kamal hassan

కమల్ హాసన్ కు షాక్: తమిళనాడులో విశ్వరూపం నిషేధం

  కమల్ హస్సన్ తన విశ్వరూపం సినిమాను ఏ ముహుర్తాన్న మొదలుపెట్టారో గానీ ఆ సినిమాకు ఆది నుండి నేటి వరకు కూడా కష్టాలు తప్పట్లేదు. ప్రపంచ వ్యాప్తంగా రేపు విడుదల కానున్న ఆ సినిమాకి మరో కష్టం ఎదురయింది. తమిళనాడు ప్రభుత్వం విశ్వరూపం సినిమా ప్రదర్శనను రాష్ట్రంలో నిషేదిస్తూ నిన్న సాయత్రం ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడుకు చెందిన కొన్ని ముస్లిం సంస్థలు ఆ సినిమాలో తమ వర్గాన్నిఉగ్రవాదులుగా చూపడాన్ని తప్పుబడుతూ, పెద్ద ఎత్తున నిరసనలు చేప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలితకు ఆ సినిమా ప్రదర్శనను నిలిపివేయమని కోరుతూ వినతి పత్రం ఈయడంతో, ఆమె సినిమాపై నిషేధం విదించారు.   అయితే కమల్ హస్సన్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు బడుతూ అసలు సినిమానే చూడకుండా కేవలం సినిమా ట్రైలర్లను, వాల్ పేపర్లను చూసి ఈవిదంగా నిర్ణయం తీసుకోవడం అనుచితమని అయన అన్నారు.     మరో వైపు సాయి మీరా అనే సినిమా నిర్మాణ సంస్థ కూడా సినిమా విడుదలపై స్టే విదించాలంటూ నిన్న కోర్టుకెక్కింది. కమల్ హస్సన్ తో సినిమా తీసేందుకు తమ సంస్థ కుదుర్చుకొన్న ఒప్పందాన్ని అయన ఉల్లంగించడమే కాకుండా, ఆయనకు తాము ఇచ్చిన అడ్వాన్స్ రూ.10.5 కోట్లు కూడా ఇంతవరకు వాపసు చేయనందున విశ్వరూపం సినిమా విడుదలపై స్టే విదించాలని కోరుతూ వేసిన పిటిషన్ను కోర్టు స్వీకరించింది. ఇప్పటికే, తమిళనాడు సినిమా పంపిణీదారులతో, ధియేటర్ యజమానులతో చాలా తిప్పలుపడి ఎట్టకేలకు జనవరి 25వ తేదీన సినిమాను విడుదల చేయడానికి సిద్దమయిన కమల్ హస్సన్ కి తమిళనాడు ప్రభుత్వ నిర్ణయం పెద్ద దెబ్బే అని చెప్పక తప్పదు. తెలుగు, హిందీ బాషలలోకూడా రేపు విడుదల కానున్న విశ్వరూపం సినిమా మరి విడుదల అవుతుందో లేదో కూడా అనుమానమే.

 chandrababu lagadapati

బాబు యాత్రకి పోటిగా లగడపాటి కనువిప్పు యాత్ర

        చంద్రబాబు పాదయాత్ర నేపథ్యంలో కృష్ణాజిల్లాలో లగడపాటి నడిపిన హైడ్రామా బాగా హైలెట్ అయ్యింది. చంద్రబాబు పాదయాత్రను అడ్డుకుంటామని ప్రకటించిన నేపథ్యంలో లగడపాటిని పోలీసులు కృష్ణాజిల్లా అనుమంచిపల్లిలో అదుపులోకి తీసుకున్నారు.   ఆయన మీడియా తో మాట్లాడుతూ తాను ఇప్పటికే ‘కనువిప్పు’ కార్యక్రమాన్ని తాను ఇప్పటికే చేపట్టానని ప్రకటించారు.  వేర్పాటువాదులకు వెన్నులో చలి పుట్టించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. అరెస్ట్ లతో సమైక్య ఉద్యమం ఆగదని లగడపాటి స్పష్టం చేశారు. కనువిప్పు కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఆయన తెలిపారు. బాబుకు కనువిప్పు కార్యక్రమం చేపట్టే విషయంలో మాత్రం లగడపాటి తగ్గలేదు. సీమాంధ్రలో బాబుకు పోటీగా యాత్ర చేయాలని ఆయన తలపెట్టారు. బాబు రూట్ మ్యాప్ ఆధారంగా పోటీ యాత్రకు లగడపాటి జిల్లాకు చెందిన కాంగ్రెసు నేతలతో సిద్ధమవుతున్నారు. ఈ నెల 26 లేదా 27 తేదిన లగడపాటి కనువిప్పు యాత్ర ప్రారంభం కానుంది. సమైక్యాంధ్రపై బాబుకు కనువిప్పు కలిగించేందుకు తన ప్రయత్నాన్ని మానుకునేది లేదని చెప్పారు. సీమాంధ్రలో ఎక్కడో ఓ చోట ఆయనను కలుస్తానని చెప్పారు. తన రూట్ మ్యాపును బాబు వస్తున్నా మీకోసంకు సమానంగా ఉండటమే కాకుండా ఎక్కడో ఓ చోట ఆయన యాత్రలో కలిసేలా ఏర్పాటు చేస్తున్నారట. అయితే ఇందుకు పోలీసులు అనుమతిస్తారా అనేది ప్రశ్న. పోలీసులు అనుమతించక పోవచ్చునని అంటున్నారు.

