మనిషిలో ఉండాల్సిన గొప్ప గుణం ఇదే!

మనిషి జీవితంలో ఒకదాని తరువాత ఇంకోటి కావాలని అనుకుంటూనే ఉంటాడు. అంటే మనిషికి తృప్తి ఉండటం లేదు. ఇంకా ఇంకా కావాలనే అత్యాశ మనిషిని నిలువనీయదు. కానీ ఈ ప్రపంచంలో తృప్తి మించిన సంపద లేదన్నది అందరూ నమ్మాల్సిన వాస్తవం. అది పెద్దలు, యువత అందరూ గుర్తించాలి. ముఖ్యంగా యువతరం తృప్తి గురించి తెలుసుకుని  దాన్ని గుర్తించాలి.   ఈ సమాజంలో అందరికీ కూడా తృప్తి అనేది కరవు అయ్యింది. ఎందుకు అంటే మనిషిలో ఇంకా కావాలి అనే అత్యాశ వల్ల తృప్తి అనేది లేకుండా అందరూ స్వార్థంతో జీవిస్తున్నారు. దాని వలన మనశ్శాంతి కోల్పోవడం తప్ప వేరే ప్రయోజనం ఏదీ లేదు. ఈ సమాజానికి మేథావులు, శక్తివంతులు, ఆదర్శవ్యక్తులు ఎంత అవసరమో అంతకంటే గుణవంతులు ఎక్కువ అవసరం. అటువంటి గుణసంపద యువతీ యువకులు కలిగి ఉండాలి. సంస్కారం, సమగ్ర వ్యక్తిత్వం, సేవాగుణం ఈ కాలంలో ఉన్న యువతలో ఉండటం చాలా అవసరం.  మనిషి దిగజారితే పతనం అంటారు. ఈ పతనావస్థ స్థాయికి జారడం  చాలా సులభం. పతనావస్థకు జరినంత సులువు కాదు విజయం సాధించడమంటే. విజయం గురించి ఆలోచించటం మంచిదే కాని పతనం చెందకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవటం కూడా చాలా అవసరం. గొప్పపేరు సంపాదించడం కంటే మంచితనం సంపాదించటం చాలా మేలు. వినయ విధేయతలతో కూడిన క్రమశిక్షణ అనేది ఈ కాలంలో యువతకు చాలా ముఖ్యం. తాము ఈ సమాజానికి ఎలా ఉపయోగపడతాం అనే ఆలోచన యువతలో ఉండాలి తప్ప ఈకాలంలో మనకు తీసుకోగలిగినంత స్వేచ్ఛ ఉంది కాబట్టి మనకు సమాజంతో పని ఏంటి?? అనే ఆలోచనతో అసలు ఉండకూడదు.   ఈ దేశ భవిష్యత్తు అనేది యువతీ యువకులపై ఆధారపడి వుంది. అందుకే యువతకు ఓ బాధ్యత ఉందని,  యువత తాను చెయ్యవలసిన పనిని సక్రమంగా ఒక క్రమపద్ధతితో చేయాలని పెద్దలు చెబుతారు. ఏ పనిని అయినా సక్రమంగా చేయగలిగినట్లయితే తాను అభివృద్ధి చెందగలడు. అట్లాగే దేశాన్ని అభివృద్ధి చేయగలడు. ఇదీ యువతలో దాగున్న శక్తి. వ్యక్తిగత అభివృద్ధిపై దేశాభివృద్ధి ఆధారపడి వుంటుంది. దేశాభివృద్ధి అనేది ఆ దేశంలో నివసించే ప్రజల ఆర్థికాభివృద్ధిని బట్టి చెప్పవచ్చు. ఇకపోతే ఈ దేశానికి మూలస్థంబాలు అయిన యువత భవిష్యత్తు అంతా వారు విద్యావంతులు అవ్వడంలోనే ఉంటుంది. ఎంత కష్టపడి చదివితే అంత గొప్ప స్థాయికి చేరుకొగలరు అనే విషయాన్ని యువత ఎప్పుడూ మనసులో పెట్టుకోవాలి. యువత కష్టపడి ఇష్టంతో చదవాలి. ఇవి చెప్పటం చాలా సులభం కాని చెయ్యటం కష్టం. కానీ ఆర్థిక స్థోమత పెంచుకోవాలంటే కష్టపడటం అవసరమే అవుతుంది. సవాళ్ళను అధిగమించి అనుకున్నది సాధించాలి. అనుకున్నది సాధించగలిగినట్లయితే సంతృప్తి అనేది దానంతట అదే వస్తుంది. తృప్తికి మించిన సంపద ఇంకొకటి లేదు.  అందుకే పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. మనిషి జీవితంలో ఉండాల్సిన గొప్ప గుణం ఏదైనా ఉందంటే అది తృప్తిపడటమే అని.                                         ◆నిశ్శబ్ద.

సాధకులే విజెలవుతారు.. విజయం ఎలా చేకూరుతుంది?

ఈ ప్రపంచంలో ఎంతో మంది కలలు కనే పదం విజయం. ఈ పదాన్ని పలకడం ఎంత సులభమో.. ఆ విజయాన్ని సాధించడం అంత కష్టం. కేవలం కష్టం మాత్రమే కాదు.. వ్యక్తిలో కృషి, పట్టుదల, తెలివితేటలు, ఆత్మస్తైర్యం, పోటీపడే తత్వం, విషయం పట్ల అవగాహన ఇవన్నీ ఉండాలి విజయం సాధించాలంటే.. అందుకే విజయానికి కొందరు మాత్రమే అర్హులు అవుతున్నారు.  ప్రతి సంవత్సరం మార్చి 24వ తేదీన world achievers day ని జరుపుకుంటారు. ఆయా రంగాలలో కృషి చేసి విజయాలు సాధించినందుకు వారిని గుర్తుచేసుకోవడం ఈ అచీవర్స్ డే ని జరుపుకుంటారు.   జనాదరణ పొందినవారినో.. కేవలం ప్రముఖులు, ప్రభావవంతమైన వారినో  గౌరవించే రోజు కాదు ఇది.  ప్రతి వర్గంలో.. ప్రతి వ్యక్తిని గుర్తించే దినం. వ్యక్తి స్తాయితో సంబంధం లేకుండా.. ప్రతిభ కలిగిన అందరినీ గుర్తించాలని చెప్పడమే ఈ రోజు ఉద్దేశం. పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు, పౌర సేవకులు ఇలా ప్రతి ఒక్కరూ వారి స్థాయికి కాకుండా వారి కృషికి అనుగుణంగా గౌరవించబడతారు, గుర్తుచేసుకోబడతారు.  వారి తెలివితేటలు, ధైర్యం, నిస్వార్థత, సృజనాత్మకత ద్వారా  ప్రపంచాన్ని మరింత మెరుగ్గా  మార్చడానికి కృషి చేశారు. అలాగే దేశాల ప్రగతిని ఇనుమడింపజేస్తూ  తెలివితేటలతో ఎదుగుతున్న  అత్యుత్తమ విద్యార్థులు కూడా ఈ సందర్భంగా గౌరవానికి అర్హులే.. ఈ రోజున ఎవరైనా సరే..  వారి వయస్సు, లింగం, సామాజిక స్థితి, విద్యా స్థాయి లేదా జాతితో సంబంధం లేకుండా..  జీవితంలోని ఏ రంగంలోనైనా ఏదైనా వినూత్నమైన లేదా ప్రత్యేకమైన ఘనత సాధించిన వారికి పతకం, సర్టిఫికేట్, బహుమతి లేదా ఏదైనా ఇతర అవార్డును అందజేయడం జరుగుతుంది. తద్వారా వారు మరింత కృషి చేసేదిశగా గొప్ప ప్రోత్సాహం అందించినట్టు అవుతుంది.  ఈ అచీవర్స్ డే సందర్భంగా.. పిల్లలకు వివిధ రంగాలలో కృషి చేసిన గొప్పవారి గురించి పరిచయం చేయడం, పిల్లల్లో ప్రతిభ పెంచుకోవాలనే తపనను క్రమంగా పెంచడం. లక్ష్య సాధనకై పిల్లలను నడిపించడం చేయవచ్చు.  విజయం ఎలా చేకూరుతుంది?? ఈ ప్రపంచంలో గొప్ప ఆవిష్కరణలు చేసి, గొప్పగా ఎదిగిన వ్యక్తులు విజయాన్ని అక్కున చేర్చుకోవడానికి వెనుక ఎంత కృషి చేసారు?? వారి కష్టాలు, సమస్యలు, సవాళ్లు, త్యాగాలు ఇలా ఎన్నో విషయాలను పిల్లలకు వివరించడం ద్వారా పిల్లలో విజేతలు లక్షణాలు పెంపొందించవచ్చు. నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు.. నేటి ప్రతిభావంతులు రేపటి విజేతలు అవుతారు. కాబట్టి పిల్లలను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడం పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజంలోని వ్యక్తుల చేతుల్లోనే ఉంది.                               ◆నిశ్శబ్ద.

ఉపవాసాల మాసం.. రంజాన్ మాసం..

అటు తెలుగువారి ఉగాది పండుగ అయిపోగానే.. ఇటు ఇస్లాం మతస్థుల పవిత్రమాసం ప్రారంభమవుతుంది. ముస్లిం మస్తస్తులకు ఎంతో పవిత్రమైన మాసం రంజాన్ మాసం.  ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల అయిన రంజాన్, ఉపవాసాలతో పవిత్ర మాసంగా భాసిల్లుతుంది.  ఈ సంవత్సరం ఇది మార్చి 23 నుండి ఏప్రిల్ 22 వరకు నడుస్తుంది. అల్లా ఇస్లాం మతానికి అయిదు ముఖ్యవిషయాలు తెలిపాడు.  అవి.. షహదా, సలాత్, జకాత్, స్వామ్ మరియు హజ్. స్వామ్ (ఉపవాసం) అనేది రంజాన్‌లో పాటించేది. ఈ పేరు అరబిక్ మూలం 'అర్-రామద్' నుండి వచ్చింది, దీని అర్థం మండే వేడి. రంజాన్ ప్రారంభ, ముగింపు తేదీలు ప్రతి ఏటా మారుతూ ఉంటాయి.  ఎందుకంటే చంద్రుని గమనాన్ని బట్టి వీరి సమయం ఉంటుంది. వివిధ దేశాలలో వేర్వేరు ప్రారంభ ముగింపు తేదీలు ఉంటాయి. ఇస్లామిక్ సంవత్సరం గ్రెగోరియన్ సంవత్సరం కంటే తక్కువగా ఉంటుంది అందువల్ల రంజాన్ ప్రతి సంవత్సరం 10-12 రోజుల ముందుగా ప్రారంభమవుతుంది, ఇది 33 సంవత్సరాల చక్రంలో ప్రతి సీజన్‌లో వస్తుంది. రంజాన్ చాలా ప్రత్యేకమైన ఆశీర్వాద రాత్రి. దేవదూత జిబ్రీల్ ప్రవక్త ముహమ్మద్‌కు మొదటిసారిగా ఖురాన్‌ను వెల్లడించాడు. అదే లైలతుల్ ఖద్ర్.  ఈ రాత్రి రంజాన్ చివరి పది రాత్రులలో ఉంటుంది. ప్రతి రంజాన్‌లో పదిలో నిర్దిష్ట రాత్రి మారుతుంది. అల్లాహ్ ఇలా అంటాడు..  "ఆ దేవుడి  ఆజ్ఞ దొరికిన రాత్రి వెయ్యి నెలల కంటే ఉత్తమమైనది" అని.   ఇక ఈ రంజాన్ నెలలో ఉపవాసం, మసీదులో ప్రార్థనలు,  ఖురాన్ పఠించే సమయం. చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటాయి.  రంజాన్ సందర్భంగా, అల్లా పాపాలను క్షమిస్తాడు. తప్పులు చేసిన వారిని ప్రతి రాత్రి నరకాగ్ని నుండి విడిపిస్తాడు. ముస్లింలు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మంచినీళ్లు కూడా తాగకుండా కఠినమైన ఉపవాసం చేస్తారు.  సూర్యాస్తమయ ప్రార్థన తర్వాత వారి ఉపవాసాన్ని విరమించుకోవడానికి వారి స్నేహితులు, కుటుంబ సభ్యులతో వారి ఇళ్లలో లేదా మసీదులలో సమావేశమవుతారు. ఈ భోజనాన్ని ఇఫ్తార్ అంటారు. ఉపవాసం ప్రారంభానికి ముందు తెల్లవారుజామున జరిగే భోజనాన్ని సుహూర్ అంటారు. కాబట్టి, ఉపవాసం సుహూర్ నుండి ఇఫ్తార్ వరకు విస్తరించి ఉంటుంది. రంజాన్ తర్వాత ఈద్ అల్-ఫితర్ వస్తుంది. ఇది ఉపవాసం ముగింపును సూచిస్తుంది. ఇది మూడు రోజుల పాటు కొనసాగుతుంది, ఈ సమయంలో ముస్లింలు ఆనందంగా ఉంటారు. సంతోషాన్ని ఒకరికొకరు పంచుకుంటారు. ఈ నెలలోనే దానధర్మాలు చేస్తారు. బీదలకు సహాయం చేస్తారు. ఈద్ ప్రత్యేక ప్రార్థన ఉంటుంది.  ఇకపోతే ఉపవాసం చేయలేని వారు కొందరు ఉంటారు. ఇలాంటి వారు బీదలకు సహాయం చేయడం, ఉపవాసం ఉండే ఇతరులకు ఇఫ్తార్ విషయంలో సహాయం చేయడం లాంటివి చేయొచ్చు. వీలైనంత వరకు పేదవారికి చేసే సహాయం ఎంతో ప్రముఖ్యతగా ఉంటుంది రంజాన్ మాసంలో. రంజాన్ మాసం గురించి కొన్ని ముఖ్య విషయాలు.. *క్రీ.శ570లో  ప్రవక్త ముహమ్మద్ జన్మించారు. క్రీ.శ 610 లో  ఖురాన్ మొట్టమొదట దేవదూత జిబ్రీల్ ద్వారా ప్రవక్త ముహమ్మద్‌కు వినిపించారు. ఇలా ఖురాన్ అవతరించింది. క్రీ.శ622లో  చంద్ర ఇస్లామిక్ క్యాలెండర్ ప్రారంభబమయ్యింది. క్రీ.శ622లో  ప్రవక్త ముహమ్మద్ హింస నుండి తప్పించుకోవడానికి మక్కా నుండి మదీనాకు వలస పూర్తి చేశాడు. క్రీ.శ624 అల్లా రంజాన్‌లో ఉపవాసాన్ని విధిగా పాటించాలని సూచించాడు. ఖురాన్ అవతరించిన ఈ మాసంను ఎంతో పవిత్రంగా భావిస్తారు ముస్లిం సోదరులు. ఖురాన్ ను ఇస్లాం మతానికి పవిత్ర గ్రంథంగా భావిస్తారు. అందుకే ఈ నెలకు అంత ప్రాముఖ్యత.                                         ◆నిశ్శబ్ద.

