Goli venkata reddy final rites

అమెరికాలోనే రెడ్డి అంత్య క్రియలు ?

      గత ఆదివారం అమెరికాలోని సిన్సినాటిలో గల తన షాపులో హత్యకు గురి అయిన గోలి వెంకట రెడ్డి అంత్య క్రియలు అమెరికాలోనే చేయాలని ఆయన బంధువులు నిర్ణయించారు. రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు అమెరికాలో గ్రీన్ కార్డ్ ఉంది. నిబంధనల ప్రకారం వెంకట రెడ్డి మృత దేహాన్ని స్వదేశానికి పంపే వీలు లేకపోవడంతో అక్కడే అంత్య క్రియలు చేయాలని నిర్ణయించారు.   కరీంనగర్ జిల్లా కోహెడ మండలం గుండా రెడ్డి పల్లికి చెందిన వెంకట రెడ్డి గత 12 సంవత్సరాలుగా అమెరికాలోనే ఉంటున్నారు. ఈ కేసులో ఇంత వరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని కోలోరియన్ టౌన్ షిప్ పోలీస్ అధికారి మీడియా ప్రతినిధులతో అన్నారు.

Congress ap telangana

కాంగ్రెస్ లో అఖిలం చిచ్చు !

      రాష్ట్ర కాంగ్రెస్ విభాగంలో తెలంగాణాఫై ఢిల్లీ లో జరిగిన అఖిల పక్ష సమావేశం చిచ్చు రగిల్చినట్లు కనిపిస్తోంది. ఈ సమావేశం అనంతరం ఆ పార్టీ నేతలు ఎవరికీ ఇష్టం వచ్చినట్లు వారు ప్రకటనలు ఇస్తూ పోతున్నారు. ఈ సమావేశం పనికిమాలిందనీ, నెల రోజుల్లోపు తెలంగాణా వస్తుందని తనకు అసలు నమ్మకం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత కె.కేశవ రావు తేల్చి చెప్పారు. మరోవైపు, రాష్ట్రం ఇప్పటిలాగే ఉంటుందని, అసలు విడిపోదని మాజీ మంత్రి, శాసనసభ్యుడు గాదె వెంకట రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. గాదె ప్రకటనఫై ఆ పార్టీ నేతలు కాస్త తీవ్రంగానే ప్రతిస్పందించారు. ఆయన ఆలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేయవద్దని, అసలు అలా చెప్పే అధికారం ఆయనకు పార్టీ అధిష్టానం ఇచ్చిందా అని ఓ శాసనమండలి సభ్యుడు విమర్శించారు. మరోవైపు షిండే ప్రకటనఫై విశ్వాసం ఉంచాలని, సమస్య పరిష్కారానికి అనువైన వాతావరణం కల్పించాలని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యానారాయణ తన పార్టీ నేతలకు హితవు పలుకుతున్నారు. గాదె అభిప్రాయం వ్యక్తిగతం అయి ఉండవచ్చని బొత్స అన్నారు. అంతే సురేష్ రెడ్డి చెప్పింది కాంగ్రెస్ పార్టీ నిర్ణయమా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తాను ఆ సమావేశంలో ఎలాంటి వైఖరి అవలంభించాననే విషయాన్ని మాత్రమే గాదె చెపుతున్నారు. ఇలా కాంగ్రెస్ లో ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు భిన్నమైన ప్రకటనలు ఇచ్చుకొంటూ పోతున్నారు.

