మూడ్‌కి ఆహారానికి సంబంధం ఏమిటి?

మనిషి ఒక్కో సారి ఒక్కో మూడ్ లో ఉంటాడు. గురువుగారు మంచి  మూడ్ లో ఉన్నారు. లేదా మూడ్ బాగాలేదు అని సహజంగా వింటూ ఉంటాం.అయితే వ్యక్తి మూడ్ లో ఉండాలంటే  ఆహారమే కీలకం అని అంటున్నారు నిపుణులు. మనిషిని మూడ్ లో ఉంచేది అవుట్ అఫ్ మూడ్ కు తీసుకు పోయేది ఆహారమే అంటున్నారు. మన మూడ్ ను సరి చేసేది మనం తీసుకునే ఆహారామే అంటున్నారు నిపుణులు. అసలు ఆహారానికి మూడ్ కు సంబంధం ఏమిటి?అన్నదే ప్రశ్న? మీరు ఎప్పుడైనా ఆకలిగా ఉందని భావించారా? ఉదయం కాని,సాయంత్రం కాని,రాత్రి కాని  ఆకలి వేసి ఉండవచ్చు.అసలు మనిషికి ఆకలి లేని వారు అంటూ ఉండరు. చివరి సారి మీరు ఏమి తిన్నారు?అన్న విషయం చాలా ఆసక్తిగా ఆలోచిస్తారు.? అలా అనిపించడానికి చాలా కారణాలు ఉన్నాయి,అవి పాస్తా,కావచ్చు,కేక్ కావచ్చు,క్యాండి  కావచ్చు.క్యాండీ మిమ్మల్ని ఎప్పుడూ మూడ్ లో ఉంచదు.అయితే మీ ఒక్కరేకాదు. ఒక పరిశోదన ప్రకారం కొన్ని ఆహార పదార్ధాలు తినాలని అనిపిస్తాయి.కొన్ని మనల్ని భయ పెడతాయి. కొన్ని ఆహార పదార్ధాలుకార్బన్లు  తీసుకోవడం వల్ల చక్కెర శాతం పెంచుతాయి.మనం దానిపై దృష్టి  పెట్టం కొన్ని సందర్భాలలో ఆహారం తీసుకున్నాక అలిసి పోయేట్లు చేస్తాయి.ఇక అసలు విషయం  ఏమిటి అంటే  పెరుగు మన మూడ్ ను పెంచుతుంది అంటారు. మరో పరిశోదనలో పళ్ళు తినడం ద్వారా కూరగాయలు శాఖాహారం తీసుకోవడం వల్ల ప్రోటీన్  శాతం తగ్గడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మరో పరిశోదనలో మీరు తీసుకునే పెరుగు వల్ల సెరొటోనిన్ న్యూరో ట్రాన్స్ మీటర్ గా పనిచేస్తుంది.దీని ప్రభావం తో  మన ఫీలింగ్స్ భావాలు వ్యక్తం అవుతాయి.దీనివల్ల ఆనందం ఆరోగ్యం గా ఉంటాయి. మీరు ఎలాంటి ఆహారం తీసుకుంటారో అది అలాంటి ప్రభావం చూపిస్తుంది.అనే విషయాన్నీ దీనివల్ల వచ్చే ప్రభావం  12 రోజుల్లో చూడవచ్చు. మన శరీరంలో ఆహారం  వల్ల వచ్చే ప్రభావం ఉంటె మీ ఆహారం లో మార్పులు చే సుకోవచ్చు. ఆహారం వల్ల  మనం ఎదుర్కునే సవాళ్ళు... మీ భోజనం లో ఆహారం తీసుకునే సమయం నుంచి మూడ్ ట్రాకింగ్ జర్నల్ లో రాయండి మీరు ఏమి తీసుకున్నారో ఏమి తీసుకోలేదో  ప్రతి రోజూ అది కొన్ని నిమిషాలు మాత్రమే  మా ఆహారంలో ఉండే చాయిస్ మీకు అవగాహన కల్పిస్తుంది.అసలు మనం ఏం తింటున్నాం? ఎందుకు తింటున్నాం?అన్న విషయం తెలుస్తుంది.అవగాహన కలుగుతుంది. ఈ అంశానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు మీరు వేసుకోండి. మీరు ఏం తింటారు?భోజనం తరువాత మీరు తీసుకునే స్నాక్స్ అల్పాహారం ఏం తీసుకుంటారు? ఒక వేళ మీరు తినేంత సమయం లేకుంటే ఒక ఫోటో తీసుకుని రికార్డ్ చేయండి.అది మీకు కొంత మేర  మీకు సహకరిస్తుంది.అన్న విషయాన్ని ఒక జర్నల్ గా లేదా నోట్ యాప్,ఫుడ్ ట్రాకర్ ను మీ ఫోన్ లో తయారు చేసుకోండి తినక ముందు మీ  ఫీల్ ఏమిటి? ఎలా ఉన్నారు? ఏ సమయంలో మీకు ఆకలి వేసింది.?ఒంటరిగా ఉండాలని అనిపించింది?.ఒత్తిడికి గురి అయ్యారా? అలా ఉండడానికి మీరు తీసుకున్న ఆహారం కావచ్చు. అది మిమ్మల్ని ప్రభావితం చేసి ఉండవచ్చు,లేదా మీరు ఆహారం తీసుకున్నప్పుడు అలసటగా భావించారా? మీరు ఏ అహారాం థేసుకున్నప్పుడు తీపి పదార్ధాలు స్వీట్స్ ఇతర పదార్ధాలు మీ పంటిని ప్రభావితం చేసాయి. ఒత్తిడికి గురికావడానికి ఉప్పు పదార్శాలు చిప్స్,వేపుళ్ళు,వంటి పదార్ధాలు మీ ఫీలింగ్స్ గుర్తించ వచ్చు. ఫీలింగ్స్ కి ప్రవర్తనకి సంబంధం ఉందా ఇది మార్పుగా భావించాలి. తిన్న తరువాత మీరు ఎలా ఫీల్ అవుతారు... ఉదాహరణకి మీరు తీసుకున్న ఆహారం మీకు శక్తి నిచ్చిందా?లేక స్వాంతన చేకురిందా, త్రుప్తి నిచ్చిందా? అనందం కలిగించిందా?మీ మూడ్ ను ఆహారం ఏరకం గా ప్రభావితం చేసింది. దీనిప్రభావం వల్ల భవిష్యత్తులో తెలివైన నిర్ణయం తీసుకోగల నిర్ణయానికి సహకరిస్తుంది. కొంత మంది నిపుణులు  నిర్వహించిన సర్వేలో మనం తీసుకునే ఆహారం మనమూడ్ ను  ప్రభావితం చేస్తాయని నిర్ధారించారు.

పరగడుపున తులసి ఆకు తింటే ఆ సమస్యలన్నీ పరార్!

భారతీయ సంస్కృతిలో తులసికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మొక్కను దైవంతో సమానంగా కొలుస్తుంటారు. దైవంతో సమానంగా కొలిచే ఈ తులసి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. పరగడుపున ఖాళీ కడుపుతో తులసి ఆకులను తీసుకుంటే పలు శారీరక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. తులసి ఒక అడాప్టోజెన్. ఇందులో విటమిన్లు ఎ, సి,  కాల్షియం, ఐరన్, జింక్ వంటి అనేక పోషకాలను కలిగి ఉంటుంది. అంతేకాదు ఇందులో అధిక మొత్తంలో ప్రోటీన్, ఫైబర్ కూడా ఉంటుంది. తులసి ఆకులను ఆయుర్వేదంలో అనేక రకాల వ్యాధులకు చికిత్సలో ఉపయోగిస్తారు. తులసిని తీసుకోవడం వల్ల ఎక్కువ శారీరక శ్రమ, ఇస్కీమియా, శారీరక నిగ్రహం, చలి, శారీరక ఒత్తిడి నుండి అవయవాలు, కణజాలాలను రక్షించడంలో వరకు  సహాయపడుతుంది. పరగడుపు తులసి ఆకులు తింటే ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం. రోగనిరోధక శక్తి: తులసి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. అందువల్ల, ఇది మీ శరీరాన్ని వివిధ ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. ఇది హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లతో పోరాడుతుంది, ఆరోగ్యకరమైన రోగనిరోధక కణాలను పెంచుతుంది. అందుకే కషాయం చేసేటప్పుడు తులసిని కలుపుతారు. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది: తులసిని క్రమం తప్పకుండా తీసుకుంటే, జీర్ణక్రియను సులభతరం చేసి... ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది. ఇది యాసిడ్ రిఫ్లక్స్‌లను బ్యాలెన్స్ చేస్తుంది. మీరు ఆరోగ్యకరమైన జీర్ణక్రియను కలిగి ఉండటానికి pH స్థాయిని నిర్వహిస్తుంది. ఇలా రెండు తులసి ఆకులను నోటిలో వేసుకుని నములుతే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. నోటి దుర్వాసనకు చెక్: చాలా మంది నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతుంటారు. ఎవరితో అయినా దగ్గరగా మాట్లాడాలంటే జంకుతుంటారు. అలాంటి సమస్య ఎదుర్కొంటున్నవాళ్లు..ప్రతిరోజూ ఉదయం రెండు తులసి ఆకులను నమలడం అలవాటు చేసుకోవాలి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. రిఫ్రెష్‌గా ఉండటానికి ఉదయాన్నే వీటిని తినండి. ఒత్తిడిని దూరం చేస్తుంది: తులసి ఆకులలో అడాప్టోజెన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శరీరంలో ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది మీ నాడీ వ్యవస్థను విశ్రాంతి తీసుకోవడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది ఇంద్రియాలను ప్రశాంతపరుచడంతోపాటు...ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. మీ చర్మాన్ని మెరుగుపరుస్తుంది: మీరు ఖాళీ కడుపుతో తులసిని తీసుకుంటే, అది మీ రక్తం నుండి ట్యాక్సిన్లను  బయటకు పంపుతుంది.  ఇది మొటిమలు, మచ్చలను తగ్గించి మచ్చలు లేని చర్మాన్ని ఇస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మీ చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది: తులసిని తీసుకోవడం వల్ల ఇన్సులిన్ విడుదల పెరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. తులసిలో ఉండే కార్బోహైడ్రేట్లు  జీవక్రియను సులభతరం చేస్తాయి.  తులసి దాని యాంటీమైక్రోబయల్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఉదయాన్నే తీసుకుంటే, జలుబును  నయం చేస్తుంది.

ఈ గడ్డి రసం రోజూ తాగితే..

ఆరోగ్యంగా ఉంటే ఎలాంటి జబ్బులు దరిచేరవు అంటూ పరిశోధకులు, ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్తున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా ప్రజల్లో ఆరోగ్యం పై మరింత శ్రద్ధ పెరిగింది. మరి ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహారాలు రోజూ తప్పనిసరిగా తీసుకోవాలి. వాటిలో ముఖ్యమైనది గోధుమగడ్డి.   ఇంటిల్లిపాదికి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చేది గోధుమ గడ్డి. గోధుమగడ్డి జ్యూస్ రోజూ తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది రక్తహీనతను చాలా వేగంగా తగ్గిస్తుంది. అంతే కాదు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే అద్భుతమైన గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. అందుకే దీన్ని గ్రీన్ బ్లడ్ అని కూడా పిలుస్తారు. గింజల్లో కన్నా మొలకెత్తిన గింజల్లో పోషకాలు ఎలా ఎక్కువ శాతంలో ఉంటాయో అదే విధంగా  గోధుమ గడ్డిలో మిగతావాటి కంటే చాలా రెట్లు ఎక్కువగా పోషకాలు ఉంటాయి. వెజిటబుల్ సూప్ లో కన్నా గ్రీన్ గోధుమ గడ్డి రసంలో రక్తవృద్ధికి తోడ్పడే పోషకాలు 8-9 రెట్లు ఎక్కువగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.   గోధుమ గడ్డిని ఇంట్లో పండించుకోవడం చాలా సులభం. అందుకు కావాల్సింది కొబ్బరి పొట్టు, వర్మికంపోస్ట్ లేదా కొద్దిగా మట్టి కంపోస్టు, కలిపిన మిశ్రమం. మూడు నాలుగు అంగుళాల లోతు ఉన్న చిన్న ప్లాస్టిక్ గిన్నెలు, డబ్బాలు, ట్రేల్లోనూ పెంచుకోవచ్చు. వారం పది రోజుల్లో గోధుమగడ్డి కావలసిన ఎత్తు పెరిగి జ్యూస్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. రోజూ వరుసగా ఒక్కొక్క ట్రేలో గోధుమ గింజలు చల్లుతూ ఉంటే పది రోజుల తర్వాత రోజూ గోధుమ గడ్డి కోతకు వస్తుంది. గింజలు రాత్రంతా నానబెట్టి తేమ ఆరిపోకుండా ఉండేలా అవసరం మేరకు నీళ్లు చిలకరిస్తే చాలు. ఇంకో విషయం ఏంటంటే గోధుమ గడ్డికి  ఎండ అసలు తగలకూడదు. నీడలోనే పెంచుకోవచ్చు. ఐదు లేదా ఆరు అంగుళాల ఎత్తు పెరిగిన గోధుమగడ్డి ని కత్తిరించి మిక్సీలో వేసి రసం తీసి తాగాలి. అన్ని వయసుల వారు దీన్ని తాగొచ్చు.

ఎగ్ వైట్ మాత్రమే తినే అలవాటుందా? ఈ నిజాలు తెలుసుకోవాల్సిందే..!