ప్రకృతిలో త్రిగుణాలు ఎలా ఉంటాయి?

ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువులో అంటే కదలనివి (పర్వతములు, కొండలు, గుట్టలు, రాళ్లు), కదలకుండా కదిలేవి (చెట్లు, మొక్కలు, వృక్షములు), కదిలేవి (నాలుగు కాళ్ల, రెండు కాళ్ల జంతువులు, మనుషులు), మూడు గుణములు అంటే సత్వ రజో తమోగుణములు ఉన్నాయి అని తెలుసుకున్నాము. ఉదాహరణకు, పర్వతములు, కొండలు, గుట్టలు, రాళ్లు, ఇవి కదలవు. వీటిలో తమోగుణము 98 శాతం ఉంటే రజోగుణము 1 శాతం సత్వగుణం 1 శాతం ఉంటుంది. రెండవ రకం వృక్షములు, చెట్లు, మొక్కలు, అవి కదలవు కానీ నీటిని పీల్చుకుంటాయి, శ్వాసిస్తాయి. వాటి ఆకులు వివిధగుణములు కలిగి ఉంటాయి. కొన్ని మొక్కలు అయితే తన దగ్గరకు వచ్చిన జంతువులను తనలోకి లాక్కుంటాయి. కొన్ని తాకితే ముడుచుకుంటాయి. కొన్ని స్పందిస్తాయి. మొక్కలు పుట్టడం, పెరగడం, పెద్దవి కావడం మన కళ్లముందే జరుగుతుంది. కాని కదలలేవు. వీటిలో తమోగుణము 50శాతము, రజోగుణము 45 శాతము, సత్వగుణము 5 శాతం ఉంటుంది. ఇంక జీవజాతులు, రెండు కాళ్ల మనుషులు, నాలుగు ఇంకా అనేక కాళ్లతో నడిచే జంతువులు, వీరిలో వారి వారి ప్రవృత్తులను బట్టి మూడు గుణాల నిష్పత్తి మారుతూ ఉంటుంది. జంతువులలో వాటి స్వభావాన్ని బట్టి గుణాలు ఒకేసారి మారతాయి.  కాని మానవుడికి వయసు పెరిగే కొద్దీ పరిసరాలకు అనుగుణంగా, కాలానికి అనుగుణంగా, వారి వారి గుణాలు మారుతుంటాయి. కొంతమంది సాత్వికులు అవుతారు, మరి కొంత మంది రజోగుణ ప్రధానులు అవుతారు. మరి కొంత మంది తమోగుణ ప్రధానులు అవుతారు. అది ఎలాగంటే. ఈ మూడు గుణములు పైన చెప్పబడిన వాటిలో ఒకే విధంగా, ఒకే మోతాదులో ఉండవు. హెచ్చుతగ్గులుగా ఉంటాయి. సత్వగుణము మోతాదు ఎక్కువగా ఉంటే, అది మిగిలిన రజో, తమోగుణములను అణగదొక్కుతుంది. తాను మాత్రమే ప్రధానంగా ప్రకటితమౌతుంది. అదే రజోగుణము ఎక్కువగా ఉంటే అది సత్త్వ, తమోగుణములను అణగదొక్కి తాను మాత్రమే ఎక్కువగా ప్రకటితమౌతుంది. అలాగే తమోగుణము ఎక్కువగా ఉన్నప్పుడు అది సత్వ, రజోగుణములను అణగదొక్కుతుంది. ఈ విధంగా ఒక్కొక్క పదార్థములో ఒక్కో గుణము ఎక్కువగా ఉంటుంది. కొందరిలో రెండుగుణాలు ఎక్కువ ఒక గుణము తక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఈ మూడు గుణములు వివిధములైన పాళ్లలో బంధనములను కలుగజేస్తుంటాయి. అంతే కాదు. ప్రతిరోజూ ప్రకృతిలో కూడా ఈ గుణాలు మారుతుంటాయి. సాధారణంగా మానవులలో ఉదయం 4 నుండి 8 వరకు సత్వగుణము ప్రధానంగా ఉంటుంది. అందుకే ఆ సమయంలోనే స్నానం, సంధ్య, హెూమం, పూజ చేయాలని చెప్పారు. ఎండ ఎక్కేకొద్దీ రజోగుణము ఎక్కువగా ఉంటుంది. అందుకని ఆ సమయంలో ఎవరెవరికి నిర్దేశింపబడిన కర్మలు వారు చేయాలి. సూర్యుడు అస్తమించగానే, తమోగుణము ప్రధానంగా ఉంటుంది. కాబట్టి నిద్రపోవాలని చెప్పారు. (కాని మనం ఏం చేస్తున్నాము! ధన సంపాదన కొరకు, రాత్రిళ్లు పని చేస్తూ, పగలు కునికిపాట్లు పడుతున్నాము. లేక విలాసాలతో రాత్రి 1 గంటదాకా క్లబ్బులు పబ్బులలో గడుపుతూ నిశాచరులము అవుతూ ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాము. కాబట్టి వివేకి అయినవాడు ఏ గుణమునకు బంధితుడు కాకూడదు. అన్నీ సమానంగా, పరిమితంగా అనుభవించాలి. దేనికీ అడిక్ట్ కాకూడదు. అతి, విపరీతధోరణి పనికిరాదు. శాస్త్రఅధ్యయనం చేయాలి. ఇష్టదైవాన్ని ఉపాసించాలి. ధ్యానం చేయాలి. జీవనానికి ఏదో ఒక ఉద్యోగం, వ్యాపారం ధర్మబద్దంగా, న్యాయబద్ధంగా, శ్రద్ధతో చేయాలి. అవసరము ఉన్నంత వరకే సంపాదించాలి. జీవితం ఆనందంగా గడపాలి. అంతేకానీ ఏదో ఒక గుణమునకు కట్టుబడి పోకూడదు.  ◆ వెంకటేష్ పువ్వాడ.

సంతోషానికి సిగ్నేచర్ ఈరోజే..

సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. వారి మాట నీటిమూట కాదు. ప్రపంచ దేశాలే సంతోషం మనిషి హక్కు అని నినదిస్తున్నాయి. సంతోషంగా ఉండటానికి దనికులుగానే పుట్టక్కర్లేదు అని చాలా మంది అంటూ ఉంటారు. కానీ ప్రస్తుతకాలంలో కనీస నిత్యావసరాలు తీరాలన్నా ధనం మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి డబ్బు లేకుండా సంతోషం అనివార్యమైన విషయం. ఇకపోతే సంతోషం ఈ ప్రపంచంలో ప్రతి మానవుడి ప్రాథమిక హక్కు. దాన్ని సాధించుకోవడం మనిషి కర్తవ్యం అయితే.. ప్రజలకు సంతోషాన్ని అందించడం ఆయా దేశాల కర్తవ్యం. ప్రతి మనిషి జీవితంలో సంతోషం ఉండాలని, ఆ సంతోషం పెంపుదలకు ఎన్నో నిర్ణయాలు, మరెన్నో ప్రణాళికలు అమలుచేయాలని నిర్ణయించారు. సంతోషమైన ప్రపంచం కోసం ఒక రోజును వరల్డ్ హ్యాపీనెస్ డే గా ప్రకటించి జరుపుకుంటూ వస్తున్నారు. ప్రతి సంవత్సరం మార్చి 20 వ తేదీన ఈ సంతోషకరమైన దినోత్సవం జరుపుకోబడుతుంది. ఐక్యరాజ్యసమితి 160 దేశాలకు చెందిన వ్యక్తులతో యాక్షన్ ఫర్ హ్యాపీనెస్ అనే గ్రూప్ లాభాపేక్షలేకుండా చేసిన పనికి ధన్యవాదాలు తెలుపుతూ  అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. దీని అంతిమ లక్ష్యం ఏమిటంటే, పురోగతి అనేది దిగువ స్థాయిలను పెంచడం, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం మాత్రమే కాదు, ప్రజల శ్రేయస్సు, మనుషుల ఆనందం కూడా ఉండాలి. అప్పుడే అది సంతోషం అని పిలవబడుతుంది. 2011లో, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది, ఇది ఆర్థిక అవకాశాలకు సమానమైన ప్రాధాన్యతను ఇవ్వడాన్ని ప్రాథమిక మానవ లక్ష్యంగా చేసింది.  రెండు సంవత్సరాల తరువాత, 2013లో, ఐక్యరాజ్యసమితిలోని  మొత్తం 193 సభ్య దేశాలు ప్రపంచంలోని మొదటి అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని జరుపుకున్నాయి మరియు అప్పటి నుండి అది పెరుగుతూనే ఉంది. ఈ కారణంగా ప్రతి సంవత్సరం ఈ ప్రపంచ సంతోష దినోత్సవ వేడుక నిర్వహించబడుతుంది. ఈ దినోత్సవ లక్ష్యాల ప్రకారం.. సంతోషం మనిషి నవ్వు ద్వారా.. చర్యల ద్వారా వ్యక్తమయ్యేది కాట్రమే కాదు.. సంతోషమంటే వ్యక్తి జీవితంలో అభివృద్ధి. ఆ అభివృద్ధి వ్యక్తి జీవితాన్ని పెరుగుపరచాలి. ఇలా ఉన్నపుడే సాధారణ పౌరులు కూసా సంతోషంగా ఉండగలుగుతారు. ఇకపోతే వ్యక్తి జీవితంలో తృప్తిగా ఉండటం ఎలాగో నేర్చుకోవాలి. తృప్తి ఉన్నచోట సంతోషం నీటి ఊటలా బయటకొస్తూ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఈ సంతోషం మరింత మెరుగు పడాలని ఆశిద్దాం.                                     ◆నిశ్శబ్ద.

కాలుష్యపు దెబ్బకు రీసైక్లింగ్ మందు...