 Gade Venkata Reddy

షిండే అలా అనలేదు : గాదె

      రెండు రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉందని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే అనలేదని, అలా అన్నట్లు నిరూపిస్తే, తాను తక్షణం రాజకీయ సన్యాసం తీసుకొంటానని శాసనసభ్యుడు, కాంగ్రెస్ తరపున ఈ సమావేశానికి హాజరయిన గాదె వెంకట రెడ్డి అన్నారు. అఖిల పక్ష సమావేశంలో ఏమి చెప్పాలనే విషయంలో తమ పార్టీ అధిష్టానం తమకు పూర్తి స్వేచ్చ ఇచ్చిందని, తాను వెల్లడించిన అభిప్రాయం, సురేష్ రెడ్డి చెప్పిన అభిప్రాయాల్లో ఎవరి అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ గౌరవిన్చిందో త్వరలో షిండే చేసే ప్రకటనతో తెలిసిపోతుందని గాదె వ్యాఖ్యానించారు. నిన్న హైదరాబాద్ లో సిఎల్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సమావేశంలో తాను మాట్లాడుతుండగా తనకు ఎవరూ అడ్డు చెప్పలేదని, తాను మూడు దఫాలుగా మాట్లాడాననీ గాదె వివరించారు. పార్టీ తరపున ఒకే అభిప్రాయాన్ని వినిపిద్దామని తాను ముందుగానే సురేష్ రెడ్డి కి చెప్పానని, అయితే, దానికి ఆయన అంగీకరించలేదని గాదె వివరించారు.ఆ సమావేశంలో జరిగిన వాస్తవానికి భిన్నంగా బయట ప్రచారం జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.  

jagan jail

త్యాగమయులు జగన్ పార్టీ నేతలు

      పండుగనాడు ఇంటిపెద్ద ఏఆసుపత్రిలోనో, జైల్లోనో ఉంటే ఆ కుటుంబము ఏవిదంగా బాధపడుతుందో, అదేవిదంగా వైయస్సార్ కాంగ్రెస్ నేతలు కూడా ఇప్పుడు బాధపడుతున్నారు. అతని జన్మదినం, క్రిస్మస్, నూతన సంవత్సరం వంటి ముఖ్యమయిన మూడు వేడుకలను చంచల్ గూడా జైల్లోనే జరుకోవలసివస్తున్నతమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరిస్థితిచూసి తల్లడిల్లిపోతున్న, ఆ పార్టీ నేతలు ఈసారీ తాముకూడా నూతనసంవత్సర వేడుకలు జరుపుకోకుడదని నిర్ణయించుకొన్నారు. తమ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డిని కుట్రపూరితంగా కావాలనే జైల్లో నిర్భందించిన సిబిఐ ఆయనకు ఆరు నెలలయినా కూడా బెయిల్ రాకుండా అడ్డుపడుతోందని వైయస్సార్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి శంకర్ రావు ఇదివరకు కోర్టుకు వ్రాసిన లేఖలో జగన్ పేరు అట్టడుగున ఉండగా, సిబీఐ మాత్రం తమ పార్టీ నాయకుడి పేరును మొట్టమొదటి ముద్దాయిగా పేర్కొనడమే సిబిఐ కుట్రకి నిదర్శనమని కూడా వారు ఒక వింత వాదనచేస్తున్నారు. ఒక మాజీమంత్రి కోర్టుకు వ్రాసిన ఒక లేఖని వారు ప్రామాణికమని ప్రజలకి చెప్పబోవడమే విడ్డూరం. మొన్న హైకోర్టు చేత చివాట్లుతిని బయటపడిన శంకర్ రావు లేఖలో జగన్ ముద్దాయి అని వ్రాసినట్లు వారే చెప్పుకోవడం మరో వింత. ఏది ఏమయినప్పటికీ, జగన్ పార్టీవల్ల, తనకు లాభం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ భావించినప్పుడు మాత్రమే, చంచల్ గూడా జైలు తలుపులు అలనాడు వసుదేవుడు చిన్నారి శ్రీ కృష్ణుడ్ని బుట్టలో పెట్టుకొని వ్రేప్పల్లె బయలుదేరినప్పుడు వాటంతట అవే తెరుచుకున్నట్లు, రేపు ఎన్నికలముందు తెరుచుకొనే అవకాశం ఉంది. లేదంటే, ఇక జగన్మోహన్ రెడ్డికి సిబిఐ, కోర్టుల దయాదాక్షిన్యాలకోసం ఎదురుచూపులు తప్పవు.   

congress

‘కమీషన్ల’ వరకే నామినేటేడ్ పరిమితం ?