  Case against MIM MLA Pasha Quadri

త్వరలో ఎమ్మెల్యే పాషా ఖాద్రీ అరెస్ట్ ?

        ఎంఐఎం పార్టీ నేతలకు వరుసగా షాక్ మీద షాక్ లు తగులుతున్నాయి. మొదట అక్బరుద్దీన్, తర్వాత అసదుద్దీన్ ఇప్పుడు ఎమ్మెల్యే పాషా ఖాద్రీ… మహాత్మ గాంధీ విషయంలో చేసిన అభ్యంతర వ్యాఖ్యానాలపై పాషా ఖాద్రిపై కేసు నమోదు చేయాలని రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశం ఆదేశించింది. 151, 153(ఏ), 121 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఎల్ బి నగర్ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల ఒక సభలో ఖాద్రీ మాట్లాడుతూ… నిజాంలు కట్టించిన అసెంబ్లీ భవన ఆవరణ మహాత్మా గాంధీ విగ్రహం పెట్టడం ఎందుకని ప్రశ్నించాడు. ఈ మాటలపై ఒక న్యాయవాది వేసిన పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది. మరి ఖాద్రీ అరెస్టు త్వరలోనే ఉండవచ్చు.

congres party

కాంగ్రెసుతో పెట్టుకొంటే మరంతే!

  కాంగ్రెస్ పార్టీతో స్నేహం అంటే పులి మీద సవారి వంటిది. అది సజావుగా నడుస్తున్నంత కాలం అంతా బాగున్నట్టే కనిపిస్తుంది. గానీ, దైర్యం చేసి క్రిందకి దిగితే మాత్రం ప్రాణం మీదకి వస్తుంది. ఒకప్పుడు జగన్ మోహన్ రెడ్డి కూడా ‘ఆ పులిని నేనే కదా సవారి చేసేది’ అని క్రిందకు దిగితే, ఎక్కడో తేలాడు. మాయావతి, ములాయం సింగులు కూడా అప్పుడప్పుడు దైర్యం చేసి క్రిందకి దిగినా మళ్ళీ వెంటనే బుద్ధిగా పైకెక్కి కూర్చొని, కిందకి దిగలేక పైన కూర్చోనలేకా బిక్కు బిక్కుమంటూ దానితో సాగుతున్నారు.   ఈ మద్యనే మజ్లిస్ పార్టీ కూడా క్రిందకు దిగి, దాని పులితోక పట్టుకొని ఆడుకోబోయింది. అది కొంత గ్రేస్ పీరియడ్ కూడా ఇస్తూ గాండ్రుమంటూ మెత్తగా హెచ్చరించినా లెక్కజేయకుండా దానితో చెలగాటమాడాలని మజ్లిస్ నేతలు ప్రయత్నించారు. ఆ పులి సుతారంగా కొట్టిన ఓ చిన్న దెబ్బకి ఒకేసారి ముగ్గురు మజ్లిస్ శాసన సభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ మరియు ఖాద్రీ కోర్టు గడపల మీద పడ్డారు. అక్బరుద్దీన్ పరిస్థితయితే మరీ దారుణంగా ఉంది. ఒక జైలు నుండి మరొక జైలుకు, ఒక పోలీసు స్టేషన్ నుండి మరో స్టేషనుకు, ఒక కోర్టు నుండి మరొక కోర్టుకి తిరుగుతూ చేసిన తప్పుకి లెంపలు వేసుకొంటున్నాడిప్పుడు.   మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా ఒకానొకప్పుడు పులి మీద సవారి చేస్తుండగా వాపును బలుపని బ్రమసి పోలీసులను తుపాకులు చూపి బెదిరించడం, సాక్షాత్ జిల్లా కలెక్టర్ మీదనే నోరు పారేసుకొవడం వంటి చిలిపి పనులు చాలానే చేసాడు. అప్పుడు జనం అతనెక్కిన పులిని చూసి భయపడి వెనక్కి తగ్గితే, అదంతా తనను చూసే అనుకొన్నాడు. అయితే, ఈ మద్యనే పులి మీద నుంచి దిగేసాడు గనుక ఆ నాటి తన చిలిపి పనులకి ఈ రోజు కటకటాల పాలయ్యాడు. మరి కాంగ్రెసుతో పెట్టుకొంటే అంతే!

