ప్రపంచంలో అత్యంత ఖరీదైన హీల్స్ గురించి తెలుసా... ఒక జత బూట్లు లేదా హీల్స్ కొనడానికి ఎంత డబ్బు ఖర్చు చేయవచ్చు? మహా అయితే 500, 1000, 10000 లేదా అంతకంటే కొంచెం ఎక్కువ కూడా. కానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హీల్స్ ధర వేల లక్షల కంటే చాలా ఎక్కువ. ఇది విన్నవాళ్లు నమ్మడానికి సంశయిస్తారు. కానీ ఈ హీల్స్ డిజైన్, మెరుపు చూస్తే మాత్రం కళ్లు తిప్పుకోలేరు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హీల్స్ తయారు చేయడానికి చాలా విలువైన మెటీరియల్ ఉపయోగించారట. అసలు ఈ హీల్స్ను ఏ బ్రాండ్ తయారు చేసిందో, దాని ధర ఏంటో తెలుసుకుంటే.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన హీల్స్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాదరక్షలను తయారు చేసే బ్రాండ్ పేరు జాడా దుబాయ్. ఖరీదైన పాదరక్షలను తయారు చేయడంలో ఈ బ్రాండ్ ఒక్కసారి మాత్రమే కాదు, చాలాసార్లు వార్తల్లో నిలిచింది. వీరు తయారు చేసిన 'ప్యాషన్ డైమండ్ షూస్' ప్రపంచంలోని అత్యంత ఖరీదైన పాదరక్షలలో ఒకటిగా పరిగణించబడుతోంది. వీటి రంగు వీటిని ఇతన బ్రాండ్ లు, ఇతర హీల్స్ కంటే చాలా డిఫరెంట్ గా ఉంచుతోంది. వీటి సైజ్ ఎంతంటే.. ఈ హీల్స్ యూరోపియన్ సైజు 36. ఎవరైనా తమ సైజు ఎంపిక ప్రకారం దీన్ని తయారు చేయించుకోవచ్చు. ఇది కేవలం ఒక షోపీస్ కోసం మాత్రమే తయారు చేసినవి కాదు. వీటిని ధరించాలని అనుకునేవారు ఎంచక్క ఆర్డర్ ఇచ్చి వీటిని తయారుచేయించుకుని ధరించవచ్చు. ఇది ఎవరినైనా రాయల్గా చూపిస్తుంది . కానీ ఒక జత హీల్స్ కోసం కోట్ల రూపాయలు ఎవరు ఖర్చు చేస్తారనేది ప్రశ్న. బంగారంతో.. సాధారణంగా చాలా వస్తువులతో తయారు చేసిన హీల్స్ చూసి ఉంటారు. కానీ 'ప్యాషన్ డైమండ్ షూస్' బంగారంతో తయారు చేయబడతాయి. అందుకే వాటి రంగు స్వచ్ఛమైన బంగారంగా కనిపిస్తుంది. ఇది మెరుపుతో చాలా అందంగా కనిపిస్తుంది. హీల్స్ కోణాల కాలి శైలిని కలిగి ఉంటాయి. అలాగే హీల్స్ ఎత్తు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, ధరించే వారి లుక్ను పెంచుతుంది. వజ్రాలు జోడించారు.. 'ప్యాషన్ డైమండ్ షూస్' కు డైమండ్ డిటెయిలింగ్ జోడించబడింది. ముందుగా హీల్స్ మధ్యలో ఒక వజ్రం ఉంటుంది. దీని తరువాత హీల్స్ కు రెండు వైపులా చిన్న వజ్రాలను జోడించడం ద్వారా డిజైన్ చేయబడింది. బంగారు మెరుపుతో వజ్రం అందం మరింత మెరుగుపడుతోంది. అందుకే వాటి ధర కోట్లలో ఉంది. అసలు ధర ఎంతంటే.. ఈ హీల్స్ ధర 17 మిలియన్ డాలర్లు. ఇది భారత రూపాయిలలో దాదాపు 141 కోట్ల రూపాయలు. దీనిని విని ఆశ్చర్యపోవచ్చు. కానీ దానిపై ఉన్న వివరాలు దాని పూర్తి ధరను సమర్థిస్తాయి. అయితే ఈ ధర సామాన్యులకు చాలా ఎక్కువ. కానీ ధనవంతులు వీటిని కొనడానికి ఎలాంటి భయం వ్యక్తం చేయరు. ఈ విషయం జగమెరిగిన సత్యం మరి. *రూపశ్రీ.
