Top Stories

political-news-img

గోదావరి పుష్కర ఏర్పాట్లపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమీక్ష.!

దక్షిణది కుంభమేళాగా చెప్పుకునే గోదావరి పుష్కరాల నిర్వహణ, ఏర్పాట్లపై తెలంగాణ సర్కార్ దృష్టి సారించింది. పుష్కరాల నిర్వహణ పకడ్బందీగా ఉండాలనీ, పుష్కర స్నాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ఏర్పాట్లు చేయాలనీ నిర్ణయించింది. అలాగే పుష్కరాల సందర్భంగా రాష్ట్ర సాంస్కృతిక విశిష్టత, తెలంగాణ బ్రాండ్ ప్రతిబింబించేలా గోదావరి పుష్కరాల నిర్వహణకు తెలంగాణ సర్కార్ సమాయత్తమౌతోంది. ఇందులో భాగంగా సచివాలయంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ గురువారం సమవేశమై ఏర్పాట్లపై సమీక్ష జరిపింది. గోదావరి నది తీరప్రాంతాలు.. బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న అన్ని చారిత్రక, ప్రాచీన దేవాలయాల శాశ్వత అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని కేబినెట్ సబ్ కమిటీ ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలు, ఘాట్ల నిర్మాణం, రవాణా, పారిశుద్ధ్యం, భద్రత ఏర్పాట్లపై చర్చించింది. కేబినెట్ సభ్ కమిటీలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి ఉన్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా తెలంగాణతో పాటు దేశ, విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. Godavari Pushkaralu, Telangana Cabinet Sub Committee, Sridhar Babu, Basara to Bhadrachalam, Telangana News, TelugiOne

Publish Date: Aug 14, 2026 12:20PM

political-news-img

సీడ్ యాక్సెస్ రోడ్డులో ఎస్ కర్వ్..రాజకీయం వద్దు విషయమిదీ.!

ఏపీ రాజధాని అమరావతికి అత్యంత కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గురువారం (ఆగస్టు 13) ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాజధాని రాకపోకలకు, రవాణా వ్యవస్థకు వెన్నుముక అయిన ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు విషయంలో ఒకచోట ఉన్న ఎస్ ఆకారంలోని కర్వ్ పై విమర్శలు వస్తున్నాయి. దీనిపై వివరణ ఇచ్చింది. అత్యంత కీలకమైన #యాక్సెస్ రోడ్డులో ఎస్ కర్వ్ ఏంటంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగం పెద్ద ఎత్తున విమర్శల దాడికి దిగింది. ధనవంతులు, పలుకుబడి ఉన్న వ్యక్తుల భూములు, ఆస్తులను భూసేకరణ నుండి కాపాడేందుకే యాక్సెస్ రోడ్డును నిబంధలకు విరుద్ధంగా నిర్మించారనీ, ప్రధాన రహదారిలో ఎస్ కర్వ్ ఎందుకు వచ్చిందంటూ ప్రశ్నలు సంధిస్తూ సందేహాలను ప్రేరేపించే ప్రయత్నం వైసీపీ సోషల్ మీడియా ఓ రేంజ్ లో చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిజానిజాలతో వివరణ ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. రాజధాని మాస్టర్ ప్లాన్, భవిష్యత్తు అవసరాలను పరిగణనలోకి తీసుకునే ఈ డిజైన్ రూపొందించినట్లు స్పష్టం చేసింది. సీడ్ యాక్సెస్ రోడ్డు మూడో విడత విస్తరణలో భాగంగా #మణిపాల్ హాస్పిటల్ సమీపంలో విజయవాడ, చెన్నై జాతీయ రహదారికి ఈ రోడ్డును అనుసంధానించేందుకు ఒక కారిడార్‌ ఏర్పాటు కానుందనీ, భవిష్యత్తులో రాబోయే ఈ కారిడార్ అవసరాలు, భూభౌగోళిక పరిస్థితులు, వాహనాల రద్దీ నిర్వహణను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రాథమిక లక్ష్యం రాజధాని నగరానికి మంగళగిరి, విజయవాడ ప్రాంతాలతో సులువైన అనుసంధానాన్ని కల్పించడమేనని స్పష్టం చేసిన ప్రభుత్వం.. కరకట్ట రహదారిపై రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీని తగ్గించడం కూడా ఈ ప్రాజెక్టు ఉద్దేశమని వెల్లడించింది. రాబోయే దశాబ్దాల రవాణా అవసరాలను తీర్చడానికి తగిన భద్రతా ప్రమాణాలు పాటించి డిజైన్ చేశామనీ, అందువల్ల సీడ్ యాక్సెస్ రోడ్డుపై ఉన్న #ఎస్ కర్వ్ మలుపులను రాజకీయ కోణంలో కాకుండా.. భవిష్యత్ ట్రాఫిక్ కనెక్టివిటీ, మాస్టర్ ప్లాన్ విస్తరణలో భాగంగానే చూడాలని ఆ ప్రకటనలో పేర్కొంది. Amaravati Seed Access Road, S Curve, Chandrababu Naidu, CMCBN, Government, Clarification, Capital Connectivity

