ఈటలకు పోటీగా రాజేందర్... తెరాస కొత్త ఎత్తు

కోటి విద్యలు కూటి కొరకే..అలాగే,ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు వేసే వేషాలన్నీ కూడా ఓట్ల కోసమే. హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీలో ఉన్న పార్టీలన్నీ, ఇలాంటి ఎన్నో వేషాలు వేశాయి. వేస్తూనే ఉన్నాయి. ప్రత్యర్ధులను దెబ్బతీసేందుకు ప్రతి పార్టీకూడా ఎప్పటి కప్పుడు కొత్త ఎత్తులు వేస్తూనే ఉంటుంది. పాత ఎత్తులను కొత్తగా ప్రయోగిస్తూనే ఉంటాయి  ఇది అనేక సందర్భాలలో రుజువైన నిజం.  పేరులో నేముంది? అని అనుకుంటాం కానీ, ఎన్నికల సమయంలో పేరులోనే పెన్నిది ఉందని రుజువైన సందర్భాలున్నాయి. ఒక అభుర్ది పేరును పోలిన పేరున్న మరో పది మంది చేత నామినేషన్ వేయించి, ఓటర్లు గందరగోళానికి గురిచేసి, ఓట్లను దరి మళ్లించే ఎత్తుగడలకు పార్టీలు పాల్పడడం కొత్త విషయం కాదు.  ప్రత్యర్ధి పార్టీల అభ్యర్ధిని దెబ్బ కొట్టేందుకు, ఆ అభ్యర్ధి పేరును పోలిన ఇండిపెండెంట్  అభ్యర్ధులను బరిలో దించడం, ప్రత్యర్ధి పార్టీ ఎన్నికల గుర్తును పోలిన గుర్తున్న చిన్న చితకా పార్టీలకు డబ్బులిచ్చి ఆ పార్టీ అభ్యర్ధులను బరిలో దించడం వంటి ట్రిక్కులు అన్ని పార్టీలు ప్లే చేస్తూనే ఉంటాయి.   ఇక ప్రస్తుతానికి వస్తే, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఓటమి నుంచి తప్పించుకునేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదులుకొని అధికార తెరాస ఇప్పుడు అదే ఎత్తును తెరపైకి తెచ్చింది. తెరాస ప్రధాన ప్రత్యర్దిగా భావిస్తున్న బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేరును పోలి ఉన్న వారితో నామినేషన్ వేయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. రాజేందర్ పేరున్న వారి కోసం వేట మొదలు పెట్టింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక బాధ్యతను తమ భుజస్కందాలపైకి ఎత్తుకున్న, మంత్రి హరీష్ రావు, బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ పేరును పోలిన వారిని వెతికి పట్టుకోమని పార్టీ క్యాడర్’ను ఆదేశించినట్లు తెలుస్తోంది.  ఇందులో భాగంగా హుజురాబాద్‎కు చెందిన ఇల్లందుల రాజేందర్ (ఇ. రాజేందర్) అనే వ్యక్తిని తెరాస నాయకులు గుర్తించారు. నామినేషన్ వేయాలని టీఆర్ఎస్ నాయకులు ఆయన్ని సంప్రదించారు. కాదంటే వత్తిడి తెచ్చారని  ఆయన బంధువులు ఆరోపించారు. ఈటల రాజేందర్ పేరుతో పోలి ఉన్నందుకే ఈయనతో నామినేషన్ వేయించేందుకు ప్రయత్నిస్తున్నారని బంధువులు అంటున్నారు. నామినేషన్ వేస్తే.. ఇంటి పన్ను చెల్లిస్తాం, వ్యాక్సిన్ వేయిస్తామని చెప్పినట్లు వారు తెలిపారు. గోడౌన్‎లో హమాలీ పనిచేసే ఇల్లందుల రాజేందర్ చేత నామినేషన్ వేయించాలనుకోవడం వెనక కుట్ర ఉందని వారుంటున్నారు. ఈ విషయంపై ఈసీ స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఇల్లందుల రాజేందర్ బంధువులు విజ్ఞప్తి చేశారు. అయితే, ఇలాంటి విషయాలలో ఈసీ కూడా చేయగలిగింది ఏమీ ఉండదు అనేది ఒకటైతే, ఈసారి ఎన్నికల్లో హుజూరాబాద్ ఓటర్లు ఇప్పటికే  ఒక నిర్ణయానికి వచ్చారని, ఇలాంటి చిల్లర వేషాలు చెల్లవని స్థానికులు అంటున్నారు.

ధూళిపాళ్ల అరెస్టుకు మ‌ళ్లీ స్కెచ్‌!.. డ్ర‌గ్స్‌కు సాక్షాలు ఇవ్వాలంటూ నోటీసులు..

