ఖాళీల భర్తీకి ఆదేశాలు.. ముందస్తు తొందరేనా?
Publish Date:Feb 6, 2023
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సర్కార్ పరిస్థితి ముందు చూస్తే గొయ్యి, వెనుక చూస్తే నుయ్యి అన్నట్లుగా తయారైంది. ఎన్నికలకు ఇంకా ఏడాది పైగా సమయమున్నా.. జగన్ సర్కార్ ఇప్పడో.. ఇహనో అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు వెళ్లాలని నిర్ణయం తీసేసుకుందా అన్నట్లుగా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి. అదే సమయంలో ముందస్తుకు వెళితే కొండ నాలుక్కి మందు వేస్తే ఉన్న నాలుక కూడా ఊడినట్లు అన్న చందంగా ముందుగానే అధికారం కోల్పోవలసి వస్తుందా అన్న సందేహమూ వైసీపీ ప్రభుత్వాన్నీ, పార్టీ ముఖ్యులనూ వెంటాడుతోంది.
అందుకే ఎటూ తేల్చుకోలేని స్థితిలో జగన్ పరిస్థితి తయారైంది. మహా కవి, శ్రీ శ్రీ సంధ్యా సమస్యలు,( ఆ సాయంత్రం...ఇటు చూస్తే అప్పులవాళ్లూ..అటు చూస్తే బిడ్డల ఆకలి.. ఉరిపోసుకు చనిపోవడమో..సముద్రమున పడిపోవడమో-..సమస్యగా ఘనీభవించిందొక సంసారికి) కవితను గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం కూడా సరిగ్గా అటువంటి సంకట స్థితినే ఎదుర్కొంటోంది. ముందస్తుకు వెళ్లకుంటే ఇప్పటికే దిగజారిన ప్రభుత్వ ప్రతిష్ట మరో ఏడాది కాలంలో అధమ స్థాయికి పడిపోయేలా ఉంది. అలాగని ముందస్తుకే వెళితే.. ఏప్పుడో ఏడాది తరువాత చేజారాల్సిన అధికారం అంతకంటే ముందే చేయి జారిపోతుంది. ఇప్పుడు ఏపీ సర్కార్ పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది. ముందస్తుకు వెళ్లుటయా? మానుటయా అన్న సందిగ్ధంతో పడి కొట్టుమిట్టాడుతోంది.
అందుకే.. ఒక వైపు ముందస్తుకు రెడీ అయిపోతూనే.. మరో వైపు వేచి చేద్దాం అన్నట్లుగా వ్యవమరిస్తోంది. అందుకే చూస్తే కదులుతున్న అధికార పీఠం.. ఇటు చూస్తే కమ్ముకొస్తున్న ప్రజా వ్యతిరేకత.. అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు వెళ్లడమా? వ్యతిరేకతను పట్టించుకోకుండా అధికారాన్నిపట్టుకు వేలాడుతూ మిగిలిన ఏడాది గడిపేయడమా? అన్నది జగన్ సర్కార్ కు ఎటూ తేల్చుకోలేని సందిగ్ధ పరిస్థితిని తీసుకు వచ్చింది. సరిగ్గా అదే సమయంలో మండల, డివిజన్ స్థాయిలో ఉన్న ఖాళీలన్నిటినీ వెంటనే భర్తీ చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశిస్తూ.. సీఎంవో కార్యాలయం నుంచి ఆదేశాలుజారీ అయ్యాయి. దీంతో జగన్ ముందస్తుకే మొగ్గు చూపుతున్నారని అంతా భావిస్తున్నారు. నిజానికి ముందస్తుకు వెళ్లినా, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగినా ఓటమి తథ్యమన్న భావనకు ఇప్పటికే వైసీపీ నేతలు వచ్చేశారనీ, అందుకే.. ముందస్తుకు వెళ్లడమా? షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు వచ్చే వరకూ ఆగటమా? అన్న సంశయంలో పడ్డారనీ అంటున్నారు.
