్లెటూరి వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. దర్శకుడు మునిరాజు పల్లెటూరి యాసను, అక్కడి మనుషుల మధ్య ఉండే సంబంధాలను చాలా సహజంగా తెరకెక్కించారు. 90ల నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూనే, సెకండ్ హాఫ్లో వచ్చే సస్పెన్స్, ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. పల్లెటూరి కథలు, నోస్టాల్జియా, మిస్టరీ ఇష్టపడే వారికి 'తిమ్మరాజుపల్లి టీవీ' ఒక మంచి ఛాయిస్. ఈ సినిమా మే 15 నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. ఆహా గోల్డ్ సబ్స్క్రైబర్లు 24 గంటల ముందే ఈ చిత్రాన్ని వీక్షించే అవకాశం ఉంది. మరి 'తిమ్మరాజుపల్లి టీవీ' ఓటీటీలో ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి.
May 07, 2026
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com



