పొత్తులు కాదు.. ఉద్యోగాలు, పరిశ్రమలు.. బీహార్ తక్షణ అవసరాలివే.!
పొత్తులు కాదు.. ఉద్యోగాలు, పరిశ్రమలు.. బీహార్ తక్షణ అవసరాలివే.!

దేశ రాజకీయాలలో ఎన్నికల వ్యూహకర్తగా తిరుగులేని గుర్తింపు పొంది.. ఇప్పుడు తన స్వరాష్ట్రంలో రాజకీయ నాయకుడిగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న ప్రశాంత్ కిశోర్ ఇటీవల రాష్ట్రంలోని బంకిపునా నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించి ప్రత్యక్ష రాజకీయాలలో తొలి అడుగు వేశారు. బంకీపూర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన అనంతరం తొలి సారిగా మీడియా సమావేవంలో మాట్లాడిన ఆయన బీహార్ తక్షణావసరాలు పొత్తులు కాదనీ, పరిశ్రమలూ ఉద్యోగా లన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి ప్రభుత్వం కేవలం పొత్తులు, రాజకీయ సమీకరణాలపైనే దృష్టి పెడుతోందని విమర్శించారు. అయితే రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే.. క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు. తమ పార్టీకి ఇతర పార్టీలతో ఎటువంటి పొత్తూ ఉండదని కుండబద్దలు కొట్టిన ప్రశాంత్ కిశోర్.. జనసురాజ్ అలయెన్స్ బీహార్ ప్రజలతో మాత్రమేనన్నారు. స్వార్థ రాజకీయాల కోసం సిద్ధాంతాలను పక్కనబెట్టి కొలువుదీరే సంకీర్ణ ప్రభుత్వాల వల్లు రాష్ట్రానికి ఇసుమంతైనా ప్రయోజనం లేదన్నారు. జన సురాజ్ పార్టీ లక్ష్యం అధికారం కాదనీ, సుపరిపాలన, పారదర్శకత, సమగ్ర అభివృద్ధి మాత్రమేనని క్లియర్ కట్ గా చెప్పారు. అధకారం కంటే ప్రజాసంక్షేమం, అభివృద్ధే జనసురాజ్ పార్టీకి ముఖ్యమన్నారు. Prashant Kishor, Jan Suraaj Party, Bihar Jobs and Industrialization, Bihar Politics, Bankipur Bypoll Results

Publish Date: Aug 5, 2026 12:58PM
విజయ్ సర్కార్ తొలి బడ్జెట్.. సర్వత్రా ఆసక్తి.!
విజయ్ సర్కార్ తొలి బడ్జెట్.. సర్వత్రా ఆసక్తి.!

తమిళనాడులో అధికారంలోకి వచ్చిన తమిళగ వెట్రి కజగం ప్రభుత్వం బుధవారం తన తొలి వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, అభివృద్ధి శాఖల మంత్రి మేరీ విల్సన్ బుధవారం ( ఆగస్టు5) సభలో ప్రవేశపెట్టనున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత సమర్పిస్తున్న తొలి బడ్జెట్ కావడంతో.. ప్రభుత్వ ప్రాధాన్యతలు, కొత్త పథకాలు, పాలనా సంస్కరణలపై సర్వత్రా తీవ్ర ఆసక్తి నెలకొంది. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం భారీ నిధులు వెచ్చించాల్సిన నూతన సంక్షేమ పథకాల ప్రకటనల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వచ్చింది. ఇప్పటివరకు అధికారికంగా అమలు చేస్తున్న తైమామన్ తంగ మోదిరం' పథకం తప్ప, ఇతర పెద్ద పథకాల ప్రకటనలేవీ వెలువడలేదు. ఈ తొలి బడ్జెట్‌లో సామాన్య ప్రజలను ఆకట్టుకునేలా కొన్ని కొత్త పథకాలతో పాటు, సేవా రంగాన్ని బలోపేతం చేసే కీలక పాలనా సంస్కరణలను ప్రతిపాదించే అవకాశం ఉందని సమాచారం. ప్రజలపై అదనపు పన్నుల భారం వేయకుండా ఆదాయ మార్గాలను పెంపొందించుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అనవసర వ్యయాలను తగ్గించుకుంటూ, ఆదాయ సేకరణను మెరుగుపరచడం ద్వారా ఆర్థిక లోటును పూడ్చాలని భావిస్తోంది. ప్రజా సేవలను మరింత వేగవంతం చేయడం, పారదర్శకతను పెంచడం ద్వారా పాలనా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. శాసనసభలో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం పూర్తయిన వెంటనే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాబోయే రోజుల్లో శాసనసభ నిర్వహణ, బడ్జెట్‌పై చర్చలకు కేటాయించే వ్యవధి, సంబంధిత షెడ్యూల్‌ ఖరారు చేయనున్నారు. మొత్తానికి, టీవీకే ప్రభుత్వం తన తొలి వార్షిక బడ్జెట్ ద్వారా ఎలాంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తుందన్నది తమిళనాటే కాకుండా, దేశం మొత్తం ఆసక్తిగా చూస్తున్నది. TVK Budget 2026, Tamil Nadu First Budget, Mary Wilson TVK, Thaimaman Thanga Mothiram Scheme, Tamil Nadu