      ఎంతో కాలం నుండి కాంగ్రెస్ పార్టీ నేతలు ఎదురు చూస్తున్న నామినేటేడ్ పదవుల భర్తీ ఇప్పట్లో జరగక పోవచ్చని తెలుస్తోంది. వాస్తవానికి వీటిని జనవరి మొదటి వారంలో భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. అయితే, ఇంతలో తెలంగాణాఫై అఖిల పక్ష సమావేశం జరగడం, ఈ విషయంపై నెల రోజుల్లో తమ నిర్ణయాన్ని తెలియచేస్తామని కేంద్ర హోం మంత్రి షిండే ప్రకటించడంతో ఈ పదవులను ఆశిస్తున్న నాయకుల ఆశలఫై నీళ్ళు చల్లినట్లయింది.   కేంద్రం ఈ విషయంలో నిర్ణయాన్ని ప్రకటించేంతవరకూ ఈ భర్తీ చేపట్టకూడదని ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు వీటిని భర్తీ చేస్తే, కొత్త సమస్యలు వస్తాయని కిరణ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే, కీలకమైన ఎస్సీ, ఎస్టీ కమీషన్, మహిళా కమీషన్ల లోని చైర్ పర్సన్, సభ్యుల పదవులను మాత్రం ప్రస్తుతానికి భర్తీ చేయాలని ముఖ్య మంత్రి ఆలోచనగా తెలుస్తోంది. వీటిలో ఎస్సీ, ఎస్టీ కమీషన్ లోని పదవి కోసం 140 మంది పార్టీ నాయకులు, పదవీ విరమణ చేసిన ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే, మహిళా కమీషన్ చైర్ పర్సన్ కు కూడా పోటీ అంతే స్థాయిలో ఉందని సమాచారం. దీని కోసం 38 మంది కాంగ్రెస్ నేతలతో పాటు, మొత్తం 120 మంది పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కమీషన్ల లోని పదవులను మాత్రమే భర్తీ చేయాలని, మిగిలిన వాటిని తెలంగాణాఫై నిర్ణయం వెలువడిన తర్వాతే భర్తీ చేయాలనేది ముఖ్య మంత్రి ఆలోచనగా సమాచారం.  

Shinde telanagana

‘30’ రోజుల మాట మార్చేసిన కేంద్రం ?

            తెలంగాణా రాష్ట్రం విషయంలో నెల రోజుల్లో ఓ నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పిన మాటల్ని నమ్మాల్సిన పని లేదా ? నిన్న ఢిల్లీ లో జరిగిన అఖిల పక్ష సమావేశం అనంతరం షిండే మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు.   అయితే, నిన్న సాయంత్రం కేంద్ర హోం మంత్రిత్వశాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఈ మాట మారిపోయింది. ఈ అంశంఫై ఈ గడువు లోగా నిర్ణయం ఉంటుందని ఆ ప్రకటనలో ఎక్కడా లేదు. తెలంగాణాఫై నెల రోజుల్లోగా నిర్ణయం తీసుకుంటామని ఈ సమావేశంలో షిండే తమతో అన్నారని ఈ సమావేశంలో సిపిఎం తరపున హాజరైన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు మీడియా ప్రతినిధులతో కూడా అన్నారు.   ఒక్క నెల రోజులు అగలేరా అంటూ కొంత మంది తెలంగాణా కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు ఇతర పార్టీలకు సలహా ఇచ్చాయి కూడా. షిండే చేసిన ప్రకటన, ఆ తర్వాత స్వయానా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటనను పరిశీలిస్తే, కేంద్రం ‘నెల’ రోజుల మాటను మార్చేసిందని అనుకోవాలా? ఆ శాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటనఫై రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.