ఎన్నెన్నో అంటుంటారు. అన్నిటికీ సాక్షాలు ఉంటాయా ఏంటి? రాజ‌కీయాలు అన్న‌ప్పుడు ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు కామ‌న్‌. అలాంటి విమ‌ర్శ‌లు చేసిన‌ప్పుడే.. మీడియా అటెన్ష‌న్ పెరిగి అస‌లు నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి కూడా. నిప్పులేనిదే పొగ‌రాదు. అదిగో పొగ అంటే.. నిప్పు ఏది..చూపించండి అంటే ఎలా? ఏపీని డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం కుదిపేస్తోంది. ముంద్రా పోర్టులో ప‌ట్టుబ‌డిన వేల కోట్ల డ్ర‌గ్స్‌.. విజ‌య‌వాడ అడ్ర‌స్‌తో బుక్ అయ్యాయి. ఆశి ట్రేడింగ్ కంపెనీ సైతం బెజ‌వాడ‌లోనే రిజిష్ట‌ర్ కావ‌డం.. సుధాక‌ర్‌కు సైతం వైసీపీ నేత‌ల‌తో లింకులుండ‌టం.. కాకినాడ పోర్టు డ్ర‌గ్స్ దందాకు కేంద్రంగా మారింద‌నే ప్ర‌చారం.. ఎమ్మెల్యే ద్వారంపూడి క‌నుస‌న్న‌ల్లో డ్ర‌గ్స్ వ్యాపారం జ‌రుగుతోంద‌నే అనుమానం.. ఇలా డ్ర‌గ్స్ ఎపిసోడ్ ఏపీ పాలిటిక్స్‌ను షేక్ చేస్తోంది. ప‌లువురు టీడీపీ నేత‌లు వైసీపీకి అంటిని ఈ డ్ర‌గ్స్ మ‌ర‌క‌పై బాగానే నిల‌దీస్తున్నారు. అయితే, ప్ర‌తిప‌క్షం నోరు మూయించేందుకు ప్ర‌భుత్వం పోలీసుల‌ను రంగంలోకి దింపింద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. తాజాగా, కాకినాడ పోలీసులు టీడీపీ సీనియ‌ర్ నేత ధూళిపాళ్ల న‌రేంద్ర‌కు నోటీసులు ఇవ్వ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.  డ్రగ్స్ వ్యవహారంలో ధూళిపాళ్ల నరేంద్ర వైసీపీ నేతలపై చేసిన‌ ఆరోపణలకు సాక్ష్యాలివ్వాలంటూ కాకినాడ పోలీసులు ధూళిపాళ్ల నరేంద్ర ఇంటికి వెళ్లారు. కాకినాడ నుంచి గుంటూరు జిల్లా చింతలపూడిలో ఉన్న ధూళిపాళ్ల‌ ఇంటికి పోలీసులు ప్రత్యేకంగా నోటీసులు ఇవ్వడానికే వెళ్లారంటే ఖాకీలపై ఎంత ఒత్తిడి ఉందో తెలుస్తోంది. గ‌తంలో సంగం డెయిరీ కేసులో ధూళిపాళ్ల‌ను అరెస్టు చేసి.. జైల్లో పెట్టి క‌క్ష్య తీర్చుకుంది జ‌గ‌న్ స‌ర్కారు. అది స‌రిపోలేద‌నుకున్నారో.. లేక‌, కేసుల‌కు భ‌య‌ప‌డ‌కుండా మ‌ళ్లీ మ‌ళ్లీ నోరెత్తుతున్నార‌ని క‌న్నెర్ర జేస్తున్నారో.. కార‌ణం తెలీదు కానీ, డ్ర‌గ్స్ ఎపిసోడ్‌లో ప‌లువురు టీడీపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నా.. ప్ర‌త్యేకించి ధూళిపాళ్ల‌కే పోలీసులు నోటీసులు ఇవ్వ‌డం వెనుక భ‌య‌పెట్టే వ్యూహం ఉందనే అనుమానం వ్య‌క్తం అవుతోంది.  ధూళిపాళ్ల‌ చేసిన విమర్శలు, ఆరోపణలకు సాక్ష్యాలివ్వకపోతే .. గతంలో అరెస్ట్ చేసినట్లుగా తెల్లవారు జామునే వచ్చి అరెస్ట్ చేస్తారా? అంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. డ్రగ్స్ కేసులో చంద్రబాబు, లోకేష్‌పై సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఆరోపణలు చేశారు. రాజ‌కీయాల్లో ఇలాంటివ‌న్నీ సాధార‌ణం. మ‌రి, ఇలాంటి వాటిని పట్టుకుని పోలీసులు నేరుగా ఎందుకు రంగంలోకి దిగుతున్నారో? పాల‌కుల ఒత్తిడే కార‌ణ‌మ‌ని ఇట్టే తెలిసిపోతోంది. పోలీసులు అధికార‌ పార్టీ వారి కోస‌మే పని చేస్తున్నారంటూ విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అందుకే, సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ ప‌దే ప‌దే పోలీసులు ప్ర‌భుత్వంతో అంట‌కాగ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.    

రోడ్ల‌నూ వ‌ద‌ల‌ని జ‌గ‌న్ స‌ర్కారు.. అప్పు కోసం అప్ప‌నంగా...