Publish Date: Aug 5, 2026 10:28AM
బాంకీపూర్ ఫలితంతో బీజేపీ ఖతమేనా..?
బాంకీపూర్ ఫలితంతో బీజేపీ ఖతమేనా..?

దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన ఈ ఎన్నికల సరళిని పరిశీలిస్తే, సుదీర్ఘకాలంగా స్థిరపడిన రాజకీయ సమీకరణాలు ఓటర్ల ఆలోచనా విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా బీహార్‌లోని పాట్నా పరిధిలోని బ్యాంకీపూర్ నియోజకవర్గంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోని ‘జన్ సురాజ్’ పార్టీ సాధించిన చారిత్రాత్మక విజయం జాతీయ స్థాయిలో తీవ్ర రాజకీయ చర్చకు తెరలేపింది. ఈ అంశంపై టోన్‌ న్యూస్‌లో ఆసక్తికర విశ్లేషణ జరిగింది. బీహార్‌లోని ఈ నియోజకవర్గం దాదాపు మూడు దశాబ్దాలుగా (1995 నుండి) భారతీయ జనతా పార్టీకి చెక్కుచెదరని కోటగా ఉంటూ వచ్చింది. అధికారంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండటం, పార్టీ జాతీయ స్థాయి నేతలకు అత్యంత ప్రాతినిధ్యం ఉన్న స్థానం కావడం వంటి అనేక సానుకూలాంశాలు ఉన్నప్పటికీ బిజెపి ఇక్కడ భారీ తేడాతో ఓటమి పాలైంది. ప్రశాంత్ కిషోర్ దాదాపు 19,000 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించడమే కాకుండా, ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీని మూడో స్థానానికి నెట్టివేయడం గమనార్హం. మరోవైపు గుజరాత్‌లో బిజెపి విజయం సాధించినప్పటికీ, గతంలో ఉన్న లక్ష మెజారిటీ ఈసారి కేవలం 30,000కు పడిపోవడం గమనార్హం. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ తన మెజారిటీని రెట్టింపు చేసుకుంది. ఈ పరిణామాలు అధికార పక్షంలో క్షేత్రస్థాయి అసంతృప్తి పెరుగుతోందనడానికి స్పష్టమైన నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ ఫలితాల వెనుక వ్యూహాత్మక మార్పులు సామాజిక సమీకరణాలు కీలక పాత్ర పోషించాయి: బ్యాంకీపూర్ నియోజకవర్గంలో మూడో వంతు ఓటర్లు 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువకులే. ఇటీవల దేశంలో చోటుచేసుకున్న విద్యార్థి, ఉద్యోగ, యువజన ఉద్యమాలు సామాజిక అంశాలపై యువతలో వ్యక్తమవుతున్న నిరసన ఈ ఓటింగ్ సరళిపై నేరుగా ప్రభావం చూపింది. ప్రశాంత్ కిషోర్ పాదయాత్రలు, ప్రజా సమస్యలపై నేరుగా మాట్లాడటం, సాంప్రదాయ కుల-మత రాజకీయాలకు అతీతంగా విద్యా-ఉపాధి అంశాలను ముందుకు తీసుకురావడం పట్టణ ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంది. కేవలం బిజెపి వైఫల్యాలే కాకుండా, ప్రతిపక్షంలో ఉన్న బిహార్ సాంప్రదాయ పార్టీలు కూడా ప్రజల్లో నమ్మకాన్ని కలిగించలేకపోయాయి. దీనిని జన్ సురాజ్ పార్టీ ఒక అవకాశంగా మలుచుకోగలిగింది. ఈ ఉప ఎన్నికల ఫలితాలు భవిష్యత్ జాతీయ రాష్ట్ర రాజకీయాలపై బహుముఖ ప్రభావాన్ని చూపనున్నాయి. రాబోయే రోజుల్లో ప్రాంతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ శక్తులు రూపుదిద్దుకోవడానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది. సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉన్న పార్టీలకు ప్రజల్లో పెరుగుతున్న 'యాంటీ-ఇంబంబెన్సీ'ని సకాలంలో గుర్తించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గుజరాత్, బీహార్ ఫలితాలు హెచ్చరిస్తున్నాయి. అంతేకాకుండా, కేవలం సాంప్రదాయ కుల సమీకరణాలు, భావోద్వేగ నినాదాలు మాత్రమే కాకుండా ఉపాధి, విద్య, పాలనా పారదర్శకత ప్రాతిపదికగా ఓటర్లు, ప్రత్యేకించి యువత తీర్పు ఇస్తున్నారని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. రాబోయే సాధారణ శాసనసభ ఎన్నికల్లో యువత ఓటింగ్ సరళినే జయాపజయాలను శాసించే ప్రధాన శక్తిగా మారనుందనడంలో సందేహం లేదు. ఇలాంటి అంశాలపై పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి. Bankipur election results, Prashant Kishor, Bihar politics, Gujarat bypoll result, BJP setback Bihar Gujarat