Police all set to Arrest MP Lagadapati Rajagopal

ఎంపీ లగడపాటి రాజగోపాల్ హౌస్ అరెస్ట్

      టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్రను ఎంపీ లగడపాటి రాజగోపాల్ అడ్డుకుంటానని చేసిన వ్యాఖ్యల కారణంగా హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఉన్న ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. పాదయాత్రను అడ్డుకునేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వ్యూహాలు పన్నుతున్న నేపథ్యంలో వారికి ధీటుగా టీడీపీ నేతలు కార్యచరణ చేస్తున్నారు.   చంద్రబాబు యాత్రను అడ్డుకుంటామని చెప్పిన లగడపాటి అనుచరులలో చాల మందిని పోలీసులు నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు. లగడపాటి ఇంటి చుట్టూ పోలీసులు మోహరించడంతో ఉద్రికత్త వాతావరణం నెలకొంది. మరో వైపు ఇబ్రహీంపట్నం లో ఎమ్మెల్యే జోగిరమేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  

 chandrababu padayatra

కృష్ణా జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర

        చంద్రబాబు పాదయాత్ర ఈ రోజు కోస్తాలోకి ప్రవేశించనుంది. నల్గొండ జిల్లా కోదాడ మండలం పరిధిలోని హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి సమీపంలో కృష్ణా జిల్లాలోకి అడుగుపెట్టనున్నారు. జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద ఆయనకు పెద్దఎత్తున స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.   అదే సమయంలో రాష్ట్ర విభజన అంశంపై తారస్థాయిలో చర్చ జరుగుతున్న తరుణంలో చంద్రబాబు తెలంగాణ నుంచి ఆంధ్రా ప్రాంతంలో ప్రవేశించనుండడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. అప్పట్లో తెలంగాణలో పాదయాత్రకు అడ్డంకులు తప్పవని, గొడవలు జరుగుతాయని నాడు పలువురు భావించారు. అయితే..తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం ఆధ్వర్యంలో తెలంగాణ వాదులు ఆయనను అడ్డుకునేందుకు యత్నించినప్పటికీ పెద్దగా సమస్యలు ఎదురు కాలేదు. కృష్ణా జిల్లాలో తొమ్మిది రోజులు పాదయాత్ర జరిపిన అనంతరం చంద్రబాబు గుంటూరు జిల్లాలోకి ప్రవేశిస్తారు. 15 రోజుల పాదయాత్ర అనంతరం మళ్లీ కృష్ణా జిల్లాలోకి ప్రవేశించి మరో 8 రోజుల పాటు పాదయాత్ర జరుపుతారు. ఆ తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తారు.  

samll films

చిన్న సినిమాను కబళిస్తున్న పెద్ద సినిమాలు?

      నేడు తెలుగు సినిమాలలో వేర్వేరు స్థాయి హీరోలున్నట్లే, సినిమాలలో కూడా చిన్నసినిమాలు, పెద్ద సినిమాలు, డబ్బింగ్ సినిమాలు అంటూ మూడు రకాలు పుట్టుకొచ్చాయి. పెద్ద సినిమాలంటే బడ్జెట్ కనీసం వంద కోట్లయినా ఉండాలి. అది ఆడుతుందా లేదా అనేది వేరే సంగతి. ఈ పెద్ద సినిమాలను నిర్మించే నిర్మాతలు తమ సినిమాలను ఏక కాలంలో అనేక సినిమా హాళ్ళలో విడుదలచేసుకోవడానికి వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సినిమా హాళ్ళను క్రమంగా తమ అధీనంలోకి తెచ్చుకొన్నారు. చివరికి రాష్ట్రంలో బీ, సి, సెంటర్లలో ఉన్న సినిమా హాళ్ళను సైతం వారి అధీనంలోకి తెచ్చుకోగలిగేరు. ఆ దెబ్బకి చిన్న సినిమా నిర్మాతలు తమ సినిమాలు విడుదల చేసుకోవడానికి సినిమా హాళ్ళు దొరక్క, వాటిని నియంత్రిస్తున్న పెద్ద నిర్మాతల కాళ్ళ మీదపడితే తప్ప తమ సినిమాలు విడుదల చేసుకోలేని దీనస్థితిలో విలవిలలాడుతున్నారు.   ప్రతీ నెలలో ఎవరో ఒక పెద్ద నిర్మాతది పెద్ద సినిమా విడుదల తప్పక ఉంటుంది. ఆ సినిమా కోసం రాష్ట్రంలో సినిమా హాళ్ళన్నీ ముందుగానే రిజర్వ్ చేయబడిపోతాయి. ఆ సమయంలో చిన్న సినిమా నిర్మాత ఎవరయినా తన సినిమా విడుదల చేసుకొందామన్నా అతనికి సినిమా హాళ్ళు దొరకవు. అందువల్ల ఎక్కడో ఊరవతల సినిమా హాళ్ళలో తన సినిమాను విడుదలచేసుకోవాలి, లేదా పెద్ద సెంటర్లలో తన సినిమాను విడుదలచేసుకోవాలంటే తప్పనిసరిగా పెద్ద సినిమా నిర్మాతల చుట్టూ తన సినిమా రీళ్ళ డబ్బాలు పట్టుకొని ప్రదక్షిణాలు చేయాలి. వారు అతనిని కనికరిస్తే సినిమా విడుదల అవుతుంది, లేదంటే ఇక ఆ సినిమా నిర్మాత కష్టం బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.   సినిమా తీయడం ఒక ఎత్తయితే, నేడు సినిమా విడుదల చేసుకోవడం మరో ఎత్తుగా మారింది. ఇది చిన్న నిర్మాతలపాలిత శాపం గా మారింది. అనేక మంది చిన్న సినిమా నిర్మాలు మంచి  సినిమాలు తీసినప్పటికీ, ఈ కారణంగానే ఆర్దికంగా నష్టబోయి, ఉన్నకాడికి తమ ఆస్తులు తెగనమ్ముకొని వీధిన పడినవారు చాలామందే ఉన్నారు. ఈ విషయాలన్నీ తెలిసినప్పటికీ పెద్ద నిర్మాతలు గానీ, పెద్ద హీరోలు గానీ స్పందించకపోవడంతో, తెలుగు సినిమా రంగంలో అందరికంటే సీనియర్ నిర్మాత, దర్శకుడు, నటుడు అయిన దాసరి నారాయణరావు గారు, చిన్న సినిమా నిర్మాతల కష్టాల పట్ల స్పందిస్తూ అనేక సార్లు పెద్ద నిర్మాతలకి వ్యతిరేఖంగా గొంతు విప్పి మాట్లాడినా ఫలితం లేకపోయింది.   అందువల్ల, గురువారంనాడు సమావేశం అయిన చిన్న సినిమా నిర్మాతల కౌన్సిల్‌ ఫిబ్రవరి 20 తేదీ నుండి తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేయకుండా నేరుగా డిటిహెచ్‌ ద్వారా టీవీలలో విడుదల చేయడానికి నిర్ణయించుకొన్నారు. ఈ ప్రయోగం సఫలం అవడం కష్టమని వారికీ తెలుసు గానే తమకు వేరే గత్యంతరం లేదని వారు ఈ నిర్ణయం తీసుకొన్నారు. నట్టికుమార్‌, విజయచందర్‌, చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్నకుమార్‌ తదితరులు కొందరు అందుకు అవసరమయిన ఒప్పందాలు త్వరలో కుదుర్చుకుంటామని అన్నారు.   ఒక అందమయిన  రంగుల కలల ప్రపంచం సృష్టించే మన తెలుగు సినిమా పరిశ్రమ, కొందరి స్వార్ధంవల్ల చిన్న నిర్మాతలకి పీడకలగా మారిపోవడం విచారకరం.