Harish rao lokesh

అటెండర్ పోస్టుకు రెడీ : హరీష్

      తాను అన్న మాటకు కట్టుబడి తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో అటెండర్ పోస్టుకు సిద్దంగా ఉన్నానని టిఆర్ఎస్ శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. తెలంగాణా కు అనుకూలంగా తన తండ్రి లేఖ ఇచ్చినందున ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో అటెండర్ పోస్టు చేయడానికి హరీష్ రావు సిద్దంగా ఉన్నారా అని నారా లోకేష్ నిన్న ట్విట్టర్ లో ప్రశ్నించిన విషయం తెలిసిందే.   తెలంగాణా కు అనుకూలంగా చంద్ర బాబు కేంద్ర మంత్రి చిదంబరానికి లేఖ ఇచ్చినట్లయితే, తాను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో అటెండర్ పోస్టు చేస్తానని హరీష్ రావు గత జనవరి 13 న సిద్ధిపేట లో తెలంగాణా దీక్షలకు సంఘీభావ కార్యక్రమంలో మాట్లాడుతూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.   లోకేష్ ట్విట్టర్ వ్యాఖ్యలకు హరీష్ రావు స్పందిస్తూ, తాను అటెండర్ పోస్టుకు సిద్దంగా ఉన్నానని, అయితే,చంద్ర బాబు ముందుగా ‘జై తెలంగాణా’ అనే నినాదం చేసి, తెలంగాణా అమరవీరుల స్మారక స్థూపాల వద్ద దండలు వేయాలని అన్నారు. హరీష్ తన స్పందనను మరో సామాజిక అనుసంధాన సైట్ ఫేస్ బుక్ లో ప్రచురించారు.

Telangana all party

తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన కేసిఆర్

        ఢిల్లీలో జరిగిన అఖిల పక్ష సమావేశం ముగిసింది. పెద్దగా సంచలన అభిప్రాయలేమీ ఇక్కడ వెలువడలేదు. ముందునుండి అనుకున్నట్లుగానే ఆయా పార్టీలు తమ అభిప్రాయాలను తెలియచేసాయి.   తెలుగు దేశం పార్టీ తరపున మాట్లాడిన కడియం శ్రీహరి 2008 లో కేంద్రానికి ఇచ్చిన లేఖలోని అంశాలకు తాము ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని అన్నారు. అదే పార్టీ నుండి హాజరైన యనమల రామకృష్ణుడు తన అభిప్రాయాన్ని లేఖ ద్వారా తెలియచేసారు. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ నుండి ఈ సమావేశంలో పాల్గొన్న గాదె వెంకట రెడ్డి తెలంగాణాకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండటంతో, మంత్రి ఆయనను ఆపి అదే పార్టీకి చెందిన సురేష్ రెడ్డికి అవకాశం కల్పించారు.   తెలంగాణాఫై బిల్లు పెడితే, దానికి మద్దతిస్తామని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది. ప్రత్యెక రాష్ట్రం విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని జగన్ పార్టీ నుండి హాజరైన ప్రతినిధులు షిండే కు చెప్పారు. ఎంఐఎం పార్టీ తరపున ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజించడాన్ని వ్యతిరేకించారు. ఒక వేళ విభాజించాల్సి వస్తే, రాయల తెలంగాణా ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో సత్వర నిర్ణయం తీసుకోవాలని సిపిఐ కేంద్రాన్ని కోరింది. సిపిఎం మాత్రం సమైక్యాంధ్రకు అనుకూలంగా తన నిర్ణయాన్ని తెలియచేసింది.   ఈ సమావేశం ఫలితంతో సంతృప్తి చెందని టిఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర రావు రేపు తెలంగాణా బంద్ కు పిలుపు ఇచ్చారు.