మరో ఏడాదిన్నర ప్రభుత్వాన్ని నడపడం, అంటే షో రన్ చేయడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తుండటంతో ముఖ్యమంత్రి ముందస్తుకే మొగ్గు చూపుతున్నారని పార్టీ నేతలే చెబుతున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల అయితే.. జగన్ ఎప్పుడు అనుకుంటే అప్పుడే ఎన్నికలు జరుగుతాయని ముందస్తు విషయంలో బంతి జగన్ కోర్టులో ఉందని తేల్చేశారు.
ముందస్తు ఎన్నికలకు పోతే ముందుగానే ఇంటికి పోతామని సొంత పార్టీ ఎమ్మెల్యేలే హెచ్చరిస్తున్నారు. అలాగని షెడ్యూల్ దాకా అగుదామంటే..మొదటికే మోసం వచ్చేలా వుంది. అందుకే అధికార పార్టీ నేతలు ముందస్తు ఎన్నికల విషయంలో ఓ రోజు ఔననీ, మరో రోజు కాదనీ ఆల్ మోస్ట్ నిర్ణయం తీసుకోవడానికి రోజు హెడ్ అండ్ టెయిల్ వేసుకుని ఆ మేరకు రోజుకో విధంగా మాట్లాడుతోంది.
వాస్తవానికి ముందస్తు ఎన్నికల మాట ముందుగా వచ్చింది అధికార పార్టీ నేతల నుంచే. ఒక సారి కాదు ఒకటికి పది సార్లు జగన్ సర్కార్ లో సకల శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్న పలు మార్లు ముందస్తు ప్రస్తావన తీసుకు వచ్చారు. నిజానికి, ప్రతిపక్ష పార్టీలు, ముందస్తు ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వ్యూహాత్మకంగా తీసుకు వస్తున్న ముందస్తు చర్చను విపక్షాలే కాదు.. ప్రజలు కూడా పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు.
ముందస్తా కాదా అన్న విషయం పక్కన పెడితే ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని విపక్షాలతో పాటు జనం కూడా ఎదురు చూస్తున్నారు. ఈ విషయం స్పష్టంగా తెలిసినా వైసీపీ అగ్రనేతలు, ప్రభుత్వ పెద్దలూ మాత్రం తమను తాము మభ్యపెట్టుకోవడమే కాకుండా.. ప్రజలను కూడా మభ్య పెడదామని, పెట్టగలమని భావిస్తున్నారు. .అయితే, ఒకసారి ప్రజలు నిర్ణయానికి వచ్చిన తర్వాత ముందస్తు అయినా, కాకపోయినా ఫలితంలో పెద్ద తేడా ఉండదని పరిశీలకులు అంటున్నారు. అయినా ఇప్పుడు బంతి వైసీపీ కోర్టులోనే ఉందనీ, ముందస్తు అయినా కాకపోయినా ఫలితం ఏమిటన్నది ఇప్పటికే ఆ పార్టీకి అర్ధమైపోయందనీ అంటున్నారు.
పతనం అంచున పాకిస్థాన్ ఆర్ధిక పరిస్థితి!
Publish Date:Feb 6, 2023
సమావేశాల తర్వాత సంచలన నిర్ణయం ?
Publish Date:Feb 6, 2023
తెలంగాణ బడ్జెట్ 2023-24.. వ్యవసాయం, ఇరిగేషన్ కు పెద్ద పీట
Publish Date:Feb 6, 2023
ఫామ్హౌస్ కేసు విచారణ సీబీఐకే.. తేల్చి చెప్పిన హైకోర్టు
Publish Date:Feb 6, 2023
80 ఏళ్లకు గమ్యం చేరిన పెయింటింగ్!
Publish Date:Jun 19, 2022
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది.
అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది. ఆమెది నెదర్లాండ్స్. ఆమె తండ్రి నెదర్లాండ్స్లోని ఆర్నెహెమ్లో చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విషయానికి వస్తే.. అది 1683లో కాస్పర్ నెషర్ వేసిన స్టీవెన్ ఓల్టర్స్ పెయింటింగ్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆదేశాలను చార్లెట్ తండ్రి వ్యతిరేకించారు. ఆయన రహస్య జీవనం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్ని మాత్రం తన నగరంలోని ఒక బ్యాంక్లో భద్ర పరచమని ఇచ్చారట. 1940లో నాజీలు నెదర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద పడి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియలేదు. చిత్రంగా 1950ల్లో డసల్డార్ష్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రత్యక్షమయింది. 1969లో ఆమ్స్టర్డామ్లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాలరీలో వుందని చూసినవారు చెప్పారు. వేలంపాట తర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్ను 1971లో ఒక కళాపిపాసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.