పోషకాహారంలో గుడ్లకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.  పిల్లలకు ఓ నిర్ణీత వయసు వచ్చినప్పటి నుండి గుడ్డును ఆహారంలో ఇవ్వడం చాలామంచిదని ఆహార నిపుణులు చెబుతారు. ఇక వయసులో ఉన్నవారికి, గర్భవతులకు, మధ్యవయసు వారికి, వృద్దులకు ఇలా.. అన్ని వయసుల వారికి శరీరానికి తగినంత పోషకాలు భర్తీ చేయడంలో గుడ్లు ఎప్పుడూ ముందుంటాయి. అయితే డైటింగ్ చేసేవారు, రెగ్యులర్ గా గుడ్డు తినేవారిలో చాలామంది కేవలం ఎగ్ వైట్స్ మాత్రమే తిని పచ్చసొన వదిలేస్తుంటారు. పచ్చసొనలో కొవ్వులు ఎక్కువ ఉంటాయని, అది ఆరోగ్యానికి మంచిది కాదనే అపోహ కూడా ఉంది. కానీ  గుడ్డులో పచ్చసొన పడేసేవారు తప్పనిసరిగా ఈ కింది విషయాలు తెలుసుకోవాలి. విటమిన్ ఎ.. గుడ్డు పచ్చసొనలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటిచూపుకు,  రోగనిరోధక పనితీరుకు,  చర్మ ఆరోగ్యానికి అవసరమైన పోషకం. శరీర సహజ రక్షణ వ్యవస్థకు మద్దతు ఇవ్వడంలో విటమిన్ ఎ కీలక పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన చర్మ కణజాలాల నిర్వహణలో సహాయపడుతుంది.  తక్కువ కాంతి ఉన్న వాతావరణ పరిస్థితులలో కూడా కంటిచూపు మెరుగ్గా ఉండేలా చేస్తుంది. విటమిన్ డి.. గుడ్డు పచ్చసొనలో కనిపించే మరో ముఖ్యమైన విటమిన్ విటమిన్ డి. దీనిని తరచుగా "సన్‌షైన్ విటమిన్" అని పిలుస్తారు. బలమైన ఎముకలు, ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థ,  సాధారణ ఆరోగ్యం  కోసం విటమిన్ డి అవసరం. కాల్షియం శోషణ,  ఎముక ఖనిజీకరణకు విటమిన్ డి తగినంత స్థాయిలో అవసరం. ఇది బలమైన,  ఆరోగ్యకరమైన ఎముకలను నిర్వహించడానికి కీలకమైనది. విటమిన్ ఇ.. గుడ్డు సొనలో విటమిన్ ఇ  పుష్కలంగా ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షించడంలో సహాయపడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. రోగనిరోధక పనితీరు, చర్మ ఆరోగ్యం,  మొత్తం సెల్యులార్ ఆరోగ్యానికి సపోర్ట్  ఇవ్వడంలో విటమిన్ E కీలక పాత్ర పోషిస్తుంది.   విటమిన్ B12.. విటమిన్ B12 శక్తి ఉత్పత్తికి, నరాల పనితీరుకు,  ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు కీలకం. విటమిన్ B12 లభించే  కొన్ని ఆహార వనరులలో గుడ్డు పచ్చసొన  ఒకటి.ప్రత్యేకించి శాఖాహారం లేదా శాకాహారి ఆహారాలను అనుసరించే వారికి మొక్కల ఆధారిత మూలాల నుండి తగినంత B12 పొందడానికి కష్టంగా ఉంటుంది. విటమిన్ K.. గుడ్డు సొనలో విటమిన్ కె ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టడానికి, ఎముకల ఆరోగ్యానికి,  గుండె ఆరోగ్యానికి అవసరం. రక్తం సరిగ్గా గడ్డకట్టేలా చేయడంలో విటమిన్ K కీలక పాత్ర పోషిస్తుంది. గాయం అయినప్పుడు అధిక రక్తస్రావం జరగకుండా చేస్తుంది. అదనంగా, విటమిన్ K ఎముక జీవక్రియలో పాల్గొంటుంది. బలమైన,  ఆరోగ్యకరమైన ఎముకలను నిర్వహించడానికి సహాయపడుతుంది. విటమిన్ B2.. రిబోఫ్లావిన్ లేదా విటమిన్ B2, శక్తి ఉత్పత్తి, జీవక్రియ,  ఆరోగ్యకరమైన చర్మం,  కళ్ళ నిర్వహణలో కీలకంగా ఉంటుంది.  గుడ్డు సొనలో రిబోఫ్లావిన్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ B9.. ఫోలేట్ నే విటమిన్ B9 అని కూడా పిలుస్తారు. DNA సంశ్లేషణ, కణ విభజన,  ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు అవసరం. పిండం అభివృద్ధికి,  న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారించడానికి గర్భధారణ సమయంలో తగినంత ఫోలేట్ తీసుకోవడం చాలా ముఖ్యం.                                   *నిశ్శబ్ద.

ఉల్లి తో ఇన్ని లాభాలా?

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదన్న నానుడి ఎలా వచ్చిందో తేలియదు గాని ఉల్లి వల్ల ఆరోగ్య లాభాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు. ఉల్లి కేవలం ఆహారంలో భాగం మాత్రమే కాదు పోష కలా భాలు ఉన్నాయి . అంటున్నారు నిపుణులు. ఉల్లి కేవలం ఆహారం లో భాగం మాత్రమే కాదు సంపూర్ణ పోషకాలు ఉన్నాయని అంటున్నారు. వితమిన్ సి...ఉల్లి అందరూ అంగీకరించినట్లుగా ఇది మంచి పోశాకమని శరీరానికి అవసరమైన విటమిన్ సి అందిస్తుందని తద్వారా మనం ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు. శరీరంలోని రక్త నాళాల ఇతర భాగాలాకు సరిగా పనిచేసేవిధంగా చేస్తుంది. యాంటి ఆక్సిడెంట్ పని చేస్తుంది. రాడికల్స్ పై పోరాడే గుణం ఉల్లికిఉంది ఏ మాలిక్యుల్స్ అయితే కొన్ని సార్లు నాశనం చేస్తాయో అప్పుడు నిపుణులు విటమిన్ సి మిల్లి గ్రాములలో సూచిస్తారు. అది ప్రతిరోజు తీసుకోవచ్చు. ఒక్క ఉల్లి పాయలో 1% నుండి 18 % వరకు ఉంటుంది. పీచు పదార్థము...ఉల్లిపాయలో రెండు రకాల పీచు పదార్దాలు ఉంటాయి. డై టెరీ ఫ్రీ బయోటిక్ ఒక కప్పులో 12% 2 1 నుంచి 38 గ్రా మీకు రోజూ అవసరం. అవుతుంది.పీచు పదార్ధం శరీరంలో ప్రతిరోజూ బౌల్ కదలికలు ఉండడం అవసరం. మీకు కడుపు నిండి నప్పుడు చాలా తక్కువగా తింటారు. అప్పుడు మీకు ఊబ కాయం తగ్గుతుంది. ఉల్లిలో ఫ్రీ బయోటిక్ మీ గత ను బ్యాక్టీరియా ను కలిగిఉంటుంది.యాంటి ఆక్సిడెంట్...అన్ని ఉల్లిపాయాలలో క్వార్ స్టాన్ ఫ్లావోనాయిడ్స్ లేదా యాంటి ఆక్సిడెంట్ కాంపౌండ్ క్వార్టిన్ లో యాంటి ఇంఫ్లామేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. అవి శరీరానికి సహకరిస్తాయి. విటమిన్ ఇ సంరక్షిస్తుంది. క్యాన్సర్ ప్రతి ఉల్లి పాయనుంచి ఆక్సిడెంట్ ఎరుపు,పసుపు తెల్ల ఉల్లిపాయాలలో పూర్తి పోషకాలు ఉంటాయని అంటున్నారు. విటమిన్ బి 6 ఒక మీడియం ఉల్లిపాయాలో 8% ప్రతిరోజూ విటమిన్ బి6 శరీరానికి సహకరిస్తుంది. ఉల్లి తీసుకోవడం వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాల వృద్ది ప్రోటీన్ నిరోదిస్తుంది. ఉదయం సాయంత్రం వేళ లో స్త్రీలు ఎదుర్కొనే సిక్ నెస్ నుండి బయట పడడానికి సహకరిస్తుంది. పచ్చి ఉల్లిపాయా ఆరోగ్యకరం... పచ్చి ఉల్లిపాయ ను తినడం వల్ల లాభాలు ఉన్నాయి. సలాడ్ లో ఆమ్లెట్ లేదా సాంద్ విచ్ లో గుండ్రంగా కోసిన ఉల్లిపాయాలు చాలా నెమ్మదిగా కొరికి తినడం వల్ల మంచి పీచు పదార్ధము ఉంటుంది. వండినా లేదా  వేయించిన ఉల్లిపాయాలు చెడుపు చేస్తాయి. అందులో పోషకాలు ఉండవని అంటున్నారు నిపుణులు. ఎర్ర ఉల్లి పచ్చడి... సన్నగా కోసిన ఎర్ర ఉల్లి పాయాను రెడ్ వైన్ లో లేదా వెనిగర్ లో కొంచం ఉప్పువేసి 15 ని మిషాలు ఉంచి ప్రతి 5 నిమిషాలు కట్ చేయండి. బర్గర్స్ లో సలాడ్స్ లో కొన్ని కొన్ని ఆహారాలలో ముఖ్యంగా బకింగ్ ఐటమ్స్ లో బాగుంటాయి. మీకిష్టమైన వాటితో ఫిల్ చెయ్యండి... సన్నగా తరిగిన ఉల్లిపాయలు. వాటిపై కొంచం మిరియాల పొడి మీకు నచ్చిన ప్రోటీన్ ఆయిల్ కొంచం సోడియం సోయా, బ్రౌన్ రైస్ సల్సా సోర్ కరీం బోనస్ గా పచ్చి ఉల్లిపాయాని గ్యుకమోల్ తో కలిపి తింటే ఆ రుచివేరు అంటారు ఆహారా ప్రియులు.  నాన పెట్టి తినాలి... ఉల్లిపాయా కోసినప్పుడు కంటినుంచి నీటిని తెప్పిస్తుంది. అది పచ్చి ఉల్లిపాయ కోసినప్పుడు చాలా ఘాటుగా అనిపిస్తుంది.వాటిని సనాగా కోసి చల్లని నీటిలో చల్లని ప్రదేశంలో 3౦ నిమిషాలు ఉంచండి వాటి ఘాటు పవర్ తగ్గి దానిఅసలు మూలం పోకుండా ఉంటుంది. ఉల్లిని ఎలా నిల్వచేయాలి... మీరు మీ ఇంట్లో ఉల్లిని నిల్వ చేసినప్పుడు చల్లటి ప్రదేశంలో ఉంచండి. కాస్తగాలి ఉండే ప్రదేశంలో ఉల్లిని నిల్వ ఉంచండి.ఒకాసారి కోసిన చీల్చిన వాటిని మాత్రమే ఫ్రిజ్ లో ఉంచండి 7 నుండి 1౦ రోజులు ఆలు కు దూరంగా ఉంచండి. అన్నిటికన్నా ప్రసస్తంగా ఉండాలంటే పురుషుల లో సామార్ధ్య్సాన్ని పెంచేది ఈ ఉల్లే. కాబట్టి అన్నిరాకల ఆరోగ్య విలువలు ఉన్న ఉల్లి సర్వాత్రా మేలు చేస్తుందనేది నిపుణులు చెపుతున్న మాట.  

మనం ఎంతో ఆరోగ్యం అనుకునే ఈ ఆహారాలు ఎంత డేంజరంటే..!

  ఆరోగ్యంగా ఉండటానికి తరచుగా ఆరోగ్యకరమైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి ఉండాలని వైద్యుల నుండి ఆహార నిపుణుల వరకు అందరూ చెప్తారు.  సాధారణంగా  ఆరోగ్యం మెరుగ్గా ఉన్న ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాలు, పానీయాలను తప్పనిసరిగా తమ ఫుడ్ మెనూలో చేర్చుకుంటారు.  అయితే చాలా మంది రోజూ తింటున్న కొన్ని ఆహారాలు శరీరానికి ఎంతో మంచిదనే భ్రమలో ఉన్నారు. కానీ నిజం చెప్పాలంటే ఇలా తీసుకుంటున్న కొన్ని ఆహారాలు  ఆరోగ్యానికి మంచి చేయకపోగా చెడు చేస్తయని ఆహార నిపుణులు అంటున్నారు.  అందరూ ఆరోగ్యం అనుకుంటున్న ఏ ఏ ఆహారాలు ఆరోగ్యానికి చేటు చేస్తాయో.. అసలవి ఎందుకు మంచివి కాదో తెలుసుకుంటే.. డైజెస్టీవ్ బిస్కెట్స్.. డైజెస్టివ్ అనే పేరును బట్టి ఈ బిస్కెట్లు చాలా ఆరోగ్యకరం అని అనుకుంటారు. చాలా మంది ఆకలిగా అనిపించినప్పుడు, అల్పాహారంలోనూ  ఈ బిస్కెట్లకు ప్రాధాన్యత ఇస్తుంటారు. నిజానికి డైజెస్టివ్ బిస్కెట్లు పిండి, చక్కెరతో నిండి ఉంటాయి. వీటిలో చాలా కేలరీలు ఉంటాయి. వీటిని రోజూ తీసుకుంటే, బరువు చాలా సులభంగా పెరుగుతారు.  ఖఖ్రా.. ఈ రోజుల్లో డైట్ ఖఖ్రా మార్కెట్లో విరివిగా అందుబాటులో ఉంది. చాలామంది సాయంత్రం టీతో పాటు వీటిని  చాలా ఉత్సాహంగా తింటారు. అయితే డైట్ ఖఖ్రాలో 'డైట్' లాంటిది ఏమీ ఉండదనేది విస్తుపోవాల్సిన విషయం. ఈ వేయించిన స్నాక్స్ లో చాలా కేలరీలు ఉంటాయి. హెల్త్ డ్రింక్స్.. ఇప్పట్లో హెల్త్ డ్రింక్స్  చాలా విరివిగా ఉపయోగిస్తున్నారు. పిల్లలకు ఈ హెల్త్ డ్రింక్స్ వాడకం మరీ ఎక్కువ ఉంటోంది.  ఎందుకంటే పిల్లలకు పాలు ఇవ్వాలంటే ఈ హెల్త్ డ్రింక్స్  పౌడర్లు ఉండాల్సిందే.  అయితే కంపెనీలు పేర్కొన్నట్టు విటమిన్లు, DHA కలిగిన ఈ హెల్త్ డ్రింక్స్ పౌడర్లు చాలా అనారోగ్యకరమైనవి.  వీటిలో చక్కెర శాతం ఎక్కువ ఉంటుంది. వీట్ బ్రెడ్.. వైట్ బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్, లేదా గోధుమ బ్రెడ్  ఆరోగ్యకరమైనదని చాలా మంది అనుకుంటారు. అయితే ఈ బ్రౌన్ బ్రెడ్ కూడా వైట్ బ్రెడ్ లాగా అనారోగ్యకరమైనది.  ఎందుకంటే ఇందులో రంగులు ఉపయోగించబడతాయి,  దీని తయారీలో ఆరోగ్యకరమైన పదార్థాలేవీ ఉపయోగించరు.                                 *నిశ్శబ్ద.  