Telangana all party

నేడే మీటింగ్

          అందరూ చాలా ఆసక్తితో ఎదురు చూసిన అఖిల పక్ష సమావేశానికి ఇంకా కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. ఈ సమావేశానికి రావాలని ఆహ్వానం అందిన రాష్ట్రంలోని ఎనిమిది రాజకీయ పార్టీల నేతలు నిన్న సాయంత్రమే ఢిల్లీ చేరుకున్నారు. అన్ని పార్టీలు ఈ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహానికి అనుగుణంగా తమ ప్రతినిధులకు తగిన శిక్షణ ఇచ్చి పంపిస్తున్నాయి. దాదాపు అన్ని పార్టీల లక్ష్యం ఇతర పార్టీలను ఇబ్బంది పెట్టడమేనని తెలుస్తోంది.   అసలు కాంగెస్ పార్టీ అభిప్రాయమేమిటో చెప్పాలని తెలుగు దేశం పార్టీ నిలదీసే అవకాశం కనిపిస్తోంది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముందుగా తన అభిప్రాయాన్ని చెప్పాలని జగన్ పార్టీ ప్రతినిధులు డిమాండ్ చేయనున్నారు. అలాగే, టిఆర్ఎస్,బిజెపి,సిపిఐ పార్టీలు కూడా ముందు కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలని గట్టిగా డిమాండ్ చేయాలని పధక రచన చేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో పడే అవకాశం కనిపిస్తోంది.   రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీ లైన కాంగ్రెస్, తెలుగు దేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయకుండా,ఇతర పార్టీలను ఇబ్బందుల్లోకి ఎలా నేట్టాలో మాత్రమే ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక తెలంగాణా కోసమే పుట్టిన టిఆర్ఎస్ ఈ మూడు పార్టీలను ఇరుకున పెట్టి, 2014 ఎన్నికల్లో విజయ పధాన దూసుకుపోవాలని పధక రచన చేస్తోంది. ఏది ఎలా ఉన్నా, నేటి సమావేశం అనంతరం రాష్ట్ర రాజకీయాలు మరో సారి వేడేక్కుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

 Jagan rebellion  sabbam hari

‘జగన్ ను విడుదల చేయకపోతే తిరుగుబాటు తప్పదు’

        వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్ మోహన్ రెడ్డి ని జనవరి నెలాఖరులోగా విడుదల చేయకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారని ఆ పార్టీ నేత, పార్లమెంట్ సభ్యుడు సబ్బం హరి హెచ్చరించారు. చరిత్రలో ప్రజలు చేసిన తిరుగుబాటులను ఏ శక్తులూ అడ్డుకోలేకపోయారని హరి అన్నారు.   జగన్ ను జైలుకే పరిమితం చేయాలన్న కుట్రను భగ్నం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. విశాఖపట్నం జిల్లా పాడేరులో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.     తన తండ్రి వైఎస్ రాజ శేఖర రెడ్డి ఆశయాలను సాధించేందుకు ప్రజల్లోకి వచ్చి వారి ఆధారాభిమానాన్ని పొందడం చూడలేకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ నేతఫై కక్ష కట్టాయని హరి అన్నారు. జగన్ దోషి అయితే తగిన ఆధారాలు చూపించాలే గానీ, దర్యాప్తు సంస్థలు, జుడిషియల్ విభాగాలు ఇలా కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాల రాజు కూడా పాల్గొన్నారు.

 Prapancha Telugu Mahasabhalu

తెలుగు తల్లి విగ్రహం వద్ద భూమన దీక్ష

      ప్రపంచ తెలుగు మహా సభలకు నిర్వహణ తీరుకు నిరనసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆందోళన చేపట్టారు. తెలుగు తల్లి విగ్రహం వద్ద నల్లజెండా కట్టి దీక్షకు దీగారు. భూమన దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనకుండా పోలీసులను భారీగా మొహరించారు. మరోవైపు తిరుపతిలో ప్రపంచ మహాసభల ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పూర్ణకుంభం వద్ద తెలుగు తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలుగు వైభవం...మహా జనయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమ౦లో మంత్రులు పార్ధసారధి, వట్టివసంత కుమార్, గల్లా అరుణకుమారి, శైలజానాథ్, తితిదే చైర్మన్ కనుమూరి బాపిరాజు తదితరులు హాజరయ్యారు.

Jagan all party

తెలంగాణాకు జగన్ పార్టీ ఓకె ?