ఈ తరం పిల్లలకు తెలియక పోవచ్చును. కానీ, ప్రస్తుతం 50 ప్లస్’లో ఉన్న  అందరికీ, ఈ ఆట/పాట తెలిసే ఉంటుంది. నిజానికి, ఇది ఆట కాదు, మనుషుల మనస్తత్వం ఎలా ఉంటుందో చక్కగా చెప్పే చేతివేళ్ల పాఠం. మన చేతి ఐదు వేళ్ళలో మొదటి బొటనవేలు, తిందాం ..తిందాం అంటుంది ... దాని పక్కన ఉన్న చూపుడు వేలు, ఏమి పెట్టి తిందాం అంటుంది .. మధ్య వేలు అప్పు చేసి తిందాం అంటుంది ..ఆ పక్కన ఉన్న ఉంగరం వేలు అప్పెట్ల తీరుద్దాం అంటుంది..చిట్ట చివరి చిటికిన వేలు ..ఇంచక్కా ఎగేసి పోదాం అంటుంది. ఇప్పుడీ కథ ఎందుకంటే, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, ఇదిగో ఇలాంటి అప్పు సూత్రాన్నే పాటిస్తోంది కాబ‌ట్టి.  ఏ పూటకు ఆ ఆపూట ఎక్కడో అక్కడ పుట్టిన కాడికి అప్పుచేసి, కాలక్షేపం చేస్తోంది . అందుకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దినదిన ప్రవర్థ‌మానంగా దిగజారి పోతోంది. ఇప్పటికే.. కూచమ్మ కూడా బెడితే మాచమ్మ మాయం చేసింది అన్నట్లుగా, గత తెలుగుదేశం ప్రభుత్వం, అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు కూడ బెట్టిన సంపదను, జగన్ రెడ్డి ప్రభుత్వం శక్తి వంచన లేకుండా, వీలైతే అమ్మడం, కాదంటే కుదువ పెట్టడం ద్వారా ఖర్చు ఖాతాలో చేర్చేసింది. గుళ్ళు గోపురాలు దేవుని భూములు, హుండీలు ఏదీ వదలకుండా అందిన కాడికి పప్పు బెల్లాల పందారం పద్దులో చేర్చింది. ఇక ఇప్పుడు, సర్కార్ వారి చూపు,  రోడ్లు భవనాల శాఖ భూముల మీద పడింది. సర్కార్ చూపు పడిన తర్వాత ఇక చెప్పేదేముంది, రాజు తలచుకుంటే దెబ్బలకు, సర్కారు వారు తలచుకుంటే అప్పులకు కొదవేముంటుంది. కాకపొతే, చెప్పిన అబద్ధం చెప్పకుండా, అందమైన అబద్ధాలు చెప్పగలిగితే చాలు, ఇట్టే పనై పోతుంది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వానికి, ఆదేమంత పెద్ద విషయం కాదని రెండున్నరేళ్ళ చరిత్ర చెపుతోంది. సో.. రోడ్లు భవనాల శాఖపై  కన్నుపడిందే తడవుగా, రాష్ట్రంలో రహదారులను అందంగా తీర్చి దిద్దుదామనే, ఓ అందమైన అబద్ధాన్ని అతికించి, ప్రభుత్వం రూ.2000 కోట్ల రుణాన్ని తీసుకురమ్మని ఆంధ్రప్రదేశ్ రోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్’డీసీ)ని పురమాయించింది.ఇందుకోసంగా, రోడ్లు భవనాల శాఖ వద్ద ఉన్న, అస్తుల్లోంచి రూ.3,786 కోట్ల విలువచేసే ఆస్తులను, ఏపీఆర్’డీసీకి  బదలాఇస్తూ జగన్ రెడ్డి ప్రభుత్వం జీవో 46 జారీ చేసింది. అంటే, రూ.3,786  విలువచేసే రోడ్లు భవనాల శాఖ ఆస్తులను కుదువ పెట్టి రూ.2000కోట్లు రుణం సంపాదించే బాధ్యతను, ఏపీ-ఆర్డీసీకి ప్రభుత్వం అప్పగించింది. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమంటే, ఇదే కారణం (రాష్ట్ర రోడ్లను అందంగా తీర్చి దిద్దిడం) చూపి ప్రభుత్వం ఇప్పటికీ అప్పులు చేసినట్లు అధికార వర్గాల సమాచరం.  అదలా ఉంటే, ఏపీ రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ ఇప్పటికే ఆరు వేల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయింది. అది తీర్చే మార్గం లేక, దిక్కులు చూస్తోంది. ఈ నేపధ్యంలోనే ఏపీ - ఆర్డీసీ అదనపు ఆదాయం సమకూర్చుకునేందుకు, రాష్ట్ర మంత్రి వర్గం ఇటీవల, ఏపీ- ఆర్డీసీకి రాష్ట్ర రహదారులపై టోల్ వసూలుకు అధికారం ఇచ్చింది. అలాగే, ఖాళీ స్థలాలు లీజుకు ఇవ్వడం, రోడ్ సైడ్ హోర్దింగులను అనుమతించడం వంటివి అదనపు ఆదాయ మార్గాలుగా గుర్తించారు. ఆ ప్రయత్నాలు అలా జరుగుతుండగానే, ఇప్పుడు ఈ కొత్త అప్పు పుట్టుకొచ్చింది. ఇలా.. ఒక్కొక్క సంస్థ ఆస్తులు అప్పుల పద్దులో చేరిపొతే చివరకు.. వడ్డీల‌తో కలిపి తడిసి మోపెడయ్యే అప్పులు తీర్చేది ఎలా అంటే.. ఎగేసి పోదాం అన్న చిటికిన వేలి సమాధానమే సర్కారు వారి సమాధానంగా ఉంది. 

రూ.100 కోట్ల బ్లాక్ మ‌నీ!.. హెటిరో ఐటీ రైడ్స్‌లో సంచ‌ల‌నం.. జ‌గ‌న్‌తో లింకేంటి?