Publish Date: Aug 4, 2026 10:07PM
సీమలో తెలుగుదేశం కూటమి భేష్.. మరి వైసీపీయో?
సీమలో తెలుగుదేశం కూటమి భేష్.. మరి వైసీపీయో?

ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి, సంక్షేమాలను జోడుద్దులుగా సమానంగా అమలు చేస్తూ ప్రజాదరణ పెంచుకుంటోంది. అదే సమయంలో రాష్ట్రంలో పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తున్న వైసీపీ పరిస్థితి మాత్రం ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా ఉంది. వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది. కేవలం రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకు పరిమితం కాకుండా, కాకుండా, అభివృద్ధి కేంద్రీకృత పాలిటిక్స్ తో ప్రజలకు చేరువ కావడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. రాయలసీమ ప్రాంతంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీకి పెట్టని కోట లాంటి రాయలసీమలో ప్రస్తుతం ప్రగతి వెలుగులు తెలుగుదేశం పార్టీకి కొండంత అండగా మారుతున్నాయి. తిరుపతి జిల్లాలో శ్రీ సిటీని విస్తరించడం, అనంతపురం జిల్లాలో తయారీ రంగ పరిశ్రమలను ప్రోత్సహించడం, కడప మరియు కర్నూలు జిల్లాలలో మౌలిక వసతులను అభివృద్ధి చేయడం ద్వారా సీమను ప్రగతి బాటలో పరుగులు పెట్టిస్తోంది చంద్రబాబు సర్కార్. ఈ ప్రాంతంలో నూతన పరిశ్రమల ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఇది సీమలో తెలుగుదేశం కూటమి పట్ల ప్రజా బాహుల్యంలో సానుకూలతను పెంచుతోంది. అదే సమయంలో.. వైసీపీ ఆదరణ రోజు రోజుకూ తగ్గుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాయలసీమలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి, ఆ తర్వాత వైసీపీకి తిరుగులేని పట్టు ఉండేది. తెలుగుదేశం పార్టీకి అక్కడక్కడా కొన్ని నియోజకవర్గాల్లో పట్టు ఉన్నప్పటికీ, మొత్తంగా సీమలో వైసీపీదే అధ్యప్యం అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి. అయితే తెలుగుదేశం కూటమి 2024 ఎన్నికలలో ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టినప్పటి నుంచీ వ్యూహాత్మకంగా ఈ ప్రాంతంలో పట్టు సాధించడమే లక్ష్యంగా పావులు కదిపింది. ఎన్నికల ఫలితాలు వెలువడి అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ తెలుగుదేశం కూటమి రాజకీయాలు కాకుండా అభివృద్ధిని మెయిన్ అజెండాగా తీసుకుని ముందుకు సాగింది. రాజకీయంగా దీర్ఘకాలిక ప్రయోజనాలు లక్ష్యంగా ముందుకు సాగడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొంటున్న పరిస్థితి. AP Coalition Government, Rayalaseema Development Strategy, Chandrababu Naidu Political Strategy, Telugu One

