
ఎర్రవల్లి ఫామ్హౌస్లో కేసీఆర్ను కలిసిన కవిత
Publish Date:Aug 15, 2025
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తండ్రి కేసీఆర్ను కలిసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి కవిత ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. తన కుమారుడికి కేసీఆర్ ఆశీర్వాదం తీసుకోనున్నట్టు సమాచారం. కవిత అమెరికా పర్యటనకు డిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ఇప్పటికే అనుమతించింది.బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు అమెరికాకు వెళుతున్నారు. తన కుమారుడిని అక్కడ కాలేజీలో చేర్పించనున్నారు. 15 రోజుల పాటు ఆమె అమెరికాలోనే ఉండనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత నిందితురాలిగా ఉన్న సంగతి తెలిసిందే. 15 రోజుల పాటు కవిత అమెరికాలో ఉండనున్నారు.
కుమారుడిని అమెరికా యూనివర్శిటీలో జాయిన్ చేసి.. కొన్ని రోజులు ఆమె అక్కడే ఉండి.. అనంతరం హైదరాబాద్కు తిరిగి రానున్నారు.మరోవైపు అధినేత కేసీఆర్ పార్టీలోని కీలక నేతలకు ఎర్రవల్లి ఫామ్హౌస్కు రావాలని ఆదేశించారు. దీంతో కేటీఆర్, హరీష్ రావులతోపాటు పలువురు కీలక నేతలు ఇప్పటికే ఎర్రవల్లికి పయనమయ్యారు. మరికొద్ది రోజుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై చర్చించనున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. అలాగే అసెంబ్లీ సమావేశాలు, కాళేశ్వరం ప్రాజెక్ట రిపోర్ట్ తదితర అంశాలపై చర్చించే అవకాశమున్నట్లు టాక్.
కుర్చీ వేయలేదని అలిగిన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి
Publish Date:Aug 15, 2025
ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన చంద్రబాబు, పవన్, లోకేశ్
Publish Date:Aug 15, 2025
ఒకే కుర్చీలో కూర్చోవడానికి చాలా మంది పోటీ పడతారు : సీఎం రేవంత్ రెడ్డి
Publish Date:Aug 15, 2025
తొర్రూరులో జాతీయ జెండాకు ఘోర అవమానం
Publish Date:Aug 15, 2025
.webp)
నష్టనివారణా.. జగన్ అరెస్టు ఖాయమన్న సంకేతమా?
Publish Date:Jul 26, 2025
జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన లిక్కర్ కుంభకోణం వైసీపీ పునాదులనే కదిల్చేస్తోందా? అంటే.. మిథున్ రెడ్డి అరెస్టు తరువాత ఆ పార్టీలో కనిపిస్తున్న ఖంగారు చూస్తుంటూ ఔననే అనిపిస్తోంది. దాని కంటే ముఖ్యంగా మిథున్ రెడ్డి అరెస్టు తరువాత ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి వరుసగా మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూలలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీ భయాన్ని ఎత్తి చూపుతున్నాయి. మిథున్ రెడ్డి అరెస్టు తరువాత వైసీపీ అంత వరకూ ప్రదర్శిస్తూ వస్తున్న గాంభీర్యం లేదా మేకపోతు గాంభీరం ఒక్కసారిగా పటాపంచలైపోయింది. పొంతన లేని ప్రకటనలతో పార్టీలో నెలకొన్న అయోమయాన్ని బహిర్గతం చేసుకుంటోంది. సరిగ్గా ఇదే సమయంలో సజ్జల బయటకు వచ్చి వైసీపీ అనుకూల మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ ఇంటర్వూల సారాంశం ఏమిటన్న దానిపైనే ఇప్పుడు రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. మిథున్ రెడ్డి అరెస్టు తరువాత నష్టనివారణ, క్యాడర్ లో ధైర్యాన్నినింపడం ఎజెండాగా సజ్జల మాట్లాడిన మాటలు క్యాడర్ లో ధైర్యం నింపడం సంగతి అటుంచి క్యాడర్ ను మరింత గందరగొళంలోకి నెట్టేశాయి. మొత్తంగా సజ్జల మద్యం కుంభకోణం కేసులో జగన్ అరెస్టు అనివార్యం అన్న సంకేతం ఇచ్చారు. జగన్ అరెస్టు కు క్యాడర్ ను సంసిద్ధం చేయడమే ఆయన ఇంటర్వూల సారాంశమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