Publish Date: Aug 14, 2026 11:56AM

political-news-img

సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి పవన్ ఎందుకు గైర్హాజరయ్యారో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం (ఆగస్టు 13) ప్రారంభించారు. ఈ సందర్భంగా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస గృహాల తాళం చెవులను సీఆర్డీఏ అధికారులు సీఎంకు అధికారికంగా అందజేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ రెండు కార్యక్రమాలు అమరావతి పునర్నిర్మాణంలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే.. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి కీలక ఈవెంట్‌లోనూ ముందు వరుసలో ఉండే ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి గైర్హాజరు కావడంపై చర్చ జరుగుతోంది. దీనిని కూటమి పార్టీల మధ్య విభేదాలుగా వైసీపీ సోషల్ మీడియా కలరింగ్ ఇచ్చి ఓ రేంజ్ లో వైరల్ చేస్తోంది. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీతో తెగదెంపులు చేసుకోవాల్సి వస్తే ఆప్షన్లు తెరిచి ఉంచుకోవడానికే పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగా అమరావతి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారంటై వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున పోస్టులు షేర్ చేయడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో.. పవన్ కల్యాణ్ సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కాకపోవడానికి కారణాలు ఫ్యాక్ట్ చెక్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ ను రాష్ట్ర మంత్రి నారాయణ స్వయంగా మంగళగిరిలోని ఆయన క్యాంపు కార్యాలయానికి వెళ్లి మరీ ఆహ్వానించారు. అయితే సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవం రోజునే.. పవన్ కల్యాణ్ కు అంతకు ముందే నిర్ణయమైన పర్యటన ఖారరై ఉండటంతో రావడం లేదని పొంగూరు నారాయణకు పవన్ కల్యాణ్ చెప్పారు. ఆగస్టు 12 ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా విశాఖలో నిర్వహించే వేడుకలలో పాల్గొనేందుకు ముందుగానే షెడ్యూల్ ఖరారైంది. అటవీ శాఖ మంత్రిగా పవన్ ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. ఈ కాకర్యక్రమానికి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఢిల్లీ నుంచి వస్తుండటంతో..పవన్ తన పర్యటన రద్దు చేసుకోలేకపోయారు. కేంద్ర మంత్రిని తాను స్వయంగా ఆహ్వానించాననీ, అందుకే తప్పని సరిగా హాజరుకావాలని పవన్ ఈ సందర్భంగా మంత్రి నారాయణకు వింరించారు. అంటే ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ఉండటం వల్లనే పవన్ సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పేరు ప్రత్యేకంగా ప్రశంసించి అమరావతి నిర్మాణంలో ఆయన పాత్రను ప్రశంసించారు. దీనిని బట్టి తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఇద్దరు అగ్రనేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ప్రభుత్వ నిర్వహణ సమన్వయంతో సాగుతోందని తేటతెల్లమైంది. తెలుగుదేశం, జనసేనల మధ్య విభేదాలు ఏర్పడి ఇరు పార్టీలూ విడిపోతే తప్ప రాజకీయంగా తమ మనుగడ కష్టమన్న భావనతోనే వైసీపీ ఇలా లేని విషయాలను కూడా వివాదాస్పదం చేస్తూ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. Pawan Kalyan Amaravati event, Seed Access Road Amaravati, Chandrababu Naidu, Narayana Minister, World Elephant Day Visakhapatnam, TDP Janasena Alliance

Publish Date: Aug 14, 2026 11:43AM

political-news-img

ఇరాన్ తో యుద్ధంలో అమెరికాకు చావుదెబ్బ.!

