political-news-img

మాజీ సీఎం కేసీఆర్‌కు మళ్లీ కోర్టు నోటీసులు.!

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు కోర్టు మళ్లీ నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కేసు విచారణకు సంబంధించి కేసీఆర్ కు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. గతంలో కోర్టు ద్వారా జారీ అయిన నోటీసులు కేసీఆర్‌కు సక్రమంగా చేరలేదని వెల్లడవ్వడంతో.. న్యాయస్థానం తాజాగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. గత విచారణల సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌కు పంపిన నోటీసులు ఆయనకు అందలేదని తేలడంపై న్యాయమూర్తి.. ఈసారి ఎలాంటి సాంకేతిక విఘాతాలు లేదా డెలివరీ సమస్యలు తలెత్తకుండా పక్కాగా నోటీసులు అందజేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. నోటీసుల జారీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, ప్రతివాదికి సమాచారం అందినట్లు రుజువులను న్యాయస్థానం ముందు ఉంచాన్నారు. పిటిషన్‌లో పేర్లు ఉన్న ప్రతివాదులందరికీ నోటీసులు సమర్పించాల్సిన బాధ్యతను సంబంధిత యంత్రాంగానికి కోర్టు అప్పగించింది. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో నాణ్యతా లోపాలు జరిగాయని, అలాగే నిధుల వినియోగంలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ గతంలో రాజలింగమూర్తి అనే వ్యక్తి భూపాలపల్లి జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన ఒక ప్రైవేట్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించి, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు సంబంధిత శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థలకు నోటీసులు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించింది. అయితే ఈ కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో పిటిషనర్ రాజలింగమూర్తి అనారోగ్యంతో మరణించారు. దీంతో పిటిషనర్ మృతి చెందడం వల్ల ఈ కేసు విచారణ ఆగిపోతుందా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. ఈ తరుణంలో ఈ అంశం తెలంగాణ హైకోర్టు దృష్టికి వెళ్లగా.. అత్యున్నత న్యాయస్థానం ఈ విషయంలో స్పష్టమైన తీర్పునిచ్చింది. ప్రజా ప్రయోజనాలు, ప్రాజెక్టు భద్రతతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి పిటిషనర్ మరణించినప్పటికీ కేసు విచారణను నిలిపివేయవద్దని, యథావిధిగా భూపాలపల్లి జిల్లా కోర్టులోనే కేసు విచారణను కొనసాగించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. Medigadda Barrage Case, KCR Notices, Bhupalpally Court, Kaleshwaram Project Controversy Telangana News, TeluguOne

Publish Date: Aug 12, 2026 6:40PM

political-news-img

విజయసాయి రెడ్డి కొత్త పార్టీ.. జగన్ ను బ్లాక్ మెయిల్ చేయడానికేనా?

వైసీపీ మాజీ నాయకుడు, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏపీ రాజకీయాల్లో మళ్లీ చర్చనీయాంశంగా మారారు. ఇటీవల రాజకీయాలకు కొంత దూరంగా ఉంటున్నట్లు సంకేతాలు ఇచ్చినప్పటికీ.. ఆయన అడుగులు మాత్రం రాజకీయంగా ఆయన వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నయని అనిపిం చకతప్పదు. దీనిపై ప్రముఖ విశ్లేషకుడు భరద్వాజ తెలుగువన్ న్యూస్ చానల్ లో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. హైదరాబాద్‌ ఫిలింనగర్ కేంద్రంగా కార్యాలయం ఏర్పాటు చేయడం, నూతన మీడియా సంస్థ స్థాపనకు యత్నాలు జరపడం ఆయన వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారన్న సంకేతాలేనన్నారు. తాజాగా భారత్ జన వికాస్ పేరిట ఆయన ఒక కొత్త జాతీయ పార్టీ ఆలోచన వెనుక వేరే వ్యూహం ఉందన్నారు. వైసీపీ అధినేత జగన్ పై ఒత్తిడి పెంచి, లేదా బ్లాక్ మెయిల్ చేసి పార్టీలో లేదా ఢిల్లీ నెట్‌వర్క్ బాధ్యతల్లో తిరిగి పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నమా అన్న అనుమానాన్ని భరద్వాజ వ్యక్తం చేశారు. ఢిల్లీ స్థాయిలో వైసీపీకి లైజనింగ్ బాధ్యతలు చూసే సరైన నేత అవసరం ఉన్నందున, జగన్ పిలుపు కోసం ఈ సంకేతాలు పంపుతున్నారని విశ్లేషించారు. కొత్త పార్టీ స్థాపన కాకుండా బిజెపి లేదా జనసేన వైపు విజయసాయి రెడ్డి అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయన్న భరద్వాజ.. జనసేనాని పవన్ కళ్యాణ్‌తో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా ఆ పార్టీలోకి వెళ్తారా లేక స్వతంత్రంగానే ఒక జాతీయ పార్టీకి నాయకత్వం వహిస్తారా అనేది చూడాల్సి ఉందన్నారు. మీడియా ఛానెల్ ఏర్పాటు ప్రక్రియ ద్వారా విజయసాయి, తనకంటూ ఒక వేదికను సిద్ధం చేసుకుంటున్నారన్నది వాస్తవమన్నారు. Vijayasai Reddy New Party, Bharat Jana Vikas, YSRCP AP Politics, Vijayasai Reddy News Channel, AP Politics, TeluguOne