Nayak team's success tour

'నాయక్' సక్సెస్ టూర్: బాబ్జీకి వినాయక్ క్షమాపణ

        రామ్‌చరణ్ 'నాయక్' మూవీలో విలన్ పాత్ర పేరుపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో విలన్ రాహుల్‌దేవ్ పాత్రకు 'గండి బాబ్జీ' అని పేరు పెట్టడంపై మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ అనుచరులు, వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. "నాయక్" సక్సెస్ టూర్ లో వైజాగ్ వెళ్ళిన వినాయక్ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నాయకుడు గండి బాబ్జి కి క్షమాపణ చెప్పారు. "సిటికి గండి పేట్ నీళ్ళు ఎంత ఫేమాస్సో..గండి బాబ్జీ పేరు కూడా అంతే ఫేమాస్ అన్న డైలాగ్ కి సేట్ అవుతుందని ఆ పేరు పెట్టామే తప్ప ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని, గండి బాబ్జి మనస్తాపం చెందితే క్షమించాలని వినాయక్ అన్నారు. ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు వుంటే తొలగిస్తామని హామీ ఇచ్చారు. నాయక్ సినిమాలో 'గండి బాబ్జీ' పేరు పై వివాదం సృష్టించడంతో ఆయనకి మంచి ప్రచారం దొరికింది. 