        రేపు జరిగే అఖిల పక్ష సమావేశంలో తెలంగాణాకు అనుకూలంగా తన నిర్ణయం చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రత్యెక రాష్ట్రాన్ని ఇస్తే, తమకు అభ్యంతరం లేదని జగన్ పార్టీ ఈ సమావేశంలో తన అభిప్రాయంగా చెప్పనుంది. తన తల్లి విజయమ్మ ద్వారా, పార్టీ నిర్ణయాన్ని జగన్ తన పార్టీ నేతలకు అధికారికంగా తెలియచేసినట్లు సమాచారం.   ఒక వేళ పార్లమెంట్ లో తెలంగాణాఫై బిల్లు ప్రవేశపెడితే, దానికి తాము మద్దతు ఇస్తామని కూడా ఆ పార్టీ ప్రతినిధులు మైసూరా రెడ్డి, మహేందర్ రెడ్డి లు సమావేశంలో చెప్పనున్నట్లు తెలుస్తోంది. దీనితో, తెలంగాణాఫై సత్వర నిర్ణయం తీసుకోవాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేయనున్నారు. మైసూరా రెడ్డి వ్యక్తిగతంగా తెలంగాణా కు అనుకూలం కానప్పటికీ, పార్టీ నిర్ణయానికి అనుగుణంగా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.   తెలంగాణా అనుకూల వైఖరి తీసుకున్నా, సీమాంధ్ర ప్రాంతంలో తమ పార్టీకి వచ్చిన ఇబ్బందేమీ లేదని జగన్ పార్టీ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలఫై ప్రజలకు వ్యతిరేకత ఉన్నందున, సీమాంధ్ర ప్రజలకు తమ పార్టీకి ఓటు వేయడం తప్ప మరో మార్గం ఉండదని ఆ పార్టీ భావిస్తోంది. మరో వైపు ఈ వైఖరి వల్ల తెలంగాణా ప్రాంతంలో తమ ఓటు బ్యాంకు పెరుగుతుందనేది ఆ పార్టీ నేతల అంచనా.

Bala Krishna tdp

అభ్యర్దుల ఎంపికలో బాల కృష్ణ బిజీ ?

          వచ్చే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు సరైన అభ్యర్దులను ఎంపిక చేసే పనిలో ఎన్టిఆర్ కుమారుడు, చంద్ర బాబు వియ్యంకుడు బాల కృష్ణ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. గెలిచే అవకాశం ఉన్న అభ్యర్దుల గురించి ఆయన ఆరా తీస్తునట్లు సమాచారం.   జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్. 10 లోగల తన స్నేహితుని నివాసంలో తన సన్నిహితులతో ప్రతి రోజూ ఆయన సమావేశం అవుతూ ఈ కసరత్తు చేస్తున్నారని తెలిసింది. ఈ ఎన్నికల్లో ప్రతి నియోజక వర్గం నుండి ఉన్న ఆశావహుల జాబితా, వారి ఆర్ధిక పరిస్థితి, రాజకీయానుభవం వంటి విషయాల గురించి తెలుసుకోవడానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.   ఈ విషయాలను సేకరించి, అభ్యర్దుల ఎంపికలో ఓ తుది నిర్ణయానికి రావాలని ఆయన భావిస్తున్నారు. ఇలాంటి సమావేశాలతో పాటు, అభ్యర్దుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి నందమూరి అభిమాన సంఘాల నుండి కూడా బాల కృష్ణ విషయ సేకరణ చేస్తున్నారు.   ఇలా సేకరించిన అభిప్రాయాలతో టికెట్ ఖాయమని ఆయన కొంతమందికి హామీ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. తెలుగు దేశం పార్టీఫై పట్టు సాధించడం కోసం కూడా ఆయన అంతర్గత ప్రయత్నాలు చేస్తున్నట్లు భావిస్తున్నారు.

 Ap nominated posts

‘నామినేటేడ్’ కోసం నేతల కుస్తీ

      రాష్ట్రంలో నామినేటేడ్ పదవుల భర్తీ త్వరలో జరుగుతుందని ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించడంతో ఆ పదవులను పొందేందుకు నాయకులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ పదవులకు తమ పేర్లు పరిశీలించాలని ఆశావహులు కిరణ్ కుమార్ వద్ద, ఢిల్లీ లో పార్టీ పెద్దల వద్ద ఫైరవీలు తీవ్ర స్థాయిలో చేస్తున్నారు.   మిగిలిన పదవుల భర్తీ కాస్త ఆలస్యం అయినా మహిళా కమీషన్, బిసి కమీషన్, ఎస్సీ, ఎస్టీ కమీషన్, మైనారిటీ కమీషన్ ల చైర్మన్ పదవులను మాత్రం వెంటనే భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర మహిళా కమీషన్ కు నేదురుమల్లి రాజ్య లక్ష్మి, మజ్జి శారద ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మైనారిటీ కమీషన్ చైర్మన్ పదవికి అబిద్ రసూల్ ఖాన్ పేరు పరిశీలిస్తారని తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ పదవికి కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ భర్త, మాజీ ఐ ఆర్ టి ఎస్ అధికారి పనబాక కృష్ణయ్య పేరు వినిపిస్తోంది. ఆయన గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున శాసనసభకు పోటీ చేసి ఓడిపోయారు.   గత ఐదు సంవత్సరాల నుండి ఈ పదవుల భర్తీ జరగకలేదు. దీనితో, ఈ పదవుల కోసం గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నాయకులంతా కన్నేసినట్లు తెలుస్తోంది.