కూర పనస ఎప్పుడైనా తిన్నారా? దీంతో ఎన్ని లాభాలంటే..!

  సరైన విధంగా తింటే శాకాహారం ఇచ్చినంత గొప్ప ఆరోగ్యం ఇంకేదీ ఇవ్వగదనేది వైద్యుల మాట. కూరగాయలలో కూడా ప్రాంతీయతను బట్టి వివిధ రకాలుంటాయి. వీటిలో కొన్ని చూడడానికి కొన్ని వింతగా ఉంటే మరికొన్ని తిన్నప్పుడు ఆశ్చర్యకరమైన రుచి కలిగుంటాయి. అలాంటి వాటిలో కూర పనస కూడా ఒకటి. రూపంలో అచ్చం పనస పండును పోలి ఉండే కూర పనస రుచిలో మాత్రం అందరికీ షాకిస్తుంది. ఇది అచ్చం బ్రెడ్ రుచిని పోలి ఉంటుంది. అందుకే దీన్ని బ్రెడ్ ఫ్రూట్ అని కూడా అంటారు. ఈ కూర పనస తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో ఓసారి తెలుసుకుంటే.. పోషకాలు.. కూర విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి సమృద్దిగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆరోగ్యకరమైన చర్మం కోసం కొల్లాజెన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది. అదనంగా, ఇందులో విటమిన్ ఎ, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ ఉన్నాయి, ఇది మొత్తం ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. జీర్ణ ఆరోగ్యం.. అధిక ఫైబర్ కంటెంట్‌ ఉన్న కారణంగా, కూర పనసప్రేగు కదలికలను నియంత్రించడం, మలబద్ధకాన్ని నివారించడం ద్వారా జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఫైబర్ ప్రీబయోటిక్‌గా కూడా పనిచేస్తుంది.  గట్‌లోని ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను పోషించడం, జీర్ణక్రియ, పోషకాల శోషణకు అవసరమైన ఆరోగ్యకరమైన మైక్రోబయోమ్‌ను ప్రోత్సహిస్తుంది. బరువు నిర్వహణ.. కూర పనసను ఆహారంలో చేర్చుకోవడం వల్ల  తక్కువ కేలరీలు,  అధిక ఫైబర్ కంటెంట్ లభిస్తాయి. బరువు నిర్వహణలో సహాయపడుతుంది. ఫైబర్ ఎక్కువ కాలం కడుపు  నిండిన అనుభూతిని కలిగిస్తుంది, మొత్తం కేలరీల తీసుకోవడం తగ్గిస్తుంది.  అతిగా తినకుండా చేస్తుంది. అదనంగా, దాని సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు స్థిరమైన శక్తిని అందిస్తాయి, రోజంతా సంతృప్తిగా, ఉత్సాహంగా ఉంచుతాయి.                    *నిశ్శబ్ద.  

మధుమేహం ఉన్నవారు ఈ ఒక్క కూరగాయను డైట్ లో ఉండేలా చూసుకుంటే చాలు!

ఆకుపచ్చ కూరగాయలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా ఉపయోగపడతాయి.. వీటిలో ఎన్నోరకాల విటమిన్లు, ఖనిజాలు మరియు పోషకాలు ఉంటాయి, ఇవి తీవ్రమైన జబ్బుల నుండి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా డయాబెటిస్ బాధితులు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే కొన్ని కూరగాయలు తప్పనిసరిగా తీసుకోవాలి. మధుమేహం యొక్క సమస్యలను తగ్గించడంలో  కూరగాయలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. అలాంటి కూరగాయలలో ఎంతో శక్తివంతమైనది బెండకాయ. డయాబెటిక్ రోగులు క్రమం తప్పకుండా బెండకాయ తీసుకుంటే, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధించడంలో సహాయపడుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా, ఈ కూరగాయలలో కేలరీలు, కొవ్వు రెండూ తక్కువగా ఉంటాయి, ఇది మధుమేహానికి ప్రయోజనకరంగా ఉంటుంది. డయాబెటిస్‌ ఉన్నవారు బెండకాయ తీసుకుంటే..  రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిచడం బెండకాయ వల్ల ఎంతో సులువు. కాల్చిన బెండకాయ విత్తనాలు మధుమేహం చికిత్సకు టర్కీలో చాలా కాలంగా ఉపయోగించబడుతున్నాయి. రక్తంలో చక్కెరను తగ్గించడంలో కూడా ఇది సానుకూల ప్రభావాలను చూపుతుంది. బెండకాయ మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఎందుకు మంచిదంటే.. బెండకాయలో  ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ ఉన్న ఆహారాలు జీర్ణక్రియకు సహాయపడటమే కాకుండా ఆకలి బాధలను తగ్గించి, ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతాయి. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉన్న ఆహారం మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మంచిది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల, బెండకాయలు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. బెండకాయలు రక్తంలో గ్లూకోజ్-తగ్గించే శక్తివంతమైన కూరగాయ. బెండకాయను మాత్రమే కాకుండా బెండకాయ విత్తనాలను పొడిగా చేసి తీసుకోవడం వల్ల కూడా మధుమేహం తగ్గించుకోవచ్చు.  డయాబెటిస్‌లో మాత్రమే కాకుండా బెండకాయ చాలా ప్రయోజనాలను కలిగి ఉంటుంది. బెండకాయలో విటమిన్-ఎ, సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఇవి క్యాన్సర్, డయాబెటిస్, స్ట్రోక్, గుండె జబ్బుల వంటి తీవ్రమైన ఆరోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.  ఇది కండరాలు, నరాల పనితీరును మెరుగుపరిచి అవి ఆరోగ్యంగా ఉండటంతో సహాయపడుతుంది. కాబట్టి బెండకాయను వీలైనంతగా ఆహారంలో భాగం చేసుకుంటే అద్భుతమైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.                                          ◆నిశ్శబ్ద.

దంత సంరక్షణ ఎంత ముఖ్యం?

ఉదయం లేవగానే అందరూ చేసే పని పండ్లు తోముకోవడం. చాలామంది ఉదయం లేవగానే పండ్లు తోముకోకుండా కాఫీ తాగడం చేస్తారు. మరికొందరేమో నైట్ డ్యూటీ లు గట్రా చేస్తూ నోరు సరిగ్గా శుభ్రం చేసుకోకుండా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల దగ్గర క్యూ కడతారు. అయితే ఉదయం లేవగానే పండ్లు తోముకోవడం అనే అలవాటు చాలా మంచిది. పండ్లు తోముకోవడం కూడా ఓ కళ అంటారు దంత వైద్య నిపుణులు. మన పండ్లను సరైన రీతిలో బ్రష్ చేసుకోవాలి. బ్రష్ ను గట్టిగా ముందుకు, వెనుకకు తోమకూడదు. అలా తోమటం వల్ల చిగుళ్ళు దెబ్బతింటాయి. ముందుగా పండ్లు తోముకోవడానికి ఉపయోగించే బ్రష్ చాలా మెత్తగా ఉండాలి. అలా ఉంటే పండ్ల చిగుళ్లు దెబ్బతినవు. ఇక పండ్లు తోముకునేటప్పుడు బ్రష్ తో పైకి, కిందికి మెల్లగా తోముకోవాలి. అలా చేయటం వల్ల చిగుళ్ళకు నష్టం వుండదు. మన పండ్లను బ్రష్ తో తోముకున్న తర్వాత చేతి వ్రేళ్ళతో చిగుళ్ళను తోముకోవాలి. అందువల్ల చిగుళ్ళు దృఢంగా తయారవుతాయి. కొంతమంది ఇటుకపొడి, బొగ్గు మొదలైన గరుకు పదార్థాలతో పండ్లను తోముతారు, కాని అలా తోమకూడదు. ఎందుకంటే అవి పండ్లపై ఉన్న ఎనామిల్ ను తొలగించి నష్టపరుస్తాయి. ఒకవేళ అవి ఉపయోగించేలా అయితే మెత్తగా పొడిని జల్లించుకోవాలి.  లేదంటే పండ్లకు మంచి టూత్ పేస్ట్ వాడటం చాలా అవసరం. ఎందుకంటే ఫ్లోరైడ్ కల్గిన టూత్ పేస్ట్ లు వాడటం వల్ల దంతక్షయం అరికట్టబడుతుంది. చిగుళ్ళు గట్టిగా, దృఢంగా ఆరోగ్యవంతంగా ఉంటాయి.  ఎవరైనా సరే చాక్లెట్లు, పిప్పరమెంట్లు, మిఠాయిలు ఎక్కువగా తినకూడదు. తీపి పదార్థాలు పండ్ల సందులలో చిక్కుకొని సూక్ష్మక్రిములు చేరుకుంటాయి. తద్వారా పండ్లు పుచ్చిపోతాయి. ప్రతీరోజూ ఉదయం బ్రష్ చేసేటప్పుడు నాలుక గీసుకొని శుభ్రపరచుకోవాలి. నాలుక పైన రాత్రిపూట ఒక తెల్లని పూత ఏర్పడుతుంది...! నాలుకపైన పేరుకున్న ఈ తెల్లని పూతను అప్ఆర్ఇంచుకుని సుక్మాజీవుల పెరుగుతాయి. ఈ పూతను ఎప్పటికప్పుడు తొలగించకపోతే సూక్ష్మక్రిములు పెరిగిపోయి దుర్వాసన కల్గుతుంది… మనం తీసుకునే ఆహరంతో పాటు ఈ సూక్ష్మ క్రిములు శరీరంలో ప్రవేశించి చాలా రకాల  వ్యాధులు కల్గుతాయి. భోజనం చేసిన తర్వాత నీటిని పుక్కిలించి నోటిని శుభ్రపరచుకోవాలి. నోటిలో చిక్కుకున్న ఆహారపు అణువులు తొలగించటానికి ప్రతిసారి భోజనము తర్వాత నీటిని పుక్కిలించి ఉమ్మివేయాలి. అప్పుడు నోరు శుభ్రంగా, వాసన లేకుండా ఉంటుంది. సంవత్సరానికి కనీసం ఒకసారి దంతవైద్యుడిని సంప్రదించాలి. పండ్లు అందంగా ఆకర్షవంతంగా, ఆరోగ్యంగా ఉంచుకోవటానికి సంవత్సరానికి కనీసం ఒకసారి దంత వైద్యునితో పండ్లను పరీక్ష చేయించుకోవాలి. దంత వైద్యులు చెప్పిన విషయాలను జాగ్రత్తగా పాటించాలి. సరైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉండవచ్చు.                                           ◆నిశ్శబ్ద.

నిద్ర పోయే ముందు ఏదైనా స్నాక్స్ తింటే?

మీకు నిద్ర పోయే ముందు ఏదైనా స్నాక్స్ తినాలని ఉందా తినేసయ్యండి. హాయిగా నిద్ర పొండి. సుఖంగా నిద్రపోవాలంటే సహకరిస్తుంది. లేదా ఏదైనా చిరుతిండి తింటే నిద్రవస్తుందా అంటే నిద్ర వస్తుంది అంటున్నారు నిపుణులు. వాస్తవానికి మనిషి అన్న వాడు 7 నుండి 8 ఘంటలు  నిద్రపోవాలి.మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర తప్పనిసరి. కాని ప్రపంచంలో 3 వ వంతు అమెరికన్లు  సరిపడా చాలినంత నిద్ర పోవడం లేదని నిపుణులు గమనించారు. అల్లా ఒక సారి నిద్ర లేమి సమస్య దీర్ఘకాలంగా ఉంటె వ్యక్తి శారీరకంగా మానసిక అనారోగ్యానికి దారి తీస్తుంది.  ఇన్ఫెక్షన్ సమస్యలు వస్తాయని నిపుణులు వెల్లడించారు. ప్రతి రోజు నిద్రపోవడం పడుకునే ముందు టి .వి ఫోన్ ,లి మీ నిద్రను పెంచుతాయి. మీఆహారం లో కొద్ది పాటి  మార్పు చేసుకుంటే నిద్ర సరిపోతుంది ప్రశాంతంగా నిద్ర పోవచ్చు.సాయంత్రపు గాలులు తగ్గ్గిన వెంటనే  నిద్రకు ముందు ఏదైనా స్నాక్ తీసుకుంటే నిద్ర మత్తు వస్తుంది.దీనివల్ల మీనిద్ర సమయాన్ని కొంతవరకు  మీరే స్వయంగా అలవాటు చేసుకో వచ్చు.దీనివల్ల మీరు మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.  మీరు నిద్ర పోయే ముందు వెచ్చటి పాలు గ్లాసుడు తీసుకుంటే నిద్రకు సహకరిస్తుంది. అయితే  ఇది పాత పద్దతే కావచ్చు ఇది పాత బడిపోయిన సలహా అని మీరు ఎద్దేవా చేయచ్చు. వివిధ రకాల  నట్స్,సీడ్స్,బలమైన ఆహారం సేరోటో నిన్ ను ఉత్పత్తి చేస్తాయి,అమినోయాసిడ్స్నిద్ర పోయేలా చేస్తాయి. ఆల్మండ్స్ బాదం పీనుత్స్ పల్లి పప్పులు మెలటోనిన్ పదార్ధాని ఇస్తాయి. ఈ హార్మోన్ శరీరాన్ని నిద్రపోయే పద్ధతి ని అలవాటు చేస్తుంది.       