Publish Date: Aug 4, 2026 5:43PM
సచివాలయంలో టీ-ఫైబర్‌పై మంత్రి శ్రీధర్‌బాబు కీలక సమీక్ష
సచివాలయంలో టీ-ఫైబర్‌పై మంత్రి శ్రీధర్‌బాబు కీలక సమీక్ష

తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్‌ ద్వారానే ఇంటర్నెట్‌ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్‌ 1 నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేట్‌ ఆపరేటర్ల ఇంటర్నెట్‌ సేవలను వినియోగించకుండా, పూర్తిగా టీ-ఫైబర్‌ నెట్‌వర్క్‌ ద్వారా ఇంటర్నెట్‌ అందేలా చర్యలు చేపట్టాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో టీ-ఫైబర్‌ సేవలపై మంత్రి శ్రీధర్‌బాబు కీలక సమీక్ష నిర్వహించారు. సీఎస్‌ సంజయ్‌ జాజు, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్‌ దురిశెట్టి, టీ-ఫైబర్‌ ఎండీ వేణు ప్రసాద్‌ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ టీ-ఫైబర్‌ నెట్‌వర్క్‌తో అనుసంధానించే ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. సెప్టెంబర్‌ 1 తర్వాత ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్నెట్‌ సేవల కోసం ప్రైవేట్‌ ఆపరేటర్లకు ఎలాంటి బిల్లులు చెల్లించవద్దని అధికారులను శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. అన్ని కార్యాలయాలకు అంతరాయం లేకుండా టీ-ఫైబర్‌ కనెక్టివిటీ అందేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలకు సేవలందిస్తున్న ‘టీ-స్వాన్‌’ (T-SWAN) నెట్‌వర్క్‌ను నెల రోజుల్లోగా టీ-ఫైబర్‌కు బదిలీ చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ విభాగాల డిజిటల్‌ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ మార్పిడి ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్‌ సిటీ ప్రాజెక్టుకు కూడా పూర్తిస్థాయిలో టీ-ఫైబర్‌ ఇంటర్నెట్‌ సేవలు అందేలా అవసరమైన మౌలిక వసతులను సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధికి అనుగుణంగా అత్యుత్తమ డిజిటల్‌ కనెక్టివిటీ అందుబాటులో ఉండేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇంటింటికి ఇంటర్నెట్‌’ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని శ్రీధర్‌బాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికీ నాణ్యమైన, అందుబాటులో ఉండే ఇంటర్నెట్‌ సేవలను చేరువ చేయడమే లక్ష్యంగా పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. Minister Sridhar Babu key review on T-Fiber, T-SWAN, Minister Sridhar , T-Fiber Connectivity, CS Sanjay

Publish Date: Aug 4, 2026 4:33PM
బీజేపీకి పీడకలగా మారిన  బంకీపూర్, దతియా ఓటములు.!
బీజేపీకి పీడకలగా మారిన బంకీపూర్, దతియా ఓటములు.!