Publish Date: Aug 12, 2026 6:13PM

political-news-img

జగన్ యూత్ గేమ్.. వ్యూహం ఏంటి?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవలవైసీపీ చేపడుతున్న యువజన, విద్యార్థి ఆందోళనలు చర్చనీయాంశంగా మారాయి. డీఎఎస్సీ నియామకాలు, స్పోర్ట్స్ కోటా వివాదాలపై వైసీపీ జెన్ జడ్ తరాన్ని అస్త్రంగా చేసుకుని సరికొత్త పోరాటానికి తెరలేపింది. ఈ క్రమంలో జగన్ రాజకీయ వ్యూహం కూటమి ప్రభుత్వానికి అర్థమవుతోందా అనే అంశంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఆంధ్రప్రదేశ్ మేధావుల వేదిక కన్వీనర్ చలసాని శ్రీనివాస్ తెలుగువన్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. వైసీపీ చేపట్టిన ఈ పోరాటం అభ్యర్థుల సమస్య కాదని, దీని వెనుక పెద్ద రాజకీయ వ్యూహం దాగి ఉందని అన్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న తరుణంలో, డీఎస్‌సీ, ఇతర నియామక ప్రక్రియల్లో ఏ చిన్న లోపం ఉన్నా దానిని రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకోవడంలో వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోందన్నారు. డీఎస్‌సీ స్పోర్ట్స్ కోటా మరియు నియామక ప్రక్రియలో జరుగుతున్నాయంటున్న ఆరోపణలను పాలక పక్షం తేలిగ్గా తీసిపారేయడం సరైన పద్ధతి కాదన్న చలసాని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఉన్నతాధికారులు సాంకేతిక వివరణలు ఇచ్చి ఊరుకోకుండా, ప్రజ లకు స్పష్టంగా అర్థమయ్యే రీతిలో పారదర్శక వివరణ ఇవ్వాలన్నారు. అలాగే.. ప్రతిపక్షం లేవనెత్తిన అనుమానాలను నివృత్తి చేసేందుకు అవసరమైతే స్వతంత్ర విచారణ కమిటీ, లేదా ప్రజా సంఘాలతో కూడిన విచారణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం ఏ తప్పూ చేయనప్పుడు విచారణకు వెనుకడాల్సిన అవసరం లేదని, తద్వారా ప్రభుత్వానికే మరింత విశ్వసనీయత పెరుగుతుందని విశ్లేషించారు. AP Politics, YSRCP Youth Strategy, Nara Lokesh, DSC Recruitment, Chalasani Srinivas Analysis, TeluguOne

Publish Date: Aug 12, 2026 5:59PM

political-news-img

ఏపీ అభివృద్ధి చిరునామా చంద్రబాబు.!

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాలనా నైపుణ్యం, దార్శనికతను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. నిజమైన విజనరీ చంద్రబాబు అన్న ఆమె.. ఏపీలో రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతికి ఆయనే నిజమైన చిరునామాగా అభివర్ణించారు. సాంకేతిక పరిజ్ఞానం, పాలనా సంస్కరణలు, మౌలిక వసతుల విస్తరణ వంటి కీలక రంగాల్లో చంద్రబాబు చూపుతున్న చొరవ, ఆయన దార్శనికత ఏపీని అభివృద్ధి పథం వైపు పరుగులు పెట్టిస్తోందన్నారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవల న్యూఢిల్లీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ ప్రత్యేక సమావేశంలో అప్పలనాయుడు అమరావతి నగర ప్రణాళికలు, విశేషాలతో రూపొందించిన కాఫీ టేబుల్ పుస్తకాన్ని రాష్ట్రపతికి అందజేశారు. ఆ పుస్తకంలో రాజధాని నమూనాలు, నిర్మాణాలు, అమరావతి నగర ప్రణాళికల వివరాలను రాష్ట్రపతి ఎంతో ఆసక్తితో తిలకించారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం.. రాష్ట్రలో ఐటీ , పారిశ్రామిక పురోగతి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పడుతున్న శ్రమను రాష్ట్రపతి ముర్ము ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రశంసించారు. తన దార్శనికతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే శక్తిమంతమైన నాయకత్వం చంద్రబాబు సొంతమన్న ముర్ము..టెక్నాలజీని పాలనకు అనుసంధానించడంలో ఆయన చూపుతున్న చొరవ రాష్ట్ర భవిష్యత్తుకు మేలు చేస్తుందన్నారు. Chandrababu Visionary Leader, President Draupadi Murmu, Kalisetty Appalanaidu, Amaravati Coffee Table Book, Andhra Pradesh Development

Publish Date: Aug 12, 2026 5:35PM

political-news-img

అంబటి సహా 17 మంది వైసీపీ నేతలపై కేసు.!