congress party

రాహుల్ యువరాజ పట్టాభిషేక మహోత్సవం

  కాంగ్రెస్ పార్టీ తను నిర్దేశించుకొన్న జైపూర్ మేధోమధనాల అంతిమ లక్ష్యం దిగ్విజయంగా సాధించగలిగింది. మూడు రోజుల సదస్సులో మొదటిరోజు “అది చేయవలసి ఉంది...ఇలాగ చేయవలసి ఉంది... త్యాగాలు, సిద్ధాంతాలు, క్రమశిక్షణ, సిద్ధాంతాలు, ఓట్లు” వంటి పడికట్టు పదాలు పట్టుకొని కాంగ్రెస్ నేతలు తమ ఊకదంపుడు ప్రసంగాలతో మైకులు విరగదీస్తే, రెండవ రోజయిన శనివారం నాడు, గల్లీ స్థాయి నాయకుడి నుండి డిల్లీ స్థాయి నేతల వరకు, ఉదయం నుండి సాయత్రంవరకూ కూడా “నేడే బ్రహ్మాండమయిన విడుదల...తప్పక చూడండి..” అంటూ రాహుల్ గాంధీ చెప్పట్టబోయే పదవి గురించి కబుర్లు మొదలుపెట్టారు. చివరికి వాళ్ళ కళ్ళలో ఆనందం చూసేందుకు రాహుల్ గాంధీని పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ప్రతిపాదిస్తూ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ తీర్మానం ప్రవేశ పెట్టడం దానిని సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా ఆమోదించడంతో మదించబడిన కాంగ్రెస్ మేధస్సు నుండి ఒక చారిత్రాత్మకమయిన నిర్ణయం వెలువడటం జరిగిపోయింది.   మొత్తం మీద రెండు రోజుల మేధోమధనంతో తమ శ్రమకు ఫలితం దక్కినందుకు సంభరపడుతూ కాంగ్రెస్ పార్టీలో చిన్న పెద్దా నేతలందరూ నేటి నుండి మీడియా కెక్కి రాహుల్ రాకతో మనదేశానికి కలగబోయే ప్రయోజనాలు, అతని గొప్పదనం, నిరాడంబరత, సోనియమ్మ త్యాగాశీలత, ఇందిరా గాంధీ కుటుంబం దేశం కోసం చేసిన త్యాగాల వివరాలు వగైరా మనకి వివరించబోతున్నారు. పార్టీ సాదించిన ఈ ఘనకార్యానికి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వాదులందరూ పండుగ చేసుకోవడం కూడా మనం చూడబోతున్నాము.

balayya

బాలయ్యబాబుకి తొలి పరీక్ష

    చంద్రబాబు నల్గొండలో పాదయాత్రలో ఉన్న సమయంలో తెలుగు తమ్ముళ్ళు విశాఖలో వీదులకేక్కి మరీ కొట్టుకొంటూ పార్టీ పరువు తీస్తున్నారని ఆగ్రహించిన బాలయ్యబాబు, వెంటనే సింహంలా రంగంలోకి దూకి, బండారు సత్యనారాయణ పై చేయి చేసుకోన్న పీలా శ్రీనివాసరావుని పార్టీ నుండి సస్పెండ్ చేయించి అందరినీ హడలెత్తించాడు. దానితో, ఒక్క దెబ్బకి అందరూ చల్లబడిపోయారు కూడా. అయితే, ఇటీవలే పార్టీ పోలిట్ బ్యురోలోకి సభ్యుడిగా తీసుకోబడ్డ పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు, తన అనుచరుడు శ్రీనివాసరావు ఏతప్పుచేయకపోయినా, కనీసం తనకి మాట మాత్రంగానయినా చెప్పకుండా అతనిని సస్పెండ్ చేయడంతో ఆగ్రహించి, తన పోలి బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఒక సమస్యని పరిష్కరించానని బాలయ్యబాబు సంతృప్తి పడేలోగానే, ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. రాజకీయాలలో ప్రవేశించాలని తహ తహలాడుతున్న ఆయనకి ఇది మొదటి పరీక్ష వంటిది. దీనిని ఆయన ఏవిధంగా పరిష్కరిస్తారో చూడాలి మరి.

jagan congress

కాంగ్రెస్ తో జగన్ దోస్తీ?

        వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీతో రాజీకి వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పొత్తుకు సిద్దమవుతున్నట్లుగా ఉంది. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి వాయలార్ రవి కీలక వ్యాఖ్యలు చేశారు.   తమకు ప్రధాన ప్రత్యర్ధి బిజెపి తప్ప ఇతర పార్టీలు కాదని వాయలార్ రవి చెప్పడంతో, జగన్ పార్టీ కాంగ్రెస్ తో రాజీకి వచ్చినట్లు అర్థమవుతోంది. జగన్ కొంత కాలం క్రితమే పార్టీ నుంచి బయటకు వెళ్లారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ తో పొత్తుపై రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయిస్తుందని చెప్పడం విశేషం. ఇతర రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలతో కూడా కాంగ్రెస్ పొత్తులు ఉన్న సంగతిని ఆయన గుర్తు చేశారు. దీనిని బట్టి జగన్ తో పొత్తు పై రాష్ట్ర కాంగ్రెస్ త్వరలో నిర్ణయం తీసుకుంటుందనుకోవచ్చు.  

telangana issue

తెలంగాణ పై కేసిఆర్ కు లగడపాటి సవాల్

        కేసిఆర్ కు దమ్ముంటే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో పోటిచేసి గెలవాలని విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇవ్వదు. ఒక వేళ రాష్ట్రం విడిపోతే నేను రాజకీయాల నుండి తప్పుకుంటానని చెప్పారు. ఈ నెల 28న తెలంగాణ విషయంలో ఏమీ తేలదు. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇవ్వదు. ఏం జరుగుతుంది ? ఏం జరిగితే ఏం చేయాలి ? అన్నది నాకు మాత్రమే తెలుసు” అని లగడపాటి రాజగోపాల్ అన్నారు. విభజన వార్తల్లో వాస్తవం లేదని, రాష్ట్ర విభజన ముమ్మాటికి అవాస్తవమని చెప్పారు. 2014 వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగుతాయి అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ రాష్ట్రం ఇవ్వాలో తెలుసునని, అందుకే దాని గురించి ఏమి తేల్చడం లేదన్నారు. టిడిపి లేటర్ ఇచ్చింది కాబట్టే తెలంగాణకు కొంచెం మొగ్గు కనిపిస్తుంది అంతే తప్పితే, తెలంగాణ ఇచ్చే పరిస్థతి లేదు. తెలంగాణ అంశం పై ఈ నెల 21న చంద్రబాబు ను కలిసి, ఆయన సమైక్యవాదానికి మద్దతు ఇచ్చేలా చేస్తాం అని లగడపాటి అన్నారు.  