ఇరాన్ తో యుద్ధం అమెరికాకు కొరివితో తలగోక్కున్న చందంగా మారిందా? ఈ యుద్ధం అమెరికా సైనిక బలహీనతలను ప్రపంచానికి చాటిందా? అన్నిటికీ మించి భారీ ఆర్థిక, ఆయుధ నష్టాన్ని మిగిల్చిందా అంటే.. అమెరికాకే చెందిన ప్రముఖ వార్తా పత్రిక వాషింగ్టన్ పోస్టు ఔననే అంటోంది. ఈ పత్రికలో వచ్చిన ప్రత్యేక కథనం మేరకు అమెరికా సైనిక పాటవానికి, అత్యాధునిక నిఘా సాంకేతికతకు నిదర్శనంగా నిలిచే శక్తిమంతమైన ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ వ్యవస్థపై ఇరాన్ దాడి తీవ్ర ప్రభావాన్ని చూపింది. అమెరికా వద్ద ఉన్న మొత్తం రీపర్ డ్రోన్ల బలగంలో 25 శాతం డ్రోన్లు ధ్వంసమయ్యాయి. యుద్ధక్షేత్రంలో ఇప్పటివరకు అమెరికా దాదాపు 45 రీపర్ డ్రోన్లను శాశ్వతంగా కోల్పోవడం వల్ల ఆ దేశ సైనిక, రక్షణ వ్యూహాలకు భారీ గండి పడింది. అంతే కాదు ఇది అమెరికా ఖజానాపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఒక్కో ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ విలువ దానిలో అమర్చే హైటెక్ సెన్సార్లు, ఆయుధాల స్థాయిని బట్టి దాదాపు 50 మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. ఈ లెక్కన ధ్వంసమైన 45 డ్రోన్ల మొత్తం విలువ సుమారు 1.3 బిలియన్ డాలర్లకు పైగానే ఉంటుందని వాషింగ్టన్ పోస్టు అంచనా వేసింది. అగ్రరాజ్యం గర్వంగా చెప్పుకునే ఈ డ్రోన్లను ఇరాన్ అతి సునాయాసంగా ఇరాన్ ముందు ఎందుకు బోల్తా పడుతున్నాయనే దానిపై రక్షణ రంగ విశ్లేషకులు ఈ రీపర్ డ్రోన్లు చాలా నెమ్మదిగా, తక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల ఇరాన్ ఉపయోగిస్తున్న ఎయిర్ డిఫెన్స్ క్షిపణులకు సులభమైన లక్ష్యాలుగా మారుతున్నాయంటున్నారు. కేవలం క్షిపణి దాడులతో పాటు సాంకేతిక లోపాలు, కమ్యూనికేషన్ సిగ్నల్స్ కట్ అవ్వడం వల్ల కూడా కొన్ని డ్రోన్లు కూలిపోయాయి. ఇక మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ జరిపిన మెరుపు దాడుల్లో నేలపై సిద్ధంగా ఉన్న కొన్ని డ్రోన్లు పూర్తిగా నాశనమయ్యాయి. ఈ తీవ్ర నష్టంతో అమెరికా వద్ద ఉన్న డ్రోన్ల నిల్వ ఆందోళనకర స్థాయికి పడిపోయింది. యుద్ధానికి ముందు అమెరికా వైమానిక దళం, మెరైన్ కోర్ప్స్ వద్ద మొత్తం 185 రీపర్ డ్రోన్లు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 135కు పడిపోయిందని ఎయిర్‌ఫోర్స్ లెఫ్టినెంట్ జనరల్ డేవిడ్ టాబోర్ యుఎస్ సెనెట్‌లో అంగీకరించారు. US Iran Conflict, Iran America War, MQ-9 Reaper Drones, US Drone Losses, Pentagon News, TeluguOne

Publish Date: Aug 14, 2026 11:13AM

political-news-img

ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి.. కుల రాజకీయాలకు తెరలేపిన జగన్.!