ఒక‌టి రెండు కాదు.. రూ.100,00,00,000. అక్ష‌రాల వంద కోట్లు. హెటిరో డ్ర‌గ్స్ సంస్థ‌ల కార్యాల‌యాల్లో జ‌రిగిన ఐటీ రైడ్స్‌లో దొరికిన న‌గ‌దు. రెండు రోజుల పాటు హెటిరో డ్ర‌గ్స్ ఆఫీసుల్లో ఇన్‌క‌మ్ ట్యాక్స్ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వ‌హించారు. సీఈవో, డైరెక్టర్లు, ముఖ్య ఉద్యోగుల ఇళ్లలో త‌నిఖీలు జ‌రిపారు. హైద‌రాబాద్‌లోని కార్పొరేట్‌ కార్యాలయంతో పాటు ఏపీలోని నక్కలపల్లిలో ఐటీ ఆప‌రేష‌న్ కొన‌సాగింది.  హైద‌రాబాద్, విశాఖ‌లోని ప‌లు కార్యాల‌యాల్లో రూ.100 కోట్లకుపైగా నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఇంత పెద్ద మొత్తంలో న‌గ‌దు ల‌భించ‌డంపై అధికారులే ఆశ్చ‌ర్య‌పోతుర్నారు. ఏకంగా 100 కోట్ల‌ న‌గ‌దు ఎక్క‌డి నుంచి ఎలా తీసుకొచ్చార‌నే దానిపై ఆరా తీస్తున్నారు.  నగదుపై ఉన్న బ్యాంకు సీల్‌ను పరిశీలించడంతో పాటు ఆ మొత్తాన్ని ఎప్పుడు డ్రా చేశారు? ఏ బ్యాంకు నుంచి డ్రా చేశారు? తదితర వివరాలపై ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఐటీ సోదాల్లో అనేక కీల‌క డాక్యుమెంట్లు, హార్డ్‌డిస్క్‌లు సీజ్ చేశారు. ట్యాక్స్‌ చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు.  విదేశాల నుంచి హెటిరో సంస్థ‌ పెద్ద మొత్తంలో ముడి సరుకు దిగుమతి చేసుకుంటోంద‌ని.. అయితే, ఆ ఎగుమతి, దిగుమతిలో భారీగా వ్యత్యాసాలున్నట్లు తెలుస్తోంది. విలువ తక్కువ చేసి ఇన్‌వాయిస్‌లు సృష్టించినట్లు తేల్చారు. మ‌రో రెండు రోజుల పాటు ఐటీ రైడ్స్ కొన‌సాగుతాయ‌ని స‌మాచారం. సీఎం జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడైన పార్థ‌సార‌ధిరెడ్డికి చెందిన హెటిరో డ్ర‌గ్స్ సంస్థ‌ల్లో.. లెక్క‌ల్లో చూపించ‌ని 100 కోట్ల న‌గ‌దు ల‌భించ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇంత పెద్ద స్థాయిలో బ్లాక్‌మ‌నీని.. అది కూడా క‌రెన్సీ నోట్ల రూపంలో దాయ‌డం మామూలు విష‌య‌మేమీ కాదు. డిజిట‌ల్ ఇండియా స్పూర్తికే విఘాతం అంటున్నారు. మ‌రోవైపు, ఆ 100 కోట్లు హెటిరో య‌జ‌మాని పార్థ‌సార‌ధిరెడ్డివేనా? ఆయ‌న జ‌గ‌న్‌, విజ‌య‌సాయిరెడ్డిల‌కు చాలా చాలా క్లోజ్ కాబ‌ట్టి.. ఆ బ్లాక్‌మ‌నీతో వారికేమైనా సంబంధముందా? అనే అనుమాన‌మూ వ‌స్తోందంటున్నారు.   

జ‌గ‌న్‌, విజ‌య‌సాయి, స‌జ్జ‌ల‌.. ముగ్గురితో ర‌ఘురామ చెడుగుడు..

ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. ఈ పేరు వింటేనే వైసీపీలో వ‌ణుకు. పార్టీ అధినేత‌కే చుక్కలు చూపిస్తున్న ఘ‌నుడు. సీఎం జ‌గ‌న్ సాక్షుల‌ను ప్ర‌భావితం చేస్తున్నార‌ని.. వెంట‌నే ఆయ‌న బెయిల్ ర‌ద్దు చేసి జైలుకు త‌ర‌లించాల‌ని కోర్టులో పిటిష‌న్ వేసి.. విచార‌ణ‌తో హ‌డావుడి చేశారు. సీబీఐ కోర్టు ఆ కేసు కొట్టేసినా.. ఇప్పుడు మ‌ళ్లీ హైకోర్టును ఆశ్ర‌యించి వ‌ద‌ల బొమ్మాళీ అంటున్నారు. ఏ1 జ‌గ‌న్‌తో పాటు ఏ2 విజ‌యసాయిరెడ్డినీ వ‌ద‌ల‌డం లేదు ర‌ఘురామ‌. ముందు జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు కోసం మాత్ర‌మే కేసు వేశారు. ఆ త‌ర్వాత విజ‌య‌సాయిరెడ్డి బెయిల్ కూడా ర‌ద్దు చేయాలంటూ కోర్టును ఆశ్ర‌యించారు. ఇలా వైసీపీలో నెంబ‌ర్ 1, నెంబ‌ర్ 2ల ప‌ని ప‌డుతున్న ర‌ఘురామ‌.. తాజాగా నెంబ‌ర్ 3ని సైతం టార్గెట్ చేశారు. ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న సజ్జల తన విధులు మీరుతున్నారని, వైసీపీ ప్రభుత్వం తరపున పత్రికా సమావేశాలు. ప్రకటనలు చేయకుండా నిలువరించాలని, రాష్ట్ర సివిల్ సర్వీస్ నిబంధనల మేరకు చర్చలు తీసుకునేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని హైకోర్టులో రఘురామ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం తాజాగా విచారణకు వచ్చింది. సజ్జల నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోతో పాటు రాష్ట్ర సివిల్ సర్వీస్ నిబంధనలను న్యాయస్థానం ముందుంచాలని రఘురామ తరపు న్యాయవాదిని ఆదేశించింది ధ‌ర్మాస‌నం.  ప్రభుత్వ జీతం, ఇతర ప్రయోజనాలు పొందుతున్న స‌జ్జ‌ల‌ సివిల్ సర్వీస్ నిబంధనలకు వ్యతిరేకంగా వైసీపీ ప్రతినిధిగా వ్యవహరిస్తూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. సుమారు 5 ల‌క్ష‌ల జీతం పొందుతూ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల వైసీపీ పార్టీకి చెందిన నాయకుడని,  ఆయన వైసీపీ ప్రధాన కార్యదర్శిగా మూడు జిల్లాలకు ఇంఛార్జ్ గానూ పని చేస్తున్నారని రఘురమ పిటిషన్‌లో పేర్కొన్నారు. సలహాదారులకు ప్రత్యేక నియామవళి లేదని.. వారికి సివిల్ సర్వీసెస్ నిబంధనలే వర్తిస్తాయని తెలిపారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ప్ర‌భుత్వ స‌ల‌హాదారు సజ్జలపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని రఘురామ కోర్టును కోరారు.  జ‌గ‌న్‌, విజ‌యసాయిరెడ్డి బెయిల్ ర‌ద్దు పిటిష‌న్ త‌ర‌హాలోనే స‌జ్జ‌ల‌పైనా బ‌ల‌మైన వాద‌న‌లు వినిపిస్తున్నారు ఎంపీ ర‌ఘురామ‌. అయితే, జ‌గ‌న్‌, సాయిరెడ్డి కేసుల్లో సీబీఐ త‌ట‌స్థంగా ఉండ‌టం వారికి అనుకూలించ‌గా.. స‌జ్జ‌ల కేసులో మాత్రం నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న జ‌రుగుతున్న‌ట్టే భావించే అవ‌కాశం ఉంద‌నేది న్యాయ నిపుణుల మాట‌. 