మొత్తానికి వూహించని విధంగా ఎంతో కాలం దూరమయిన గొప్ప కళాఖండం తిరిగి తన వద్దకు చేరడంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే కదా.. పోయిందనుకున్న గొప్ప వస్తువు తిరిగి చేరితే ఆ ఆనందమే వేరు! అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్ను భద్రంగా చూసుకునే ఆసక్తి వున్నప్పటికీ శక్తి సామర్ధ్యాలు లేవు. అందుకనే త్వరలో ఎవరికయినా అమ్మేసీ వచ్చిన సొమ్మును పిల్లలకు పంచుదామనుకుంటోందిట! చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వున్నారు. అలాగే ఇరవై మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అందరం ఒకే కుటుంబం, చాలాకాలం తర్వాత ఇల్లు చేరిన కళాఖండం మా కుటుంబానిది అన్నది చార్లెటీ!
పవార్ సారథ్యంలో ప్రత్యామ్నాయ ఫ్రంట్?
Publish Date:Mar 17, 2021
బడ్జెట్ రెడీ సంక్షేమానికి పెద్ద పీట?
Publish Date:Mar 16, 2021
ప్రచారం ముగిసింది.. ఇక పోరాటం మిగిలింది..
Publish Date:Mar 12, 2021
నేనూ హిందువునే..! ఓట్ల కోసం నేతల నినాదం
Publish Date:Mar 10, 2021
చంద్రబాబుకు సీఐడీ నోటీసులు
Publish Date:Mar 15, 2021
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన సిఐడి అధికారులు..ఆయన నోటీసులు ఇచ్చారు. అమరావతి రాజధానిలో అసైన్డ్ భూములు కొనుగోలు అమ్మకాలపై చంద్రబాబుపై కేసు నమోదు అయింది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇచ్చిందని తెలుస్తోంది.
41సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారని చెబుతున్నారు. నోటీసులు ఇచ్చాక ఇన్వెస్టిగేషన్ కు పిలుస్తామని ఏపీ సీఐడీ అధికారులు చెబుతున్నారు. అమరావతి నుంచి రెండు సీఐడీ బృందాలు హైదరాబాద్ వెళ్లినట్లు తెలుస్తోంది.
చంద్రబాబుపై 120బి, 166, 167, 217 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రులుకూ సీఐడీ నోటీసులు అందాయి. 41 సీఆర్పీసీ కింద మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు జారీ చేసింది.
2 వేల నోటు ఇక ఉండదా!
Publish Date:Mar 15, 2021
బీజేపీ నోటాను బీట్ చేసింది...
Publish Date:Mar 15, 2021
స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఖర్చు 10 వేల కోట్లు!
Publish Date:Mar 15, 2021
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎన్నిక రద్దేనా..?
Publish Date:Mar 15, 2021
'జననాంగ వికృతీకరణ' సృష్టికి మూలాన్ని సమాధి చేస్తున్నారు!
Publish Date:Feb 5, 2023
ఈ ప్రపంచం సంగతి ఏమిటో కానీ.. ఈ దేశంలో మాత్రం స్త్రీకి సంబంధించిన కొన్ని విషయాలను మాట్లాడటానికి ఎంతో సంకోచిస్తారు. అలాంటి వాటిలో సెక్స్,స్త్రీ-పురుష జననేంద్రియాలు, వాటికి సంబంధించిన సమస్యలు. మనుషులను ఉద్రేకపరిచే కోరికలు మొదలైనవి ఎంతో ముఖ్యమైనవి. అయితే ఎన్నో వందల సంవత్సరాల నుండి స్త్రీ చాలా విషయాల్లో అణిచివేయబడుతోంది. ఈ సృష్టిలోకి ఓ మనిషి రావాలంటే స్త్రీ జననేంద్రియం దానికి కార్యక్షేత్రం. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే ప్రపంచం ఇన్ని మార్పులకు లోనైనా ఎన్నోచోట్ల ఇప్పటికీ స్త్రీల పట్ల చాలా దారుణాలు జరుగుతున్నాయి. వాటిలో స్త్రీ జననేంద్రియం మీద అధికారం, అణిచివేత కూడా ముఖ్యమైనది.