టమాటాలో దాగి ఉన్న ఆరోగ్యం...

టమాటాతో చేసే వంటకాన్ని ఇష్టపడని వాళ్ళు ఉండరు. ఎలాంటి వంటకమైన టమాట వేస్తే చాలు దానికి రుచి వచ్చేసినట్లే. కేవలం రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందిట ఈ టమాట.టమాటా లలో క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సిలు ఎక్కువ మోతాదులో ఉంటాయట.ఎసిడిటీతో బాధపడేవారు టమాటాలతో తయారు చేసిన వంటకాన్ని రుచి చూస్తే ఎంతో ఉపశమనం కలుగుతుంది. టమాటాల్లో సిట్రిక్ యాసిడ్ ఉండటంతో ఎసిడిటీ దూరమౌతుంది. ఇందులో సిట్రిక్ యాసిడ్ ఉండటంవలన యాంటాసిడ్‌లా ఉపయోగపడుతుందంటున్నారు వైద్యులు. టమాటాల్లో విటమిన్ ఏ అధికంగా ఉండటంతో కంటి జబ్బులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది.టమాటాని చక్రాలుగా తరికి కళ్ళ మీద పెట్టుకున్నా కళ్ళకి చల్లదనం లభిస్తుంది. వీటిల్లోని విటమిన్‌ ఏ, విటమిన్‌ సి  రోగ నిరోధకశక్తినీ పెంపొందించి వ్యాధుల నుంచి రక్షణ కల్పించటంలో తోడ్పడతాయి.వీటికి ఎర్రటి రంగును తెచ్చిపెట్టే లైకొపేన్‌ మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఊపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్ల వృద్ధిని అడ్డుకోవటంలో సాయం చేస్తుంది.     ఆడవారికి నచ్చే మరో విషయం ఏమిటో తెలుసా? ప్రతిరోజూ తినే ఆహారంలో టమాటా  తింటే బరువు తగ్గుతారని పరిశోధకులు చెప్తున్నారు. టమాటాలు తినే వారు ఇతర ఆహార పదార్ధాలను ఎక్కువగా తినలేరు. ఇవి తింటే కడుపు నిండినట్లు ఉండి ఎక్కువ అన్నం గాని , ఇతర పదార్దములు గాని తిననీయదు.  కాబట్టి ఆకలి మీద నియంత్రణ ఉండి, తక్కువగా తింటారు.   మెనోపాజ్‌ దశలో ఉన్న వారు రోజు రెండు గ్లాసుల టమాటా రసాన్ని తాగడం వల్ల ఎముకలు అరిగి,విరిగిపోయే సమస్యకి స్వస్తి చెప్పవచ్చు. టమాటాల్లోని లైకోపీన్‌ వల్ల ఎముకలు బలంగా మారతాయని అధ్యయనంలో తేలింది. టమాటాల్లో గుండెకు మేలు చేసే పొటాషియం, రక్తంలో గ్లూకోజు స్థాయులను నియంత్రించే మాంగనీసులాంటివి కూడా పుష్కలంగా ఉన్నాయట. టమాటాల్లో ఇన్ని అద్భుతాలు ఉన్నాయా అని ఆశ్చర్యం వేస్తోంది కదూ. అసలే టమాటాల సీజన్. ఇంకెందుకు ఆలస్యం ఆరోగ్యాన్ని పెంపొందించుకునే పని మొదలుపెట్టేద్దాం. ......కళ్యాణి

అవిసె గింజలు తీసుకుంటే జరిగేది ఇదే....

అవిసగింజలతో బిపి కి చెక్ పెట్టవచ్చని నిపుణులు అంటున్నారు. అవిసగింజలు హై బిపి సమస్య లేదా అధికబరువు తో ఇబ్బంది పడుతున్న వారికి దీర్ఘకాలిక రోగాలనునివారించే శక్తి అవిసగింజలలో ఉందనేది వాస్తవం. మీరు ఊబకాయం తో వచ్చే హై బిపి ని ఎలానియంత్రించాలి? లేదా అవిసతో ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం. అవిసచూడడానికి చిన్నగింజ మాత్రమే కాని బోలెడు లాభాలు ఉన్నాయని అంతున్నారు నిపుణులు. అవిసగింజలను ఫ్లాక్స్ అని కూడా అంటారు.దీనిని సూపర్ సీడ్స్ గా అంగీకరిస్తారు.అవిసగింజలు మీ గుండెకు లాభదాయకంగా పని చేస్తుంది. అవిస యాంటి ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.యాంటి ఇంఫ్లామేటరీ, మైక్రో,మేక్రో,న్యుట్రీ యంట్స్, ఖజనాగా అవిస గింజను పేర్కొంటారు. అవిసగింజలలో దాదాపు ౩5%పీచు పదార్ధం ఉంటుంది.ఇందులో మహాజ్ 1౦ గ్రాములు,వినియోగిస్తే మీశారీరానికి నిత్యం అవసరమైన ప్రోటీన్,ఫైబర్, ఒమేగా౩ ఫెటియాసిస్, తోపాటు చాలా విలువైన విటమిన్లుమినరల్స్ లభిస్తాయి.శాస్త్రజ్ఞులు హెర్బల్ వైద్యులు దీపక్ ఆచార్య అవిసగింజలు తినడం వల్ల చాలా విలువైన విటమిన్లు లభిస్తాయి. అవిసగింజలు వినియోగం ద్వారా ఊబకాయం హై బిపి నియంత్రించ వచ్చు. అవిసగింజలతో లాభాలు... గుజరాత్,మహారాష్ట్ర,మధ్య,ఉత్తర భారతంలోని చాలా ఇళ్ళలో వారు వాడే కిళ్ళీలో అవిస గింజలు వినియోగించడం చూడ వచ్చు. అవిసను నేరుగా తినడం ఎలా? మార్కెట్లో లభించే అవిసగింజల్ని తీసుకోండి.వాటిని శుభ్రం చేసి కొంచం వేడిమీద వేయించండి.వాటిని వేయించి దంచి పొడి చేయండి.మీకు కావాలంటే కొంచం రుచికోసం.నల్ల ఉప్పు వేసుకోవచ్చు.ప్రతిరోజూ ౩-లేదా4 చెంచాలు అంటే 2౦-25 గ్రాముల అవిసగింజలు బాగా నమిలి తినండి.మీకు హై బిపి హై బ్లడ్ ప్రేషర్ లేదా బరువు తగ్గించాలంటే అవిస గింజల పొడి చాలా బాగా సహాయ పడుతుంది.అవిస గింజలలో లభించే ఒమేగా ౩ చాలా మంచిదని భావిస్తారు.అవిస గింజల లో ఏ.ఎల్.ఏ ఎల్ఫా లీనో లిక్ లభిస్తుంది.అది మీ గుండె ఆరోగ్యంగా ఉండేందుకు అత్యవసరం. అవిసలో పీచు పదార్ధాలు పుష్కలం... అవిసలో పీచుపదార్ధం పుష్కలంగా ఉంటుంది. శరీరంలో కొన్ని పీచుపదార్ధాలు కాలిపోతే కొన్ని కలిసి పోవు,అరుగుదల ఉన్న అవిసగింజలు పంచెంద్రియాల పని తీరును తగ్గిస్తుంది.నీటిని ఎండిపోయే విధంగా చేస్తుంది.ఈ కారణంగానే ఆకలి తగ్గిపోవడం అది మీ ఊబకాయం పై పడుతుంది.అది మీకు డయాబెటిస్ పై పడుతుంది. అది మీ శరీరం లో బ్లడ్ షుగర్ ను నియంత్రిస్తుంది.శరీరం లో కల వాణి అవిస గింజలు సూక్ష్మ క్రిముల కొడం అద్భుతమైన ఆహారం గా పనిచేస్తుంది.అది మీపోట్టలో  ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతుంది.అంటే 2౦-25 గ్రాముల అవిస విత్తనాలు మరెన్నో ప్రశ్నలకు సమాధానం గా చెప్పవచ్చు. అవిసను వాడండి ఇలా ... ఎవరైతే అత్యంత ఖరీదైన ఆలివ్ ఆయిల్ వాడతారో అలాగే అవిస గింజలు నూనెను వాడండి.ధర తక్కువ ఇందులో మరిన్ని గుణాలుఅధికంగా ఉంటాయి. ఎవరైతే అవిస గింజలు తింటారో వారు సీడ్రేస్ విత్తనాల స్థానం లో వాడచ్చు.అవిసగింజ పొడిని మీరు గ్రైండర్ లో వేయవద్దని.రోట్లో రోకలితో దంచిన తయారు చేసిన అవిస గింజల పొడి ని మజ్జిగలో కలపండి.పాలలో ను అవిసగింజలపొడిని కలిపి తీసుకోండి.బాగా మరుగుతున్న నీటిలో కలిపి వాడండి.లేదా అవిసపోడి ని తినవచ్చు.ప్రతిరోజూ 2౦-25 గ్రాముల అవిసపొడి తప్పకుండా తినండి ఇంట్లో వృద్ధులకు పెట్టండి.అవిసగింజలతో చేసిన లడ్డు అటు స్వేట్ కు స్వేటు ఇటు ఇమ్యునిటి పెరుగుతుంది అని నిపుణులు సూచిస్తున్నారు. అవిసగింజలతో బిపి ని నియంత్రించడం ఎలా... శాస్త్రజ్ఞులు నిర్వహించిన క్లినికల్ స్టడీస్ లో హై బ్లడ్ ప్రెషర్ బిపి తగ్గించడం లో అవిసగింజలు మంచి ఫలిత్గాలు ఇచ్చాయని 1 1/2 లేదా ఆ పైన అవిసగింజల్ పౌడర్ 2౦ గ్రాముల పొడిని 25౦ మందికి పైగా వినియోగించాగా హై బిపి తగ్గుముఖం పట్టిందని గమనించారు.అధికమోత్తలో లభిస్తున్న అవిస గింజల వాడకం వల్ల ఊబకాయం,బిపి ఇతర అనారోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం కాగలదని ఆశిద్దాం.

లివర్‌ను నాశనం చేసే 9  రకాల ఆహారాలు ఇవే...