నడుమునొప్పికి అధిక కారణాలు ఇవే… పరిష్కారాలు కూడా... చాలామంది మహిళలలో తరచుగా వినిపించే ఫిర్యాదు నడుమునొప్పి. నడుమునొప్పి అనేది ఒకప్పుడు పెద్ద వయసు వారికి మాత్రమే వాచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు వయసుతో సంబంధం లేకుండా నడుమునొప్పి వచ్చేస్తోంది. నడుమునొప్పి నివారణ కోసం ఎన్నో రకాల మందులు, పెయిన్ రిలీఫ్ జెల్, పెయిన్ రిలీఫ్ క్రీమ్ లు వాడుతుంటారు. అయితే అసలు నడుము నొప్పి ఎందుకు వస్తుంది అని కారణం తెలుసుకుంటే దీన్ని నివరించుకోవడం అందరి చేతుల్లోనే ఉంది. మరి నడుము నొప్పి ఎలా వస్తుంది దానికి కారణం ఏమిటి వంటి వివరాలు తెలుసుకుంటే… నడుమునొప్పి ఎలా వస్తుంది?ఎందుకు వస్తుంది? నడుము అనేది శరీరానికి మధ్యభాగంలో ఉన్న అవయవం. కడుపు పై భాగం నుండి ఉన్న బరువు మొత్తం నడుము మీద పడుతూ ఉంటుంది. ఏదైనా పని చేసేటప్పుడు లేదా సాధారణంగా అలవాటు ప్రకారము వంగినప్పుడు నడుము భాగం వంచుతూ ఉంటాం. ఫలితంగా నడుము భాగం ప్రభావానికి గురవుతుంది. నడుము వంచిన భంగిమ లేదా నడుము మీద బరువు పడే ప్రాంతాన్ని బట్టి నడుము ప్రాంతం ఒత్తిడికి లోనయ్యి నొప్పి వస్తుంది. ఒకే వైపు బరువు పడటం, ఒకే వైపు వంగి కూర్చోవడం, ఒకే వైపు బరువులు ఎత్తడం, నడవడంలో కూడా ఒకేవైపు బెండ్ కావడం వంటివి జరిగినప్పుడు నడుము ప్రభావానికి గురయ్యి నొప్పి వస్తుంది. ఈ నడుము నొప్పి వచ్చే కొన్ని కారణాల, వాటి నివారణకు మార్గాలు ఉన్నాయి… కూర్చునేటప్పుడు:- కూర్చునేటప్పుడు వీపును నిటారుగా ఉంచి కూర్చోవాలి. దీనివల్ల శరీరం సమాంతరంగా ఉండి బరువు ఒకే ప్రాంతంలో పడకుండా ఉంటుంది. నడుము నొప్పి రాకుండా ఉండటం కోసం మాత్రమే కాకుండా నడుమునొప్పి వచ్చినప్పుడు కూడా వీలైనంతవరకు ఇలా కూర్చోవడం అలవాటు చేసుకుంటే నడుమునొప్పి తగ్గిపోతుంది. చాలామంది బరువులు ఎత్తుతూ ఉన్నపుడు కాళ్ళను నిటారుగా ఉంచుతారు. ఇలా ఎత్తేటప్పుడు నడుము మీద చాలా ఒత్తిడి పడుతుంది. నడుము భాగంలో కండరాలు, ఎముకలు బిగుసుకున్నట్టు అవుతాయి. అయితే ఇలా బరువు ఎత్తేటప్పుడు ఏమాత్రం బ్యాలెన్స్ కాస్త తప్పిన అది నడుము మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి బరువులు ఎత్తేటపుడు కాళ్ళను 'మోకాళ్ళవద్ద వంచి, బరువులు ఎత్తాలి. ఇకపోతే నిలబడినప్పుడు కూడా పద్దతిగా నిలబడాలి. కొండస్రు నిలబడినప్పుడు బరువు మొత్తం ఒక కాలు మీద వేసి నిలబడటం, లేదా ఒకవైపుకు వంగి నడుము ఒకవైపు భాగం మీద బరువు వేయడం, ఒకవైపు మాత్రమే నడుము వంచి ఎక్కువ సేపు ఉండటం వంటివి చేస్తుంటారు. దీనివల్ల నడుమునొప్పి చాలా తొందశరగా వస్తుంది. కాబట్టి నిలబడినట్టు అటు ఇటు బెండ్ అవ్వకుండా నిటారుగా నిలబాడ్స్ట్స్మ్ ఎంతో ముఖ్యం. పడుకునే