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫస్ట్రేషన్ లో ఉన్నారా? ఆ కారణంగానే కుల రాజకీయాలకు తెరలేపి రాజకీయ లబ్ఢి పాందాలని ప్రయత్నిస్తున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. రాష్ట్రంలో ప్రగతి పరుగులు తీస్తుండటం, మెగా డీఎస్సీలో అక్రమాలు, అవకతవకలు అంటూ తన పిలుపు మేరకు వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసనలకు ప్రజల నుంచి స్పందన కరవవ్వడంతో జగన్ లో ఫస్ల్రేషన్ పీక్స్ కు చేరిందని అంటున్నారు. అందుకే ఆయన కుల రాజకీయాలకు తెరలేపి లబ్థి కోసం అర్రులు చాస్తున్నారని చెబుతున్నారు. అయితే.. ఆయన వ్యూహాలు, వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ముఖ్యంగా గతంలో తాను అధికారంలో ఉన్న సమయంలో వైసీపీకి చెందిన కొందరు నాయకులు, ప్రజాప్రతినిధులు ఆరోపణలు, అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు అప్పట్లోనే వెల్లువెత్తాయి. స్వయంగా జగన్ పైనే మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు అన్న ఆరోపణలు ఉన్నాయి. 2024 ఎన్నికలలో విజయం సాధించి చంద్రబాబు నేతృత్వంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. చట్టబద్ధమైన చర్యల్లో భాగంగా పోలీసులు జగన్ హయాంలో అక్రమాలు, అవినీతికి పాల్పడిన కేసుల వచారణను వేగవంతం చేశారు. ఈ క్రమంలో అరెస్టులు జరుగుతున్నాయి. అయితే ఈ అరెస్టులు, న్యాయపరమైన చర్యలు జగన్ లో అసహనాన్ని పెంచుతున్నాయని అంటున్నారు. పార్టీ నేతలకు మద్దతుగా మాట్లాడే క్రమంలో జగన్ హద్దు మీరుతున్నారన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి అరెస్టుల విషయంలో జగన్ కుల రాజకీయాలకు తెరలేపుతున్నారంటున్నారు. తాజాగా కర్నూలు జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న వైసీపీ నేత విరూపాక్షిని జగన్ పరామర్శించారు. తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులపై దాడి చేశారనే ఆరోపణలతో పాటు దానికి సంబంధించిన దృశ్యాలు రికార్డై బయటకు వచ్చిన నేపథ్యంలో విరూపాక్షపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు. ఈ నేపథ్యంలో జగన్ కర్నాలు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విరూపాక్షను ములాఖత్ ద్వారా కలిసి పరామర్శించారు. అనంతరం జైలు బయట జగన్ మీడియా సమావేశంలో చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం బలహీన వర్గాలను, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను అణచివేస్తోందంటూ విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. నేరాలకు పాల్పడిన వారు అరెస్టైతే.. కులం పేరెత్తడమేంటని నెటిజనులు జగన్ వ్యాఖ్యలపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. వీడియో ఆధారాలతో సహా ప్రత్యక్షంగా నేరానికి పాల్పడినట్లు కనిపించిన సంఘటనల్లో నేరస్థులను వెనకేసుకు రావడానికి కులం కార్డు ఉపయోగించడం సరి కాదని విమర్శిస్తున్నారు. ఒక వ్యక్తి నేరం చేశాడా లేదా అనేదే చట్టం ముందు ముఖ్యమని, కులాన్ని ఆధారం చేసుకుని నేరారోపణలు ఎదుర్కొంటున్న వారికి మద్దతుగా నిలవడం సరి కాదనీ అంటున్నారు. . గతంలో వైకాపా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విషయంలో కూడా జగన్ ఇదే తీరున వ్యవహరించిన సంగతి గుర్తు చేస్తున్నారు. Kurnool Jail, Virupakshi, Seediri Appalaraju, Andhra Pradesh politics, NDA government, TeluguOne News, Jagan casterelated remarks

Publish Date: Aug 14, 2026 10:25AM

political-news-img

ఉత్తరాఖండ్ లో విషాదం.. కొండచరియలు విరిగి పడి ఏడుగురు దుర్మరణం.!

ఉత్తరాఘండ్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న జలవిద్యుత్ ప్రాజెక్టు టన్నెల్‌లో కొండచరియలు విరిగిపడి ఏడుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఆరుగురు గల్లంతయ్యారు. గురువారం (ఆగస్టు 13) రాత్రి ఏడుగంటల సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది. తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిర్మిస్తున్న విష్ణుగడ్-పీపల్‌కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు టన్నెల్‌లో కార్మికులు పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో టన్నెల్ పైభాగం నుంచి భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. క్షణాల వ్యవధిలోనే కొండచరియలతో పాటు కొండపై నుంచి భారీగా బురద, నీరు టన్నెల్ లోపలికి వేగంగా దూసుకొచ్చాయి. ఘటన జరిగిన సమయంలో టన్నెల్ లో 22 మంది కార్మికులు పనిచేస్తున్నారు. నీరు, బురద వేగంగా రావడం, మార్గం మూసుకుపోవడంతో కార్మికులు బయటకు రాలేక లోపలే చిక్కుకుపోయారు. సమాచారం అందుకోగానే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ), ఇండియన్ ఆర్మీ, ఐటీబీపీ బలగాలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. ఏడుగురు కార్మికుల మృతదేహాలను వెలికి తీశారు. అలాగే తీవ్రంగా గాయపడిన తొమ్మండుగురిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. టన్నెల్ లోపలే మరో ఆరుగురు కార్మికులు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డెహ్రాడూన్‌లోని కంట్రోల్ రూమ్ నుండి స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. Uttarakhand Tunnel Accident, Chamoli Landslide, Vishnugad Pipalkoti Hydroelectric Project, Tunnel Collapse, NDRF Rescue Operation, TeluguOne

Publish Date: Aug 14, 2026 9:54AM

MOVIE NEWS