బీహార్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో రెండు నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలతాలు బీజేపీకి పీడ కలనే మిగిల్చాయి. బీజేపీకి కంచుకోటలు, అత్యంత సురక్షిత స్థానాలుగా గుర్తింపు పొందిన రెండు స్థానాలలోనూ కూడా ఉప ఎన్నికలో బీజేపీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి. బీహార్‌లోని బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జన సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ దాదాపు 20 వేల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ప్రశాంత్ కిషోర్‌కు 64,151 ఓట్లు రాగా, సిన్హా 44,827 ఓట్లు సాధించారు. ఇక మధ్యప్రదేశ్‌లోని దతియా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఘనశ్యామ్ సింగ్, బీజేపీ అభ్యర్థి అశుతోష్ తివారీపై ఆరు వేల ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. తివారీకి 60,741 ఓట్లు రాగా, సింగ్‌కు 66,757 ఓట్లు వచ్చాయి. ఈ రెండు ఫలితాలూ కూడా బీజేపీ ప్రజాదరణ కోల్పోతోందన్న సంకేతాలను బలంగా ఇచ్చాయి. ముందుగా బంకీపూర్ విషయాన్ని తీసుకుంటే.. ఈ నియోజకవర్గం.. కమలం పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్సొంత నియోజకవర్గం.అంతే కాదు బీజేపీకి అత్యంత సురక్షితమైన సీట్లలో ఒకటి. 1995 నుంచి బీజేపీ ఈ సీటు గెలుచుకుంటూనే వస్తోంది. అటువంటి స్థానంలో బీజేపీ ఓటమి.. మోడీ పాలనపై ప్రజావ్యతిరేకతకు బలమైన సందేశంగా నిస్సందేహంగా చెప్పవచ్చంటున్నారు పరిశీలకులు. ఇలా ఎందుకు చెప్పొచ్చంటూ.. బంకీపూర్ లో కానీ, దతియా నియోజకవర్గంలో కానీ జరిగినది ఉప ఎన్నిక. సాధారణంగా ఉప ఎన్నికలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల పార్టీలు సునాయాసంగా గెలిచేస్తాయి. బీహార్, మధ్య ప్రదేశ్ లో బీజేపీయే అధికారంలో ఉంది. హస్తినలో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన, పోరాటం వల్ల మోడీ ప్రతిష్టకు కలిగిన నష్టం ప్రభావం కూడా బంకీపూర్, దతియా ఉప ఎన్నికలలో బీజేపీ ఓటమికి కారణమైందని చెప్పొచ్చు. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ ల ఆందోళన, నిరసనల సమయంలో ప్రధాని మోదీపై బహిరంగ విమర్శలు బ్రాండ్ ను మసకబార్చాయి. అలాగే.. బంకిపూర్, దతియా ఫలితాలు నిరుద్యోగం, విద్య, విద్యార్థులపై పోలీసుల చర్యలపై ప్రజలో వెల్లువెత్తిన ఆగ్రహజ్వాలలకు దర్పణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. Bankipur and Datia defeats nightmare to BJP, Modi, Pride, Diminish

Publish Date: Aug 4, 2026 4:28PM
మోడీకి డిగ్రీ సర్టిఫికెట్ వర్సెస్.. అభిజీత్ దీప్కే స్కాలర్ షిప్ పేపర్స్.!
మోడీకి డిగ్రీ సర్టిఫికెట్ వర్సెస్.. అభిజీత్ దీప్కే స్కాలర్ షిప్ పేపర్స్.!

కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే నీట్ పరీక్షాపత్రాల లీకేజీ, విద్యావ్యవస్థలోని అక్రమాలపై దేశవ్యాప్త ఉద్యమానికి నాయకత్వం వహించి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కారణమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ యువ నాయకుడి విదేశీ విద్యానిధులపై బీజేపీ, దాని మద్దతు దారులు ప్రశ్నలు కురిపిస్తూ, విమర్శలు గుప్పిస్తున్నారు. అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల వేదికగా అభిజీత్ దిప్కేను పాకిస్తానీ ఏజెంట్ అని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేయాలనే డిమాండ్లు కూడా వెలువడ్డాయి. కాగా తనపై వస్తున్న ఆరోపణలు, విచారణ డిమాండ్లపై అభిజీత్ దిప్కే స్పందించారు. ఈ విషయంలో ఆయన నేరుగా ప్రధాని నరేంద్ర మోదీకి సవాల్ విసిరారు. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో షేర్ చేసిన వీడియో ద్వారా అభిజీత్ దీప్కే.. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు బోస్టన్ లాంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో చదువుకుంటే ఈ ప్రభుత్వానికి అంత కడుపుమంట ఎందుకని నిలదీశారు. తన విద్యార్హతలూ, ఆర్థిక లావాదేవీలలో ఎటువంటి దాపరికంలేనన్న అభిజీత్ దిప్కే.. తాను పొందిన స్కాలర్‌షిప్ పత్రాలు, విద్యారుణం మంజూరు లేఖలను బహిరంగంగా ప్రజల ముందు ఉంచడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ తన డిగ్రీ సర్టిఫికేట్‌ను దేశ ప్రజలకు చూపిస్తారా? అంటూ సవాల్ చేశారు. ఈ వివాదంలో అభిజీత్ దిప్కే తన విద్యాభ్యాసం, దానికి అయిన ఖర్చులకు సంబంధించిన గణాంకాలను వెల్లడించారు. బోస్టన్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కమ్యూనికేషన్ నుండి మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ పబ్లిక్ రిలేషన్స్ పూర్తి చేసిన ఆయన, జూన్ నెలలో భారత్‌కు తిరిగి వచ్చారు. తన చదువు కోసం బోస్టన్ విశ్వవిద్యాలయం ప్రతీ సెమిస్టర్‌కు 12,వేల 500 డాలర్ల చొప్పున మొత్తం 3 సెమిస్టర్లకు 37 వేల500 డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ. 31 లక్షలకు పైగా) డీన్స్ స్కాలర్‌షిప్ మంజూరు చేసిందని దీప్కే వివరించారు. ఇక మిగిలిన విద్యా వ్యయం కోసం బ్యాంకు నుండి ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నానని, ఆ అప్పును తాను ఇప్పటికీ వాయిదాల పద్ధతిలో తీరుస్తున్నానని వెల్లడించారు.తప అర్హత, ప్రతిభ ఆధారంగానే ఈ స్కాలర్‌షిప్ లభించిందన్న ఆయన ఈ విషయంలో కావాలంటే దర్యాప్తు చేసుకోవచ్చన్నారు. ఈ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిపై వెంటనే ఈడీ (ఈడీ), సీబీఐవంటి దర్యాప్తు సంస్థలను ప్రయోగించడం పరిపాటిగా మారిందన్న అభిజీత్ దిప్కే.. ప్రధాని నరేంద్ర మోదీ తన ఇంటికి ఈడీని పంపినా తనకు అభ్యంతరం లేదనీ, దర్యాప్తు కోసం వచ్చే అధికారుల చేతికి మోడీ.. తన డిగ్రీ సర్టిఫికేట్ కాపీని ఇచ్చి పంపాన్నారు. అప్పుడే నేను నా లోన్ పేపర్లు, స్కాలర్‌షిప్ లెటర్లు, డిగ్రీ కాపీలను అధికారులకు అందిస్తానని చెప్పారు. Abhijeet Dipke, Narendra Modi Degree, Cockroach Janta Party, Boston University Scholarship, CJP Youth Movement, Education Loan Row

Publish Date: Aug 4, 2026 4:01PM
ఉదయనిథి స్టాలిన్ అరెస్టు.. ఎందుకంటే?
ఉదయనిథి స్టాలిన్ అరెస్టు.. ఎందుకంటే?

తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయ నిథి స్టాలిన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి విజయ్, ప్రముఖ నటి త్రిషను ఉద్దేశించి ఉదయనిధి స్టాలిన్ సోమవారం (ఆగస్టు 3) చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు వెలువడిన కేవలం 24 గంటల వ్యవధిలోనే చెన్నై పోలీసులు ఉదయనిథి స్టాలిన్ ను అదుపులోనికి తీసుకున్నారు. అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి ఉదయనిధి స్టాలిన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, మంగళవారం (ఆగస్టు 4)ఉదయం ఉదయనిథి స్టాలిన్ ను ఆయన నివాసంలోనే అరెస్టు చేసి తీసుకెళ్లారు. నివాసం నుంచి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అసలు వివాదం ఏమిటంటే.. సోమవారం (ఆగస్టు 3) తంజావూరులో కావేరి జలాల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉదయనిథి స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్ పాలనపై, ఆయన రాజకీయ విధానాలపై విమర్శలు చేశారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో కొందరు డీఎంకే కార్యకర్తలు.. విజయ్ వ్యక్తిగత విషయాలు, సినిమాలను ప్రస్తావిస్తూ.. త్రిష అంటూ నినాదాలు చేశారు. వాటికి స్పందనగా.. ఉదయ నిథి స్టాలిన్ నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని సర్ది చెప్పుకోవడానికి ప్రయత్నించినా.. ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా వేదికగా ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యల వీడి యోలు తెగ వైరల్ అవ్వడంతో వివాదం మరింత ముదిరింది. ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో తమిళనాడు హోంశాఖ, చెన్నై పోలీసులు చట్టపరమైన చర్యలకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా శ్రీకారం చుట్టారు. కాగా ఉదయనిథి స్టాలిన్ అరెస్టును డీఎంకే తీవ్రంగా ఖండించింది. డీఎంకే లీగల్ సెల్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. డీఎంకే తరఫు న్యాయవాదులు మద్రాస్ హైకోర్టులో బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. అదలా ఉంటే.. డీఎంకే నేతలు ఉదయనిథి స్టాలిన్ అరెస్టును రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణిస్తుంటే.. ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎవరూ చట్టానికి అతీతులు కారని అంటోంది. రాజకీయ పరిశీలకులైతే.. ప్రజా క్షేత్రంలో ఉండే నాయకులు బాధ్యతా యుతంగా మాట్లాడాలనీ, అనుచిత వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు ఇలానే ఉంటాయనీ అంటున్నారు. Udayanithi Stalin arrested, Tamilnadu, Former, Deputy CM, Untoward, Comments, Actress, Trisha