సమయంలో కూడా భంగిమ ఎంతో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒకవైపుకు తిరిగి పడుకోవడం లేదా పడుకున్న తీరు ఏదైనా శరీరం అస్తవ్యస్తంగా కాకుండా కాస్త నిటారుగా ఉండటం ముఖ్యం. లేకపోతే శరీరం అస్తవ్యస్తంగా ఉన్నట్టు నిద్రపోతే నడుము భాగంలో కండరాలు పట్టేస్తాయి. పొట్ట కింద భాగంలో ఉండే అబ్డామినల్ కండరాలు ఎఫెక్ట్ అవుతాయి. ఒకవేళ ఎలాగంటే అలా పడుకునే అలవాటు ఉన్నవాళ్లకు నడుము నొప్పి రాకూడదు అంటే ఒక మంచి చిట్కా ఉంది. పడుకునేటప్పుడు మోకాళ్ళ కింద దిండు పెట్టుకుంటే పడుకునే విధానం కాస్త మెరుగ్గా ఉంటుంది. ఫలితంగా నడుము ఒత్తిడికి గురి కాదు. కుర్చీలో కూర్చున్నప్పుడు నిటారుగా కూర్చోవాలి. అంతే కానీ ఒకవైపుకు అనుకుని మూలకు కూర్చోకూడదు. అలాగే కుర్చీ నుండి లేచేతప్పుడు ఒకేసారి పైకి లేవకుండా ఒక కాలిని ముందుకు, మరొక కాలిని వెనక్కు పెట్టి లేవడానికి ప్రయత్నించాలి. ఇలా చేస్తే నడుమునొప్పి రాదు. ఆడవారిలో ఈమధ్య బాగా విస్తృతం అయిపోయిన అలవాటు హై హీల్స్ వేసుకోవడం. ఇలా హైహీల్స్ వేసుకొంటే నడుమునొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చాలామంది ఆడవారు ఇతరులతో మాట్లాడేటప్పుడు రెండు కాళ్ళను ఇంటూ ఆకారంలో ఉంచి మాట్లాడుతూ ఉంటారు. దీనివల్ల నడుమునొప్పి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ అలవాటు ఉంటే మానుకోవడం మంచిది. పైన చెప్పుకున్న కొన్ని చిట్కాలు గమనిస్తే మహిళలు తమకు తెలియకుండా నడుము నొప్పిన బారిన ఎలా పడుతున్నారో కూడా అర్థమవుతుంది. వాటికి సూచించిన జాగ్రత్తలు తీసుకుంటే నడుము నొప్పికి చెప్పచ్చు బై బై.. ◆నిశ్శబ్ద.
పిల్లలకు క్రమశిక్షణ ఎలా నేర్పాలి.. ప్రయోజనాలు ఏంటి.. ప్రతిఒక్కరికీ క్రమశిక్షణ అనేది చాలా అవసరం. పిల్లలకు చిన్నతనం నుంచే క్రమశిక్షణ నేర్పించడం చాలా ముఖ్యం. దీని ద్వారా పిల్లలు భవిష్యత్తులో ప్రయోజకులుగా మారుతారు. శ్రమ ఎప్పటికీ వృధా కాదు. మీరు మీ పిల్లలకు క్రమశిక్షణను చిన్నతనంలోనే నేర్పించాలి. కష్టపడి పనిచేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వారికి వివరించాలి. ఇలా పెంచిన పిల్లలు భవిష్యత్తులో ప్రయోజకులుగా మారుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. తల్లిదండ్రులుగా మీరు చేయాల్సిందల్లా మీ పిల్లలను క్రమశిక్షణలో పెట్టడం. మీరు పిల్లలకి ఎక్కువ పనిని అప్పగించాల్సిన అవసరం లేదు. బదులుగా మీరు వారి మానసిక, ప్రవర్తనా అలవాట్లను గమనించి వారిని ప్రోత్సహించాలి. తల్లిదండ్రులు తమ పిల్లల అభివృద్ధికి ఎలా సహకరించాలో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలకు క్రమశిక్షణ నేర్పండి: పిల్లల భవిష్యత్తు అనేది