మనశరీరం,లో కీలక మైన మరో అవయవం లివర్ అయితే లివర్ లో ఎప్పుడు సమస్య వస్తుందో,ఎలా ఎప్పుడు ముంపు పొంచి ఉందొ అంచనా వేయడం అసాధ్యం. అయితే మీరు తీసుకునే ఆహారం విహారం వ్యాయామం వంటి అంశాలు మీ లివర్ కు ప్రమాద కారిగా మారవచ్చు. హెపటైటిస్ వల్ల మీ లివర్ తీవ్రంగా దెబ్బ తింటుందని. నిపుణులు హెచ్చరిస్తున్నారు. చక్కర శాతం పెరిగిందా లివర్ డ్డ మాల్ ... మీకు చక్కెర  ఎక్కువగా తీసుకునే అలవాటు మీకు ఉందా?అది మీ పళ్లకు మాత్రమే నష్టం కాదు. మీ లివర్ ను కూడా నాశనం చేస్తుంది.హై ఫ్యాక్టోస్  కార్న్ సిరప్ కూడా ఫ్యాట్ కొవ్వును తయారు చేస్తుంది.అదే మీ లివర్ డిసీజ్ కారణంగా చెప్పవచ్చు. మీరు పెద్దగా ఊబకాయం తో లేకపోయినా ఆహారం పై నియంత్రణ అవసరమని నిపు ణులు హెచ్చరిస్తున్నారు.ఉదాహరణకు ఇప్పుడు వచ్చేది ఎండాకాలం సోడా వేసిన చల్లని పానీయాలు,దాహం తీరడానికి నిమ్మషోడా, రాత్రి కి మధ్యంలో షోడా, తియ్యగా ఉండే పెష్ట్రీలు,క్యాన్డీలు, చక్కెరను పెంచుతాయి. హెర్బల్ సప్లిమెంట్స్... సహజమైన ప్రక్రుతినుండి లభించినవి కూడా కాదు.మెనోపాజ్ ఉన్న వారు కావా కావా మూలికను తీసుకుంటారు. ఇది వాడితే కాస్త ఉపసమనం  ఉంటుందని అనుకుంటారు. అయితే అది మీ లివర్ ను సరిగా పనిచేయనివ్వదనే విషయం మీకు తెలుసా?. ఈ విషయం ఒక పరిశోదనలో వెల్లడించారు.కోవకోవ ను సప్లిమెంట్ ను విరివిగా వాడితే అది మీలివర్ ఫైల్యూర్ కు దారి తీస్తుంది.కోవా కోవా హెర్బ్ మూలికను కొన్ని దేశాలు ఇప్పటికే నిషేదించాయి.అయితే అమెరికాలో కోవా కోవా ఇప్పటికీ అందు బాటులో ఉండడం గమనార్హం.ఈ మూలికను వాడే ముందు మీరు మీ డాక్టర్ ను సంప్రదించడం అవసరం.కోవో కోవా మూలిక సురక్షితమా కదా అన్న విషయం తెలుసుకోండి. అదనపు బరువులు... మీ లివర్ లో అదనంగా కొవ్వు చేరుతుంది. అయితే అది ఆల్కాహాల్ ఫ్యాటీ లివర్ డిసీజ్ గా చెప్పవచ్చు. ఇక్కడ మీ లివర్ కు వాపు వచ్చి ఉండవచ్చు. అది గట్టిగా ఉండవచ్చు. లివర్ కణాల పై ఒక మరక ఉంటుంది దీనిని వైద్యులు సిరోసిస్ అని అంటారు. మీరు అధిక బరువు,ఊబకాయం మధ్య వయస్సుల వారు అయ్యి ఉంటె డయాబెటిస్ వచ్చి ఉంటె మీరు  మీ ఆహారం వ్యాయామం చేస్తే వ్యాధికి కొంత స హకరించ వచ్చు. అతిగా విటమిన్ ఎ వాడకూడదు... మీశరీరానికి విటమిన్ ఎ అవసరమే అయితే కొన్ని రకాల చెట్లనుండి. లేదా తాజా పళ్ళు ముఖ్యంగా ఎర్రగా ఉండే ఆరంజ్,దానిమ్మ, పసుపు పచ్చగా ఉండే పళ్ళు  ,కూరగాయాలుబీట్ రూట్,క్యారెట్ లలో ఉండే సప్లిమెంట్స్ వాడడం వల్ల విటమిన్ ఏ లభిస్తుంది. అతిగా విటమిన్ ఎ వాడడం వల్ల మీ లివర్ సమస్యకు కారణం అవుతుంది. మీ లివర్ ను పరీక్షించిన తరుబాత మాత్రమే సంప్రదించండి.విటమిన్ ఎ ను వాడడం బహుశా అవసరం రాకపోవచ్చు. శీతల పానీయాలు ... అసలే ఎండాకాలం ఎండలు ముదురు తున్నాయి. ఎండ వేడిమి భరించలేక ఏదైనా చల్లగా తాగాలని అనిపిస్తుంది ముఖ్యంగా ఎవరికైతే శీతల పానీయాలు వాడే అలవాటు ఉందొ వారికి నాన్  ఆల్కా హాల్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుంది. అయితే పరిశోదనలో శీతల పానీయాల వల్ల లివర్ వ్యాధి వచ్చింది అనేది నిరూపితం కాలేదు. అయితే అతిగా షోడాలు వాడితే సోడా లేకుండా పానీయాలు తీసుకుంటే పరవాలేదు.అయితే షోడా ఎక్కువగా తీసుకున్నారో మీలివర్ ను నాశనం చేస్తుంది. అందుకే వాటికి దూరంగా ఉండడం ఉత్తమమని గ్యాస్ట్రో నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసిటో మినోపెన్... మీరు తీవ్రమైన తల నొప్పి,జలుబు  లేదా మీ తల వేనుకభాగం వెన్నుపూస వీపు వెనుకభాగం, లో తీవ్రమైన నొప్పి తో బాధ పడుతూ ఉన్నారా ? అయితే మీ నొప్పి తగ్గాలంటే  ఉపసమ నానికి మీరు తప్పనిసరిగా అసిటో మినోపెన్ అధిక మోతాదులో కాకుండా సరైన మోతాదులో తీసుకుంటే నొప్పులు, జలుబుకు వాడవచ్చు.జలుబు కోసం మీరు అసిటో మినోపెన్ మాత్రను వాడితే మీ లివర్ నాశనం కావడం ఖాయం అంటున్నారు వైద్యులు.మీ డాక్టర్ ను సంప్రదించి ఏమోతాదులో వాడాలో వారి సూచనలమేరకు ఒకరోజు వాడవచ్చు. అది మీకు మేలు చేస్తుంది. సూచన మేరకే వాడండి అది మీకు మంచి చేస్తుంది లేదా అదే పనిగా అసిటో మేనోఫిన్ వాడితే మీ లివర్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కొవ్వు పదార్ధాలు... ట్రాన్స్ ఫ్యాట్స్ అవి మనం తయారు చేసిన కొవ్వు పదార్దాలే అందులో కొన్ని మనం ప్యాక్ చేసిన పదార్దాలే. అయితే అందులో కొంత హైడ్రోజన్ ఉంటుంది.దీనివల్ల కొంత బరువు పెరుగుతారు. అది మీలివర్ కు మంచిది కాదు. ఆ పదార్దాలాలో కొవ్వు ౦% అని ఉన్నా ట్రాన్స్ ఫ్యాట్ చిన్న మొత్తంలో ఉన్నా అది మరింత పెంచుతుంది అందుకే ట్రాన్స్ ఫ్యాట్స్ లేదా కొవ్వు పెంచే పదార్ధాలకు దూరంగా ఉండాలని అలాకాకుండా మీరు తీసుకునే కొవ్వు పదార్ధాలు అటు మీ గుండెకు ఇటు మీ లివర్ పై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చ్చరిస్తున్నారు. తప్పులు జరిగాయి... కొన్ని సందర్భాలాలో నర్సులు రోగికి వారు ఇస్తున్న ఇంజక్షన్ చట్ట పూర్వకంగా కావచ్చు చట్ట విరుద్ధంగా కావచ్చు. ఈ సమయంలో నీడిల్ వాడినా సమస్య సూది కాదు అది హెపటైటిస్ సి రక్తం ద్వారా చేరవచ్చు. ఇది ఒక్కసారి జరిగినా మీరు పెనుప్రమాదం లో ఉన్నట్లే ఒకవేళ మీకు హెచ్ ఐ వి లేదా హెపటైటిస్ గర్భిణీలు అయితే మీరు పరీక్షలు చేసుకోవాలి అయితే 1945 -1965 లోపు ఉన్న వాళ్ళు లివర్ ఫంక్షన్  పరీక్ష చేసుకోవాలి. మద్యాన్ని తక్కువగా తీసుకోవాలి... మీకు మాద్యం తాగే అలవాటు ఉందా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ మధ్యం తీసుకుంటే అది మీ లివర్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వద్యులు హెచ్చరిస్తున్నారు.అయితే మీ అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే  అతిగా మధ్యం తీసుకో కూడదని అది మీలివర్ ను పూర్తిగా నాశనం చేస్తుంది.అన్న విష్యం కనీసం మీ మిత్రులలో ఒకరికైనా వచ్చిఉంటుంది అయినా మద్యానికి బానిస అయ్యి మీరు తాగాల్సిన దానికన్నా ఎక్కువ తాగాలని భావిస్తే అంతే చాలు మీరు చాలా గ్లాసులు తాగినట్లే ఇదు ఔన్సులు మధ్యం లిక్కర్ తీసుకుంటే అది హుందాగా పెద్దమనిషి లక్షణంగా ఉంటుంది. స్త్రీలు అయితే ఒకటి పురుషులు అయితే రెండు అవున్సులు లేదా రెండు కప్పులు తీసుకోవచ్చు. ఏమైనా మీ లివేర్ను నాశనం చేసే వీటిపై జాగ్రత్త అని అంటోంది తెలుగు వన్ హెల్త్.  హెపటైటిస్ సి గనక వస్తే ప్రమాదమే,హెపటైటిస్ సి ఉంటె మీకు పచ్చకామెర్లు వాచ్చే అవకాశం ఉంది. అనుకే లివేర్ను అశ్రద్ధ చేయద్దు కొన్ని సార్లు లివర్ ట్రాన్స్ ప్లాంట్ కు వెళ్ళాల్సి రావచ్చు.   

ఎనర్జీ డ్రింక్స్ తో ప్రమాదమే!

ఎనర్జీ డ్రింక్ తక్షణ శక్తి నిచ్చే పానీయం వల్ల 6 రకాల ప్రమాదాలు ఉన్నాయన్న విషయం మీకు తెలుసా? ఎనర్జీ డ్రింక్స్ ను యురప్ లో 1987 లో తీసుకువచ్చారు.ఆతరువాత దీనికి పాపులారిటీ పెరిగిపోవడం తో ప్రపంచ వ్యాప్తంగా తక్షణ శక్తి  నిచ్చే పానీయాలకు ప్రజలు అలవాటు పడ్డారు.తక్షణ శక్తి నిచ్చే పానీయాలు నష్టం కలిగిస్తాయని విషయం మీకు తెలుసా? ఈ విషయం గురించి తెలుసుకుందాం. ఇది ఒక పెద్ద ప్రపంచం ప్రజలకి కొంచం ఓపిక తక్కువే ఇప్పుడు వారికి తక్షణం ఇన్స్టెంట్ ఎనర్జీ డ్రింక్ అంటే శక్తి నిచ్చే పానీయం చాలా మందికి ఒక ఫ్యాషన్ గా మారింది.ఇది ఎలా పనిచేస్తుంది దీనివల్ల వచ్చే దుష్పరిణామాలు ఏమిటో తెలుసా.? నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎనర్జీ డ్రింక్స్ ను ఆమోదించలేదు.ప్రజలు ఎనర్జీ డ్రింక్స్ కు దూరంగా ఉండాలని అయితే మీకు తక్షణ శక్తి నిస్తాయి.అనడం లో సందేహం లేదు అయితే దీర్ఘ కాలం లో వాడితే నష్టమే అని అంటున్నారు నిపుణులు. 1)కేఫెన్ డోస్ ఎక్కువైతే... కేఫెన్ మోతాదు ఎక్కువైతే హై బిపి వస్తుందా?-- తక్షణ శక్తి నిచ్చే పానీయాల లో కేఫెన్ అధిక మోతాదులో ఉంటుంది.చింతించాల్సిన విషయం ఏమిటి అంటే ఎనేర్జీ డ్రింక్స్ లో దాదాపు 2౦౦ గ్రాముల కెఫేన్ ఉంటుంది. ఒక్కోసారి దీనిస్తాయి 5౦౦ గ్రాములు ఉంటుందని అవసరమైన దానికంటే అధిక మోతాదులో కేఫెన్ ఉంటె హై బిపి పెరుతుందని. ఈకారణంగా గుండె వేగం గా కొట్టుకుంటుంది. కాల్షియం తగ్గడం  కూడా కారణం కావచ్చు. 2)టైప్2 దయా బెటిస్ వస్తుందా... మీరు తీసుకునే ఎనేర్జీ డ్రింక్స్ లో కేఫెన్ ఎక్కువ మోతాదులో ఉంటుబ్ది.ముఖ్యంగా ఇంజక్షన్ తో పాటు చక్కర అధికంగా పెంచుతుంది.ఈ కారణంగానే బరువు పెరగడం మరో సమస్యకు దారి తీస్తుంది.శక్తినిచ్చే పానీయాలలో అరలీటరు లో 22౦ క్యాలరీల ఉంటుంది.అది దయాబిటిస్ కు దారితీన్ సే ప్రామాడం  పొంచి ఉందని. నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ౩) మనస్సులో ఆందోళన-అసహనం... కొంతమందిలో జనటిక్ సమస్యలు ప్రారంభమౌతాయి.ఏండోక్రైన్ రెసేప్టర్స్ లో ఏరకమైన మార్పులు వస్తాయి. ఈకారణంగా వారిలో ఆందోళన రేకెత్తిస్తుంది.అవసర మైన దానికన్నా ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటే అందులో ఎక్కువ మోతాదులో కెఫీన్ ఉండడమే కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 4)కేఫెన్ తో పంటి సమస్యలు.... శక్తినిచ్చే పానీయాలలో అత్యధిక చక్కెర శాతం ఉంటుందని దృవీకరించారు.చక్కెర మీ దంతాలు పంటి ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది.ఇందులో ఉండే చక్కెర మోతాదు కారణంగా పళ్ళపై ఉండే ఎనామిల్ పోతుంది.ఈ కారణం గానే పళ్ళ లో హైపెర్ సెన్సిటివిటీ తోపాటు కేవిటీ సమస్యలు ప్రారంభమౌతాయని దంత వైద్యులు పేర్కొన్నారు. 5) శరీరంలో నీటి శాతం తగ్గి బలహీన పడతారు... ఎనర్జీ డ్రింక్ ఉపయోగించడం వల్ల శరీరంలో సత్వరం శక్తి నిచ్చేందుకు సిద్ధం అవుతుంది.ఈ కారణంగా నే ప్రజలు దీనిని వర్క్ అవుట్ చేసేటప్పుడు లేదా క్రీడా కారులు ఆడే సమయం లో ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం సహజం.మీరు ఎనర్జీ డ్రింక్ ను మంచినీటికి బదులుగా ఎనర్జీ డ్రింక్ తీసుకుంటారు.దీని ప్రభావంతో శరీరంలో నీటి శాతం తగ్గుతుంది.కేఫెన్ హెచ్చు స్థాయిలో ఉంటె మీ కిడ్నీ పై తీవ్ర ప్రభావం చ్చూపిస్తుంది ఏమాత్రం అశ్రద్ధ చేసినా కిడ్నీ నాశనం అవుతుంది.శరీరంలో డీ హైడ్రేషన్ ప్రారంభ మౌతుంది. కేఫెన్ తీసుకోవడం  మీశరీరానికి అలవాటుగా మారుతుంది.ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల వచ్చే మరోనష్టం ఏమిటంటే శరీరంలో కెఫెన్ పేరుకుపోతుంది.ముఖ్యంగా నేటి యువతరం వర్క్ అవుత  సెషన్ కు ముందే ఒక్కోబోటిల్ తాగాల్సి ఉంటుంది.సమయానుకూలంగా మీరు తీసుకునే డ్రింక్స్ లేకుండా పని చెయడం కష్టంగా ఉడే స్థితికి చేరతారు. 

మీకూ ఆఫీసులో నిద్ర ముంచుకొస్తుందా... అయితే ఇది తప్పక చదవాల్సిందే..