దళిత బంధు.. దగా బంధు అవుతుందా? యూటర్న్ సీఎం కేసీఆర్‌..

సూది కోసమని సోదికెళితే.. పాత రంకులు బయట పడ్డాయని సామెత. అలాగే, తీగలాగితే డొంకంతా కదిలిందని మరో సామెత. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట మార్చడంలో, తిమ్మిని బమ్మిని చేయడంలో మహా దిట్ట. కానీ, అదేమిటో ఆయన అసెంబ్లీ సాక్షిగా, దళితులకు మూడెకరాల భూమి విషయంలో ఒక్కసారిగా పిల్లి మొగ్గ వేశారు. ప్రభుత్వం సగర్వంగా ప్రకటించి, కొద్దోగొప్పో అమలు చేసిన పథకం విషయంలోనే ముఖ్యమంత్రి అసలు అలాంటి వాగ్దానమే చేయలేదని పిల్లి మొగ్గ వేయడం విపక్షాల నుంచే కాదు, స్వపక్షం నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాదు, ఇద్దామన్నా రాష్ట్రంలో ఇవ్వటానికి భూములెక్కడున్నయ్’ అంటూ ముఖ్యమంత్రి ముక్తాయింపు ఇవ్వడమూ విమర్శలకు అవకాశం కలిపిస్తోంది.  ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఏడేళ్ళలో చేసిన వాగ్దానాలు, వాగ్దాన భంగాలు, ముఖ్యంగా దళితులకు ప్రత్యేకించి చేసిన వాగ్దానాలు, వాగ్దాన భంగాలు ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి. దళిత ముఖ్యమంత్రి మొదలు ఏ ఒక్క వాగ్దానం సక్రమంగా అమలు కాని విషయాన్ని ముఖ్యమంత్రి ప్రకటన మరో మారు గుర్తుకు తెచ్చింది. కొద్దిరోజుల క్రితం మంత్రి కేటీఆర్ ప్రభుత్వ ఉద్యోగాలకు పంగనామాలు పెట్టారు. ఉద్యమ సమయంలో ఊదర కొట్టిన, ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిన ఇంటికో ఉద్యోగం హామీని, కేటీఆర్ అటక ఎక్కించారు. అది అయ్యేది కాదు, పొయ్యేది కాదని లెక్కలు చెప్పారు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి మూడు ఎకరాలకు మంగళం పాడేశారు. ఇలా ఒక్కొక్క వాగ్దానం వదిలించుకుంటూ పోవడంతో, ప్రభుత్వం విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా మారుతోందని అంటున్నారు.   ఈ నేపధ్యంలో, దళిత బంధు గతేంటని చర్చ జరుగుతోంది. నిజానికి, దళిత బంధు విషయంలో ప్రభుత్వం ఇప్పటికే అనేక పిల్లి మొగ్గలు వేసింది. ఇక్కడని అక్కడ, అక్కడని  ఇక్కడ ప్రారంభోత్సవాలతో మొదలైన కంఫూజన్, గందరగోళం, ఎంపిక ప్రక్రియ, విధి విధానాలు, ఖాతాల్లో సోమ్ములేసి, ఎద్దు మూతికి చిక్కం కట్టినట్లు, అకౌంట్స్ ఫీజ్’ చేయడం వరకు అనేక అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. చివరకు, లబ్దిదారులు కూడా ‘నిజంగా వస్తదంటవా’ అన్న సందేహాలను వ్యక్త పరుస్తున్నారు. మరోవంక, హుజూరాబాద్‌కేనా, రాష్ట్రం మొత్తంలో అమలవుతుందా? అనే అనుమానాలు ఉన్నాయి.  నిజానికి, ముఖ్యమంత్రి కేసీఆర్, అసెంబ్లీలో ఆడిన అసత్యంతో.. తెరాస ఎమ్మెల్యేలు, నాయకులలో కూడా  దళిత బంధు దగా బంధు అవుతుందా అన్న చర్చ మొదలైంది. నిజానికి, అన్ని వర్గాల, అన్ని కులాల నుంచి, కుల బంధు కోసం వస్తున్న డిమాండ్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి మూడెకరాల విషయంలో యూ టర్న్ తీసుకోవడంతో మరింతగా ఉలిక్కి పడుతున్నారు. మరోవంక రాష్ట్రమంతా దళిత వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. ఈ చర్చలో భాగంగా తెరాస ప్రభుత్వ పాలనలో దళితులకు జరుగతున్నఅన్యాయాలపై దళితసంఘాలు, దళిత నాయకులు అధికార పార్టీ నాయకులను నిలదీస్తున్నారు. కేబినెట్ లో దళిత మంత్రులకు సముచిత స్థానం కల్పించకుండా మోసం చేస్తున్నారని మండిపడుతున్నాయి. సీఎం ఆఫీస్ లో దళిత అధికారులకు సముచిత స్థానం కల్పించకుండా ఇన్నాళ్లు దూరం పెట్టిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాయి. అంతేకాదు కేసీఆర్ ప్రభుత్వంలో దళిత అధికారులు ఎదుర్కొంటున్న ఘోర అవమానాలను గుర్తు చేసుకుంటున్నాయి. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కడతామని చెప్పి ఎన్నేళ్లవుతుంది? పంజాగుట్ట అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడ పెట్టారు? నేరెళ్ల ఘటనకు కారకులు ఎవరు? ఎందుకు స్పందించరు? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది దళితులకు ఉద్యోగాలు ఇచ్చారు? ఇలా అనేక ప్రశ్నలను లేవనెత్తుతూ కేసీఆర్ పై అసహనం వ్యక్తం చేస్తున్నాయి దళిత సంఘాలు. దళిత బంధు సంగతి కూడా ఇంతేనా? అని అనుమానిస్తున్నాయి. అసెంబ్లీలో మూడెకరాలపై సీఎం స్పీచ్ చూసిన దగ్గర నుంచి దళితుల్లో భయం మరింత ఎక్కువైందని చెబుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో అనవసరపు విషయాలను ప్రస్తావించి ఉన్న సమస్యలు చాలవన్నట్లు కొత్త సమస్యలను తలకు చుట్టుకుంటున్నారని అంటున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలపై ఈ ప్రభావం త‌ప్ప‌కుండా ఉంటుందని అంటున్నారు.  