స్త్రీ జననేంద్రియ వికృతీకరణకు వ్యతిరేకంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 6న జీరో టాలరెన్స్ ఫిమేల్ జెనెటల్ మ్యుటిలేషన్ ను అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకుంటారు. మనం 21వ శతాబ్దంలో ఉన్నప్పటికీ, ఓ హింసాత్మక సంప్రదాయం ఇప్పటికీ ఉనికిలో ఉండటం చాలా కలవరపెడుతోంది. ఆఫ్రికా మరియు తూర్పు ఐరోపా నుండి అరబ్ దేశాలు, ఆసియా, లాటిన్ అమెరికా వరకు స్త్రీల జననేంద్రియాల పట్ల జరుగుతున్నవి చాలా దారుణమైనవి. బాహ్య స్త్రీ జననేంద్రియాలను తొలగించడం వేల సంవత్సరాల లింగ అసమానతలో ముఖ్యమైనదిగా ఉంది. ఇతరులు స్త్రీ యొక్క లైంగికత మరియు ఆనందాన్ని నియంత్రించడానికి దీనిని పాటిస్తారు. దీని గురించి ప్రపంచానికి సరైన అవగాహన కల్పించేందుకు ఫిబ్రవరి 6వ తేదీని స్త్రీ జననేంద్రియ వికృతీకరణకు జీరో టాలరెన్స్ డేగా ప్రకటించింది.
అసలు ఏమిటీ సమస్య.. ఎక్కడుంది ఈ ఆచారం??
స్త్రీ జననేంద్రియ వికృతీకరణ అనేది స్త్రీ జననేంద్రియాలను పూర్తిగా లేదా పాక్షికంగా తొలగించడం. మహిళల యోని భాగంలో క్లిటోరిస్ను కుట్టడం, కత్తిరించడం చాలా దేశాలలో పాటించే అలవాటు. ఇది మహిళల పట్ల దారుణమైన చర్య కలిగి ఉంది.
ప్రపంచం స్త్రీ జనాభా విషయంలో విఫలమవుతూనే ఉంది, దాదాపు 200 మిలియన్ల మంది బాలికలు, మహిళలు ఇప్పటి వరకు జననేంద్రియ వికృతీకరణకు గురయ్యారు, ఈ సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూనే ఉండటం దిగ్భ్రాంతికి గురిచేసే విషయం.
అయితే.. ఇది ఎక్కడ ఉద్భవించిందనే దానిపై చరిత్రకారులు స్పష్టత ఇవ్వనప్పటికీ ఇది చాలా కాలంగా ఉండటమే కాదు, ప్రపంచంలోని అనేక జాతి, తెగ ప్రజలు ఇప్పటికీ దీనిని పాటిస్తున్నారు. ఉప-సహారా, అరబ్ దేశాలలో స్త్రీ జననేంద్రియ వికృతీకరణ చేయడం చాలా సాధారణం.
దీని వల్ల కలుగుతున్న నష్టం ఏమిటి??
స్త్రీ జననేంద్రియ వికృతీకరణ కేవలం స్త్రీలను అణిచివేస్తున్న ఒక మార్గం మాత్రమే కాదు. ఇది చాలా పెద్ద అనారోగ్య సమస్యలు దారి తీస్తున్న అంశం. స్త్రీలలో, బాలికలలో లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ఇది తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. జననేంద్రియ వికృతీకరణకు గురైన స్త్రీలు ప్రసవానంతర రక్తస్రావం, పిండం మరణం, ప్రసవానికి ఆటంకం మొదలైన సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఎక్కువ ఉంది. ఇంకా మానసిక ప్రభావాలు చాలా దీర్ఘకాలం ఉంటాయి. వాటి తాలూకూ గాయాలు పిల్లలలో ప్రవర్తనా సమస్యలకు దారితీస్తుంది, మానసిక స్టైర్యాన్ని బలహీనపరిచి ఆందోళన, ఒత్తిడి పెరగడానికి కారణం అవుతాయి.