jr.ntr

నారా లోకేష్ కి లైన్ క్లియర్ చేసిన జూనియర్ ఎన్టీఆర్

స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి వర్ధంతి తెలుగు దేశం పార్టీకి ఒక శాపాన్ని, ఒక వరాన్నిఅందించింది. నందమూరి వారి అర్ధాంగి శ్రీమతి లక్ష్మీ పార్వతి తెలుగుదేశo పార్టీ వచ్చే ఎన్నికలలో ఉనికి కోల్పోతుందని శాపానార్ధాలు పెట్టగా, జు.యన్టీఆర్ స్వయంగా తనకు ఇప్పుడప్పుడే రాజకీయాలలో చేరాలని ఆసక్తి లేదని విస్పష్టంగా ప్రకటించి, తెలుగు దేశం పార్టీలో అతనికి అన్యాయం జరుగుతోందనే ప్రచారానికి అడ్డుకట్ట వేసాడు. బాబాయి బాలకృష్ణ తో కలిసి వచ్చి తాతగారికి యన్టీఆర్ ఘాట్ లో నివాళులు అర్పించిన తరువాత జు.యన్టీఆర్ మీడియా వారితో మాట్లాడుతూ, తన మొదటి ప్రాముఖ్యత సినిమా రంగానికేనని, రాజకీయాలలోకి రావడానికి ఇంకా చాలా సమయం ఉన్నందున, ప్రస్తుతం తన సినిమాలపైనే లగ్నం చేయలనుకొంటున్నట్లు చెప్పాడు. అయితే, ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలలో పాల్గోనలేకపోయినప్పటికీ, ఎన్నికల సమయంలో తప్పనిసరిగా పార్టీ తరపున ప్రచారంలో పాల్గొంటానని తెలిపాడు.   తద్వారా, ఇంతవరకు అతనిని పార్టీలోకి రాకుండా చంద్రబాబు, లోకేష్ అడ్డుకొంటున్నారనే అపవాదును తనే స్వయంగా ఖండించి పార్టీలో తనకి ఎవరితో విభేదాలు లేవని స్పష్టం చేసాడు. ఈ విధంగా అతను ప్రకటించడంవల్ల పార్టీలో అంతర్గత కుమ్ములాటలు లేవనే విషయాన్నీ తెలియజేయగలిగేడు.   ఇటీవల కాలంలో పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్న నారా లోకేష్ కు ఇది కలిసొచ్చే అంశం గా చెప్పవచ్చును. ప్రస్తుతం జు.యన్టీఆర్ అతనితో పోటీ పడబోవట్లేదు గనుక ఇక నారా లోకేష్ పార్టీ కార్యక్రామలపై పూర్తి శ్రద్ధ పెట్టి పనిచేయవచ్చును.

 Lokesh not to talk to media

నాన్న యాత్ర పూర్తయ్యేదాకా మాట్లాడను: లోకేష్

        తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 17వ వర్ధంతి కార్యక్రమాలు హైదరరాబాద్ లో ఘనంగా జరిగాయి. ఉదయాన్నే కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి ఎన్టీఆర్ సమాధికి నివాళులు అర్పించారు. మామా అల్లుళ్లు నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ ఈ సారి వర్ధంతి కార్యక్రమాలలో కలిసి పాల్గొనడం విశేషం. ఎన్టీఆర్ అమర్ జ్యోతి ర్యాలీని రసూల్ పుర నుండి మామ బాలకృష్ణతో కలిసి లోకేష్ ప్రారంభించాడు. ఈ సంధర్భంగా మాట్లాడాలని మీడియా కోరగా ”మా నాన్న పాదయాత్ర పూర్తయ్యేదాకా మీడియాతో మాట్లాడను” అని అన్నారు. తన తాత ఎన్టీఆర్ వర్ధంతి సంధర్భంగా లోకేష్ తను చిన్నప్పుడు తాత ఎన్టీఆర్ తో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్ లో పెట్టాడు. ఐ మిస్ యూ..అని ట్వీటేశాడు.  