జగన్ ప్రభుత్వ హయాంలో సజ్జల సకలశాఖల మంత్రిగా చక్రం తిప్పారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ఆయన నాడు అన్ని శాఖలపైనా తిరుగులేని పెత్తనం చెలాయించారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత ఈ ఏడాది కాలంలో ఆయనకు పనేమీ లేకుండా పోయింది. అయితే మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి అరెస్టు తరువాత ఆ అరెస్టును, ప్రభుత్వ తీరును ఖండిస్తూ పార్టీని సమర్ధించుకోవలసిన బాధ్యత ఆయనపై పడింది. ఆ పనిని ఆయన చేయగలిగినంత అస్తవ్యస్తం చేస్తున్నారని వైసీపీ శ్రేణులే అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి అరెస్టుకే కంగారుపడితే ఎలా? ముందు ముందు జగన్ కూడా ఈ కేసులో కటకటాల వెనక్కు వెడతారు.. అంటే ఆయన పార్టీ క్యాడర్ కు సంకేతాలిస్తున్నారు. ఆధారాలు లేకుండా అరెస్టులు చేస్తున్నారంటూ ఆయన చేస్తున్న ఆరోపణలు కూడా చాలా బలహీనంగా ఉన్నాయి. ఇంతకీ ఆయనేం చెప్పారంటే.. ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చి తొలి ఏడాది ఎవరినైనా అరెస్టు చేయడం సులువే.. చంద్రబాబు ఇప్పుడు అదే చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు.
అదే జగన్ అన్ని ఆధారాలూ సేకరించిన తరువాత తన అధికారం చివరి దశలో చంద్రబాబును అరెస్టు చేశారని గుర్తు చేశారు. అయితే ఇక్కడ సజ్జల ఉద్దేశపూర్వకంగా విస్మరించిన సంగతేంటంటే.. జగన్ ప్రభుత్వం అన్ని ఆధారాలూ సేకరించి చంద్రబాబునున అరెస్టు చేసినట్లైతే.. ఆ ఆధారాలను కోర్టులో ప్రవేశపెట్టడంలో విఫలం ఎందుకైంది? అన్న ప్రశ్నకు సమాధానం. మొత్తంగా నష్టనివారణ అంటూ మీడియా ముందుకు అదీ జగన్ అనుకూల మీడియా ముందుకు వచ్చి సజ్జల చెప్పిందేమిటంటే.. జగన్ మద్యం కేసులో అరెస్టు కాబోతున్నారు అనే.
గాంధీలు జైలుకు వెడతారా?
Publish Date:Apr 19, 2025
జగన్ కోటరీ నుంచి సజ్జల ఔట్?
Publish Date:Apr 9, 2025
ఫిర్ ఏక్ బార్., కేసీఆర్ సర్ కార్?
Publish Date:Apr 8, 2025
రాజకీయాల్లో కవిత మళ్లీ యాక్టివ్.. హరీశ్కు చెక్ పెట్టేందుకేనా?
Publish Date:Nov 24, 2024
కల్వకుంట్ల వారసుల సెపరేట్ అజెండాలు.. క్యాడర్లో కన్ఫ్యూజన్
Publish Date:Jul 25, 2025
వరుస పరాజయాలు మూటగట్టుకున్న గులాబీ పార్టీలో నెలకొన్న వివాదాలు, ఆధిపత్యపోరు ఆ పార్టీ ఉనికికే ప్రశ్నార్ధకంగా మారుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కారు పార్టీని తిరిగి రేసులోకి తీసుకురావాల్సిన పార్టీ ముఖ్యనేతలు, అందులోనూ కల్వకుంట్ల వారసులు వ్యవహరిస్తున్న తీరు బీఆర్ఎస్ వర్గాకు అసలు మింగుడుపడటం లేదంట. తాజాగా కవిత జాగృతి వర్సెస్ పార్టీ అనుభంద సంస్థ బీఆర్ఎస్వీ పోటాపోటీగా ఓకే రోజూ శిక్షణ తరగతులు, వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించడం పార్టీలో తీవ్ర గందరగోళానికి దారి తీస్తోంది.