ఇన్నాళ్లు ఈ సమస్య ఇలా కొనసాగడానికి స్త్రీలలో భయమే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. అయా విషయాలు నోరు తెరచి మాట్లాడాలంటే స్త్రీలు చాలా భయాందోళనకు గురవుతారు. సమాజం కూడా అలాంటి విషయాలను బహిరంగంగా మాట్లాడకూడదు అనే ఒకానొక కట్టుబాటును విధించారు. దీనివల్ల స్త్రీల సమస్యను పరిష్కరించడం కూడా సవాలుగా మారింది.
2012 ఫిబ్రవరి 6న స్త్రీ జననేంద్రియ వికృతీకరణ కోసం జీరో టాలరెన్స్ అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రకటించింది. దీని గురించి అవగాహన కల్పించడం, స్త్రీలలో చైతన్యం తీసుకురావడం, స్త్రీలు ఈ సమస్య వల్ల పడుతున్న ఇబ్బందులను సమాజానికి వినిపించడం. మొత్తంగా స్త్రీలకు ఈ సమస్య నుండి విముక్తి కలిగించడం ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం.
◆నిశ్శబ్ద.
క్యాన్సర్ మీద యుద్ధానికి అస్త్రాలు ఇవే!
Publish Date:Feb 4, 2023
ఆశయానికి, అత్యాశకి తేడా గుర్తించడమెలా?
Publish Date:Feb 3, 2023
మీ బడ్జెట్ మీ చేతుల్లో ఉందా?
Publish Date:Feb 2, 2023
సి.పి బ్రౌన్ పుట్టింది మన దేశంలోనే అని మీకు తెలుసా?
Publish Date:Feb 1, 2023
పొట్టలో నీరు వల్ల ఇన్ని రోగాల రిస్క్ ఉందా?
Publish Date:Feb 7, 2023
ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య పొట్ట పెరగడం. దీన్నే అందరూ పొట్ట పడింది అంటూ ఉంటారు. కొందరికి పొట్టలో నీరు చేరుతుంది. పొట్టలో 12 లీటర్ల నీరు చేరితే తప్ప నీరు చేరినట్లు స్పష్టంగా కనబడదు. పొట్టలో నీరు చేరడాన్ని 'ఎసైటిస్' అంటారు. జీర్ణకోశం నుంచి లివర్ కి వెళ్ళే రక్తనాళాలకి ఏదైనా అడ్డంకి ఏర్పడితే పొట్టకి నీరు చేరడం అతి సహజం. ముఖ్యంగా లివర్ కుదించుకు పోయినప్పుడు (సిర్రోసిస్ లివర్) పొట్టకి నీరు చేరుతుంది.
గుండె పెరిగినప్పుడు, మూత్ర పిండాలు దెబ్బతిన్నప్పుడు పొట్టకి నీరు వస్తుంది. కడుపులో క్షయవ్యాధి, క్యాన్సర్, ఇతర వ్యాధులు వచ్చినప్పుడు కడుపుకి నీరు చేరడం సహజం. లివర్, పాన్ క్రియాస్, జీర్ణకోశం, గర్భకోశం, అండాశయాలకి టి. బి కేన్సర్ వచ్చినప్పుడు సాధారణంగా పొట్టకి నీరు చేరు తుంది.
కొందరికి పొట్టకి నీరు చేరడంతోపాటు కాళ్ళకి, ముఖానికి, శరీరం అంతటికీ కొద్దో గొప్పో వీరు వస్తుంది ఈ పరిస్థితిని'నెఫ్రొటెక్' సిండ్రోమ్' అనుకోవచ్చు. ముందుగా కాళ్ళకి వీరు కనిపించి, ఆ తరువాత పొట్టకి నీరు చేరడం అంటే గుండె పెరగడంవల్ల అని అనుమానించవచ్చు.