బాగా గమనిస్తే ఆఫీసులలో చాలా మంది నిద్రమత్తుతో ఉంటారు. ఇలాంటి  సమస్యలతో మీరు కూడా  ఇబ్బంది పడుతుంటే దీని గురించి కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే ఇది కేవలం మీ ఒక్కరి సమస్య కాదు. ఇది  ఉద్యోగాలు చేస్తున్న జనాభాలో కనీసం 15శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్టు తెలిసింది.  ఆఫీసులో నిద్రపోవడం కేవలం ఆఫీసులో తోటి ఉద్యోగస్తులు, బాస్ ముందు పరువు తీయడమే కాదు.. ఇది చెయ్యాల్సిన వర్క్ మీద కూడా గణనీయంగా ప్రభావం చూపిస్తుంది.  అయితే ఆఫీసు వేళల్లో నిద్రపోవడానికి కారణం ఏమిటి? ఇలా ఎందుకు జరుగుతుంది తెలుసుకుంటే.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, పగటిపూట లేదా ఆఫీసులో  నిద్రపోవడానికి ప్రధాన కారణం రాత్రి నిద్ర లేకపోవడమే. ప్రతి ఒక్కరికీ  6-8 గంటలు నిద్ర అవసరం. అంత సమయం నిద్రపోకపోతే, లేదా ఈ నిద్రాక్రమం అస్తవ్యస్తమైతే.. దీని కారణంగా  పగటిపూట కూడా నిద్రపోయేలా అనిపించవచ్చు. అంతే కాకుండా కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. కొన్ని వ్యాధుల కారణంగా పగటిపూట ఎక్కువగా నిద్రపోవడం లేదా ఎక్కువగా పగటి సమయంలో నిద్రపోతుండటం జరుగుతుంది. కొన్ని శారీరక  ఆరోగ్య  పరిస్థితులు, మానసిక ఆరోగ్య రుగ్మతలు దీనికి  కారణమని భావించవచ్చు. డిప్రెషన్-ఆందోళన, స్కిజోఫ్రెనియా, లూపస్, పార్కిన్సన్స్ వ్యాధి, మల్టిపుల్ స్క్లెరోసిస్,  హైపోథైరాయిడిజం మొదలైన వ్యాధుల ప్రమాదం ఇలా పగటి సమయంలో నిద్రపోవడం అనే ప్రక్రియ కారణమవుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే ఇవి రెండూ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. న్యూరోలాజికల్,  న్యూరోడెజెనరేటివ్ వ్యాధులు.. నార్కోలెప్సీ వంటి నరాల సంబంధిత రుగ్మతలు  ఉన్నప్పుడు  పగటిపూట కూడా నిద్రపోవడం జరుగుతుంది. నార్కోలెప్సీలో మెదడు నిద్రమేల్కొనే చక్రాన్ని సరిగ్గా నియంత్రించలేకపోతుంది. నార్కోలెప్సీ ఉన్నవారు అధికంగా లేదా అకాల నిద్రపోవడానికి ఇదే కారణం. ఇది కాకుండా, వృద్ధులలో డిమెన్షియా లేదా పార్కిన్సన్స్ వ్యాధుల కారణంగా,  పగటిపూట అధికంగా  నిద్రపోయే సమస్య కూడా ఏర్పడుతుంది. ఆహారంలో ఆటంకాల వల్లా..  పగటిపూట  నిద్రపోయే సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు  మధ్యాహ్నం భారీ భోజనం తీసుకోవడం దీనికి ఒక కారణం. షుగర్ అధికంగా ఉన్న  స్నాక్స్, సోడా, వైట్ బ్రెడ్, రైస్ వంటి కార్బోహైడ్రేట్ అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల కూడా  నిద్ర బాగా వస్తుంది. దీనికి పరిష్కారం కావాలంటే తేలికపాటి ఆహరం తీసుకోవాలి.  ఆరోగ్యకరమైన. పోషకమైన ఆహారాన్ని తినడం వల్ల  శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా,  శక్తి స్థాయిలను మెరుగుపరుస్తుంది  నిద్రలేమిని తగ్గిస్తుంది. నిద్రను దూరం చేయడానికి ఏమి చేయాలంటే..  ఆఫీసులో పదే పదే నిద్రపోతున్నట్లు అనిపిస్తే దాన్ని వదిలించుకోవడానికి తక్కువ మొత్తంలో కెఫిన్‌తో కూడిన పదార్థాలు తీసుకోవచ్చు. కెఫీన్  మెదడు  నాడీ వ్యవస్థలో కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది. కాఫీ-టీ నిద్రను దూరం చేస్తుంది. ఇదిమాత్రమే  కాకుండా ఒకే చోట ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కూడా  నిద్ర వస్తుంది. అందుకే పనిచేసే  స్థలం నుండి అప్పుడప్పుడు లేచి  తిరగడం వల్ల రక్త ప్రవాహం పెరుగుతుంది, శరీర నీరసం పోతుంది. నిద్ర కూడా నియంత్రణలో ఉంటుంది.                                                                    *నిశ్శబ్ద.

మహిళల గుండెకు ముప్పు పొంచి ఉందా ?

పురుషుల కన్నా మహిళల్లో నే గుండెపోటు సమస్యతో మరనిస్తున్నారు .సహజంగా స్త్రీలకు ఆరోగ్యం పట్ల పెద్దగా శ్రద చూపరు. ఎచిన్న సమస్యకైన మళ్ళీ వస్తే చూద్ద్దాం అన్న ధోరణిలో ఉంటారు.అదే వారి పాలిట శాపం గా మారుతుంది ఒక కేసు విష యం లో రోగి పరిస్థితి చూసిన డాక్టర్ చాలా ఆగ్రహంగా మాట్లాడుతూ ఇన్ని రోజుల నుండి రాకుండా ఏమి చేసారు. ఇప్పుడు చూడండి 7౦% బ్లాక్స్ ఏర్పడ్డాయి.కోపంగా మందలించారు.చెమట పడుతుంటే వేడి ఎక్కువగా ఉంది కదా అని అనుకున్నా మెట్లు ఎక్కు తుంటే ఆయాసం వస్తుంటే పనెక్కువ అయ్యిందని అందుకే అలసట వచ్చిందని అనుకున్నా. గుండె నొప్పి నాకు ఎందుకు వస్తుంది? అని సరి పెట్టుకున్నా కాని ఇలా జరుగుతుందని అనుకోలేదు. అని అన్నది ఆమె.కన్న బిడ్డకు చిన్న జలుబు చేసినా కంగారు పడిపోతారు.భర్తకు చిన్న జ్వరం వచ్చినా హడావిడి చేస్తారు. ఇంట్లో ఎవరికీ ఏం జరిగినా కంగారు పది పోయే డి ఆ ఇంటి మహాలక్ష్ములే. అదే మహిళలు తమ అనారోగ్య గురించి మాత్రం పట్టించుకోరు అందుకు చాలా సందర్భాలాలో జబ్బు బాగా ముదిరి పోయే దాకా చికిత్సకు వెళ్లరు. ఇక గుండె జబ్బు విషయానికి వస్తే అదేదో మగ వాళ్ళకు మాత్రమే వచ్చే జబ్బుగా అనుకుంటారు. గుండె జబ్బుకు స్త్రీలు, పురుషులు అన్న పక్ష పాతం ఉండదు. ఆ కులము ఈ కులము అన్న వివక్ష ఉండదు. ఈ మతము ఆమతము అన్న పక్ష పాత ధోరణి గుండెకు ఉండదు. ఎవరు అన్నారు గుండె జబ్బులు పురుషులకు మాత్రమే వచ్చే వని స్త్రీలకు భావోద్వేగాల ను భరించే శక్తి సహనం ఎక్కువే. ఓర్పు ఒర్చుకోవడం స్త్రీ ల ప్రవృత్తి. అందుకే ఆమె గుండె గట్టిది. అంటూ ఉంటారు. అందుకే మన వాళ్ళు ఆడవాళ్లకు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉండవని ఉన్నా అతి తక్కువే అని భావిస్తూ ఉంటారు. ఇది చాలా తప్పుడు అభిప్రాయం గా చెప్పవచ్చు. నిజానికి పురుదులతో పాటు సమానం గా మహిళలలో కూడా గుండె జబ్బుల అవకాశం  ఎక్కువే సాధారణంగా మహిళలలో క్యాన్సర్ బాధితులు అదీ రోమ్ముక్యాన్సర్ సర్వికల్ క్యాన్సర్ ,ఎక్కువగా వస్తూ ఉంటాయి. అది వాస్తవమే అయినప్పటికీ క్యాన్సర్ల కన్నా గుందేజబ్బుల వల్ల మరణించిన వాళ్ళే ఎక్కువ అని ఒక అద్యయనం లోతేలింది. స్త్రీలను వేదించే సమస్యలలో క్యాన్సర్ కన్నా 6 వంతులు ఎక్కువ అవకాశం గుండె పోటు కే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు గుర్తించారు.ముఖ్యంగా స్త్రీలు ౩౦ సంవత్సరాలు దాటగానే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని భావించి క్యాన్సర్ స్క్రీనింగ్ కు వెళుతూ ఉంటారు.అయితే పనిలో అనిగా గుండెకు సంబందించిన పరీక్షలు చేయించుకోడం లో మాత్రం ఎందుకో తాత్సారం చేస్తారు. తమ గుండె గట్టిదనే నమ్మకం తో ధీమా తో ఉంటారు.విద్యా వంతులైన మహిళలు కూడా తమ ఆరోగ్యం పట్ల ఉదాసీనంగా ఉండడం అంత క్షేమం కాదు. గుండె పోటు మహిళ్ళలో రావడానికి కారణాలు... గుండె పోటు అంటే అది మగవాళ్ళకు మాత్రమే వస్తుందనేది కేవలం అపోహ మాత్రమే అని అంటున్నారు అపోలో ఆసుపత్రికి చెందినా  ప్రముఖ హృద్రోగ నిపుణులుడాక్టర్ ఎ  శ్రీనివాస్. ఇప్పటికే చాలా మందిలో అదే ఆపోహ కలిగి ఉండడం విచారకరం అనారు వైద్య నిపుణులు.చాతిలో నొప్పి అని అనిపించినా అది గ్యాస్ నొప్పో,మరేదైనా నొప్పి గా భావిస్తారు. తప్ప గుండె నొప్పిగా అనుమానించరు. ఆడవాళ్ళలో గుండేనొప్పి తక్కువ కాబట్టి నాకు గుండె జబ్బు రావడం ఏమిటి నాకు అస్సలు గుండె నొప్పి వచ్చే అవకాశం లేదని విశ్వాశం తో ఉంటారు స్త్రీలు. స్త్రీలకూ గుండె జబ్బు ఉండనే విషయాన్ని గుర్తించడం లో మిస్ అవుతూ ఉంటారు .ముఖ్యంగా స్త్రీలు మెనోపాజ్ తరువాత మరణిస్తున్న మహిళల లో ప్రాధాన కారణం గుండె పోటే అయి ఉంటుంది.సాధారణంగా మెనోపాజ్ దశలో ఊపిరాడక పోవడం,బలహీనం గా ఉండడం, గుండె దడ నీరసం, లాంటివి ఎక్కువగా ఉంటాయి. స్త్రీలలో గుండె సమస్య ఉన్నప్పుడు కూడా ఇలాంటి లక్షణాలే ఉంటాయి. కాబట్టి చాలా మంది వీటిని గుర్తించలేరు అని అంటారు హృద్రోగ నిపుణులు శ్రీనివాస్.దాదాపు మెనోపాజ్ లో ఉండే సమస్యలే కదా అని అనుకుంటారు. అందుకే చాలా సందర్భాలలో  తమకు గుండె జబ్బు ఉందన్న విషయాన్ని గుర్తించలేక పోతారు.కొన్ని సార్లు స్త్రీలలో వచ్చే ఆయాసాన్ని ఆస్తమాగా పోప్రబడతారు. లేదా నీరసం గా ఉన్నాం కదా అందుకే ఆయాసం గా ఉందేమో అనుకుంటారు.చాలా సంఫర్భాలలో మహిళలు గుండె నొప్పిని గుర్తించక పోవడానికి ఇదే కారణం. అయితే గుండె నొప్పి లక్షణాలు కూడా మహిళ ల్లో వేరు వేరు గా ఉంటాయి అని శ్రీనివాస్ విశ్లేషించారు.సాధారణ గుండేనొప్పి లాగా నొప్పి పాకుతూ ఉంటుంది. సాంప్రదాయిక గుండె నొప్పి లక్షణాలు ఏవి ఉండక పోవచ్చు. ఆయాసం గా ఉండడం, చమట పట్టడం వంటి లక్షణాలు గుండె నొప్పి అన్న విషయాన్ని కలిగించవు. నీరసం,బలహీన పడి పోవడం కూడా గుండె జబ్బు అన్న అనుమానాన్ని కలిగించవు. నీరసం బలహీన పడి పోవడం కూడా గుండె జబ్బు లక్షనమం గానే బహిర్గతం అవుతాయి కాని అవి సాధారణ అనారోగ్యపు లక్షణాలుగా పర్గానించడం వల్ల ఒక్కోసారి గుండె జబ్బును కనిపెట్టడం మిస్ అవుతారు.ఇలాంటి సమయం లో చిన్న బ్లాక్ ఉన్నా అది హటాత్తుగా  విచ్చినం చెందవచ్చు. దాంతో అకస్మాతుగా గుండెపోటు వచ్చి కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. ఫలితం గా ప్రాణాల మీదకు వస్తుంది. అలా కాకుండా క్రమం తప్పకుండా గుండె పరీక్షలు చేయించుకుంటే ఇలా అకాస్మాతుగా గుండె పోటుకు గురి అయ్యే అవకాశాలు ఉండవు. అందుకే మెనో పాజ్ దశలో లక్షణాల లో అశ్రద్ధ చేయవద్దని 4౦ ఏళ్ళు దాటినా గుండెకు సంబందించిన అన్ని పరీక్షలను క్రమం తప్పకుండా చేయిన్చుకోవాలి.అవగాహన ఉన్న వాళ్ళు కూడా క్యాన్సర్ కోసం పాప్స్మియర్ టెస్ట్ లు మమ్మో గ్రామ్ మామో గ్రఫీ, చేయించు కోవడం లేదు. చాలా మందికి మొదటి సారి గుండెపోటు రావడమే ప్రాణా పాయానికి  దారి తీస్తుంది.  పరీక్షల్లోనూ వేరుగా ఉంటాయి... సాధారణ లక్షనాలాతో గుండె జబ్బును కనిపెట్టడం కష్టం. కాబట్టి మహిళ ల్లో డయాగ్నిస్టిక్ పరీక్షలు కీలకం అవుతాయి. కొన్ని సార్లు ఈ పరీక్షలలో కూడా గుండె జబ్బు ఉన్నా లేనట్లుగా తేలే అవకాశాలు లేకపోలేదు. అందు వల్ల మహిళలు గుండెజబ్బు గుర్తించడం లో వైద్యుల నైపుణ్యం తో పాటు అన్ని రకాల పరీక్షలు ప్రాధాన పాత్ర వహిస్తాయని వాటి అన్నిటి సమీకృత ఫలితాలను బట్టే నిర్ధారణ చేయాల్సి ఉంటుంది.నిపుణులైన డాక్టర్లు మాత్రమే కేస్ హిస్టరీ ని బట్టి పరీక్షలు చేయిస్తారు. ఈ పరీక్షలలో ముఖ్యంగా ఇ సి జి ఎకో పరీక్షలు మార్పులు కూడా ప్రత్యేకంగా ఉంటాయి .ఒక్కోసారి టి ఎం టి పరీక్ష కూడా తప్పుగా చూపించ వచ్చు. జబ్బు ఉన్న లేదని లేకున్నా ఉందని రావొచ్చు. కాబట్టి ఒకే పరీక్ష ఆధారం గా చెప్పలేము. ఈ పరీక్ష లన్నిటికీ బెరేజు వేసుకుని ఒక నిర్ధారణకు రావాల్సి ఉంటుంది.ఆంజియో గ్రామ్ లో కూడా మహిళల డి ప్రత్యేకతే. పురుషులకన్న మహిళల శరీర నిర్మాణం చిన్నదిగా ఉంటుంది. అదే విధంగా రక్త నాళాలు సైతం చిన్నవిగా ఉంటాయి. అన్జియో గ్రామ్ చేసేటపుడు ఉపయోగించే చేయి లేదా  కాలి రక్త నాళాలు కూడా చిన్నగా ఉంటుంది. కాబట్టి అన్జియో గ్రామ్ చాలా జాగ్రతగా చేయాలి. నైపుణ్యం లేకుండా అన్జియోగ్రామ్ చేస్తే సరైన ఫలితాలు రావు.మహిళ ల్లో గుండె రిస్క్ ఎక్కువ... కొలస్ట్రాల్ పేరుకుపోయి అదేరో స్క్లిరో సిస్ రావడం సర్వ సాధారణం కాని మహిళలలో రక్త నాళాలు స్పాసమ్ అంటారు రక్త నాళాలు పట్టేసినట్లు. అయిపోవడంవల్ల కుంచించుకు పోతాయి.తద్వారా రక్త ప్రసరణ కష్టం అవుతుంది. రక్త నాళాలు పెద్దవైతే జబ్బు మొదలై నప్పటికీ రక్తం ప్రసరించడానికి ఇంకా చోటు ఉంటుంది. కాబట్టి అడ్డంకి పెద్దది అయ్యే వరకూ జబ్బు ముదరదు. కాని రక్త నాళం చిన్నదిగా ఉండడం వల్ల చిన్న అడ్డకి ఏర్పడినా సమస్య ఎక్కువ అవుతుంది. అందు వల్ల ఒకే సైజు బ్లాక్ పురుషులలో అద్దంకి కాక పోయినా మహిళలలో మాత్రం పెద్ద సమాస్య అయి కూర్చుంటుంది. మహిళల లోనే రిస్క్ ఎక్కువ. పురుషుల కన్నా మహిళల్లో రక్త నాళాల పరిణామం చిన్నదిగా ఉండడం వల్ల చికిత్స విధానం లో కూడా వేరుగా ఉండడం వెర్రిలో రక్త నాళాలు మూసుకు పోయే అవకాశం చిన్న సైజు స్టెంట్ వాడాల్సి ఉంటుంది. పెద్ద రక్త నాళాలలో మళ్ళీ అడ్డంకులు ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది.చిన్న రక్త నాళాలు ఉన్నప్పుడు స్తేన్టింగ్ సరిగా చేయకుండా మళ్ళీ క్లోత్స్ రక్తం గడ్డ కట్టే అవకాశం లేదా అడ్డాకులు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటాయి. రక్త నళాలలో అడ్డంకులు ఏమేరకు ఉన్నాయో తెలుసుకోడానికి వాడే పరికరాలు కూడా మరింత ఆధునిక సంతరించుకుని అందుబాటులోకి వచ్చాయి ఇంట్రా వాస్క్యులార్ అల్ట్రా సౌండ్ ఆప్టికల్ కోహారెన్స్ టమో గ్రఫీ ద్వారా చికిత్సకు ముందు తరువాత అడ్డంకులు ఎలా ఉన్నాయి అన్నది పరిశీలిస్తారు. అయితే ఆధునిక పరిజ్ఞానం తో పాటు నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉండడం కూడా ప్రాధాన అంశం. గుండెపోటు వస్తే... మహిళల లో కూడా మరణాల రేటు ఎక్కువ మగ వాళ్ళ కన్నా మూడు వంతులు ఎక్కువ సాధారణ మొదటి సారి గుండెపోటు వచ్చిన తరువాత చికిత్సచికిత్స చేయించు కోకుంటే పురుషులలో 2౦% రిస్క్ ఉంటె మహిళ లలో 5౦% రిస్క్ ఉంటుంది. రక్త నాళాలు చిన్న సైజువి కాబట్టి బైపాస్ లో కూడా రిస్క్ ఎక్కువ గా ఉంటుంది. కాబట్టి చాలా సున్నితంగా హ్యాండిల్ చేయాలి స్టెంట్ సరిగా పెట్టక పోతే సమస్య మళ్ళీ మొదటికి వస్తుంది. సమర్దులైన నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోక పోతే పంపింగ్ సామర్ధ్యంభయపడాల్సిన అవసరం లేదు.జబ్బు ఉందన్న విషయాన్ని సకాలం లో గ్రహించకుండా తెలిసి నిర్లక్ష్యం చేసినా ఎటువంటి చేయించుకోక పోతే గుండె పంపింగ్ సామర్ధ్యం తగ్గిపోతూ వస్తుంది. ఇలాంటప్పుడు ఇటీవలే అందు బాటులోకి వచ్చిన బై వెంట్రీ క్యులర్ పెసింగ్ అన్న విధానం సత్ఫలితాలు ఇస్తుంది. గుండె పంపింగ్ సా మర్ధ్యం పెరగడం కోసం ఇక మరో దారి లేదనుకున్నప్పుడు దీనిని వాడతారు. నివారణా ఉపాయాలు... సమస్య ఉన్నప్పటికీ నిపుణులైన వైద్యుల పర్యవేక్షణ లో మందులు జాగ్రత్తగా వాడుకుంటే గుండె జబ్బును అదిగా మించ వచ్చు.అయితే నివారణ అన్నది అన్నిటికన్నా ఉత్తమం.గుండెను కాపాడు కోవాలంటే ప్రధానంగా జీవన శైలి లో మార్పులు చేసుకోవడం అవసరం.ఒత్తిడి తగ్గించుకునే ప్రయాత్నం చేయాలి దైనందిన వైవాహిక జీవితం లో సమస్యలు రాకుండా చూసుకోవాలి. ప్రతి రోజూ వాకింగ్ చేసుకోవాలి.బిపి షుగర్ కొలస్ట్రాల్ రెగ్యులర్ గా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఒక వేళ ఈ సమస్యలు వచ్చినా అదుపులో ఉంచుకోడానికి డాక్టర్ సలహా మేరకు తప్పని సరిగా సలహా తీసుకోవాలి.సూచించిన విధంగా మందులు వాడుకోవాలి.స్థూల కాయం మధుమేహం సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడాలి.                                                 