ఒకే రోజు జాగృతి ఒకవైపు.. బీఆర్ఎస్వీ మరోవైపు కార్యక్రమాలు నిర్వహించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పార్టీలో ఆధిపత్య పోరు అన్నాచెల్లెళ్ల సవాల్ అన్నట్లుగా మారిందనే చర్చ నేతల్లో నడుస్తోంది. జాగృతి సంస్థను కవిత స్థాపించగా, బీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంస్థగా బీఆర్ఎస్వీ ఉంది. పార్టీకి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నా.. ఒకే రోజు వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించడంతో పార్టీ కేడర్ లో మాత్రం గందరగోళానికి తెరదీసిందట.
బీఆర్ఎస్ లో కేటీఆర్, కవిత ఇద్దరూ కీలక నేతలు. ఇద్దరూ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు వారసులే. పార్టీ ఎమ్మెల్సీగా కవిత ఉన్నప్పటికీ సొంత జాగృతి సంస్థ బలోపేతంపైనే ఆమె ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ జాగృతి ఆధ్యర్యంలోనే కార్యక్రమాలు చేపడుతూ యాక్టివ్ అవుతున్నారు. కేటీఆర్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ విద్యార్థి విభాగం నేతలను పరిస్థితులకు అనుగుణంగా కార్యక్రమాలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
అయితే ఒకే రోజు ఇటు జాగృతి శిక్షణ తరగతులు, అటు బీఆర్ఎస్వీ రాష్ట్ర సదస్సు నిర్వహిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. వేదికలు వేర్వేరు ప్రాంతాలు అయినప్పటికీ ఈ నెల 26న నిర్వహిస్తున్నట్లు కల్వకుంట్ల వారసులు ప్రకటించారు. జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే లీడర్ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కవిత రెండు సెషన్లుగా నిర్వహించాలని నిర్ణయించారు. మరోవైపు బీఆర్ఎస్వీ సదస్సుకు హరీష్ రావు, కేటీఆర్ తో పాటు ముఖ్య నేతలు హాజరై రెండు సెషన్లలో పాల్గొని మార్గనిర్దేశం చేయనున్నారు. ఇదే ఇప్పుడు గులాబీ పార్టీలో ఆయోమయానికి, గందరగోళానికి కారణమైందట.
ఎందుకు ఒకేసారి అన్నచెల్లెలు ఒకే సారి వేర్వేరుగా ప్రోగ్రాంలను ఫిక్స్ చేశారు? అసలు కారణం ఏంటి? ఒకరు ఒక తేదీలో.. మరొకరు ఇంకో తేదీలో శిక్షణ తరగతులు నిర్వహించవచ్చుకదా? అన్న చర్చ ఇప్పుడు హాట్ హాట్గా మారింది. ఆ క్రమంలో అసలు పార్టీలో ఏం జరుగుతుందనేది తెలియక కేడర్ లో అయోమయం నెలకొందట. కవిత యువత, విద్యార్థులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా పక్కా ప్రణాళికలతో జాగృతిని యాక్టివేట్ చేయాలని చూస్తున్నారు. యువత, మహిళలు, బహుజనులు రాజకీయాల్లో రావాలని ప్రతీ సందర్భంలోనూ పిలుపునిస్తున్నారు.
అందులో భాగంగానే జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ శిక్షణ తరగతులకు శ్రీకారం చుట్టారు. తొలుత రాష్ట్రస్థాయిలో ‘లీడర్’ పేరుతో శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. శనివారం (జులై26) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కొంపల్లిలో గల శ్రీ కన్వెన్షన్ హాల్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అయితే ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆమె గత నెల 15నే ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి జాగృతి ప్రతినిధులు రావాలని పిలుపు నిచ్చారు.
బీఆర్ఎస్ ఓటమి తర్వాత గులాబీ బాస్ ఫాంహౌస్కే పరిమితమవుతున్నారు. దాంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ పార్టీని నడిపిస్తున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టే విధంగా కార్యక్రమాలను రూపొందిస్తూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ ముఖ్యులందరికీ కేసుల చట్రం బిగుసుకుంటుండటంతో... చిన్నబాస్కు పార్టీ నేతల సహకారం పూర్తి స్థాయిలో లభించడం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయినా తనదైన వ్యూహాలు అమలు చేస్తున్న కేటీఆర్ బనకచర్ల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను బీఆర్ఎస్వీకి అప్పగిస్తూ తాజా కార్యక్రమానికి రూపకల్పన చేశారు.