పొట్ట బానలాగా తయారై పొట్టకి విజరీతంగా నీరు మరి కొద్దిపాటి నీరు కాళ్ళకి వుంటే 'సిర్రోసిస్ లివర్' అనుకోవచ్చు. పొట్టకి నీరు చేరడమే కాకుండా పచ్చకామెర్లు (జాండిస్) కూడా వుంటే పోర్టల్ వెయిన్ ఆల్ స్ట్రక్షన్ అను కోవచ్చు. పోర్టర్ వెయిన్ అల్సక్షన్లో రక్తంలో ప్రోటీను శాతం బాగా తక్కువగా వుంటుంది.
ఏ సమస్య ఎలా ఉంటుంది??
సిర్రోసిస్ :- సిర్రోసిస్ లివర్ (లివర్డి స్యూ పూర్తిగా పాడై కుదించుకుపోవడం) ఉన్న వ్యక్తి అంతకు ముందు మధ్యం అతిగా సేవించడం జరిగి ఉండవచ్చు లేదా అంతకు ముందు ఏదైనా ఇన్ ఫెక్షను వచ్చి కాలేయం బాగా దెబ్బతిని ఉంటుంది. కొందరిలో అంతకు ముందు రక్తం వాంతి అవడం, విరోచనంలో నల్లగా రక్తం పోవడం, కామెర్లు రావడం ఉంటాయి. కోసిస్ పరిస్థితి ఉన్న వారి బుగ్గలు ఎరుపుగా వుంటాయి. బొడ్డు దగ్గర రక్తనాళాలు ఉబ్బి స్పష్టంగా కనబడతాయి. వికారం, ఆకలి లేకపోవడం వుంటాయి. కొందరిలో మొదట్లో లివర్ స్క్రీన్ పెరిగి కనబడటుంది. సిర్రోసిస్ లివర్ లో కొందరికి పచ్చ కామెర్లు ఉంటాయి.
మూత్రపిండాల వ్యాధి : మూత్రపిండాల వ్యాధి వల్ల పొట్టకి నీరు చేరటమేకాకుండా, ముఖానికి, కాళ్ళకి . నీరు చేరుతుంది. మూత్రంలో ఆల్బుమిన్ కనబడుతుంది. మైక్రోస్కోప్ పరీక్ష చేస్తే ఎపిథీలియల్ కాస్ట్స్ ఉంటాయి.
గుండెజబ్బు: గుండె పెరిగినప్పుడు సిరలన్నీ ఉబ్బుతాయి. మెడదగ్గర రక్తనాళాలు ఉబ్బి కనబడతాయి. కాలేయం ఉబ్బుతుంది. గుండె పెరిగినప్పుడు ముందు కాళ్ళకి, ఒంటికి నీరు కనబడి ఆ తరువాత పొట్టకి నీరు కనబడుతుంది. గుండె పెరగగా పొట్టకి నీరు చేరిన పరిస్థితిలో వ్యక్తి ఆయాసపడటం వుంటుంది.
'థాలస్ ఎసైటిస్' లో పొట్టలో చేరిన నీరు పాల లాగా కనబడుతుంది. నీరు పాలలాగా కనబడటానికి కడుపులో వున్న ప్రధాన ఎంఫాటిక్ నాళానికి అడ్డంకి ఏర్పడటం లేదా క్యాన్సర్ కణాలు చేరడం కారణం. బోదకాలు వున్న వారిలో కూడా బోద వ్యాధివల్ల పొట్టలో ఖైల్ చేరి నీరు పాలలా కనబడుతుంది.
ఇన్ని రకాల సమస్యలను మీరే డిసైడ్ చేసుకోకుండా వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.
◆నిశ్శబ్ద
పనస పండు తరచూ తింటే..!
Publish Date:Feb 6, 2023
క్యాన్సర్ అంటే ఏమిటి ?
Publish Date:Feb 4, 2023
అలసటకు కారణాలు!
Publish Date:Feb 3, 2023
నెయ్యి వాడితే వచ్చే పరిణామాలు ఇవే
Publish Date:Feb 2, 2023
కండ్ల ముందే ప్రపంచం.. కళ్లజోడు లోనే సమస్తం
Publish Date:Jul 17, 2020
సాంకేతిక రంగంలో మరో విప్లవానికి రిలయన్స్ సంస్థ తెరతీసింది. జియో ఇంటర్నెట్ తో లక్షలాది మంది వినియోగదారులను తన ఖాతాలో జమచేసుకున్న ఈ సంస్థ తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన జియో గ్లాసెస్ డిజిటల్ ప్రపంచాన్ని కొత్త కోణంలో చూపించబోతున్నాయి.