మీ లివర్ వంద సంవత్సరాలు ఉంటుందని మీకు తెలుసా?

పరిశోదనా శాస్త్రజ్ఞులు యు ఎన్ ఓ ఎస్ పద్ధతి ద్వారా అంటే నెట్ వర్క్ ఫర్ ఆర్గన్ షేరింగ్ విధానం ద్వారా లివర్ ట్రాన్స్ ప్లాంట్ నూతన పద్దతిలో లివర్ ట్రాన్స్ ప్లాంట్ లు విజయవంత మయ్యాయి. అసలు లివర్ ఎన్నాళ్ళు  జీవిస్తుంది,దానివయస్సు ఎంత? లివర్ ట్రాన్స్ ప్లాంట్ ఏ వయస్సువారికి చేయాలి? ట్రాన్స్ ప్లాంట్ తరువాత 1౦౦ సంవత్సరాలు బతక గలదా?2,5౩,4౦6 లివర్ ట్రాన్స్ ప్లాంట్ ను 199౦-2౦22-25 లో లివర్ 1౦౦ సంవత్చరాలు జీవించి ఉండడాన్ని గమనించారు.యూనివర్సిటి ఆఫ్ టెక్సాస్ కు చెందినసౌత్ వెస్ట్రర్న్ మెడికల్ సెంటర్,డల్లాస్, ట్రాన్స్ మేడిక్స్, ఆండో వర్స్ మసాచుట్స్ చలాచిన్నదే అయితే లివర్ పెరుగుదల ట్రాన్స్ ప్లాంట్ 1౦౦ సంవత్సరాలు జీవించడం అన్నదే ఇక్కడ కీలకం.శాస్త్రజ్ఞులు లివర్ గుర్తించడం,లక్షణాలు అవయవము స్థిరంగా నిశ్చలంగా ఉంటాయి. ఇతరులు దానం చేసిన లివర్ సైతం దీర్ఘకాలం ఉంటుంది.వ్యక్తికివయస్సు వచ్చిన లివర్ వయసులో మార్పు రాదా ?సైంటిఫిక్ ఫోరం ఆఫ్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ క్లినికల్ కాంగ్రెస్ 2౦22 బృందం పరిశోదనలు నిర్వహించింది. పరిశోధకులు ఇందుకోసం యు ఎన్ ఓ ఎస్ యునైటెడ్ నెట్ వర్క్ ఫర్ ఆర్గన్ షేరింగ్ విధానం లో ఒక పద్ధతి నియమ నిబందనల ప్రకారం అనుసరించి లివర్ ను 1౦౦ సంవత్చరాలు జీవించి ఉండే విధంగా సిద్ధం చేయచ్చు. ట్రాన్స్ ప్లాంట్ తరువాత వారు జీవించి ఉండడం ముఖ్యం.లివర్ దానం చేసిన దాతల వయస్సు లివర్ ఎన్ని సంవత్సరాలు లివర్ తీసుకున్న వ్యక్తి జీవించగలగడం ముఖ్యమని పరిశోదనకు సారధ్యం వహించిన యాష్ కోడాకియా సౌత్ వెస్ట్రర్న్ మెడికల్ స్కూల్ కి చెందిన విద్యార్ధి. లివర్ పై పరిశోదనలు చేసి 1౦౦ సంవత్చరాలు జీవిస్తాయని నిర్ధారించారు.ఇందులో ట్రాన్స్ ప్లాంట్ కీలక మని ఇది చాలా అరుదైన పద్దతిని అనుసరించడం వల్ల లివర్ 1౦౦ సంవత్సరాలు జీవిస్తుంది. 1౦౦ సంవత్సరాలు ఉన్న లివేర్స్ వ్రుద్దులనుంచి వచ్చినవే... సెంచూరియన్ లో 1౦౦ సంవత్సరాలు జీవించిన లివర్ దాతల వయస్సు 84.7 సంవత్చరాల పైనే ౩8 --55 సంవత్సరాలు వారికి లివర్ ట్రాన్స్ ప్లాంట్ కొన్ని వంద సంవత్సరాలు జీవించి ఉంటాయని గుర్తించారు వృద్ధులు వయసు మళ్ళిన దాతల వయస్సు ఆరోగ్యంగా ఉన్న వారిని వీరిలో డయాబెటిస్,ఇన్ఫెక్షన్ తక్కువే అని గుర్తించారు.గతం లో వయస్సు మళ్ళిన వారి వద్ద నుండి లివర్ వినియోగించేందుకు సిగ్గు పడేవారని సెప్టెంబర్ 2౦ 22  నాటికి లివర్ ట్రాన్స్ ప్లాంట్ కోసం ఎదురుచూసే వారి సంఖ్య పెరిగిపోయింది.వయస్సు మళ్ళిన వారి లివర్ చాలా ఫలవంతంగా లివర్ దాతలను పెంచగాలిగా మన్నారు. పరిశోదన వివరాలు... సెంచూరియన్ లివర్ దోనార్స్ ట్రాన్స్ మీటర్ ఎంజాయిం లు లివర్ లో కీలక పాత్ర పోషిస్తుంది ట్రాన్స్ మినేషణ్ చేయడం వల్ల లివర్ లో సమస్యలు వస్తాయని మరల లివర్ ట్రాన్స్ ప్లాంట్ చేయాలి సెంచూరియన్ లివర్ దాతలు 17 నుండి 22 మంది ఉంటారు.ఇందులో రోగులకు అత్యవసరంగా ట్రాన్స్ ప్లాంట్ అవసరమైన వారే ఉన్నారని పరిశోధకులు పేర్కొన్నారు. దాతలను తగ్గించి... లివర్ పొందే వారి సంఖ్య ను సగానికి తగ్గించి మేలే పద్ధతి మంచి ఫలితాలు ఇచ్చిందని డాక్టర్ కడాకి యా వెల్లడించారు.సెంచూరియన్ గ్రూప్ ఎలాంటి గ్రాఫ్టింగ్ చేయలేదని ప్రాధమికంగా గుండె పనిచేయక రక్తనాళాలు సరిగా లేకపోవడం ఇతర బైలేరి సమస్యలు లేకుండా ఉండాలని లివర్ ట్రాన్స్ ప్లాంట్ తిరస్కరించిన దాఖాలాలు తక్కువే అని సెంచూరియన్,నాన్ సెంచూరియన్ గ్రాఫ్ట్ లలో వ్య్సత్యాసం గమనించిన ప్పుడు సెంచూరియన్ విభాగం లో ఎలా గ్రాఫ్ట్ విజయవంతంగా నిర్వహించ గలిగామని అన్నారు రోగులు బతికి బట్ట కట్ట గలిగారు. ఆలో గ్రాఫ్ చేసిన 1౦౦ సంవత్సరాలు పాతవే అయినా ఫలితాలు ప్రభావవంతంగా ఉన్నాయని శాస్త్రజ్ఞులు వెల్లడించారు.లివర్ సహజంగానే దీర్ఘకాలం పాటు మన్నుతుంది డాక్టర్ కోడాక్ మేము పాతకాలం నాటి దాతలు ఇందుకోసం ఉత్తమ సర్జరీ పద్దతులు అవలంబిస్తున్నాము ఇమ్యునో సర్ప్రస్ లోఆధునిక పద్దతులు దాతలు పొందే వారి లివర్ ను పొంతన చేయడం పోల్చి చూస్తే లివర్ పొందే వారిని పూర్తిగా పరీక్షిస్తాము. దీనిద్వారా మంచిఫలితాలు ఉంటాయి.                                                                                      