ప్రతి సంవత్సరం, భూమి బిలియన్ల టన్నుల సహజ వనరులను ఇస్తోంది. ఇలా ఆలోచిస్తే మనం ఎంతో అదృష్టవంతులం. కానీ ఈ సహజవనరుల గురించి ఆలోచించాల్సింది మరొకటి ఒకటి ఉంది. అదేంటంటే.. ఈ సహజవనరుల అన్నీ భవిష్యత్తులో ఏదో ఒకప్పుడు అయిపోతాయి. ఇలా సహజ వనరులు అయిపోవడానికి కారణం.. కేవలం మనం సహజవనరులను ఇష్టానుసారం వాడెయ్యడమే కాదు. ఆ సహజవనరుల ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తూ.. వాటిని ప్రకృతికి నష్టం కలిగిస్తున్నాం.  అందుకే మనం ఈ ప్రకృతిలో కలిపేసే వస్తువుల  గురించి మరోసారి ఆలోచించాలి - వృధా కాకుండ చూడాలి. గత పదేళ్ల కాలం గమనిస్తే..  రికార్డు స్థాయిలో అత్యంత వేడిగా ఉంది. ఇప్పుడు అసమానమైన వాతావరణ మార్పులు, ఊహించని ప్రళయాలు  ఎదుర్కొంటున్నాము. మనం గణనీయమైన, వేగవంతమైన మార్పులు చేయకుంటే, పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు, మంచుగడ్డలు కరగడం, వివిధ దేశాలు, ప్రాంతాలు అంతమయ్యే దశకు చేరుకోవడం, అడవులు తగ్గిపోవడం వంటివి చాలా దారుణంగా తయారవుతాయి.   ప్రపంచంలో పెరుగుతున్న పేదరికం, ప్రాంతాల  వలసలు, ఉద్యోగ నష్టాలు, ప్రజలు నివసించే ప్రాంతాలు కనుమారుగైపోతూ.. కరువు కారణంగా ప్రపంచమంతా దారిద్య్రం ఏర్పడుతుంది. మానవాళిని ఇది నేరుగా ప్రభావితం చేస్తుంది. దీనిని ఎదుర్కోవడానికి శాశ్వతమైన మార్పులు చేసుకోవాలి. దీనికోసం ఐక్యరాజ్యసమితి గ్లోబల్ రీసైక్లింగ్ డే ని ప్రతి సంవత్సరం మార్చి 18 వ తేదీన జరుకునేలా ప్రకటించింది. 2030 నాటికల్లా.. కొన్ని లక్ష్యాలను ఈ గ్లోబల్ రీసైక్లింగ్ డే సందర్భంగా నిర్ణయించింది.  గ్లోబల్ గ్రీన్ ఎజెండాకు మద్దతుగా అనేక మంది వ్యక్తులు, ప్రభుత్వాలు మరియు సంస్థలు ప్రత్యక్ష చర్యలు తీసుకోవడం మనం ఇప్పటికే చూస్తున్నాము. రీసైక్లింగ్ అనేది వృత్తాకార ఆర్థిక వ్యవస్థలో కీలకమైన భాగం, ఇది మన సహజ వనరులను రక్షించడంలో సహాయపడుతుంది. ప్రతి సంవత్సరం 'సెవెన్త్ రిసోర్స్' (పునర్వినియోగపరచదగినవి) CO2 ఉద్గారాలలో 700 మిలియన్ టన్నులకు పైగా ఆదా చేస్తుంది. ఇది 2030 నాటికి 1 బిలియన్ టన్నులకు పెరుగుతుందని అంచనా వేయబడింది. మన భవిష్యత్తును కాపాడటానికి మనుషుల్లో ఉన్న స్పృహ రీసైక్లింగ్ ప్రక్రియలో ముందు వరుసలో ఉంటుంది. అంటే.. భావితరాలకు మనం సహజవనరులను అందించాలనే స్పృహ మనతో ఈ ప్రకృతి సంరక్షణ పనులు చేయిస్తుంది. మన విలువైన ప్రాథమిక వనరులను సంరక్షించడం, మన భూ గ్రహ భవిష్యత్తును సురక్షితం చేయడంలో రీసైక్లింగ్ ప్రాముఖ్యతను చాలా ఉంటుంది. ఈ  ప్రాముఖ్యతను గుర్తించడంలోనే ఈ గ్లోబల్ రీసైక్లింగ్ డే జరుపుకోబడుతుంది.  అందుకోసమే.. 2018లో గ్లోబల్ రీసైక్లింగ్ డే సృష్టించబడింది. ప్రపంచం ఏకతాటిపైకి వచ్చి భూమిని కాపాడుకోవడానికి ప్రయత్నించడం, ఆ ప్రయత్నాలకు తగిన ఆలోచనలు, ప్రణాళికలను ప్రపంచానికి చాటి చెప్పడం గ్లోబల్ రీసైక్లింగ్ డే రోజు చేసే పని.   గ్లోబల్ రీసైక్లింగ్ ఫౌండేషన్ ద్వారా నిర్దేశించబడిన గ్లోబల్ రీసైక్లింగ్ డే లక్ష్యం రెండు రెట్లు: రీసైక్లింగ్ అనేది గ్లోబల్ సమస్య కాకూడదని, ఇది చాలా ముఖ్యమైనదని  చెబుతారు. ఈ రీసైక్లింగ్‌కు ఒక సాధారణ, ఉమ్మడి విధానం తక్షణం అవసరమని ప్రపంచానికి తెలిసేలా చెప్పడం. మన చుట్టూ ఉన్న వస్తువుల విషయానికి వస్తే, వనరులను వృధా చేయకూడదని ఈ భూమ్మీద ఉన్న అందరూ ప్రజలకు తెలియజేయడం.   అవార్డులు రివార్డులు ఉన్నాయి దీనికి.. గ్లోబల్ రీసైక్లింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపక ప్రెసిడెంట్ రంజిత్ బాక్సీ ఇలా వ్యాఖ్యానించారు. “కరోనా కాలంలో  రీసైక్లింగ్ హీరోలు చేసిన విశిష్ట సహకారానికి మేము వారిని గుర్తించాలనుకుంటున్నాము. గత 12 నెలల్లో రీసైక్లింగ్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్న వ్యక్తులు, సంఘాలు, వ్యాపారాల నుండి నామినేషన్లు ఆహ్వానించబడ్డాయి. వారి ప్రయత్నాలు మన ప్రపంచం యొక్క పచ్చని భవిష్యత్తుకు దోహదపడతాయి. రీసైక్లింగ్ అనేది వాతావరణ మార్పు చక్రంలో అంతర్భాగం. ప్రపంచ స్థిరత్వాన్ని ప్రోత్సహించడంలో, రక్షించడంలో సహాయపడుతుంది. రీసైక్లింగ్ 2030 నాటికి ఒక బిలియన్ టన్నుల CO 2 ఉద్గారాలను ఆదా చేస్తుందని అంచనా వేయబడింది . ఈ అవార్డు కింద 1000 అమెరికన్ డాలర్లు బహుమానంగా ఇస్తారు. కలుషితమైపోతున్న ఈ ప్రపంచాన్ని కాపాడుకోవడం మన చేస్తుల్లోనే ఉంది. మన చుట్టూ ఉన్న వనరులను దీర్ఘకాలంగా, పొదుపుగా ఉపయోగించుకోవాలి. అలా చేస్తే మన వంతు ప్రయత్నంలో మనం సఫలమే..                                   ◆నిశ్శబ్ద.

మీ మనసును మర్చివేసే కథ

కొన్ని కథలు మనుషుల జీవితాలను, ప్రవర్తనను ప్రతిబింబిస్తాయి. ప్రాంతాలు ఏవైనా సరే మనుషుల ప్రవర్తనలో అసూయ, ద్వేషం, కోపం వీటితోపాటు.. ప్రేమ, ఆప్యాయత కూడా ఉంటాయి. మనం ఏ కోణాన్ని చూస్తామో అదే మనలో నుండి వ్యక్తమవుతుంది కూడా..  మనిషి మనసుకు సంబంధించి ఓ కథ ఉంది.. ఇది ఒక చైనా దేశం కథ. వివాహానంతరం ఒక అమ్మాయి అత్తగారింటికి వెళ్తుంది. మొదటి ఆరు నెలలు అత్తాకోడళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఆ తరువాత ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. గోరంతలు కొండంతలై చివరకు కోడలు పుట్టింటికి పరుగెడుతుంది. అక్కడ ఆమె తండ్రిగారి స్నేహితుడైన ఒక డాక్టర్తో తన బాధల్ని వెళ్ళబోసుకుంటూ 'ఎలాగైనా మా అత్త మరణిస్తే గాని నాకు సుఖశాంతులుండవు అని చెప్పింది. ఒకప్పుడు తన దగ్గర కూర్చొని ముద్దుమాటలతో చిలిపి చేష్టలతో ఆనందింపజేసిన ఆ చిన్నారిలో ఇప్పుడు కనిపిస్తున్న ఈ రాక్షసత్వాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు ఆ డాక్టర్. తర్వాత ఇలా అన్నాడు. ' అమ్మా! నీ మీద ప్రేమతో ఈ పనిచేస్తున్నాను. ఒక మందు నీకిస్తాను. దానిని మీ అత్తగారికివ్వాలి. అది తీసుకున్న సంవత్సరం తరువాత ఆమె మరణిస్తుంది. వెంటనే చనిపోతే, అందరికీ అనుమానం రావొచ్చు. అప్పుడు మన పన్నాగం బయట పడుతుంది.  అందుకే ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా చంపే మందు ఇస్తున్నాను. ఒక సంవత్సరం నీవు ఓపిక పట్టాలి. అత్త ఎలాగూ చనిపోతుంది. కాబట్టి నీవు ఆమెను ఈ సంవత్సర కాలం పాటు ప్రేమగా చూసుకుంటూ సేవ చేస్తానని నాకు హామీ ఇవ్వు. అప్పుడు ఎవరికీ అనుమానం రాదు” అన్నాడు.  అమ్మాయి సరేనని అంగీకరించింది. మందు తీసుకుని అత్తగారింటికి వెళ్లింది.  అత్తకు తినిపించి ప్రేమతో సపర్యలు చేయడం ప్రారంభించింది. అత్తకు అమితానందం. తన కోడలు చేసే సేవకు స్పందించింది. ఆమె చూపిన ప్రేమకు దాసోహం అయ్యింది. తనకు ఓపికలేక పోయినప్పటికీ కోడలికి చిన్నచిన్న పనుల్లో సహాయం చేయడం మొదలు పెట్టింది. కోడలిని తన సొంత కూతురిలా భావించింది. అప్పుడు కుటుంబంలో ప్రశాంతత చోటు చేసుకుంది. అందరి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. ఆరు నెలలు గడిచాయి. కోడలు పుట్టింటికి వెళ్ళి మళ్ళీ ఆ డాక్టర్ని కలిసింది. ఆమె ముఖంలో విషాదం. గద్గద స్వరంతో ఇలా అంది. 'డాక్టర్! నేను ఓ పెద్ద తప్పు చేశాను. దేవతలాంటి మా అత్తను నిర్దాక్షిణ్యంగా చంపుతున్నాను. నా చేతులతో ఆమెకు విషం తినిపించాను. ఆరు నెలల్లో నన్ను ప్రేమించే నాదేవత నాకుండదు. ఆమెను ఎలాగైనా నేను రక్షించుకోవాలి'. ఈ మాటలు విన్న డాక్టర్ నవ్వి 'అమ్మా నేనిచ్చిన మందు, విషం కాదు. మీ అత్తగారికి ఏ అపాయంలేదు. అప్పుడు నీ మనసులో ఉన్నది విషం. ఇప్పుడది లేదు. మీ అత్తాకోడళ్ళ మధ్య ఈ ఆరు నెలల్లో నెలకొన్న ప్రేమానురాగాల ప్రవాహంలో ఆ ''విషం' కొట్టుకు పోయింది. మనసులో ఏ కల్మషం లేకుండా జీవించు' అన్నాడు. ఇది మనసు కథ, ప్రతి మనిషి కథ.                                       ◆నిశ్శబ్ద.

భయాల స్వరూపాన్ని తెలిపే విశ్లేషణ!!

మనిషిని పిరికివాడిగా చేసేది, లక్ష్యాలకు దూరం చేసేది భయమే. మన భయాలు అర్థరహితం అని చెప్పేందుకు ఓ ప్రయోగం ఉంది. ఓ తరగతిలో టీచర్ చేసిన ప్రయోగం అది. కుర్చీల్లో కూర్చున్న విద్యార్థులను అందరినీ లేచి ఓ వైపు వచ్చి నిలబడమన్నాడు. ఆపై అందరినీ మరో వైపు కు పొమ్మన్నాడు. అడ్డుగా ఉన్న కుర్చీలను దాటుకుంటూ, ఆ వైపు చేరారు విద్యార్థులు. మళ్లీ ఈ వైపు రమ్మన్నాడు టీచర్. అయితే ఈ సారి విద్యార్థుల కళ్లకు గంతలు కట్టాడు. ఆపై నిశ్శబ్దంగా, గదిలో ఉన్న కుర్చీలు తీయించేశాడు. ఇప్పుడు మరో వైపు రమ్మన్నాడు. ఒక్క విద్యార్థి కూడా కదలలేదు. "దారిలో కుర్చీలు, బల్లలు అడ్డుగా ఉన్నాయి. కళ్లకు గంతలు కట్టారు. వాటిని దాటుతూ ఆ వైపు రావటం కష్టం" అన్నారు. చివరికి ఓ విద్యార్థి ధైర్యంగా ముందుకు వచ్చాడు. తడబడుతూ, లేని టేబిళ్ల కోసం వెతుకుతూ అడుగులు వేయటం ఆరంభించాడు. అతడి వల్ల మరి కొందరు ముందుకు వచ్చారు. అయితే, చేతికి ఏమీ తగలకపోవటంతో సందిగ్ధంలో పడి సగంలో ఆగిపోయారు. అన్ని సందిగ్ధాలను మించి, లేని అడ్డంకులను దాటుకుంటూ, అడ్డేమీ లేదని నిర్ధారించుకుంటూ ఒక విద్యార్థి గమ్యం చేరాడు. ఇదీ మనలో నాటుకుపోయిన భయాల స్వరూపం! అక్కడెమీ లేకున్నా లేని అనుమానాలతో ఏదో ఉందని తమని తాము మభ్యపెట్టుకునే వారు చాలామంది. మనం ఏదైనా పని సాధించాలనుకోగానే ముందుగా సందేహాలు ముసురు కుంటాయి. ఆపై అడ్డంకులు గుర్తుకు వస్తాయి. దారిలోని అవరోధాలను స్మరిస్తాం. దాంతో అడుగు ముందుకు వేయం. ఆలోచన ఉంటుంది కానీ అది ఆచరణలోకి రాదు. ఒకవేళ ఆచరణ ఆరంభించినా, మొదటి ప్రతి బంధకంలోనే వెనక్కు తిరుగుతాం. ఎవరైతే ఆలోచనను ఆచరణలో పెట్టటమే కాదు, ప్రతిబంధకాలన్నీ ఊహాత్మకమైనవే తప్ప నిజమైనవి కావు అని గ్రహించి గమ్యం వైపు సాగిపోతారో, వారు తమ గమ్యం చేరుతారు లక్ష్యాన్ని సాధిస్తారు. అందుకే మన పూర్వికులు మనుషులను మూడు రకాలుగా వర్గీకరించారు. 'ఆరంభించరు నీచమానవులు' అన్నారు.. ఎవరైతే ఏదైనా పని చేయాలనుకోగానే, రకరకాల అవరోధాలను ఊహించి, అడ్డంకులను చూసి భయపడుతూ పని ఆరంభించనే ఆరంభించరో వారు అధమస్థాయి మానవులు. ప్రగల్భాలు పలుకుతూ, తాము చేయగల పనులు సాధించగల గొప్ప లక్ష్యాల గురించి మాటలు మాట్లాడతారు తప్ప చేతల దగ్గరకు వచ్చేసరికి అడుగు ముందుకు పడదు. తాము అడుగు ముందుకు వేయకపోవటమే కాదు ఇతరులనూ అడుగు ముందుకు వేయనీయరు వీరు. అందుకే వీరు నీచమానవులయ్యారు. ఇక్కడ 'నీచం' అంటే 'చెడు' అని కాదు. 'నీచులు' అంటే నేరస్థులు, హంతకులు, మోసగాళ్లు కారు. వారి కన్నా తక్కువస్థాయి వారు వీరు. ఎందుకంటే ప్రతివ్యక్తికీ కర్తవ్యపాలన తప్పని సరిగా పాటించవలసిన ధర్మం అని భగవంతుడు నిర్దేశించాడు. అది సాధించదగ్గదా, అందుబాటులో ఉన్నదా అన్నది కాదు ముఖ్యం. కర్తవ్య నిర్వహణ ముఖ్యం. అటువంటి కర్తవ్యనిర్వహణను విస్మరించే వారంతా నీచులే. వారు ధనవంతులు కావచ్చు, విజ్ఞానవంతులు కావచ్చు. నాయకులు కావచ్చు. ఇంకెవరైనా కావచ్చు. స్వధర్మాన్ని పాటించకుండా, కర్తవ్యనిర్వహణను విస్మరిస్తే వారు నీచులే అవుతారు. ఇలా మనుషుల్లో మొదటి రకం వారు నీచులుగా గుర్తించబడ్డారు.                                     ◆నిశ్శబ్ద.