రిలయన్స్ సంస్థ 43న వార్షికోత్సవంలో జియో గ్లాస్ ను ఆవిష్కరించారు. ఈ కళ్లజోడుతో ఇప్పటివరకు అరచేతిలో ఇమిడిన ప్రపంచం ఇంక కంటి ముందు సాక్షాత్కరించబోతుంది.
కరోనా వ్యాప్తి కారణంగా ప్రపంచమంతా డిజిటలైజ్ అయ్యిన తరుణంలో ఆన్ లైన్ క్లాస్ లు, వీడియా కాన్ఫరెన్సులు, జూమ్ మీటింగ్ లు సగటు మనిషి జీవితంలో సాధారణమైన తరుణంలో ఈ జియో గ్లాస్ లు ఎంతో ఉపయోగకరంగా ఉండ బోతున్నాయి. అయితే వీటి ధరను మాత్రం ఇంకా ప్రకటించలేదు.
జియో గ్లాస్ ఫీచర్స్
- నల్లని రంగు..కాస్త మందంగా.. కూలింగ్ గ్లాసెస్ లను పోలిన వీటి బరువు కేవలం 75 గ్రాములు మాత్రమే.
- ఈ గ్లాసెస్ ద్వారా మన స్మార్ట్ ఫోన్ నుంచి 25 మిక్సిడ్ రియాలిటీ యాప్స్ పనిచేసేలా సెట్టింగ్ చేసుకోవచ్చు.
- ప్రత్యేకంగా పొందుపరిచిన 3 డి హోలో గ్రాఫిక్ డిజైన్ ద్వారా వర్చువల్ రియాల్జీలో మీటింగ్స్ నిర్వహించుకోవచ్చు.
- ఇందులో అమర్చిన సెన్సార్లు, హార్డ్ వేర్ అధునాతన టెక్నాలజీలో పనిచేస్తాయి. ఎక్స్ ఆర్ సౌండ్ సిస్టం ద్వారా ఎలాంటి కేబుల్ అటాచ్ మెంట్ లేకుండా మీకు ఇష్టమైన మ్యూజిక్ వినవచ్చు. ఆన్ లైన్ క్లాస్ లు వినవచ్చు. అన్ని రకాల ఆడియో ఫార్మెట్లను సపోర్ట్ చేసే టెక్నాలజీ ఇందులో ఉంది.
- హై రిజల్యూషన్ లో ఉండే డిస్ ప్లే ద్వారా గేమింగ్, షాపింగ్ ఎంజాయ్ చేయవచ్చు.
- ఇందులోని హోలా గ్రాఫిక్ వీడియో కాల్ ద్వారా పెద్ద స్క్రీన్ పై ప్రజెంటేషన్లు ఇవ్వచ్చు.
- అంతేకాదు 3డీ వర్చువల్ అవతార్, 2డి వర్చువల్ ఇంటరాక్షన్ ద్వారా కూడా మీకు కావల్సిన విధంగా ఈ కళ్లజోడు పనిచేస్తుంది.
- జియో మిక్స్ డ్ రియాలిటీ క్లౌడ్ అందుబాటులో ఉండటంతో ఆన్ లైన్ క్లాస్ లు నిర్వహించేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
- ప్రపంచాన్నిసుందరంగా చూపించగల టెక్నాలజీని ఈ కళ్లజోడుతో అందిస్తున్నారు.
విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, వ్యాపార వేత్తలు ఇలా అన్నిరంగాల వారికి ఉపయోగపడేలా ప్రపంచాన్ని అరచేతిలో నుంచి కండ్లముందుకు తీసుకువస్తున్నారు.
YouTube Premium and Music services launched in India, starts at Rs 99 per month
Publish Date:Mar 13, 2019
Your WhatsApp account will be deactivated if you use these apps
Publish Date:Mar 11, 2019
Best phones under 20,000 in 2019
Publish Date:Mar 9, 2019
Google introduces educational app Bolo to improve children’s literacy in India
Publish Date:Mar 6, 2019