 Nagam janardhana reddy telangana

జగన్ పార్టీకి నాగం వార్నింగ్

      తెలంగాణా ఫై స్పష్టమైన వైఖరి ప్రకటించకపోతే, కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలకు పట్టిన గతే పడుతుందని శాసనసభ్యుడు నాగం జనార్ధన రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. అలాగే, తెలంగాణా ఫై కాంగ్రెస్ కూడా స్పష్టమైన అభిప్రాయం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.   ఈ విషయంలో కాంగ్రెస్ తన వైఖరిని ప్రకటించకపోతే, ఆ ప్రాంతంలో కాంగ్రెస్ జెండాలను ఎగరనివ్వబోమని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. ఢిల్లీ లో జరిగే అఖిల పక్ష సమావేశంలో అన్ని పార్టీలు తెలంగాణా కు అనుకూలమని చెప్పాలని నాగం అన్నారు. కొన్ని వందల మంది ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు చేసుకొన్నా జగన్ పార్టీ, తెలంగాణా కు అనుకూలంగా నిర్ణయం ప్రకటించకపోవడం దారుణమని నాగం అభిప్రాయపడ్డారు.   తెలంగాణా విషయంలో సీమాంధ్ర పార్టీలన్నీ కుమ్మక్కు అయినట్లు కనపడుతుందని ఆయన అన్నారు.ప్రత్యెక రాష్ట్రాన్ని అడ్డుకోవడానికి వీలుగా పార్టీలు తమ అభిప్రాయాన్ని బయటపెడుతున్నాయని ఆయన అన్నారు. తెలంగాణా కు చెందిన నాయకులంతా, తమ తమ పార్టీలను ఈ విషయంలో ఒప్పించాలని నాగం అన్నారు.

గుజరాత్ పర్యటనను రద్దు చేసుకున్న బాలయ్య

      గుజరాత్ పర్యటనను తెలుగు సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ విరమించుకున్నారు. గుజరాత్ సీఎంగా బుధవారం ప్రమాణం చేయనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా నరేంద్ర మోడీ బాలయ్యను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమానికి వెళ్లినట్లయితే టీడీపీలో విభేదాలు రావచ్చుననే ఆలోచనలతో బాలకృష్ణ గుజరాత్ పర్యటనను విరమించుకున్నారు. మోడీ ప్రమాణ స్వీకారానికి బాలయ్య వెళ్తే పార్టీకి ఉన్న లౌకికవాద ముద్రకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందనే భయాలను పార్టీ నాయకుల నుంచి వ్యక్తం కావడంతో చంద్రబాబు ప్రతిస్పందించారు. చంద్రబాబు వైఖరి తెలియడంతో బాలయ్య తన గుజరాత్ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.