అందుకు తగ్గట్లుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కార్యచరణ సిద్ధంచేశారు. బనకచర్ల ప్రాజెక్టుపై జంగ్ సైరన్ మోగించేందుకే ఈ నెల 19 నుంచి విద్యాసంస్థల్లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 26న ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్స్ లో బీఆర్ఎస్వీ విభాగం రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమం ఉదయం సెషన్ ను మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభిస్తుండగా... సాయంత్రం సెషన్ లో కేటీఆర్ పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు. బనకచర్ల ప్రాజెక్టుతో నష్టాలు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టాలని చూస్తున్నారు.
కల్వకుంట్ల అన్నాచెల్లెళ్లు ఇద్దరూ ఎవరికి వారే పార్టీ తమకు ప్రాణం అంటూనే .. ఎవరికి వారు సొంతంగా యాక్షన్ప్లాన్లు ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వారిద్దరూ ప్రత్యక్షంగా ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకోకపోయినా.. ఎవరికి వారు సొంత కార్యచరణ మేరకు ముందుకు సాగడం చూస్తుంటే.. వారిరువురి తీరు గులాబీ పార్టీని మనుగడను ప్రశ్నార్ధకం చేస్తున్నాయన్న అభిప్రాయం పార్టీ లీడర్లు, క్యాడర్ లో వ్యక్తమౌతోంది.
సీబీఎన్.. ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం!
Publish Date:Apr 19, 2025
కడప మహానాడులో బాంబులు పేలనున్నాయా..?
Publish Date:Apr 8, 2025
నోస్ట్రాడమస్ జోస్యం నిజం కానుందా?
Publish Date:Nov 26, 2024
సొంత పార్టీ శ్రేణులకే వెగటు పుట్టిస్తున్న జగన్ రెడ్డి అతితెలివి!
Publish Date:Nov 13, 2024
త్రివర్ణ పతాకాన్ని గౌరవించడానికి కొన్ని నియమాలున్నాయ్ తెలుసా?
Publish Date:Aug 14, 2025
మన దేశ గుర్తింపు భారతదేశ జాతీయ జెండా. దీనికి మూడు రంగులు ఉన్నాయి కాబట్టి దీనిని త్రివర్ణ పతాకం అని పిలుస్తారు. ఇది దేశ ఐక్యత, గర్వం, త్యాగానికి చిహ్నం. స్వాతంత్ర్య దినోత్సవం వంటి జాతీయ పండుగలు, కార్యక్రమాలలో జెండా ఎగురవేయడం జరుగుతుంది. ఆగస్టు 15, జనవరి26 వంటి ప్రత్యేక సందర్భాలలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేటప్పుడు, "భారత జెండా కోడ్"లో నిర్దేశించబడిన కొన్ని నియమాలను పాటించడం అవసరం. జెండా ఎగురవేయడానికి ప్రభుత్వం పాటించే నియమాలను తెలుసుకుంటే..
భారత జాతీయ జెండా ఎలా ఉంటుంది?
భారత జాతీయ జెండా మూడు రంగులలో ఉంటుంది. త్రివర్ణ పతాకం పైభాగంలో ముదురు కాషాయ రంగు ఉంటుంది, ఇది ధైర్యం, త్యాగానికి చిహ్నం. మధ్యలో ఉన్న తెలుపు రంగు శాంతి, సత్యానికి చిహ్నం. దిగువన ఉన్న ఆకుపచ్చ రంగు విశ్వాసం, సస్యశ్యామలతకు చిహ్నం. మధ్యలో 24 చువ్వలు కలిగిన ముదురు నీలం అశోక చక్రం ఉంటుంది.
జెండా ఎగురవేయడానికి నియమాలు, నిబంధనలు..
జెండాను ఎగురవేసేటప్పుడు సగం ఎత్తులో ఎగురవేయకూడదు. ఆదేశాలు లేకుండా త్రివర్ణ పతాకాన్ని సగం ఎత్తులో ఎగురవేయకూడదు.
జాతీయ జెండాలో ఎటువంటి చిత్రం, పెయింటింగ్ లేదా ఛాయాచిత్రం ఉపయోగించకూడదు.
చెరిగిన, మురికిగా ఉన్న జెండాలను ఎగురవేయకూడదు. జెండాను ఏ విధంగానూ తారుమారు చేయకూడదు.