వారి క్రమశిక్షణపై ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పిల్లలకు మంచి సలహాలు ఇస్తూ క్రమశిక్షణతోపాటు ప్రేమను కూడా వ్యక్తపరుస్తుండాలి. క్రమశిక్షణ అనేది పిల్లలకే కాదు పెద్దలకు కూడా వర్తిస్తుంది. పిల్లలు క్రమశిక్షణతో ఉండాలని ప్రోత్సహించినప్పుడు, వారు పట్టుదల, సంకల్పం వంటి లక్షణాలను నేర్చుకుంటారు. ఈ విషయాలు పిల్లల పాత్రచ పరస్పర చర్యలు, ఇతరులతో సంబంధాలను ఏర్పరుస్తాయి. కష్టపడి పనిచేసే పిల్లలు భవిష్యత్తులో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు క్రమశిక్షణతో ఉంటే పిల్లలు కూడా అదే అలవాటు అవుతుంది. ఇదంతా తల్లిదండ్రుల ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని గమనించాలి. పని విషయంలో కఠినమైన నియమాలను రూపొందించండి: పిల్లలు బలమైన పని-సంబంధిత నీతిని అభివృద్ధి చేయడం ముఖ్యం. చిన్న చిన్న విషయాలు చెప్పి వారిలో ఆత్మవిశ్వాసం నింపండి. తల్లిదండ్రులు తమ పిల్లలకు అన్ని పనులు చేయగలరని విశ్వాసం కలిగించాలి.దీని ద్వారా, పిల్లలు తాము చేసిన పనికి బాధ్యత వహించడం నేర్చుకుంటారు. వారి పనిని పూర్తి చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. ఇదొక ప్రత్యేక నైపుణ్యం: క్రమశిక్షణ ప్రత్యేక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది. ఇది పిల్లలు పాఠశాలలో, వృత్తిలో, వారి వ్యక్తిగత జీవితంలో ఈ నైపుణ్యాల నుండి ప్రయోజనం పొందేందుకు అనుమతిస్తుంది. మీ పిల్లలలో ఈ నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడానికి సమయం పట్టవచ్చు. అలాగే, దీనికి తల్లిదండ్రుల నుండి చాలా ఓపిక అవసరం. పిల్లలను అనవసరమైన ఒత్తిడికి గురిచేయకూడదు. ఒత్తిడికి గురిచేయవద్దు: క్రమశిక్షణ పేరుతో మీ పిల్లలను ఒత్తిడికి గురిచేయకూడదు. పిల్లల వయస్సుకు తగిన అంచనాలు ఉండాలి. పిల్లలపై ఎక్కువ ఒత్తిడి పెడితే చిన్న వయసులోనే డిప్రెషన్ లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. పిల్లలకు ముందుగా సులభమైన పనులు ఇచ్చి, క్రమంగా వారి స్థాయిని పెంచుతుండాలి. దీంతో పిల్లల్లో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అలాగే పిల్లవాడు చాలా నేర్చుకోవచ్చు. మంచి దినచర్యలో ఇంటి పని కూడా ఉంటుంది. అది అబ్బాయి అయినా సరే... అమ్మాయి అయినా సరే. పిల్లలు ప్రశంసిస్తుండాలి: పొగడ్తలను ప్రేమించే పిల్లలను ప్రశంసించడం ద్వారా వారికి క్రమశిక్షణ నేర్పించవచ్చు. కల్మషం లేని హృదయానికి ప్రేమ, శ్రద్ధ అవసరం. ఇది మీ బిడ్డకు తల్లిదండ్రులుగా ఇవ్వవచ్చు. పిల్లలు ఏదైనా మంచి చేసినప్పుడు వారిని మెచ్చుకోండి. వారి ప్రయత్నాలను గుర్తించడం ద్వారా వారి విజయానికి బాసటగా మారుతుంది.