పొగడ్తలు ఎలాంటి పాత్ర పోషిస్తాయి?

పొగిడి చెడినవాడు లేడు. సమయోచితంగా పొగడలేని వారు అన్ని చోట్లా చెడిపోతారు. జీవితంలో కొందరికి జ్ఞానం ఒక దశలో వస్తుంది. అంతకు క్రితం నష్టమైపోయిన కాలాన్ని కూడదీసుకోవడానికి అన్నట్లుగా జ్ఞానోదయమైన మరుక్షణం నుండి అవతలివారిని అమితంగా, భరించలేనంతగా పొగడడం నేర్చుకుంటారు. ఇలాంటి వ్యక్తి తాను పొగిడేవాణ్ణి ఆకాశానికి ఎత్తేస్తాడు. 'ది స్కై ఈజ్ ది లిమిట్” అని రుజువు చేస్తాడు. అవతలి వ్యక్తి అలిసిపోయేంత వరకూ, లేక తాను అలిసేంత వరకూ పొగుడుతాడు.  ఒక్కొక్కసారి అక్కడ పొగడడానికి తగినంత విషయం లేనప్పుడు అతడి ఇంట్లో తనకు ఆతిథ్యమిచ్చిన ఆయన సతీమణి అమృతహస్తాన్ని, ఆవిడ వండి వడ్డించిన పదార్థాలు ఎంత రుచికరంగా వుంటాయో ఇలాంటి విషయాలను ఇరికించి మరీ చెప్తాడు. ఇలాంటి సబ్జక్టును గురించి ఎంతైనా చెప్పే వీలుంది. ఆ వంకాయ కూర, ఆ పాయసం, వారింటి నెయ్యి ఘుమఘుమలు, ఇట్లా చెప్పుకుపోతూ వుంటే దీనికి అంతుందా అనిపిస్తుంది. అక్కడ సన్మానంలో సన్మానితుడూ, ఉపన్యాసకుడూ అలసి పోయేలోగా శ్రోతలమైన మనం అలసిపోవడం ఖాయం. ఇలా ప్రసంగించేవాడికి సన్మానితుడు అసలెవరో తెలీని సందర్భాలు కూడా ఎదురావుతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఈ ప్రాసంగికుడు ఏ మాత్రం జంకడు. ఎవర్ని సన్మానిస్తున్నారో వారిని గురించి చీటిమీద మూడు ముక్కలు వ్రాసి ఇలా ఇవ్వండి. మూడునిమిషాల్లో ప్రసంగ పాఠంతో రెడీ అయిపోతాను. మీరు వేదికమీద ఆహ్వానితులు నలుగురికీ పూలమాలలు వేసేలోగా నా చెవిలో నాలుగుముక్కలు ఊదితే దంచి పారేస్తాను. ఎవరిని గురించి చెప్పే వాక్యాలైనా నాకు కంఠస్థమే, తడుము కోవలసిన అవసరముండదు. రాజకీయ, పారిశ్రామిక, విద్యావేత్తలెవరైనా సరే, కళాకారులు, సినిమా స్టారులైనా సరే. ఎవరికి తగిన సన్మాన వాక్యాలు వారికి వప్పజెప్పడానికి ఎప్పటికప్పుడు సిద్ధంగానే వుంటాను. గుటికెడు కాఫీ సేవించి గొంతు సవరించానంటే ఇక ఆ తర్వాత ఉపన్యాసం అనర్గళంగా సాగిపోతుంది" అని హామీ ఇస్తాడు. అన్ని రంగాల్లోనూ స్పెషలైజేషన్ చోటు చేసుకున్న నేటి కాలంలో పొగిడే కళలో కొందర్ని తర్ఫీదు చేసి, వారికి లైసెన్స్ మంజూరు చేయడంలో తప్పేమీ కనిపించదు అనిపిస్తుంది. ఈ లలితకళను శాస్త్రీయంగా ఎక్కడా అభ్యసించకపోయినా, అనేక సంవత్సరాల అలవాటు కొద్దీ దీనిని క్షుణ్ణంగా నేర్చినవారు మన రాష్ట్రంలో ఎందరో వున్నారు. ఇలాంటివి నేర్పటానికి  నెలకొల్పే సంస్థల్లో ప్రస్తుతానికి వీరిని అధ్యాపకులు గానూ, శిక్షకులుగానూ నియమించవచ్చు. ఒక బాచ్ విద్యార్థులు శిక్షణ పొందితే ఇక ఆ తర్వాత కావలసినంత మంది అధ్యాపకులు. సమోవా అనే చిన్న రాజ్యానికి ఒక రాజుండేవాడు. అతడి రాజ్యంలో డాక్టర్ విన్సెంట్ హైనర్ అనే పెద్దమనిషి కొన్నాళ్ళుండి కొంత ప్రజాసేవ చేశాడు. డాక్టరు మహాశయుడు ఆ రాజ్యాన్ని వదలి వెళ్ళే తరుణంలో ఆ రాజుగారు ఆయన గౌరవార్థం విందు ఏర్పాటు చేశాడు. ఆ సందర్భంగా రాజు డాక్టర్ను గురించి నాలుగు వాక్యాలు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. కాని రాజు కుర్చీలో కదలకుండా కూచున్నాడు. రాజు లేచి నుంచోని ప్రసంగించకుండా అలానే కూచోనుండటం డాక్టర్ హైనర్కు ఆశ్చర్యం కలిగించింది. ఈలోగా పొగడ్తనే వృత్తిగా చేసుకున్న ఒక వక్త వచ్చి రాజు తరపున డాక్టర్ హైనర్ గురించి బ్రహ్మాండమైన వాక్యాలతో దంచి పారేశాడు. సుదీర్ఘమైన ఆ ప్రశంసా వాక్యాల తర్వాత హైనర్ కొంత కింధా మీదై. ఉచిత రీతిని సమాధానం చెప్పడానికి లేచి నుంచోబోయాడు. రాజుగారు హైనర్ను వారిస్తూ కూచోమంటూ సౌంజ్ఞ చేశాడు. "మీ తరపున ప్రసంగించటానికి కూడా ఒక వక్తను నియమించాను. ఇక్కడ మా రాజ్యంలో ఇలాంటి ప్రసంగాలు ఆ వృత్తి స్వీకరించిన వారే చేస్తారు. ఔత్సాహికుల్ని ప్రోత్సహించడం మా పద్ధతి కాదు" అని వివరించాడు. ఇది పొగడటానికి కూడా ఎంత ప్రతిభ ఉండాలో తెలియజేస్తుంది. వాక్చాతుర్యం మనిషికి ఎంత ముఖ్యమో స్పష్టపరుస్తుంది.                                    ◆నిశ్శబ్ద.

శాస్త్రవేత్తలు  ప్రపంచ ఆయువుకు ఊపిరితిత్తులు..

  ఈ ప్రపంచంలో చాలా రహస్యాలు ఉన్నాయి. ఆ రహస్యాలను వాటి వెనుక కారణాలను కనిపెట్టేవారు శాస్త్రవేత్తలు.  శాస్త్రవేత్తలు లేకుంటే ఈ ప్రపంచం ఒక జంతుచర్యల కేంద్రంగా ఉండేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. శాస్త్రవేత్తలు ప్రపంచ ఆయువుకు ఊపిరితిత్తుల లాంటి వాళ్ళు. అలాంటి శాస్త్రవేత్తలను గుర్తుచేసుకుంటూ, వారి కృషిని గుర్తిస్తూ ప్రతి ఏడూ శాస్త్రవేత్తల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మరీ ముఖ్యంగా మార్చి 14వ తేదీన ఆల్బర్ట్ ఐన్ స్టీన్ పుట్టినరోజు సందర్భంగా శాస్త్రవేత్తల దినోత్సవం జరుపుకుంటారు. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ పుట్టినరోజుతో పాటుగా మార్చి 14న సెలబ్రేట్ సైంటిస్ట్స్ డే జరుపుకుంటారు. ఈ రోజున, మేము గతం మరియు వర్తమానం నుండి శాస్త్రీయ సహకారాన్ని గమనించాము. మన జీవితాలను సులభతరం చేయడంలో శాస్త్రవేత్తలు సాధించిన విజయాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి శాస్త్రవేత్తలకు మనకంటే ఎక్కువ తెలుసు.  ప్రాణాలను కాపాడటానికి, పర్యావరణాన్ని రక్షించడానికి, వ్యాధులను నయం చేయడానికి, మనకి దూరంగా ఉన్న గ్రహాల గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తల ఆలోచనలు, పరిశోధనలు, వారి కృషి తోడ్పడుతుంది.  చాలా మంది అరిస్టాటిల్‌ను మొదటి శాస్త్రవేత్తగా భావిస్తారు. ఈయన క్రీ.పూ నాల్గవ శతాబ్దంలో  పరిశీలనలు, తర్కానికి మార్గదర్శకత్వం వహించాడు, అరిస్టాటిల్ పని, ఈయన తత్వశాస్త్రం మధ్య యుగాలలో పాశ్చాత్య సమాజాన్ని ప్రభావితం చేశాయి, రాబోయే వేల సంవత్సరాల్లో శాస్త్రీయ అధ్యయనానికి తగిన ఆలోచనలను రూపొందించాయి. ఈయన తరువాత ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ నియమాలను కనుగొన్నాడు. గణితంలో కొత్త రూపమైన కాలిక్యులస్‌ను కనుగొన్నాడు. కానీ న్యూటన్ ఒక శాస్త్రవేత్తగా గుర్తింపు పొందలేదు.  పరిణామ సిద్ధాంతం  గురించి మనకు తెలిసేలా చేసిన చార్లెస్ డార్విన్ ఘనత పొందాడు, అయితే న్యూటన్ లాగా, ఈయన తన ఆలోచనలను ప్రజల ముందు బహిర్గతం చేయడంలో వెనుకాడాడు. డార్విన్ తన ప్రారంభ పరిశీలనలను  20 సంవత్సరాల తర్వాత అంటే..  1859 వరకు తన పరిశోధనల సమాహారమైన  "ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీసిస్" ను ప్రచురించలేదు. సహజ విజ్ఞాన రంగంలో విస్తృత పరిశోధనలు చేయడం ద్వారా శాస్త్రవేత్తగా తన ఖ్యాతిని పెంపొందించుకోవడానికి అతను అన్ని  సంవత్సరాలు కష్టపడ్డాడు. సముద్ర జీవులపై ఆయన చేసిన కొన్ని అధ్యయనాలు నేటికీ అనేక సంస్థలలో  బోధించబడుతున్నాయి. 1930ల వరకు పరిణామంపై డార్విన్ కనుగొన్న విషయాలను శాస్త్రీయ సమాజం విస్తృతంగా అంగీకరించలేదు. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, నిస్సందేహంగా ఆధునిక కాలంలో అత్యంత ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త. ఈయన గణిత, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు కానీ తిరస్కరించబడ్డాడు. తిరస్కరించారనే నిరాశతో ఆ మార్గాన్ని వదులుకుని ఉంటే.. మనం సాపేక్షత సిద్ధాంతం, ఫోటోఎలెక్ట్రిక్ ప్రభావం, క్వాంటం మెకానిక్స్ గురించి ఎప్పటికీ నేర్చుకోలేకపోయేవాళ్ళం. సైంటిస్ట్ డే సందర్భంగా కొన్ని ముఖ్యమైన విషయాలు.. 1628 సర్క్యులేషన్ సిద్ధాంతం బ్రిటీష్ వైద్యుడు విలియం హార్వే గుండె శరీరం చుట్టూ రక్తాన్ని పంప్ చేస్తుందని ప్రతిపాదించాడు, రక్త ప్రసరణ వ్యవస్థకు కాలేయం ఇంజిన్ అనే దీర్ఘకాల నమ్మకాన్ని వివాదాస్పదం చేసింది. 1844 లో మొదటి టెలిగ్రాఫ్ సందేశం మే 24న శామ్యూల్ మోర్స్ వాషింగ్టన్ DC నుండి బాల్టిమోర్‌కి మొదటి టెలిగ్రాఫ్ సందేశాన్ని పంపాడు, అందులో ఉన్న సారాంశం "దేవుడు ఏమి చేసాడు?" 1869 లో DNA యొక్క ఆవిష్కరణ ఫ్రెడరిక్ మీషెర్, స్విస్ రసాయన శాస్త్రవేత్త, DNA అణువును గుర్తించారు. 1905 - 1915 సాపేక్ష సిద్ధాంతం ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ప్రచురించాడు. 1969 చంద్రునిపై మొదటి మనిషి అపోలో 11 మొదటిసారిగా చంద్రునిపైకి మనిషిని తీసుకువెళ్లింది.                                ◆నిశ్శబ్ద.