Publish Date: Aug 4, 2026 12:56PM
నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. ఉదయనిథి స్టాలిన్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు.!
నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. ఉదయనిథి స్టాలిన్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు.!

తమిళనాట రాజకీయ విమర్శలకు త్రిష మరో సారి కేంద్ర బిందువుగా మారారు. త్రిషపై డీఎంకే నాయకుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అధికార టీవీకే, బీజేపీ, ఇతర రాజకీయ పార్టీలూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి. తంజావూరులో కావేరి జలాల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉదయనిథి స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్ పాలనపై, ఆయన రాజకీయ విధానాలపై విమర్శలు చేశారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో కొందరు డీఎంకే కార్యకర్తలు.. విజయ్ వ్యక్తిగత విషయాలు, సినిమాలను ప్రస్తావిస్తూ.. త్రిష అంటూ నినాదాలు చేశారు. వాటికి స్పందనగా.. ఉదయ నిథి స్టాలిన్ నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా వేదికగా ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యల వీడియోలు వైరల్ అవ్వడంతో వివాదం మరింత ముదిరింది. ఉదయనిధి స్టాలిన్ ద్వంద్వార్థ వ్యాఖ్యలపై టీవీకే, బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. టీవీకే ఎమ్మెల్యే రేవంత్ చరణ్.. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు. ప్రజాజీవితం ఉన్న నాయకుడు మహిళల పట్ల ఇలాంటి చౌకబారు భాషను ఉపయోగించడం డీఎంకే దిగజారుతున్న రాజకీయ సంస్కృతికి అద్దం పడుతోందని విమర్శించారు. అలాగే.. బీజేపీ కూడా ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలను ఖండించింది. మహిళలను కించపరిచేలా మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. ఈ వివాదాన్ని టీవీకే అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. కేవలం రాజకీయ విమర్శలతో సరిపెట్టకుండా చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది. ఉదయనిధి స్టాలిన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ కు అఫీషియల్ గా లేఖ రాసింది. సొసైటీలో ఎంతో గుర్తింపు పొందిన ఒక ప్రముఖ నటిని, మహిళను బహిరంగ వేదికపై అగౌరవపరిచినందుకు గాను ఆయనపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. సమాజానికి, బాధితురాలికి ఆయన బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని, ఆయనపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్‌ను కోరింది. Udhayanidhi Stalin, Actress Trisha, DMK TVK controversy, Cauvery water protest, Tamil Nadu news, NCW complaint

Publish Date: Aug 4, 2026 11:06AM
బంకీపూర్ ఉప ఎన్నికలో పీకే విజయం.!
బంకీపూర్ ఉప ఎన్నికలో పీకే విజయం.!

బీహార్ లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజక వర్గ ఉపఎన్నికలో జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విజయం సాధించారు. మూడు దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న బంకీపూర్ నియోజకవర్గం నుంచి పీకే సాధించిన ఈ విజయం బీహార్ రాజకీయాలలో సంచలనంగా మారింది. పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు. ఇటీవల నితిన్ నబీన్ ను బీజేపీ రాజ్యసభకు పంపడంతో బంకీపూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ అనూహ్యంగా విజయం సాధించి బీజేపీకి గట్టి షాక్ ఇచ్చారు. Prashantkumar win bamkipur by poll, election, Straregist, Shock, BJP

Publish Date: Aug 3, 2026 7:04PM
rss-imgRss Feeds