పిల్లలకు పారాసిట్ మాల్ వాడుతున్నారా అయితే జాగ్రత్త!

ఇండో నేషియా దేశం లో పసి ప్రాణాలు   మొగ్గలోనే రాలిపోయాయి. ఈ విషయానికి సంబంధించి ఇండో నేషియా ఆరోగ్య శాఖ అధికారులు నాడియా తర్మిజీ మాట్లాడుతూ ఎక్యుట్ కిడ్నీ ఇంజురీ బారిన 189 మంది శిశువులు దీనిబారిన పడ్డారని. ముఖ్యంగా 5 సంవత్చారాల లోపు పిల్లలు ఫెటర్న టేస్ ఉండడం గమనార్హం. ఇండోనేషియాలో 74 మంది పిల్లలు ఎక్యుట్ కిడ్నీ ఇంజురీ గాంబియా లోనే 7౦ మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది.  పిల్లలు తీవ్ర జ్వరం తో బాధపడుతూ ఉండడం తో. స్థానికంగా ఉత్పత్తి చేసిన పరాసిట్ మాల్ సిరప్ కారణం గానే మరణించారా అన్న అనుమానం వ్యక్త మౌతోంది. ఈ మందులో డై తిలిన్,గైకాల్, ఎతిలిన్ వంటివి దగ్గుమందులల్లో గుర్తించారు న్యుడిల్లికి చెందిన ఫర్మా కంపెనీ రూపొందించిన మందులు గాంబి యాలో అమ్మినట్లు తెలుస్తోంది అయితే పిల్లల మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ వివిదేశాలను ఇప్పటికే అప్రమత్తం చేసింది. ఇండో నేషియా ప్రభుత్వ అధికారులు ఆహారం మందుల ఉత్పాదతకత సంస్థ దక్షిణ ఆశియాలో అందు బాటులో లేవని ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ నిషేదించారని తెలుస్తోంది. ఇండోనేషియా ఆరోగ్య శాఖ అధికారి సిటి నాదియా తర్మిజీ మాట్లాడుతూ ఎక్యుట్ఇంజురీ బారిన పడిన వారి ని 189 కేసులను ఇండోనేషియాలో కనుగొన్నట్లు ఇందులో 5 సంవత్స్చారాల లోపు పిల్లలు 74 మంది శిశువులు పూర్తిగా దీనిబారినజనవరి నుండే  పడుతున్నప్పటికీ గ్రహించకపోవడం తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతోంది. దీనికి గల కారణాలు ఏమిటి అని ఇంకా గుర్తించ లేదని ఇంకా పూర్తివివరాలు అందాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. పిల్లల మరణాల పై గతవారం లోనే ఒక నిపుణుల కమిటీ విచారణకు అదేసిన్చామని నాదియా తర్మినీ అన్నారు. ఈ విచారణ కమిటీలో ఇండోనేషియా ఆరోగ్య ఆధికారులు,పిల్లల వైద్యనిపుణులు,పిడియాట్రిక్ అసోసియేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులను విచారణ చేస్తారని అధికారులు వెల్లడించారు. మంత్రిత్వ శాఖ పిల్లలకు ఇచ్చిన మందుల వివరాలను సేకరించాలని ఏమోతాదులో వాడారో తెలుసుకోవాలి డబ్ల్యు హెచ్ ఓ గంబియాలో విచారణ జరుపుతుందని అన్నారు.ప్రభుత్వం ఉత్తర్వులు జరీ చేస్తూ విచారణ పూర్తియ్యేవరకూ సిరప్ అమ్మకాలు నిలుపుదల చేసింది. కారణం ఏదైనా పిల్లల మరణాలకు కారణం సరైన మందుల,లేక నిషేదిత మందులా అన్నది తెలాల్సి ఉంది.                               .    

జున్ను తింటున్నారా? ఇది చదవండి అయితే!

జున్ను తినలేదు ఇప్పటి వరకు అని ఎవరైనా చెప్పారు అంటే అది నిజంగా చాలా పెద్ద వింత అనుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాలలో ఎంతో విరివిగా దొరికే జున్ను చాలా మంచి పౌష్టికాహారం అని అంటారు. అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే… నాణేనికి రెండవవైపు వాదించేవారు ఉన్నారు. వారు చెప్పేది ఏంటంటే.. జున్ను ఆరోగ్యానికి హానికరం అని. ఇంకా జున్ను గురించి చాలా విషయాలు అనుమానాలుగానే ఉండిపోతున్నాయి అందరికీ. వాటిని నివృత్తి చేసే సమాచారం ఇదిగో ఇదే… జున్నుని అని సంస్కృతంలో పీయూషం అని అంటారు. అలాగే పన్నీర్ అని హిందీలో అంటారు. ఇంకా ఇంగ్లీష్ లో అయితే చీజ్ అని అంటారు. ప్రస్తుతం చీజ్ ఆధారిత వంటలు రోడ్ సైడ్ నుండి రెస్టారెంట్ల వరకు ఒకటే హల్చల్ చేస్తుంటాయి. అయితే అదంతా కృత్రిమమైనది.  నిజమైన జున్ను అంటే.. ఆవులు లేదా గేదెలు ఈనిన మూడు నుంచి వారం రోజుల వరకూ వచ్చే పాలు ఇస్తాయి. ఈ పాలను 'ముర్రుపాలు' అంటారు. వీటిలో పచ్చదనం ఎక్కువ వుంటుంది. ఎక్కువ కొవ్వు పదార్థాలుంటాయి. ఇలా ఆవులు, గేదెలు ఈనిన మూడు నుండి వారం రోజుల లోపు ఇచ్చే పాలను పల్లె ప్రాంతాలలో ఆ దూడలు తాగగా మిగిలిపోయేవాటిని పిండి తమకు తెలిసిన ఇళ్లకు పంచుతుంటారు. ఈ పాలలో పంచదార లేదా బెల్లం, మిరియాల పొడి, యాలకులు పొడి వేసి స్టవ్ మీద కాచినప్పుడు ఆ పాలు గట్టిగా అవుతాయి. గడ్డ పెరుగులా… ఎంతో రుచిగా ఉంటుంది ఈ జున్ను.  జున్నులో ఏముంది? జున్నులో 355 కేలరీలు ఉంటాయి. అదే పాల నుండి మనకు లభించే వెన్నలో 716 కేలరీలు ఉంటాయి. పాల నుండి లభించే మీగడలో 204 కేలరీలు ఉంటాయి. ఇలా మూడింటిని పోల్చి చూసుకుంటే, పాల మీగడకు, వెన్నకు మధ్యగా జున్నులో కేలరీలు ఉంటాయి. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే… ఎక్కువ కేలరీలు అవసరమయ్యే వారు మాత్రమే జున్నును ఆహారంలో భాగంగా తీసుకోవద్సమ్ మంచిది. మరీ ముఖ్యంగా షుగర్, కీళ్ల వాతం జబ్బులు, అధికబరువు గలవారు, వాతం సమస్యలు ఉన్నవారు జున్నును దూరంగా ఉంటే మంచిది. ఈ సమస్యలు ఉన్నవారు జున్ను తీసుకుంటే అనారోగ్య సమస్యలు సులువుగా అధికమయ్యే అవకాశం ఉంటుంది. ప్రొటీన్ల కథ : జున్నులో ప్రొటీన్ల శాతం ఎక్కువ ఉంటుంది. ఇది నాణ్యమైన ప్రొటీన్, శరీరానికి త్వరగా చక్కగా వంటబట్టే ప్రోటీన్లు ఇందులో ఉంటాయి. పైన చెప్పుకున్నట్టు వెన్న, మీగడతో పోల్చి చూస్తే వెన్నలో, మీగడలో ప్రోటీన్లు చాలా తక్కువ ఉంటాయి. అదే జున్నులో అయితే వీటన్నికంటే ఎక్కువగా ఉంటుంది.  జున్నులో ఉండే ప్రోటీన్ల కంటెంట్ జీడిపప్పు, బాదంపప్పు, పిస్తాపప్పు వంటి ఖరీదైన పప్పులకన్నా ఎక్కువగా ఉంటుంది.  దీన్ని బట్టి చూస్తే ప్రోటీన్ లోపంతో బాధపడేవారికి  చిక్కి శల్యమై పోతున్నవారికీ, టీబి, ఎయిడ్స్ వంటి శరీర సామర్థ్యాన్ని క్షీణింపచేసే వ్యాధులతో బాధపడే వారికి జున్ను చాలా మేలు చేస్తుంది.  కొవ్వు: కొవ్వు శాతం పోలిస్తే.. వెన్నలో 81 శాతం కొవ్వు వుంటే, జున్నులో 26.9%, మీగడలో 20% కొవ్వు వున్నాయని తెలిసింది.  కాబట్టి వెన్న కన్నా జున్నులోనే  తక్కువ కొవ్వు ఉంది.  పై విషయాలు అన్నీ గమనిస్తే.. జున్నును తినకూడని పదార్థంగా భావించాల్సినంత ప్రమాదం ఇందులో ఏమీ లేదు. అయితే అతి అనేది అన్నింటిలోనూ ప్రమాదమే కాబట్టి జున్నును కూడా మితంగా తీసుకోవడం మంచిది.  జున్ను వల్ల లాభాలు:- జున్ను తినడం వల్ల లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో అన్నివిధాలా పోషకాలు, కొవ్వులు, ప్రోటీన్లు తగినమొత్తంలో ఉండటం వల్ల శారీరకంగా బలహీనంగా ఉన్నవారికి జున్ను మేలు చేస్తుంది.శారీరకంగా చాలామంది అధిక వేడితో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారి శరీరవేడిని తగ్గిస్తుంది. పైత్యం చేసి ఇబ్బంది కలిగే వారు జున్ను తీసుకుంటే పైత్యం తగ్గిపోతుంది. కడుపులో మంటను తగ్గిస్తుంది. మంచి నిద్రకు సహాయపడుతుంది. రక్త సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. గుండెకు మంచి చేస్తుంది. గొంతు సంబంధ సమస్యలతో బాధపడేవారికి ఆ సమస్యలు నయం చేస్తుంది.  సహజంగానే జున్నులో ప్రొటీన్లు, కొవ్వు ఎక్కువగా ఉంటుంది కాబట్టి, జీర్ణమవడానికి సమయం ఎక్కువ తీసుకుంటుంది. జీర్ణశక్తి సరిగా లేనివారు  దీన్ని తిన్నప్పుడు అది సరిగా అరగకపోగా వాతదోషం కఫదోషాలు పెరిగి, శరీరం బరువెక్కడం, మలబద్దకం, కడుపునొప్పి, కడుపులో  బరువు ఏదో తెచ్చిపెట్టినట్లు అనిపించడం... వంటి బాధల్ని కల్గిస్తుంది. వాతదోషం పెరిగి, కాళ్ళు చేతులు నొప్పులు, కీళ్ళు వాచిపోవడం, నడుంనొప్పి, శరీరం కదలకుండా బిగుసుకు పోయినట్లవడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. అందుకని, జున్నుపాలు కాచేప్పుడే అందులో కొద్దిగా మిరియాల పొడిని కలిపి జున్ను తయారుచేస్తారు. దీనివల్ల తేలికగా అరిగేందుకు ఈ మిరియాల పొడి సహకరిస్తుంది. వాతకఫ దోషాలను పెరగకుండా అదుపులో వుంచుతుంది. ఈ బాధలున్నవారు జున్నును పరిమితంగా తినాలి. ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోకపోతే, పాత రోగాలు తిరిగి మొదలయ్యేలా చేస్తుందని జున్ను గురించి హెచ్చరిస్తారు వైద్యులు. ఇదీ జును రహస్యం...                                    ◆నిశ్శబ్ద