కలల కాన్వాసు మనమే గీసుకుందాం!

కలలు కనండి, కలలను సాకారం చేసుకోండి అని అంటారు అబ్దుల్ కలాం. ఈయన మన భారతీయులకు గొప్ప ప్రేరణ. ఎక్కడో పేద కుటుంబంలో జన్మించి, దీపం వెలుగులో చదువుకుని, అంతరిక్షానికి రాకెట్లను పంపే విజ్ఞానాన్ని ఒడిసి పట్టి శాస్త్రవేత్తగా ఎదిగాడు. ఇప్పుడు ఈయన గురించి ఎందుకు అంటే.. కలలను సాకారం చేసుకోమని ఈయన ఇచ్చిన ఆలోచన ఎంత గొప్పదో చర్చించుకోవడానికి. అలాగే ఈ ఆలోచనకు మరొక రూపమా అన్నట్టుండే మరొక విషయాన్ని, ప్రపంచానికి అంతగా తెలియని వ్యక్తిని గురించి మాట్లాడుకోవడానికి. NAtional dream day… కలలను కనడం వాటిని నిజం చేసుకోవడం చాలా గొప్ప విషయం. ఈ గొప్పతనం వెనుక మనిషి కృషి, పట్టుదల, అవిరామ సాధన ఎంతో ఉంటుంది. కలలను గూర్చి కథలుగా మాత్రమే చెప్పుకునే కాలం కాదు జీవితాలను కథలు కథలుగా, స్ఫూర్తి మంత్రాలుగా చెప్పుకునే కాలమిది. మనిషి గొప్పగా ఎదగడానికి అడ్డుకునేది ఏదీ ఈ ప్రపంచంలో లేదు.. ఉన్న అడ్డంకల్లా మనకు ఎన్నో అడ్డంకులు ఉన్నాయని మొదటే మనం అభిప్రాయపడటం. బిడ్డ పుట్టాక ఏడుపు నుండి నవ్వుతూ ఉండటానికి సమయం పడుతుంది. పిల్లవాడికి పండ్లు మొలిచేటప్పుడు ధవడలు చెప్పలేనంత నొప్పిని అనుభూతి చెందుతాయి. ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు మోకాళ్ళు గీరుకుపోయి నొప్పి పెడతాయి. అవన్నీ సమస్య అనుకుంటే ఎవరూ నడక నేర్వలేరు కదా… అలాగే మనిషి దశలు మారేకొద్ది సమస్యలు కూడా విభిన్న రూపాలు దాలుస్తాయి. సమస్యలను చూసుకుని ఆగిపోయే వారు జీవితంలో గొప్ప స్థానానికి వెళ్లలేరు.  అందుకే కలలను కనమని ప్రోత్సహించే రోజు ఒకటుంది. ప్రతి ఏటా మార్చి 11న జరుపుకునే జాతీయ కలల దినోత్సవం జరుపుకుంటారు. ఈ  రోజున మన జీవితంలో జరగవులే అనే ఆలోచనతో వదిలిపెట్టేసిన  మీ కలలను తిరిగి వేటాడటం మొదలుపెట్టండి. యువకుల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ దీనికి అర్హులే.. కావాల్సిందల్లా సంకల్ప బలమే.. "ది మిలీనియం మ్యాన్," రాబర్ట్ ముల్లర్ చేత ప్రేరణ పొంది ఈ కలల దినోత్సవం ఏర్పడింది.   ప్రతి సంవత్సరం అతని పుట్టినరోజున దీన్ని జరుపుకుంటారు. డ్రీమ్ స్కూల్ ఫౌండేషన్ పిల్లల కలను నిజం చేయడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తుంది.  ఇది అన్ని వయసుల వారికి స్ఫూర్తినిచ్చినప్పటికీ, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందిస్తోంది.  ఎవరు రాబర్ట్ ముల్లర్.. మన దేశానికి కలాం తెలుసు..  ఈ ప్రపంచానికి ముల్లర్ తెలుసు. చాలామందికి తెలియని విస్తృతమైన ప్రపంచం ఇది. రాబర్ట్  ముల్లర్ ఒక శరణార్థి, జైలు శిక్ష తప్పించుకునే భయానక పరిస్థితులను అనుభవించాడు.  ఫ్రెంచ్ ప్రతిఘటనలో సభ్యుడు కూడా అయ్యాడు. అతను 25 సంవత్సరాల వయస్సులో ఐక్యరాజ్యసమితిలో ఇంటర్న్‌గా చేరాడు, అక్కడ తన జీవితంలోని తరువాతి 40 సంవత్సరాలను అంకితం చేశాడు. అనేక అవార్డులు, నామినేషన్లు ఈయన సొంతమయ్యాయి. 14 పుస్తకాలు వేలకొద్దీ రచనలు తరువాత, 1986లో కోస్టా రికాలో  పదవీ విరమణ చేసాడు, అక్కడ అతను ఐక్యరాజ్యసమితి యొక్క యూనివర్శిటీ ఫర్ పీస్ ఛాన్సలర్‌గా పనిచేశాడు, దీన్ని స్థాపించడంలో సహాయం చేశాడు. బెంచ్ ఆఫ్ డ్రీమ్స్ డ్రీమ్ బెంచ్ డైరీని కూడా రూపొందించాడు.  ఇలా ఒక శరణార్థిగా ఉన్న వ్యక్తి తన జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగాడు. రాబర్ట్ ముల్లర్ గూర్చి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటే.. 1923 "ది మిలీనియం మ్యాన్" రాబర్ట్ ముల్లర్ మార్చి 11న బెల్జియంలో జన్మించాడు. 1948 ముల్లర్ ఐక్యరాజ్యసమితిలో ఇంటర్న్‌గా చేరాడు. 1987 మీ కలల కోసం ఒక బెంచ్ సృష్టించాలని.. ముల్లర్ డెస్ బెర్గోఫర్ మరియు గెర్రీ స్క్వార్ట్జ్ సహాయంతో బెంచ్ ఆఫ్ డ్రీమ్స్‌ అనే ఆలోచనతో ముందుకు వచ్చాడు. 1995 జాతీయ కలల దినోత్సవాన్ని డ్రీమ్ స్కూల్ ఫౌండేషన్ రూపొందించింది. పెద్దకలలు కనడం వాటిని నిజం చేసుకోవడం ప్రతి మనిషికి అవసరం.                                     ◆నిశ్శబ్ద.

మహిళా న్యాయమూర్తులు కావాలి ఇందుకే..

ఈ ప్రపంచంలో వ్యక్తులకు న్యాయం జరిగేలా చూసేది న్యాయవ్యవస్థ. స్వాతంత్య్రం పొందిన ప్రతి దేశంలో న్యాయవ్యవస్థ ఉంది. ఈ న్యాయ వ్యవస్థ అనేది ఈనాటిది కాదు. ఒకప్పుడు రాజ్యాల పేరుతో ఈ భూమండలాన్ని పాలించిన రాజులు, రాణులు కూడా న్యాయవ్యవస్థను పాటించారు. ఎక్కడో కొందరు నియంతలు మాత్రం తాము చెప్పిందే వేదమనే ధోరణిలో రాజ్యపాలన చేశారు. అయితే ఇదంతా అధికారం చేతిలో ఉన్నవాళ్లకే తప్ప సాధారణ పౌరులు తలవంచుకుని పోయే పరిస్థితులే ఉండేవి.  దేశాలు నాగరిక ప్రపంచంలో అడుగుపెట్టినా, ఎంత అభివృద్ధి సాధించినా మహిళలకు న్యాయం అనేది విభిన్నంగానే ఉండేది, బడుగు బలహీన వర్గాలకు బానిసత్వం తప్ప న్యాయం అనే పదానికి తావుండేది కాదు. ఈక్రమంలో ఎన్నో పోరాటాలు, మరెన్నో నిరసనలు, ప్రపంచం మీద కాలుతున్న కత్తిపై సమ్మెట దెబ్బల్లా మారాయి. ఫలితంగా న్యాయవ్యవస్థలోని వివిధ స్థాయిలలో మహిళలకు సమాన మరియు సంపూర్ణ భాగస్వామ్యం వైపు అడుగులు పడ్డాయి.   ప్రతి సంవత్సరం మార్చి 10న అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. న్యాయస్థానాలు మహిళా న్యాయమూర్తులకు తగిన ప్రాధాన్యత ఇస్తూ.. మగవారితో సమానంగా ఆడవారు ఉండాలని భావించారు. జనాభాకు ప్రాతినిధ్యం వహించడానికి, వారి ఆందోళనలకు ప్రతిస్పందించడానికి, సమర్థ నిర్ణయాలను జారీ చేయడానికి న్యాయవ్యవస్థలో మహిళల పాత్ర చాలా కీలకం. మహిళా న్యాయమూర్తులు తమ విధులకు హాజరు కావడం ద్వారా న్యాయస్థానాల విశ్వసనీయతను పెంచుతారు, వారు బహిరంగంగా న్యాయం కోరుకునే ఎవరికైనా అందుబాటులో ఉంటామనే బలమైన సందేశాన్ని, భరోసాను ఇస్తారు.  సహజంగా ఓ కుటుంబంలో మహిళల నిర్ణయాల కంటే పురుషుల అభిప్రాయాలకు ప్రాధాన్యత, వారి నిర్ణయాలే పైచేయిగా ఉంటాయి. సమాజంలో ఇక మహిళల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. స్త్రీలు ఎప్పుడూ పురుషుల కంటే తక్కువ అని భావించబడుతున్నారు, అందువల్ల జీవితంలోని వివిధ రంగాలలో సమాన ప్రాతినిధ్యం ఇవ్వబడలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి కానీ అవి అలానే కొనసాగుతున్నాయి. గత సంవత్సరం, దోహాలో జరిగిన UNODC గ్లోబల్ జ్యుడీషియల్ ఇంటెగ్రిటీ నెట్‌వర్క్ యొక్క రెండవ ఉన్నత-స్థాయి సమావేశంలో, ప్రెసిడెంట్ వెనెస్సా రూయిజ్, ఖతార్ ప్రధాన న్యాయమూర్తి సంయుక్తంగా మహిళా న్యాయమూర్తుల విజయాలను గౌరవించే అంతర్జాతీయ దినోత్సవ ఆలోచనను ప్రతిపాదించారు.  కోర్టు బెంచ్‌లో సమాన సంఖ్యలో పురుషులు మరియు మహిళలు ఉండటం న్యాయవ్యవస్థ  నిష్పాక్షిక తీర్పుల సామర్థ్యాన్ని పెంచుతుంది. మహిళా న్యాయమూర్తులు ధర్మాసనానికి విభిన్న దృక్కోణాలను అనుభవాలను అందిస్తారు, వారు సేవ చేసే సమాజాన్ని చిత్రీకరిస్తూ మానవ హక్కులు, చట్ట నియమాలను రక్షించే న్యాయవ్యవస్థ సామర్థ్యంపై ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేస్తారు. నాయకత్వ స్థానాల్లో ఉన్న మహిళలు అవినీతిని ఎదుర్కోవడానికి, కుట్రలను నాశనం చేయడానికి కూడా సహాయపడతారు. మహిళా న్యాయమూర్తులను గతంలో నిషేధించారు కానీ తరువాత వీటిని తిరిగి చేర్చడం ద్వారా న్యాయ వ్యవస్థలను మరింత పారదర్శకంగా వారు తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడింది. న్యాయ వ్యవస్థలు, నిర్వాహక నాయకత్వ సంస్థలు, ఇతర స్థాయిలలో మహిళల అభివృద్ధి కోసం సంబంధిత విజయవంతమైన జాతీయ విధానాలు, ప్రణాళికలను స్థాపించడానికి మరియు అమలు చేయడానికి నిబద్ధత ఏర్పడింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్క మహిళ చేయాల్సిన కొన్ని పనులను చూస్తే.. •ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కుల కోసం ఒక స్టాండ్ తీసుకోండి మీరు ప్రస్తుతం మహిళల కోసం మాట్లాడటానికి మీ వాయిస్‌ని ఉపయోగించవచ్చు. ఈ రోజున, సోషల్ మీడియాలో లింగసమానత్వం మీకు ఎందుకు ముఖ్యమైనదో షేర్ చేయవచ్చు.   •మహిళా శక్తిని ప్రోత్సహించండి మహిళలు తమ హక్కుల కోసం తమ మద్దతును చూపించడానికి మరిన్ని అవకాశాలను ప్రోత్సహించండి. మహిళా సాధికారతను పెంపొందించడానికి కొన్ని ఆలోచనలు మహిళల కోసం మాత్రమే ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను రూపొందించవచ్చు. •అణగారిన మహిళలకు న్యాయవాది ప్రాథమిక అవసరాలు లేదా హక్కుల విషయానికి వస్తే అందరికీ సమాన హక్కు లేదు. సమాజం ద్వారా వారి ప్రాథమిక అవసరాలు ఏర్పాటయ్యేలా చేయడం, మానవ హక్కులను కోల్పోతున్న మహిళల కోసం మీరు ఎక్కడెక్కడికో వెళ్లి సహాయం చేయలేకపోయినా మీ చుట్టూ  ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నించండి. న్యాయం విస్తృతమవ్వాలంటే.. న్యాయవ్యవస్థలో మహిళల సంఖ్య పెరగాలి. ◆నిశ్శబ్ద.