ఎవరికైనా సెల్యూట్ చేయడానికి త్రివర్ణ పతాకాన్ని అవనతం చేయకూడదు.
సూర్యోదయం, సూర్యాస్తమయ సమయంలో మాత్రమే జెండా ఎగురవేయాలి. సూర్యాస్తమయం తర్వాత త్రివర్ణ పతాకాన్ని దించాలి.
త్రివర్ణ పతాకాన్ని ఎల్లప్పుడూ స్పష్టంగా కనిపించే ప్రదేశంలో ఎగురవేయాలి.
జెండా ఎగురవేసే సమయం
స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఉదయం 8:30 గంటలకు ప్రధానమంత్రి ఎర్రకోట వద్ద జెండాను ఎగురవేస్తారు. సాధారణ పౌరులు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయవచ్చు.
జెండా కోడ్ను ఎందుకు పాటించాలి?
జెండాను గౌరవించడం దేశ గౌరవానికి చిహ్నం. నియమాలను పాటించడం ద్వారా మన జాతీయ జెండా గౌరవాన్ని కాపాడుకుంటాము.
జెండా ఎగురవేయడం అంటే ఏమిటి?
ప్రతి సంవత్సరం ఆగస్టు 15న జెండా ఎగురవేయడం జరుగుతుంది. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు, బ్రిటిష్ పాలకుల జెండాను తొలగించి, త్రివర్ణ పతాకాన్ని కింది నుండి పైకి లాగి ఎగురవేశారు. దీనిని జెండా ఎగురవేయడం అంటారు. ప్రతి సంవత్సరం దేశ ప్రధానమంత్రి ఎర్రకోట ప్రాకారాల నుండి జెండాను ఎగురవేస్తారు. దీనిలో జెండాను తాడు సహాయంతో కింది నుండి పైకి లాగుతారు. జెండా ఎగురవేయడం అనేది కొత్త దేశం యొక్క ఆవిర్భావానికి చిహ్నం.
జెండా ఎగురవేయడంలో రెండవ పద్దతి..
ఆగస్టు 15న జెండా ఎగురవేస్తే, జనవరి 26న అంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. ఈ రోజున జెండా ఇప్పటికే కట్టబడి ఉంటుంది. జనవరి 26న, రాష్ట్రపతి రాజ్పథ్పై జెండాను ఎగురవేస్తారు. ఈ రెండింటి మధ్య తేడాలు చాలామందికి తెలియవు.
*రూపశ్రీ.
ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం ఎన్నవది.. 78 లేదా 79?
Publish Date:Aug 14, 2025
పిల్లలలో మొబైల్ వ్యసనం.. ఇలా మాన్పించేయవచ్చు..!
Publish Date:Aug 13, 2025
జాతీయ గ్రంథాలయ దినోత్సవం... సరస్వతి నిలయానికి జయహో!
Publish Date:Aug 12, 2025
పెళ్ళికి ముందు ఈ 5 విషయాలు కూతుళ్లకే కాదు.. కొడుకులకు కూడా నేర్పించాలి..!
Publish Date:Aug 12, 2025
మోకాళ్లను సంవత్సరాల తరబడి సేఫ్గా ఉంచే సూపర్ టిప్స్ ఇవి..!
Publish Date:Aug 14, 2025
వయసు పెరిగే కొద్దీ ఎముకలు పెళుసుగా, బలహీనంగా మారతాయి. అయితే అనుసరించే జీవనశైలి, అలవాట్లు బలమైన ఎముకలకు, శరీరం సాఫీగా కదలడానికి దోహదం చేస్తాయి. చాలా మంది మోకాళ్ సమస్య వచ్చేవరకు మోకాళ్ల గురించి అస్సలు ఆలోచించరు. కానీ శరీర బరువును మోసేవి కాళ్లు. ఆ భారం ఎక్కువగా మోకాళ్ల మీద ఉంటుంది. అందుకే ఒక వయసు దాటగానే మోకాళ్లు నొప్పులు రావడం, లేక ఇతర మోకాళ్ల సంబంధ సమస్యలు రావడం జరుగుతుంది. అయితే మోకాళ్లను సంవత్సరాల తరబడి ఎలాంటి సమస్యలు చట్టు ముట్టకుండా ఉండేందుకు కొన్ని టిప్స్ పాటించాలి. ఇవన్నీ లైప్ స్టైల్ అలవాట్లలో భాగమే.. అవేంటో తెలుసుకుంటే..