Samaikya JAC leaders arrested

సమైక్యా౦ద్ర జేఏసీ నేతలు అరెస్ట్

        రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ సీమాంధ్రలోని పలు విశ్వవిద్యాలయాల విద్యార్థులు హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్ లో సమైక్య సమావేశం నిర్వహించేందుకు ప్రయత్నించారు. పలు విశ్వవిద్యాలయాల విద్యార్థులు అక్కడికి చేరుకుని సమైక్య నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. తమ సమావేశానికి అనుమతివ్వాలని విద్యార్థి నేతలు పోలీసులను డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. దీంతో పోలీసులకు, విద్యార్థులకు మధ్యన పెద్ద ఎత్తున వాగ్వివాదం నెలకొంది. సదస్సుకు అనుమతివ్వాలని సమైక్య నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  

రాజకీయాల్లోకి రాను..అధికారం మాదే : జూ. ఎన్టీఆర్

        దివంగత ముఖ్యమంత్రి, నటుడు నందమూరి తారక రామారావు గారి 17వ వర్ధంతి సంధర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తెల్లవారుజామున హైదరాబాద్ లోని ఎన్టీఆర్ సమాధికి నివాళులు అర్పించారు. ఆయన తన భార్య లక్ష్మి ప్రణతితో విచ్చేసి నివాళులు అర్పించారు. ఇతర కుటుంబ సభ్యులు ఎవరూ ఆయన వెంట రాలేదు.     మీడియాతో మాట్లాడుతూ మామయ్య చంద్రబాబు చేస్తున్న "వస్తున్నా మీకోసం" పాదయాత్ర మూలంగా ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి ఆదరణ పెరుగుతుందని, రాబోయే ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధిస్తుందని అన్నారు. ప్రజల నుండి పాదయాత్రకు వస్తున్న స్పందనను చూసి దానిని పొడిగించడం మంచిదేనని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. సినిమాలపైనే దృష్టి పెడుతానని తెలిపారు.

రంగంలోకి దిగిన లోకేష్

  తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ సంక్రాంతి సందర్భంగా చిత్తూరు జిల్లాలో తమ స్వగ్రామమయిన నారావారి పల్లెకు వచ్చినప్పుడు, తన రాజకీయ కార్యక్రమాలను కూడా ఆరంభించాడు. పండుగ సంభారాలలో మునిగున్న తెలుగు తమ్ముళ్ళకు నారా లోకేష్ స్వయంగా తమను కలవడం వారికి మరింత ఆనందం కలిగించింది.   పార్టీ అధ్యక్షుడే స్వయంగా జిల్లాకు ప్రాతినిద్యం వహిస్తున్నపటికీ, గత కొంత కాలంగా జిల్లా వైపు కన్నెత్తి చూడడానికి కూడా తీరికలేని రాజకీయాలలో తలమునకలవుతున్న కారణంగా, తెలుగుదేశం కార్యకర్తలలో మునుపటి ఉత్సాహం కొరవడింది.ఆకారణంగా కొందరు పార్టీ నేతలు, కార్యకర్తలూ క్రమంగా ఇతర పార్టీలవైపు ఆకర్షితులవుతున్న సంగతి తెలియడంతో యువనేత లోకేష్ జిల్లారాజకీయాలపై తన దృష్టి సారించాడు.   లోకేష్ స్థానిక నేతలతో, పార్టీ కార్యకర్తలతో దఫా దఫాలుగా అనేక సార్లు సమావేశం అయ్యాడు. జిల్లాలో పార్టీ పరిస్థితిని తెలుసుకోనడమే గాకుండా వారి అభిప్రాయాలను, సూచనలను ఎప్పటికప్పుడు తన ల్యాప్ టాప్ కంప్యుటర్ లో నోట్ చేసుకొన్నట్లు సమాచారం.   స్థానిక నేతలు, అతనితో నియోజక వర్గ ఇన్-చార్జుల నియామకాల గురించి ప్రస్తావించినప్పుడు,మరొక నెల, నెలన్నర సమయంలో చిత్తూరు మరియు తెలంగాణ జిల్లాలలో అన్ని నియోజక వర్గాలకు ఇన్-చార్జుల నియామక ప్రక్రియ పూర్తీ చేయనున్నట్లు లోకేష్ తెలిపాడు.   ఈ సమావేశాలలో అతను ముఖ్యంగా తంబళ్లపల్లి, చంద్రగిరి,పుంగనూరు, పీలేరు, పీలేరు నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితులపై ప్రత్యేక శ్రద్ద కనబరుస్తూ పూర్తీ వివరాలను సేకరించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, గతంలో ఈ నియోజకవర్గాలలో పార్టీ అధిష్టానం మరియు స్థానికనేతల మధ్య సరయిన అనుసంధానం జరగకపోవడం చేత తీవ్రమయిన తప్పిదాలు కొన్నిజరిగి, తద్వారా పార్టీకి కూడా తీవ్ర నష్టం జరిగిందని పేర్కొంటూ, ఇక ముందు అటువంటి పొరపాట్లు పునారావృతం కాకుండా తానూ శ్రద్ధ తీసుకొంటానని చెప్పడంతో పార్టీ నాయకులూ సంతోషం వ్యక్తం చేసారు.   ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా లోకేష్ స్వయంగా ఈ విధంగా చొరవ తీసుకొని స్థానిక నేతలతో, మమేకం కావడం జిల్లాపార్టీ శ్రేణులు చాలా ఉత్సహంగా ఉన్నారు.