కిడ్నీల మీద కాస్త కనికరం చూపండి!

కిడ్నీలు మన శరీరంలో ముఖ్య అవయవాలు. ఇవి శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తాయి. వ్యర్థాలను మూత్రం రూపంలో బయటకు పంపుతాయి. అయితే మనం రోజూ వారీ జీవితంలో చేస్తున్న కొన్ని తప్పులు మూత్రపిండాల పనితీరుకు అడ్డంకి అవుతున్నాయి. చాలా తొందరగా పాడైపోతున్నాయి. ఎంతో చిన్న వయసులో మూత్రపిండాల సమస్యలు అనుభవిస్తున్నారు. ఆరోగ్యం గురించి ఆలోచిస్తే.. కిడ్నీల విషయంలో చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు. పైగా ఈ కిడ్నీ సమస్యలు మన చెప్పుచేతల్లో నుండి జారిపోయేవరకు బయటపడవు.   ప్రతి సంవత్సరం మార్చి 9వ తేదీని ప్రపంచం కిడ్నీ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా అందరూ కిడ్నీల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారవిహారాలు తెలుసుకుంటే..  నీళ్లు.. కిడ్నీ ఆరోగ్యానికి మంచినీరు మొదటి ఔషధం. ప్రతిరోజు శరీరానికి అవసరమైనంత నీటిని తీసుకోవడం ద్వారా కిడ్నీలను జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. శరీరం హైడ్రేట్ గా ఉంటే కిడ్నీలు సేఫ్ గా ఉంటాయి. మంచినీరు తగినంత తీసుకుంటే.. కిడ్నీలు వ్యర్థాలను వడపోయడం తేలిక అవుతుంది.  ఆహారం.. ట్యూనా, సాల్మన్ లేదా ట్రౌట్ వంటి చేపలలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల  ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను సులువుగా పొందవచ్చు. క్యాబేజీలో పొటాషియం మరియు సోడియం రెండూ తక్కువగా ఉంటాయి, అయితే ఫైబర్, విటమిన్ C మరియు K సమృద్ధిగా ఉంటాయి. క్యాప్సికం గా పిలుచుకునే బెల్ పెప్పర్ లో విటమిన్ B6, B9, C మరియు K,  విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిలో మంచి  ఫైబర్ ఉంటుంది. ఇందులో  యాంటీఆక్సిడెంట్లను కూడా బాగుంటాయి. ముదురు ఆకుకూరలలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు వీటి నుండి బాగా అందుతాయి. మన దగ్గర ఎప్పుడూ ఉండే గొప్ప యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ వెల్లుల్లి. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే నిర్దిష్ట సమ్మేళనం ఉంటుంది. ఇది మూత్ర పిండాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. క్యాలి ఫ్లవర్, బ్రోకలి కిడ్నీ ఆరోగ్యాన్ని దృఢంగా ఉంచుతాయి. అలవాట్లు.. ద్రవ పదార్థాల దగ్గరి నుండి, ఆహార పదార్థాల వరకు ప్రతి ఒక్కటీ కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడేదిగా ఉండాలి. శీతల పానీయాలు, ఆల్కహాల్, ఎక్కువ పవర్ ఉన్న మందులు, కఠినమైన ఆహార పదార్థాలు దూరం పెట్టాలి. ఫైబర్, విటమిన్ సి, తాజా ఆకుకూరలు, కూరగాయలు, ముల్లంగి, తీసుకోవడం. శారీరక వ్యాయామం. యోగా సాధన పాటించాలి. అవయవదానం.. ప్రస్తుత కాలంలో కిడ్నీ సమస్యలు ఫేస్ చేస్తున్నవారు చాలామంది ఉన్నారు. కొందరు కిడ్నీ దాతలు లేక మరణిస్తున్నారు. ఇలాంటి వారి కోసం అవయవదానం చెయ్యాలి. మరణం తరువాత, ఊహించిఅని మరణాలు సంభవించినప్పుడు కుటుంబ సభ్యులు కూడా అవయవ దానానికి  మద్దతు ఇవ్వాలి.   సంవత్సరానికి ఒకసారి అయినా వైద్యుడిని సంప్రదించి కిడ్నీల ఆరోగ్యాన్ని పరీక్ష చేయించుకోవాలి. ఇలా చేస్తే కిడ్నీ ఆరోగ్యం పదిలం.                                        ◆నిశ్శబ్ద.

ప్రపంచం మీద మహిళల పతాకం.. మహిళా దినోత్సవం!

మహిళ లేకపోతే ఈ భూమి మీద ప్రాణిని నవమాసాలు మోసి  కనే మార్గం లేదు. ఆడవారికే ప్రత్యేకతను తీసుకొచ్చే అంశం ఇది. ఈ సృష్టిలో ఆడ, మగ అంటూ రెండు వర్గాలున్నా.. ఏ వర్గానికి ఆ వర్గం ప్రత్యేకం. కానీ పితృస్వామ్య వ్యవస్థ కలిగిన భారతదేశంలో తరతరాలుగా స్త్రీని ఒక శ్రామికురాలిగా చూస్తున్నారు. ఆడది అంటే భర్తకు సేవ చేయడం, పిల్లల్ని కనడం, ఇంటి పనులు చేయడం, భర్తకు కోపం వచ్చినప్పుడు ఆ కోపం తీరడానికి తనొక మార్గమన్నట్టు, భర్తకు శారీరక అవసరం తీర్చే వస్తువు అయినట్టు ఇలా మహిళను ఎంతో దారుణంగా చూసేవారు. దీన్ని అధిగమించి మహిళలు ఈ ప్రపంచంలో తమకంటూ గుర్తింపు కోసం ఎంతో పోరాటం చేశారు. దీని ఫలితమే మహిళా దినోత్సవం.  ప్రతి సంవత్సరం, మార్చి నెల మహిళల చరిత్రను ఈ ప్రపంచమంతా గొంతువిప్పి చెబుతుంది. ఈ చరిత్ర  సమకాలీన సమాజంలోని సంఘటనలను మహిళల సహకారాన్ని అందరికీ తెలుపుతుంది.  మార్చి 8న ప్రజలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈరోజున వివిధ రంగాలలో మహిళలు సాధించిన సాంస్కృతిక, రాజకీయ, సామాజిక - ఆర్థిక విజయాలను గురించి ప్రపంచానికి పరిచయం చేస్తుంది.   పక్షపాతం, వివక్ష లేని లింగ-సమాన ప్రపంచం కోసం మహిళా దినోత్సవం  పిలుపునిస్తుంది.  ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఒక్కో థీమ్ ను ఏర్పాటు చేస్తారు. ఈ ఏడాది థీమ్ ఎంబ్రేస్ ఈక్విటీ లేదా #ఎంబ్రేస్ ఈక్విటీ. "ఈక్విటీ అనేది కేవలం మాటల్లో కాదు, అది మహిళల జీవితాల్లో తప్పనిసరిగా ఉండాలి. లింగ సమానత్వం సమాజంలో భాగం కావాలి. IWD 2023 #EmbraceEquity ప్రకారం 'సమాన అవకాశాలు ఎందుకు సరిపోవు' అనే విషయం  గురించి ప్రపంచం మొత్తం మాట్లాడేలా చేయడమే ముఖ్య ఉద్దేశం. మహిళా దినోత్సవ చరిత్ర.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మొదట ఉత్తర అమెరికా మరియు ఐరోపాలో జరుపుకునేవారు.  ఐక్యరాజ్యసమితి పేర్కొన్న విషయాలు పరిశీలిస్తే.. "మొదటి జాతీయ మహిళా దినోత్సవం ఫిబ్రవరి 28, 1909న యునైటెడ్ స్టేట్స్‌లో నిర్వహించబడింది.  దీనిని సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా 1908లో న్యూయార్క్‌లో గార్మెంట్ కార్మికుల సమ్మె గౌరవార్థం అంకితం చేసింది.  మహిళలు కఠినమైన పని, అక్కడి పరిస్థితులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. 1917లో, రష్యాలోని మహిళలు ఫిబ్రవరిలో చివరి ఆదివారం (గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి 8న) "బ్రెడ్ అండ్ పీస్" నినాదంతో నిరసన, సమ్మెను చేశారు. వారి ఉద్యమం చివరికి రష్యాలో మహిళల ఓటుహక్కు చట్టానికి దారితీసింది. 1945లో ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన చట్టం స్త్రీ పురుషుల మధ్య సమానత్వాన్ని  ధృవీకరించే మొదటి అంతర్జాతీయ ఒప్పందంగా ప్రకటించింది, అయితే 1975లో అంతర్జాతీయ మహిళా సంవత్సరంలో మార్చి 8న మాత్రమే ఐక్యరాజ్యసమితి మొదటిసారిగా అధికారికంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంది. తరువాత డిసెంబర్ 1977లో, జనరల్ అసెంబ్లీ మహిళా హక్కులు, అంతర్జాతీయ శాంతి కోసం మహిళా దినోత్సవాన్ని సభ్యదేశాలు సంవత్సరంలో ఏ రోజునైనా పాటించాలని ఒక తీర్మానాన్ని ఆమోదించింది. చివరగా, 1977లోనే ఐక్యరాజ్యసమితి దీనిని ఆమోదించిన తరువాత, అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న మహిళా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవాలని ఆమోదించింది. ఇలా పలు మార్పులు చెందుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రూపుదిద్దుకుంది. మహిళా దినోత్సవం కేవలం సంవత్సరంలో ఒకసారి జరుపుకునే ముచ్చటగా, కేవలం ఆరోజు మాత్రమే మహిళలను గౌరవించే సందర్భంగా కాకుండా ప్రతిరోజూ మహిళకు తగిన గౌరవం, మహిళల పనికి తగిన గుర్తింపు కల్పించడం ఎంతో ముఖ్యం. మీ ఇంటి ఆడవారిని మీరు గౌరవించడం మొదలుపెడితే సమాజం ఆడవారిని గౌరవిస్తుంది. అలా ఒక బాధ్యతాయుతమైన ప్రపంచం ఆడవారి చుట్టూ పెనవేసుకుపోతుంది. ఈ ప్రపంచమంతా ఆడవారి సంకల్పశక్తి అనే పతాకం రెపరెపలాడుతుంది. మగవాడి విజయం వెనుక ఆడది ఉన్నట్టే.. ఆడదాని విజయం వెనుక మగవారి అర్థం చేసుకునే మనసు ఉండటం ప్రధానం. సమకాలీన ప్రపంచంలో ప్రతి మహిళ జీవితం యుద్ధమే.. అలాంటి మహిళలకు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలకు అండగా నిలబడే పురుషులకు ఆనందోత్సవ శుభాకాంక్షలు.. మీ ఆడవారి విజయం మీకు ఆనందమేగా..                                       ◆నిశ్శబ్ద.

రంగు రంగుల హోళి.. వసంతపు రంగేళి!