బరువు..
కొంచెం అదనపు బరువు ఉన్నా అది మోకాళ్లపై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. ప్రతి అడుగుతో శరీర బరువుకు నాలుగు రెట్లు ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం వల్ల ఈ ఒత్తిడి తగ్గుతుంది. దీర్ఘకాలిక గాయం అయ్యే అవకాశాలు తగ్గుతాయి.
మూవ్ మెంట్..
తరచుగా కదలికలు చేయడం వల్ల మోకాళ్లను సరళంగా ఉంచుకోవచ్చు. అంతేకాదు కీళ్ళు కూడా మంచి స్థితిలో ఉంటాయి. నడక, ఈత, సైక్లింగ్ లేదా యోగా వంటి తక్కువ ప్రభావ వ్యాయామాలు మోకాళ్లకు సున్నితంగా ఉంటాయి. మోకాళ్ల మీద ఒత్తిడి ఉండదు. కానీ మోకాళ్లను బలంగా మారుస్తాయి.
కండరాల సపోర్ట్..
దృఢమైన కాళ్ళ కండరాలు, ముఖ్యంగా హామ్ స్ట్రింగ్స్, క్వాడ్స్, మోకాళ్ల నుండి ఒత్తిడిని తగ్గిస్తాయి. వ్యాయామ నియమావళిలో బాడీ వెయిట్ స్క్వాట్లు, లెగ్ రైజ్లను చేర్చడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవన్నీ చేసేటప్పుడు గాయం కాకుండ ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవాలి.
మోకాళ్ల చుట్టూ ఉన్న కండరాలు బిగుతుగా ఉండటం వల్ల మోకాళ్ల నొప్పులు వస్తాయి. ప్రతిరోజూ స్ట్రెచింగ్స్, ముఖ్యంగా తొడలు, పిక్కలు, తుంటిని వదులుగా, స్ట్రయిట్ గా ఉంచుతుంది. వ్యాయామం తర్వాత లేదా రోజు చివరిలో వేగవంతమైన స్ట్రెచింగ్ ను డైలీ రొటీన్ లో భాగం చేసుకోవాలి.
షూస్..
నడవడం లేదా వ్యాయామం చేయడం వంటివి చేసేటప్పుడు మంచి ఆర్చ్ సపోర్ట్, కుషనింగ్ ఉన్న బూట్లు ధరించాలి. బాగు్నాయి కదా అని పాత షూస్ ను వర్కౌట్స్ కు సరిపడకపోయినా వేసుకుంటే ఆ తరువాత నష్టాలు ఎదురుచూడాల్సి రావచ్చు. మరొక విషయం ఏమిటంటే.. ఎక్కువసేపు హీల్స్ ధరించకూడదు.
ఫోజ్ మార్చుకోవాలి..
ఫోజ్ ను భంగిమ అని కూడా అంటారు. సరైన భంగిమ కాకుండా వ్యాయామం చేసేటప్పుడు ఇష్టం వచ్చినట్టు ఫోజ్ లు పెడుతుంటే అది వీపును గాయపరచడమే కాకుండా, మోకాలి అమరికను కూడా దెబ్బతీస్తుంది. నిటారుగా నిలబడాలి, నిటారుగా కూర్చోవాలి. అలాగే వ్యాయామం అయినా వాకింగ్ అయినా, యోగా అయినా వాటికి తగిన విధంగా శరీరాన్ని బ్యాలన్స్ చేయాలి. అలాగే బరువులు ఎత్తేటప్పుడు కూడా ఫోజ్ చూసుకోవాలి.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
నో ఆయిల్ డైట్.. 30 రోజులు దీన్ని ఫాలో అయితే మ్యాజిక్కే..!
Publish Date:Aug 13, 2025
టైప్-1, టైప్-2 కాదు.. టైప్-5 డయాబెటిస్ గురించి తెలుసా?
Publish Date:Aug 12, 2025
ఆరోగ్యం కోసం డీటాక్స్ జ్యూసులు తీసుకుంటున్నారా? ఈ నిజాలు తెలుసా?
Publish Date:Aug 11, 2025
రోజూ ఉదయమే ఉప్పు కలిపిన నీరు తాగితే ఏం జరుగుతుందో తెలుసా..!
Publish Date:Aug 9, 2025