Aracheta Gorinta / Mehendi / Gorinta Designs / Mehndi / Learn Simple & Easy Mehendi Designs / Learn Gorintaku Designs / Learn Tattoo Designs / Henna Designs
మహిళలు ధరించే బ్రా ల గురించి షాకింగ్ నిజాలు..! మనకు ఆహారం, నివాసంతో పాటు, బట్టలు కూడా చాలా ముఖ్యమైనవి. పొడవాటి చీర అయినా లేదా చిన్న బ్రా అయినా.. వాటి ఎంపిక విషయంలో మహిళలు బాగా ఆలోచిస్తారు. ఎలాంటి దుస్తులు ధరించినా మహిళలు బ్రా వేసుకోవడం తప్పనిసరి. అయితే మహిళలు బ్రా లు తప్పనిసరిగా ధరించినా వాటి గురించి మాట్లాడటానికి వెనుకాడతారు. ఈ కారణంగా బ్రా గురించి చాలామందికి చాలా విషయాలు ప్రశ్నలుగానే ఉన్నాయి. చాలామందికి తెలియని బ్రా గురించి నిజాలు తెలుసుకుంటే.. బ్రా ఎలా ఉనికిలోకి వచ్చింది? గతంలో కార్సెట్ దుస్తులు మాత్రమే ఉండేవి. ఇది క్రమంగా మారిపోయి 20వ శతాబ్దంలో బ్రాను ప్రవేశపెట్టారు. హెర్మియోన్ కాడోల్ అనే వ్యక్తి కార్సెట్ తయారు చేస్తున్నాడు. దానిని తయారు చేస్తున్నప్పుడు అది బిగుతుగా మారింది. అతను కార్సెట్ను 2 ముక్కలుగా చేశాడు. తరువాత కార్సెట్ బ్రా రూపాన్ని తీసుకుంది. చాలా మంది చరిత్రకారులు బ్రాను 1910లో మేరీ ఫెల్ప్స్ జాకబ్ 19 సంవత్సరాల వయసులో కనుగొన్నారని నమ్ముతారు. అసలు పదం.. బ్రా పూర్తి రూపం బ్రజియర్. ఇది ఫ్రెంచ్ పదం. దీని అర్థం మహిళల వక్షోజాలను కప్పి ఉంచడానికి, మద్దతు ఇవ్వడానికి రూపొందించిన లోదుస్తులు. కానీ 1930 నాటికి, ప్రజలు బ్రజియర్ను బ్రా అని పిలవడం ప్రారంభించారు. బ్రజియర్ అనే పదం 1911లో ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో చేర్చబడింది. బ్రా లకు ఎక్స్పైరీ డేట్.. బ్రాను వారానికి 3 నుండి 4 సార్లు ధరిస్తే.. అది 8 నెలల వరకు ఉంటుంది. బ్రాను 12 నెలల వరకు కూడా ఉపయోగించవచ్చు. ప్రతిరోజూ ధరించకపోతే బ్రాను ఇంకా ఎక్కువ కాలం ఉపయోగించవచ్చు. ఇది బ్రా నాణ్యత, దానిని ఎలా నిర్వహిస్తున్నారనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. సరైన బ్రా లు ధరిస్తున్నారా? నివేదికల ప్రకారం 80% మంది మహిళలు తప్పు సైజు బ్రా ధరిస్తున్నారట. బ్రా సైజును కొలవడానికి అనేక స్కేళ్లు అందుబాటులో ఉన్నాయి. కానీ సంకోచం, సిగ్గు వంటి అనేక కారణాల వల్ల, మహిళలు సైజును కొలవకుండా బ్రాలను కొనుగోలు చేస్తారు. మహిళలు కూడా తాము తప్పు సైజు బ్రా ధరిస్తున్నారనే విషయం గురించి ఎప్పుడూ ఆలోచించి ఉండకపోవచ్చట. అత్యంత ఖరీదైన బ్రా ధర.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డ్రెస్ గురించి వినే ఉంటారు . ఈ విషయంలో బ్రా కూడా తన రికార్డ్ తనకు క్రియేట్ చేసుకుంది. 'రెడ్ హాట్ ఫాంటసీ బ్రా' ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్రాగా పరిగణించబడుతుంది. దీనిని విక్టోరియా సీక్రెట్ రూపొందించింది. 2000లో దీనిని సూపర్ స్టైలిష్ గిసెల్ బుండ్చెన్ ధరించింది . ఈ బ్రా ధర రూ. 125 కోట్లుగా చెబుతారు. 1,300 క్యారెట్ల వజ్రాలు థాయ్ కెంపులు దానిపై పొందుపరచబడ్డాయి. అందుకే 'రెడ్ హాట్ ఫాంటసీ బ్రా' మెరిసేలా కనిపిస్తుంది. *రూపశ్రీ.