భారతీయుల సంప్రదాయంలో బోలెడు పండుగలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఋతువు మార్పుకు అనుగుణంగా జరిగేవి అయితే.. మరికొన్ని వివిధ కాలాలలో జరిగిన కొన్ని సంఘటనలకు గుర్తుగా జరుపుకునేవి. కొన్ని ప్రాంతీయత ఆధారంగా జరుపుకునేవి అయితే మరికొన్ని యావత్ భారతదేశం అంతా జరుకునేవి. ఇలా భారతీయులు అందరూ  దేశం మొత్తం జరుపుకునే వేడుకల్లో హోళి ఒకటి. రంగుల పండగ అయిన ఈ హోళి వెనుక చాలా కథనాలు ఉన్నాయి. ముఖ్యంగా శ్రీకృష్ణుడికి, హోళి పూర్ణిమకు అవినాభావ సంబంధం ఎంతో ఉంది. అలాగే హోళిని దేశవ్యాప్తంగా జరుపుకున్నా ఒక్కో ప్రాంతంలో ఒకో విధంగా జరుపుకుంటారు. ముఖ్యంగా పిల్లలు పెద్దలనే తేడా లేకుండా హోళి పండుగ జరుపుకోవడం చాలా చోట్ల కనిపిస్తుంది.  హోళి వెనుక చాలా కథలున్నాయ్! హోళీ పూర్ణిమను పలుచోట్ల కామ పున్నమి అని కూడా పిలుస్తారు. అంతే కాదు పౌర్ణమికి ముందురోజు కామదహనం కూడా నిర్వహిస్తారు. ఈ కామ దహనం వెనుక ఓ కథ ఉంది. తపస్సు చేసుకుంటున్న శివుడి మీద మన్మధ బాణాలు ప్రయోగిస్తాడు మన్మథుడు. దీనికి కోపం చెందిన శివుడు మన్మధుడిని తన మూడవ కంటితో భస్మం చేస్తాడు. తరువాత మన్మధుడి భార్య వేడుకోగా అతనికి పూర్వ రూపం ప్రసాదిస్తాడు. దీన్ని పురస్కరించుకుని వసంత మాసంలో వచ్చే పూర్ణిమను కామ పూర్ణిమగా జరుపుకుంటారు. మన్మధుడిని కాముడు అని పిలవడం అందరికీ తెలిసిందే.. హోళీ.. హోళిక.. హోళిక ఒక రాక్షసి. ఈమె హిరణ్యకశిపుడి చెల్లెలు. తన అన్నయ్య హిరణ్యకశిపుడు నరసింహ అవతారం చేతిలో మరణించినందుకు ప్రహ్లాదుని మీద ఎనలేని ద్వేషం పెంచుకుంది. ఎలాగైనా ప్రహ్లాదుని చంపాలని మంటల్లోకి తోసింది. కానీ నారాయణుడి అభయం ఉన్న ప్రహ్లాదునికి ఏమి కాలేదు. హోళిక ఆ మంటల్లో దహనమైపోతుంది. చెడు మీద మంచి సాధించిన విజయం ఇదని, హోళిక చనిపోయిన సందర్భంగా హోళికా దహనం చేస్తారని చెబుతారు.  బాల కృష్ణుడు..   హోళి పండుగ రోజే.. బాలకృష్ణుడిని ఉయ్యాలలో వేసినట్టు చెబుతారు. అందుకే డోలాయాత్ర పేరుతో కృష్ణుడిని ఉయ్యాలలో వేసి ఊపుతారు. కన్నయ్యతో పాటు రాధను కూడా జతగా ఉంచుతారు.  ఇక హోళిని వివిధ ప్రాంతాల్లో విభిన్న రకాలుగా చేసుకుంటారు. హోళి అంటే ఉదయం నుండి రంగులు పట్టుకుని వీధులంతా  హంగామా చేయడమే మనకు తెలుసు. కానీ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఆ శ్రీకృష్ణుడి నివాసమైన మధురలో చాలా ప్రత్యేకంగా హోళి జరుగుతుంది.  ఇక్కడ హోళి పండుగ వీధుల్లో జరుపుకోవడం ఎక్కడా కనిపించదు. పూర్తిగా దేవాలయాల్లో మాత్రమే హోళి జరుపుకుంటారు. అందుకు అనుగుణంగా ప్రజలందరూ దేవాలయాలకు బారులు తీరుతారు. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడు తమతో కలిసి రంగులు చల్లుకుంటూ, హోళి ఆడతాడనే నమ్మకం అక్కడి ప్రజల్లో ఉంది. ముఖ్యంగా బృందావనంలో హోళి సంబరాలు అంబరాన్నంటుతాయి. అంతే కాదు ఇక్కడి సంప్రదాయంలో భాగంలో ఆడవారు మగవారికి కర్రలతో కొడతారు. ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు, మొత్తం 16 రోజుల పాటు హోళి సంబరాలు జరుగుతాయి. ఆ ఇంద్రధనస్సు వచ్చి మధుర, బృందవనాలలో వాలిందా అన్నట్టు అక్కడ రంగుల మయం అందరినీ మాయ చేస్తుంది. ఫలితంగా హోళి పండుగ రోజు ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలకు అదనపు పని పెడతారు, మరికొందరు తమలో ఉన్న ట్యాలెంట్ ను ప్రదర్శిస్తారు. ఇలా హోళి సందడి దేశమంతా వెల్లివిరుస్తుంది.                                       ◆నిశ్శబ్ద.

భారతీయ మహిళకు గౌరవమెంత?

మహిళలు భార్యగా, తల్లిగా నిర్వహించే బాధ్యతలు ఎంతో విలువైనవి.. బాలచంద్రునికి వీరతిలకం దిద్దిన మగువ మాంచాలను, భరతజాతికి ఛత్రపతిని ప్రసాదించిన మహారాజ్ఞి జిజాబాయిని చరిత్ర ఎన్నటికీ మరచిపోదు. కుటుంబానికి కేంద్రబిందువుగా భర్తపై, బిడ్డలపై స్త్రీ ప్రభావం గణనీయమైనది. "నా జీవితంలో ఇద్దరు దయామయుల రుణం ఎన్నటికీ తీర్చుకోలేనిది. అనురాగాన్ని, ఆదర్శాల్ని గోరుముద్దలుగా కలిపి తినిపించిన మా అమ్మ ఒకరు; చేతి బంగారు గాజుల్ని అమ్మి నా పై చదువులకు డబ్బు కట్టిన మా అక్క ఒకరు... నేను సాధించిన విజయాలన్నీ వారి పాదాల వద్ద వినమ్రంగా అర్పిస్తాను" అంటారు భారతరత్న అబ్ధుల్కలామ్. అందుకే ఇంటిని నందనంగా తీర్చిదిద్దినా, నరకంలా మార్చినా కారణం ఇల్లాలే.  మగవారూ మారాలి... ఇంటినీ, ఇంటి పేరునూ వదలి అర్థాంగిగా తమ ఇంట అడుగుపెట్టిన మగువ పట్ల మగవారు కూడా ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. సహధర్మచారిణిగా ఆదరించాలి. భార్య అంటే తమ అసహనాన్ని, ఆవేశాన్ని భరించే బానిసగా భావించటం తగదు. సంపాదన ఒక్కటే గొప్పతనానికి గీటురాయి కాదు. కుటుంబ నిర్వహణ, ఆలనాపాలనా... ఇవన్నీ నిజంగా స్త్రీమూర్తి కార్యపటిమకు ప్రతీకలే. అతివలు చేసే ఇంటి పనులను చులకనగా చూడటం పురుషులు మానుకోవాలి. తనభార్య సీతలా ఉండాలని, పరాయి స్త్రీ మాత్రం సినిమాతారలా పలకరించాలనుకునే వికృత స్వభావాల నుంచి పురుషులు సంస్కారవంతులుగా ఎదగాలి. సప్తపది నడిచిన భర్తే భార్యను గౌరవించకపోతే ఇక సంతానం ఏం గౌరవిస్తుంది!  మేడిపండు మన సమాజం...  ఇటీవల ప్రపంచవ్యాప్తంగా స్త్రీని గౌరవించే విధానంపై పరిశోధనలు చేస్తే ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచం మొత్తంలో మహిళలను గౌరవించడంలో స్కాండినేవియన్ దేశాలు భౌగోళికంగా చిన్నవైనా ముందువరుసలో ఉన్నాయి. అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా వెనుకవరుసలో నిలిచాయి. ఇక 'యత్రనార్యస్తు పూజ్యంతే తత్ర రమంతే దేవతాః' అంటూ ఉపదేశాలు వల్లించే భారతీయులు కూడా చివరిస్థానంలో ఉన్నారు. మేడిపండు మనస్తత్వం గల వ్యక్తులతో నిండివున్న మన సమాజం తలదించుకోవాల్సిన కఠోర వాస్తవమిది. భారతీయ మహిళే ఫస్టు.. భారతనారీమణుల సాంప్రదాయిక జీవనశైలికి ప్రపంచదేశాలే నీరాజనాలు పలుకుతున్నాయి. అస్తిత్వానికి, అపరిమిత స్వాతంత్ర్యానికి భేదం తెలియని పాశ్చాత్య మహిళాలోకం స్త్రీవాదం పేరుతో నేలవిడిచి సాముచేసింది. ఏకంగా సామాజిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసుకుంది. భారతీయ మహిళలు మాత్రం తమ అస్థిత్వాన్ని కాపాడుకుంటూ సమాజంలో గుర్తింపు తెచ్చుకుంటూ సాగుతున్నారు.  భారతీయ మహిళలకు గుర్తింపు కాదు గౌరవం కావాలిప్పుడు. అది కూడా బయటకు పొగుడుతూ వెన్నుపోటు పొడిచేది కాదు.. మహిళను తనను తానుగా గుర్తించే గౌరవం కావాలి.                                        ◆నిశ్శబ్ద.

ముత్యమంత పంటికి ముచ్చటైన సేవకులు!

ఎదుటి వారిని మనవైపు తొందరగా ఆకర్షించాలంటే మన మాటతీతుతో పాటు మంచి చిరునవ్వు కూడా ముఖ్యం. అంతర్గత అందం మనసుతో వచ్చేది అయినప్పుడు అది కేవలం ప్రవర్తనలో, ఇతరులతో కలిసి చేసే పనులను బట్టి ఇతరులకు అర్థమవుతుంది. కానీ కొన్ని బహిర్గతమయ్యే విషయాలు కూడా మనుషులలో ఆత్మవిశ్వాసం పెంచుతాయి. అలాంటి వాటిలో ఒకటి తీరైన పలువరుస. తెల్లగా మెరిసిపోయే దంతాలు, దానిమ్మ పలువరుస కలిగిన దంతాలు ఎంతో గొప్ప ఆకర్షణను తెచ్చిపెడతాయి. అయితే దురదృష్ట వశాత్తు నేటి కాలంలో చాలామంది దంత సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముప్పయ్యేళ్లు నిండకనే గట్టి పదార్థాలు తినాలంటే సంకోచించే స్థితిలో ఉన్నారు. అయితే వీరందరికీ ఉత్తమ పరిష్కారాలు ఇచ్చి దంత సంరక్షణకు దారి చూపేవారు దంత వైద్యులు. సాధారణ డాక్టర్లతో పోలిస్తే దంత వైద్యులు కాస్త తక్కువ గుర్తింపు పొందారని చెప్పవచ్చు.  ఇప్పటి కాలంలో ఎంతోమంది దంత సంబంధ సమస్యలతో బాధపడినా దంత వైద్యులను సంప్రదించేవారు తక్కువే.. సమస్య మరీ తీవ్రమైతే తప్ప దంతవైద్యుల దగ్గరకు వెళ్లరు చాలామంది. కానీ ప్రతి సంవత్సరం మార్చి 6 వ తేదీన జాతీయ దంతవైద్యుల దినోత్సవం జరుపుకుంటారు. దంతాలు చిగుర్ల సమస్యలు, పుచ్చిన పళ్ళు, పంటి నొప్పి, పంటి మీద గారా, చిగుర్ల వాపు, చిగుర్లు రక్తం కారడం, బలహీనంగా ఉండటం. చల్లని, వేడి పదార్థాలు తీసుకోవాలంటే ఇబ్బందిగా ఉండటం. ఇవన్నీ ఒకెత్తు అయితే.. ఓడిన పళ్ళ స్థానంలో కొత్త పళ్ళు కట్టడం, పళ్ళ సెట్టు వంటివి అమర్చి ఎంతోమందికి తిరిగి తమకు తాము ఆహార పదార్థాలు నమిలి తినేలా దోహదం చేస్తారు. ఇంకా చెప్పాలంటే.. దంత ఆరోగ్యం మన మొత్తం ఆరోగ్యానికి మూలంగా ఉంటుంది. శరీరంలో ఏదైనా అనారోగ్యం ఉంటే అది పళ్ళమీద, గొర్ల మీద, చర్మ, జుట్టు వంటి బాహ్య మూలకల మీద సులువుగా గుర్తించవచ్చు.  ఇంత ప్రాముఖ్యత కలిగిన దంతాలకు డెంటిస్ట్ ల తోడ్పాటు ఎంతో అవసరం. ఈ డెంటిస్ట్ డే సందర్భంగా కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుంటే. క్రీ.పూ 5000 సంవత్సరాల క్రితం సుమేరియన్లు ఉండేవారు. వీరు దంతాలలో పురుగుల వల్ల దంత క్షయం, కావిటీస్ వస్తాయని నమ్మేవారు.  2600 bc లో పురాతన ఈజిప్టుకు చెందిన హెసీ-రా తొలి దంత వైద్యులలో ఒకరిగా ప్రసిద్ధి చెందారు. 1530లో ఆర్ట్జ్నీ బుచ్లీన్ దంత ఆరోగ్యంపై మొదటి పుస్తకం రాసారు. అందులో  అన్ని రకాల వ్యాధులు మరియు దంతాల బలహీనతలకు సంబంధించిన విషయాలుంటాయి. దీన్ని "లిటిల్ మెడిసినల్ బుక్" అంటారు. 1990 నుండి దంతవైద్యం పెరుగుతూ వచ్చింది. దంతాలకు సంబంధించిన సేవలు పలు చోట్ల ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.  దంత సంరక్షణకు ఏమి చెయ్యాలి?? దంత వైద్యుల దినోత్సవం సందర్భంగా నిపుణులైన దంతవైద్యులు ప్రతి ఒక్కరూ పాటించదగిన దంత సంరక్షణ జాగ్రత్తలు, పాటించాల్సిన జాగ్రత్తలు తెలిపారు. దంత సంరక్షణకు మొదటి మార్గం శుభ్రంగా పళ్ళు తోముకోవడం. ఉదయం నిద్ర లేవగానే, రాత్రి పడుకునే ముందు పళ్ళు తోముకోవడం వల్ల దంత శుభ్రతను మైంటైన్ చేయవచ్చు. ప్రతి 6నెలలకు ఒకసారి దంతవైద్యుడ్ని సంప్రదించి పళ్ళ స్థితిగతులు, వాటి బల, బలహీనతలు వెతికి తీసుకోవలసిన జాగ్రత్తలు అడిగి తెలుసుకోవాలి. మీకు దంత సమస్య ఏమైనా ఉండి, వైద్యుల ద్వెస్రా అవి పరిష్కరమయి ఉంటే.. మరచిపోకుండా ఆ వైద్యులకు కృతజ్ఞతలు తెలపండి.  దంతాలు బాగుంటే.. దంతాలు బాగుంటే మనిషిలో చెప్పలేని ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. కల్గేట్ యాడ్ లో ఆరోగ్యవంతమైన దంతాలు మొత్తం శరీరానికి ఆత్మవిశ్వాసాన్ని,  ఆరోగ్యాన్ని ఇచ్చినట్టు దంతాలు బాగుంటే ఎలాంటి చింతా ఉండదు. అయితే ఈ దంత సంరక్షణ కులం పళ్ళు బాగా తొముకోవాలి.  ఇతరుల ముందు నవ్వడానికి, మాట్లాడటానికి తడబడేవారు, ఇబ్బందిగా ఫీలయ్యే వారు  దంతవైద్యుని సహకారంతో వారి పరిస్థితిని అధిగమించగలుగుతారు. దంతాలకు ఆరోగ్యాన్నిచ్చే పదార్థాలు తీసుకోవడం మంచిది. దంత వైద్యుడి సలహాలు పాటించడం మరీ మంచిది. ఇలా దంత సంరక్షణ నుండి, దంతాల ప్రాధాన్యత వరకు అన్నీ తెలుసుకుని పాటించాలి.                                  ◆నిశ్శబ్ద.