TOP NEWS @ 7pm

1. తెలంగాణ‌లో భారీ పెట్టుబ‌డి పెట్ట‌నున్న‌ట్టు ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల సంస్థ ట్రిటాన్ ఈవీ ప్ర‌క‌టించింది. త్వ‌ర‌లో రాష్ట్రంలో రూ.2100 కోట్ల‌తో విద్యుత్ వాహ‌నాల యూనిట్ ప్రారంభిస్తామ‌ని తెలిపింది. ఈ మేర‌కు తెలంగాణ స‌ర్కారుతో ట్రిటాన్ ప్ర‌తినిధులు అవ‌గాహ‌న ఒప్పందం చేసుకున్నారు. జ‌హీరాబాద్ పారిశ్రామిక ప్రాంతంలో ప‌రిశ్ర‌మ ఏర్పాటుకు ప‌రిశీలిస్తున్నారు.  2. ఆసరా కాదు.. పచ్చి దగా అని, కోటి మంది డ్వాక్రా మహిళలకు జగన్‌ రెడ్డి టోకరా పెడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షులు అచ్చెన్నాయుడు మండిప‌డ్డారు. 98 లక్షల మంది డ్వాక్రా మహిళలుంటే ఆసరా 78 లక్షల మందికా? సెప్టెంబరులో నొక్కాల్సిన ఆసరా మీట.. ఎందుకు ఆలస్యమైంది? అంటూ అచ్చెన్న ప్రశ్నించారు. మొత్తం సొమ్మును నాలుగు విడతల్లో నాలుగేళ్ల పాటు ఇస్తానన్నావ్‌... ఇప్పుడు ఒక విడతను పది విడతలు చేశావని ఆగ్రహం వ్యక్తం చేశారు.  3. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మనకు తెలిసి పవన్ కల్యాణ్ కు ముగ్గురు భార్యలు, తెలియకుండా ఎంతమంది ఉన్నారో.. అన్నారు. హీరోయిన్ పూనమ్ కౌర్‌ను ప్రేమించి, ప్రెగ్నెసి వస్తే అబార్షన్ చేయించి, రూ.5కోట్లు ఇచ్చి సెటిల్ చేశాడని ఆరోపించాడు. పవన్ కల్యాణ్ రెండు రోజులు రాష్ట్రంలో తిరిగితే రాష్ట్రమంతా అల్లకల్లోలమేనన్నారు. జన సైనికులను అసాంఘిక శక్తులుగా మారుస్తున్నాడన్నారు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌.  4. బతుకమ్మలపై నుంచి తన కారు వెళ్లిన ఘటనపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్పందించారు. తాను ఆ సమయంలో కారులో లేనని, నడుచుకుంటూనే వెళ్లానని చెప్పారు. కొందరు కావాలనే తనపై బురదజల్లుతున్నారని ఆరోపించారు. మహిళల మనోభావాలు దెబ్బతింటే క్షమాపణలు కోరతామని చల్లా ధర్మారెడ్డి ప్రకటించారు.  5. ప్రజలు దోమల బారినపడి, డెంగ్యూ మలేరియా, ఇతర విషజ్వరాలతో అల్లాడుతున్నా ప్రభుత్వంలో చలనంలేదని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు అన్నారు. దోమల దెబ్బ ఎలా ఉంటుందో తెలియాలంటే, మంత్రులు ప్రజలతో కలిసి రోడ్లపై తిరగాలని అన్నారు. దోమలు రక్తాన్ని పీల్చిబతికితే, మంత్రులు ప్రజలను అన్నిరకాలా పీల్చిపిప్పిచేసి బతికేస్తున్నారన్నారు. రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జన్సీ విధించాలని డిమాండ్ చేశారు.  6. ప్రభుత్వం రుణ యజ్ఞం పేరిట అప్పులు తెస్తోందని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. కొత్త కోణాల్లో అప్పు ఎలా తీసుకురావాలని తమ ప్రభుత్వం ఆలోచిస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వం ఏపీ స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కింద రూ. 3వేల కోట్లు రుణం తెచ్చిందని, ఇప్పుడు తమ ప్రభుత్వం కొత్తగా జీవో ఇచ్చి 574 ఎకరాలు, ఆర్‌అండ్‌బీ ఆస్తులపై అప్పులు తేవాలని చూస్తోందన్నారు. 7. ఏపీలో ఉద్యోగులకు జీతాలు సరైన సమయంలో ఇవ్వడంలేదని, పెన్షన్లు అందని పరిస్థితి నెలకుందని ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఏ ఏరియర్స్, పీఆర్సీ పెండింగ్‌లో ఉన్నాయని, ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేకపోతే ఉద్య‌మ‌ కార్యాచరణ మొదలు పెడతామని ఏపీఎన్జీవో ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చ‌రించారు.  8. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సంస్థ ద్వారా రూ. 25 వేల కోట్లు రుణం తీసుకురావడంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిగింది. రుణం తీసుకునే అంశాలు, బ్యాంకుతో కుదుర్చుకున్న ఒప్పందంలో గవర్నర్ సార్వభౌమాధికారాన్ని అధిగమించటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 361కి ఇది పూర్తి వ్యతిరేకమన్నారు. అలా చేసేందుకు తమకు అధికారం ఉందని ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత దవే వాదించారు. గవర్నర్‌కు నోటీసులు జారీ చేసే ఆచారాన్ని ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నిస్తూ.. ఈనెల 21వ తేదీ లోపు కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది న్యాయ‌స్థానం. 9. దేశంలో ఆసుపత్రుల సామర్థ్యం మరింత పెరిగిందని ప్రధాని మోదీ అన్నారు. పీఎం కేర్స్ నిధి క్రింద కొత్తగా 4,000 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. దేశంలోని అన్ని జిల్లాల్లోనూ పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటవుతాయని ప్ర‌క‌టించారు.  10. తిరుమ‌ల శ్రీవేంక‌టేశ్వ‌ర‌స్వామి సాల‌కట్ల బ్ర‌హ్మోత్స‌వాలు ధ్వ‌జారోహ‌ణంతో వైభ‌వంగా ఆరంభ‌మ‌య్యాయి.  ముక్కోటి దేవ‌త‌ల‌ను ఆహ్వానిస్తూ అర్చ‌కులు ధ్వ‌జ‌ప‌టం ఎగ‌ర‌వేశారు. రాత్రికి పెద్ద‌శేష వాహ‌న సేవ జ‌ర‌గ‌నుంది. ఈ నెల 15 వ‌ర‌కు శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయి.   

పోల‌వ‌రంపై కేంద్రం పిత‌లాట‌కం.. జ‌గ‌న్ స‌ర్కారు చేత‌గానిత‌నం!