గుంటూరు అరండల్ పేట పోలీసు స్టేషన్ లో వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ఆయనతో పాటు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ నూరి ఫాతిమా సహా 17 మంది నాయకులు, పలువురు వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 10వ తేదీన గుంటూరు శంకరవిలాస్ సెంటర్ నుంచి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వరకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు మెగా డీఎస్సీ నియామకాల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిరుద్యోగ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శిస్తూ చేపట్టిన ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడం కూడదని స్పష్టం చేశారు. అంతే కాకుండా గుంటూరు నగరంలో సెక్షన్ 30 అమలులో ఉన్నందున ఎటువంటి ప్రదర్శనలకూ అనుమతి లేదని పేర్కొంటూ.. నిరసన కార్యక్రమాన్ని నిలిపివేయాలని పోలీసులు స్పష్టం చేశారు. అయితే వైసీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగి రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది, దీంతో అరండల్ పేట పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు ప్రజా రవాణాకు అడ్డంకులు సృష్టించడం, పోలీసుల అధికారిక ఆదేశాలను ఉల్లంఘించడం, అనుమతి లేకుండా నిరసనలు చేపట్టడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించడం వంటి నేరాల కింద ఈ కేసు నమోదు చేశారు. Ambati Rambabu, police Case Guntur, Modugula Venugopal Reddy, YSRCP Leaders, Mega DSC Protest, Guntur Rally

Publish Date: Aug 12, 2026 5:20PM

political-news-img

ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు బెయిలు కావాలట.!

కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన కేసులో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తాజాగా రాజమంత్రి ప్రత్యేక కోర్టులో బెయిలు పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అయితే ఆ పిటిషన్ లో ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ వర్షా కాల సమావేశాలలో ప్రజా సమస్యలపై గళం వినిపించడానికి తనకు బెయిలు మంజూరు చేయాలని కోరడం ఇప్పుడు రాజకీయవర్గాలలోనే కాకుండా జన బాహుల్యంలో కూడా హాట్ టాపిక్ గా మారింది. శాసనమండలి, శాసనసభ సమావేశాలు ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో, ప్రజా సమస్యలపై మాట్లాడటానికి, తన నియోజకవర్గ ప్రజల తరఫున గళం విప్పడానికి తనకు బెయిల్ మంజూరు చేయాలని అనంతబాబు తన బెయిల్ పిటిషన్ లో అభ్యర్థించారు, డిసెంబర్ 2021 నుంచి ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అనంత బాబు.. గతంలో సభలో ప్రజా సమస్యలపై ఎంతవరకు గళమెత్తారనే విషయాన్ని పక్కనబెడితే.. ప్రస్తుతం ఆయన వినిపిస్తున్న వాదన విమర్శలకు దారితీస్తోంది. అసెంబ్లీలో ప్రజా సమస్యలు ప్రస్తావించడానికే బెయిల్ కావాలని ఆయన అడుగుతుంటే.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నవైసీపీ శాసనసభ సమావేశాలను బహిష్కరించింది. ఒకవైపు పార్టీ మొత్తం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తే.. మరొ వైపు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంత బాబు మాత్రం ప్రజా సమస్యల సభలో గళమెత్తుతానంటూ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం నెట్టింట తెగ ట్రోల్ అవుతోంది. కేవలం జైలు నుంచి బయటకు రావడం కోసమే ప్రజా సమస్యల నెపంతో బెయిల్ డ్రామాలు ఆడుతున్నారంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీగా అనంతబాబు మండలిలో గళమెత్తిన సందర్భాలు దాదాపు మృగ్యమని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. కారు డ్రైవర్ ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి సభలో ప్రజా సమస్యలపై ఏం మాట్లాడుతారని నిలదీస్తున్నారు. మొత్తం మీద అనంతబాబు బెయిలు పిటిషన్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. ఆయన బెయిలు దరఖాస్తుపై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమౌతోంది. MLC Anantha Babu Bail Petition, YCP Assembly Boycott, Rajahmundry Central Jail, Raise Public Issues, Sasanamandali, Dead Body, Door Delivary

Publish Date: Aug 12, 2026 4:38PM

MOVIE NEWS