పుత్రులు ఉదయించే సూర్యులు కావాలంటే...

పుత్రోత్సాహము తండ్రికి  పుత్రుడు జన్మించినపుడె పుట్టదు. జనులా పుత్రుని గనుగొని పొగడగ  బుత్రోత్సాహంబునాడు పుట్టును సుమతీ!! అంటాడు సుమతీ శతకకర్త.  ఓ సుమతీ ! కొడుకు పుట్టగానే తండ్రికి సంతోషము కలుగదు. కాని ఆ కొడుకు గొప్పవాడై ప్రజలు అతనిని పొగుడుతున్నప్పుడు ఆ తండ్రికి నిజమైన సంతోషము కలుగును. అని వె పద్య భావం.  సమాజంలో ముఖ్యంగా భారతీయులలో మగపిల్లాడు అంటే వంశాకురమని, వారసత్వం ఉండాలంటే మగపిల్లలే మూలమని భావిస్తారు. దానికి అనుగుణంగా భారతీయ మనస్తత్వాలు కూడా ఉంటాయి. పుత్రుడు పున్నామ నరకం నుండి తప్పించేవాడు అనేది భారతీయులు విశ్వసించే మాట. అయితే మగపిల్లాడు పుట్టగానే ఏ తండ్రి సంతోషపడడు. ఆ కొడుకు ప్రయోజకుడై సమాజం ఆ కొడుకును పొగిడినప్పుడే ఆ తండ్రి సంతోషిస్తాడు. ఇప్పుడు కొడుకుల గురించి ఎందుకు వచ్చింది ప్రస్తావన అనిపిస్తుంది.  ప్రతి సంవత్సరం మార్చి 4 వ తేదీన ఇంటర్నేషనల్ సన్స్ డే జరుపుకుంటారు. ఈ international sons day ని మార్చ్ 4వ తేదీన మాత్రమే కాకుండా.. సెప్టెంబర్ 28వ తేదీ కూడా జరుపుకుంటారు.  పుత్రుల దినోత్సవం ఎందుకు??  ఇప్పటి కాలంలో మగపిల్లలను కలిగున్న తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంది?? మగపిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోకుండా వారిని వృద్ధాశ్రమాలలో వదిలేస్తున్న సంఘటనలు చాలా ఉంటున్నాయి. వీటిని పరిగణలోకి తీసుకుంటే.. సమాజంలో తల్లిదండ్రులు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న మగపిల్లలు వారి తల్లిదండ్రుల బాధకు, కష్టాలకు కారణం అవుతున్నారు. తల్లిదండ్రుల స్థితిగతులు తెలుసుకోలేని నిర్లక్ష్యంలో ఎంతోమంది సుపుత్రులు ఉన్నారు.  మగపిల్లల ప్రవర్తన ఏదైనా సరే అది తల్లిదండ్రుల ఆలోచనలు, వారి పెంపకం, వారు మగపిల్లలకు ఇస్తున్న స్వేచ్ఛ మీదనే ఆధారపడి ఉంటుంది. చిన్నతనంలోనూ, కుర్రాళ్లుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు కొడుకులకు ఇచ్చే స్వేచ్చనే వారిని పెద్దయ్యాక నిర్లక్ష్య వ్యక్తిత్వం కలవారిగా మారుస్తుంది.  మగాడికేంటి పుట్టగోచి పెట్టుకుని బయటకు వెళ్లగలడు నువ్వు అలాగ వెళ్తావా అనేది చాలామంది ఆడ, మగపిల్లలు ఉన్న ఇళ్లలో ఆడపిల్లలను ఉద్దేశించి తల్లులు చెప్పే మాట. కొడుకుల మీద తల్లిదండ్రులకు ఎంత ప్రేమ ఉంటుందో అంతకు మించి బాధ్యత కూడా ఉంటుంది. అలాంటి బాధ్యతను వదిలిపెట్టి మగజాతి అంటేనే ఏదో బాధ్యతలు మోసుకుతిరిగే వర్గమని, వారికి ఏ విషయం చెప్పక్కర్లేదులే అని అనుకుంటే బాధ్యత లేని కొడుకులను తయారుచేసినట్టే.. ఎవరితో మాట్లాడుతున్నావ్, ఎంత ఖర్చు చేశావ్, దేనికోసం ఖర్చు చేశావ్?? ఎందుకింత లేటుగా వచ్చావ్?? మగపిల్లలతో మాటలేంటి?? పద్దతిగా, బుద్దిగా ఉండు. వంటి మాటలు మీ కూతుళ్లకు చెప్పేముందు కొడుకులకు కూడా ఇంకొంచెం గట్టిగా, అంతకు మించి బాధ్యతగా చెప్పండి. అడిగిందల్లా చేతిలో పెడుతూ ఆడపిల్లలకు ఎందుకులే డబ్బు వంటి మాటలు కట్టి పెట్టి మగపిల్లలకు కూడా డబ్బు విషయంలో కట్టడి చేయండి. ఇలా చేస్తే డబ్బు కోసం తల్లిదండ్రులు పడుతున్న కష్టం వారికి కూడా అర్థమైతుంది. సులువుగా చేతిలోకి డబ్బు వస్తుంటే ఎవరికి అయితే విలువ అర్థం కాదు.విలువ అర్థం కానప్పుడు మనుషుల కష్టం, మనుషుల విలువ కూడా వారికి తెలియదు.  ప్రస్తుత కాలంలో కొడుకులు ఉండీ వృద్ధాశ్రమాలలో బ్రతుకు వెళ్లదీస్తున్న పెద్దలను గుర్తు చేసుకొని అయినా మగపిల్లలకు విలువలు, బాధ్యతల గురించి చెప్పండి. మీ కొడుకులు పెడదోవ పడితే వారిని అందరూ నిందిస్తుంటే బాధపడేది మీరే.. కాబట్టి అబ్బాయిలకూ మంచి నడవడిక నేర్పించండి. అప్పుడే వారు ఉదయించే సూర్యుడిలా తల్లిదండ్రుల కళ్ళకు వెలుగు పంచగలడు.                                    ◆నిశ్శబ్ద.

అన్ ప్లగ్గింగ్ డే.. సెల్ ఫోన్లు, టీవీలూ ఆపేయండి!

ప్రపంచం చాలా పెద్దది అనుకుంటాం కళ్ళతో చూసినప్పుడు. కానీ అదే ప్రపంచం చాలా చిన్నగా కనిపిస్తుంది మొబైల్ ఫోన్ చేతిలో ఉన్నప్పుడు. అయితే ఈ బయటి ప్రపంచం సంగతి పక్కన పెడితే ప్రతి మనిషికి తనకంటూ ఓ ప్రత్యేక ప్రపంచం ఉంటుంది. ఆ ప్రపంచంలో తల్లిదండ్రులు, స్నేహితులు, ఆత్మీయులు, భార్యా, భర్త, పిల్లలు ఇలా ఎన్నో ప్రధాన పాత్రలు పోషించేవారు ఉంటారు. కానీ ఆ అనుబంధాల ప్రపంచం కాస్తా చేతిలో ఉన్న టెక్నాలజీ వల్ల మసకబారిపోతోంది. కుటుంబంలో ప్రతి ఒక్కరి చేతిలో తప్పకుండా ఓ మొబైల్ ఉంటుంది. ఇంట్లో ఉన్న సమయంలో ఆ మొబైల్ ఏ వారి ప్రపంచం. అందులో సినిమాలు, యూట్యూబ్, ఇతరులతో చాటింగ్, ఇంకా ఎన్నో వైరల్ విషయాలు చూస్తూ కాలాన్ని కరిగించేస్తారు. ఉద్యోగాల కోసం వెళ్ళినప్పుడు ఉద్యోగం ముఖ్యం కదా అని చెబుతారు. స్నేహితులతో వెళ్ళినప్పుడు.. ఫ్రెండ్స్ తో కొంచెం సేపు కూడా సరదాగా ఎంజాయ్ చేయకూడదా అంటారు. మరి కుటుంబం గురించో… ఎప్పుడైనా ఆలోచన చేస్తారా కుటుంబం గురించి. కొందరు తెలివిమీరిన ఫిలాసఫర్ లు కుటుంబం మనల్ని అర్థం చేసుకోకుంటే ఎలా.. అని ఎదుటివారి నోటిని మూసేస్తారు. ఇప్పటి కాలంలో కుటుంబ ప్రాధాన్యత తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. కుటుంబంతో సంబంధాలు మెరుగ్గా ఉంచుకోవడానికి అన్ ప్లగ్గింగ్ డే నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం మార్చ్ మూడవ తేదీన ఈ అన్ ప్లగ్గింగ్ డే జరుపుకోవడం ఉంటుంది. ప్రతి వ్యక్తికి కుటుంబం ఎంతో అవసరం. కుటుంబ సభ్యుల మధ్య బంధాలు ఆరోగ్యంగా ఉంటే వారి జీవితాలు కూడా సంతోషంగా ఉంటాయి. ఏం చెయ్యాలి? అన్ ప్లగ్గింగ్ డే రోజు మీ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్స్, టీవీ లు, సిస్టం లు అన్నిటినీ ఆఫ్ చేసేయ్యాలి. ఈ ఒక్కరోజు అయినా ఎలాంటి కార్యకలాపాలు లేకుండా హాయిగా సంతోషంగా ఉండటానికి ప్రయత్నించాలి. మీతో మాట్లాడాలని అనుకుని, మీ బిజీ షెడ్యూల్ చూస్తూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉన్న మీ తల్లిదండ్రులతో మనసు విప్పి మాట్లాడవచ్చు. మీ ఉరుకులు పరుగుల రోజులో మీకోసం అన్నిటినీ ఓపికగా సమకూర్చుతున్న మీ జీవిత భాగస్వామితో ఏకాంత సమయాన్ని గడపవచ్చు. ఉద్యోగానికి ఉదయం వెళ్లి రాత్రి ఎప్పుడో ఇంటికి చేరుకోవడం ద్వారా మీ రక్తం పంచుకు పుట్టిన పిల్లలకు సమయాన్ని కేటాయిస్తూ వారితో సరదాగా గడపవచ్చు. ఇలా తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలు మాత్రమే కాకుండా మీకున్న ఆత్మీయులు, మీరు కలవలేకపోయిన స్నేహితులను కలుసుకుని వారితో సమయాన్ని మనసారా గడపడం ద్వారా మీ మధ్యన బంధాలు బలపడతాయి. ఎంన్ సమయాన్ని చాలా సునాయాసంగా కిల్ చేసే సామాజిక మద్యమానికి కామా పెట్టడం ద్వారా ఈరోజును మీదైన దినంగా మీకు నచ్చినట్టుగా మలచుకోవచ్చు. కాబట్టి జస్ట్ స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్ అండ్ స్విచ్ ఆన్ యువర్ హార్ట్.                                    ◆నిశ్శబ్ద.