జగన్ నివాసాల్లో సోదాలు జరగాలి : యనమల

    వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి బంకర్లలో అక్రమంగా కోట్లాది రూపాయలు దాచిపెట్టారని వాటిని వెలికి తీసేందుకు సిబిఐ, ఈడి, కేంద్ర విజిలెన్స్ సంస్థలు రంగంలోకి దిగాలని తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత యనమల రామ కృష్ణుడు అన్నారు.   ఇడుపులపాయ, హైదరాబాద్ లోని లోటస్ పాండ్, పులి వెందుల బంగాళా, బెంగుళూరు ప్రాంతాల్లోని జగన్ నివాసాల్లో ఈ తరహా సంస్థలు ఎలాంటి తనిఖీలు చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతాల్లో గల ఆయన నివాసాల్లోని బంకర్లలో అక్రమంగా దాచిన డబ్బును వెలికితీయాలని యనమల డిమాండ్ చేశారు.   ఈ తనిఖీలు జరపకుండా ఉండే విషయంలో కాంగ్రెస్ పార్టీతో జగన్ పార్టీకి ఓ ఒప్పందం కుదిరిందని ఆయన ఆరోపించారు. వీటిని చేపట్టేందుకు ప్రత్యేక తనిఖీ బృందాలను నియమించాలని ఆయన కోరారు. ఈ విషయాల్లో తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నవారిని అందులో నియమించాలని యనమల సూచించారు.   జగన్ కు చెందిన కేవలం రూ. 43,000 కోట్ల రూపాయలను మాత్రమే సిబిఐ ఇప్పటివరకూ కనుగొందని, మిగిలిన విచారణ అంతా పూర్తి అయితే, ఈ సంఖ్య లక్ష కోట్లు దాటుతుందని యనమల వ్యాఖ్యానించారు.

వైఎస్ భూపందేరంఫై బాబు ధ్వజం

        దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనంతా అవినీతిమయమని తెలుగు దేశం అధినేత చంద్ర బాబు నాయుడు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మాఫియాలను తయారు చేసి దివంగత నేత ప్రభుత్వ, ప్రైవేటు భూములను ఆక్రమించుకున్నారని బాబు విమర్శించారు.   కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న తన పాద యాత్రలో బాబు మాట్లాడుతూ, వైఎస్ తాను ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో 117 సెజ్ ల పేరిట 2.75 లక్షల ఎకరాలను ప్రజల నుండి తీసుకొని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని, ఇందులో హైదరాబాద్ నుండే ఎనిమిది వేల ఎకరాలున్నాయని అన్నారు.   తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సాఫ్ట్ వేర్ కంపెనీలకు ఒక్క ఎకరం ఇస్తే, వేయి ఉద్యోగాలు ఇవ్వాలనే షరతు పెట్టానని, వైఎస్ మాత్రం కొన్ని లక్షల ఎకరాలను వాటికి దారాదత్తం చేసినా, ఒక్క ఉద్యోగం కూడా తెప్పించలేకపోయారని బాబు విమర్శలు చేశారు. చివరకు అసైన్డ్ భూములను కూడా వారు స్వాధీనం చేసుకున్నారని చంద్ర బాబు వైఎస్ భూపంపకాలఫై తీవ్ర విమర్శలు చేశారు. కలెక్టర్లతో కాకుండా, ప్రైవేటు వ్యక్తులతో భూసేకరణ చేయించారని ఆయన అన్నారు.

రేపిస్టులకు మరణ దండన కూడదు: కమల్

  కోలివుడ్ సూపర్ స్టార్ కమల్ హస్సన్, క్రిందటి ఆదివారం డిల్లీలో జరిగిన సామూహిక అత్యాచారం సంఘటనపై స్పందిస్తూ, అటువంటి నేరాలను క్షమించరాని నేరాలుగా వర్ణిస్తూనే, రేపిస్టులకు మరణ దండన విదించడం ఎంతమాత్రం సబబుకాదని అన్నారు. ఒక నేరానికి శిక్షగా మరణదండన విదించడమంటే మరో నేరం చేస్తునట్లే లెక్క అని అన్నారు. మరణదండనని చట్టబద్ధమయిన మరో నేరంగా ఆయన అభివర్నించేరు. గానీ, అదే కమల్ హస్సన్ తన సినిమాలో (భారతీయుడు) అనేక నేరస్తులకి, చివరకి తన కుమారుడుకి కూడా మరణశిక్షే న్యాయమని మనస్పూర్తిగా నమ్మి అమలు చేస్తాడు. అంటే, తన సినిమాసూత్రాలు నిజజీవితానికి పనికిరావని అతని అభిప్రాయం అనుకోవాలా? లేక తానూ నమ్మని సూత్రాలను డబ్బుకోసం సినిమాలలో చేసిచూపాడని అనుకోవాలా?