అక్బరుద్దీన్ పై మరో కేసు

        వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టు అయిన అక్బరుద్దీన్ పై మరో కేసు నమోదు అయ్యింది. 2005లో రోడ్డువెడల్పులో భాగంగా మసీదును కూల్చుతుండగా అప్పటి జిల్లా కలెక్టర్ ఆంజనేయులను దుర్బాషలాడిన ఆయనపై పటాన్ చెరు పోలీస్ స్టేషన్ లో పీటీ వారెంట్ జారీ అయ్యింది. ఈ కేసులో నిందితులుగా వున్న 8మంది కోర్ట్ కు హాజరవుతున్నపటికి అక్బర్ మాత్రం కోర్ట్ కి హాజరుకావడంలేదు. ఈ కేసులో మెదక్ జిల్లా పోలీసులు ఆయన్ను ఎప్పుడో తమ కస్టడీలోకి తీసుకోవాల్సి వున్నపటికి అలా జరగలేదు. ఈ కేసు విషయమై సంగారెడ్డి పోలీసులు అక్బరుద్దీన్ ను తీసుకు వచ్చేందుకు నిర్మల్ వెళ్లారు. అన్నీ కుదిరితే ఈ రోజు అక్బర్ సంగారెడ్డి సెషన్ కోర్టులో హాజరావ్వచ్చు. ఈ కేసులో అక్బరుద్దీన్ సోదరుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా ని౦దుతునిగా వున్నప్పటికీ ఆయన్ని అదుపులోకి తీసుకొని కోర్ట్ లో  ప్రొడ్యూస్ చేయడానికి  పోలీసులు తర్జనభర్జనలు పడుతున్నట్లు సమాచారం.    

ఇక సమైక్య పోరాటం

  కేంద్రం తన నిర్ణయం ప్రకటించే సమయం ఆసన్నమవుతున్నకొద్దీ రాష్ట్రంలో ఆంద్ర, తెలంగాణా రాజకీయాలు ఊపందుకొంటున్నాయి. రాష్ట్ర విభజన ఖాయమనే సంకేతాలు వెలువడుతున్న నేపద్యంలో, సీమంద్రాకు చెందిన వివిధ పార్టీల నేతలందరూ, తమ విభేదాలను, పార్టీ సిద్ధాంతాలను మళ్ళీ మరోమారు పక్కన బెట్టి సమైక్యపోరాటానికి చేతులు కలుపుతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న సీమాంధ్రా మంత్రులు ఈ సమైక్య పోరాటానికి ముందు నిలుస్తున్నారు.   మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, వట్టి వసంతకుమార్‌, టీజీ వెంకటేష్‌, కాసు కృష్ణారెడ్డి, శైలజానాధ్‌, విశ్వరూప్‌ ఏరాసు ప్రతాపరెడ్డితోపాటు మరో పదిమంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి కేంద్రంపై సమైక్యరాష్ట్రానికి అనుకూలంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. అదే సమయంలో మధు యాష్కీ, రాజయ్య వంటి తెలంగాణావాదులు కూడా డిల్లీలోనే తిష్టవేసి తెలంగాణా కోసం తమ ప్రయత్నాలు తము చేస్తున్నారు.   రేపు అనగా జనవరి 17వ తేదీన సీమాంధ్ర కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు మంత్రుల క్వార్టర్స్‌లోని క్లబ్‌లో సమావేశం అవ్వాలని నిర్ణయించడంతో తెలంగాణా వాదులు ఆగ్రహం ప్రకటిస్తున్నారు. తెలంగాణా గడ్డపై తెలంగాణా వ్యతిరేఖ ఆలోచనలు చేసేవారి సమావేశాలను తప్పక అడ్డుకొంటామని ఆన్నారు. ఈ నేపద్యంలో రేపు సీమంద్రా సమావేశం జరగడం అనుమానమే.   అయితే, కేంద్రం గనుక రాష్ట్ర విభజన ప్రకటించిన మర నిమిషమే సీమంద్రా రాజకీయ నాయకులందరూ తమ పదవులకు రాజీనామా చేసి ఉద్యమాలు మొదలుపెడతామని కేంద్రాన్ని హెచ్చరిస్తున్నారు. తాము ఇప్పటివరకూ పార్టీ అధిష్టానంపై నమ్మకం, గౌరవంతో ఒత్తిడి చేయలేదని, గానీ ఇప్పుడు కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేమాటయితే తాము తప్పనిసరిగా పార్టీకి వ్యతిరేఖంగా నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.   ఇంతవరకు నిదానంగా వేచిచూసిన సీమంద్రా నేతలు ఇప్పుడు రంగ ప్రవేశం చేయడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కిపోయాయి. ఇక, రేపటినుండి రాష్ట్రంలో పరిస్థితులు మరింత దిగజారే అవకాశాలు కనిపిస్తున్నాయి.