ఓ శాఖ నిధులు ఇవ్వ‌మంటోంది. మ‌రో శాఖ పైసా విదిల్చేది లేదు పొమ్మంటోంది. రెండూ కేంద్ర ప్ర‌భుత్వ శాఖ‌లే. ఒక‌రు క‌నిక‌రించ‌మంటే, మ‌రొక‌రు క‌నిక‌రం లేకుండా ముఖం మీదే  చెప్పేస్తున్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టుకు అద‌న‌పు నిధుల విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం డబుల్ గేమ్ ఆడుతోంది. విష‌యం తెలిసి మ‌న ఆర్థిక మంత్రి బుగ్గ‌న.. ఢిల్లీ వెళ్లి నిర్మ‌ల‌మ్మ‌ను బ‌తిమిలాడుకున్నా ప్ర‌యోజనం లేక‌పోయింది. ఆయ‌నేమైనా చంద్ర‌బాబా.. పోల‌వ‌రంకు నిధుల వ‌ర‌ద పారించ‌డానికి?  సొమ్ములు తెచ్చుకునే సామ‌ర్థ్యం లేక‌.. జ‌గ‌న్ స‌ర్కారు చేత‌గానిత‌నంతో.. ఏపీ జీవ‌నాడైన పోల‌వ‌రం ప్రాణం తీసేస్తున్నారు నేటి పాల‌కులు.  పోలవరం ప్రాజెక్టు నిధులపై కేంద్రం తేల్చేసింది. దేశంలోని మిగతా ప్రాజెక్టులకు మాదిరిగా పోలవరం ప్రాజెక్టుకు కూడా అదనంగా నిధులు మంజూరు చేయాలని కేంద్ర జల శక్తి శాఖ కోరింది. మరో రూ. 4వేల కోట్లను అదనంగా మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు, కేంద్ర జలశక్తి శాఖ లేఖ రాసింది. ఆ లేఖను పరిశీలించి నిధులు ఇచ్చేది లేదని ఆర్థిక శాఖ మొండికేసింది. 2017లో కేంద్ర క్యాబినెట్ తీర్మానం మేరకు రూ. 20 వేల కోట్లకు మించి ఒక్క రూపాయి కూడా అద‌నంగా ఇచ్చేది లేదని ఆర్థిక శాఖ స్పష్టం చేస్తూ.. ఆ మేరకు జలశక్తి శాఖకు లేక రాసింది.  విష‌యం తెలిసి.. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ని.. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కలిశారు. పోలవరం నిధులకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ లేఖపై మంతనాలు జరిపారు. అయితే, కేబినెట్ తీర్మానానికి కట్టుబడి ఉంటామని.. అద‌నంగా నిధులిచ్చేది లేద‌ని.. నిర్మ‌ల‌.. బుగ్గ‌న ముఖం మీదే చెప్పేశారు. పోల‌వ‌రానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చారు క‌దా అని బుగ్గ‌న చెబితే.. జాతీయ హోదా ఇచ్చిన మాట గుర్తుంద‌ని, ఇత‌ర రాష్ట్రాల్లోనూ జాతీయ హోదా క‌లిగిన ప్రాజెక్టులు ఉన్నాయ‌ని, వాటిని మించిన ప్రాధాన్యం పోల‌వ‌రానికి ఇవ్వ‌లేమ‌ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌ల అన్నార‌ని తెలుస్తోంది. క‌నీసం స‌వరించిన అంచ‌నాలనైనా ఆమోదించండి అని ప్రాధాయ‌ప‌డినా.. పోల‌వ‌రం ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్ల‌కు మించి.. న‌యా పైసా కూడా ఇచ్చేది లేద‌ని నిర్మ‌లా సీతారామ‌న్ బుగ్గ‌న‌కు ఒకింత గ‌ట్టిగానే చెప్పార‌ని అంటున్నారు. దీంతో.. జ‌గ‌మొండి కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఏమీ చేయ‌లేక‌.. ఏపీ ప్ర‌భుత్వం ఇప్పుడు ఏమి సేతురా లింగా.. అంటూ అయోమ‌యంలో ప‌డింది.  పోల‌వరం విష‌యంలో కేంద్రం మొద‌టి నుంచీ డ‌బుల్ గేమ్ ఆడుతోంది. ప్రాజెక్టు నిర్మాణానికి అవ‌స‌ర‌మ‌య్యే నిధుల‌న్నీ తామే ఇస్తామ‌ని వాగ్దానం చేసిన కేంద్రం ఆ త‌ర్వాత మాట మార్చేసింది. ప్రాజెక్టు తొలి నాళ్ల అంచ‌నాల మేర‌కే నిధులు విడుద‌ల చేస్తామ‌ని, స‌వ‌రించిన అంచనాల మేర‌కు రూ.56 వేల కోట్ల మేర నిధుల‌ను విడుద‌ల చేసే ప్ర‌సక్తే లేద‌ని కూడా తేల్చేసింది. అప్ప‌ట్లో ఆ నిధుల కోసం చంద్ర‌బాబు గ‌ట్టిగా పోరాడారు. జ‌గ‌న్ వ‌చ్చాక ఆ పోరాట‌మే లేకుండాపోయింది. అందుకే, పోల‌వ‌రం ప్రాణం పోతోంది.   

రాంకీ, హెటిరో.. జ‌గ‌న్ బెస్టీల‌పై ఐటీ రైడ్స్.. సంగ‌తేంటి?

రెండు రోజులుగా హెటిరో ఫార్మాపై ఐటీ దాడులు క‌ల‌క‌లం రేపుతున్నాయి. హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఐటీ సోదాలు జ‌రుగుతున్నాయి. కొవిడ్ 19 సమయంలో కంపెనీ జరిపిన లావాదేవీలు, ఐటీ రిటర్న్స్ పత్రాలను అధికారులు పరిశీలించారు. హెటిరో డైరెక్టర్లు, భాగస్వాముల ఇళ్లలోనూ త‌నిఖీలు చేస్తున్నారు. ఇవి రోటీన్ త‌నిఖీలేనా? లేక‌....? బండి పార్థ‌సార‌ధిరెడ్డి అంటే చాలామందికి తెలీక‌పోవ‌చ్చు కానీ హెటిరో పార్థ‌సార‌ధిరెడ్డి అంటే అంద‌రికీ సుప‌రిచిత‌మే. రిట్రా వైర‌ల్ డ్ర‌గ్స్ ఉత్ప‌త్తిలో ప్ర‌పంచంలోనే అగ్ర‌గామి సంస్థ హెటిరో. ఆ హెటిరో ఫార్మా అధినేత పార్థ‌సార‌ధిరెడ్డి.. సీఎం జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడు. జ‌గ‌న్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో నిందితుడు కూడా. వైఎస్సార్ హ‌యాంలో.. విజ‌య‌సాయిరెడ్డి డైరెక్ష‌న్‌లో.. జ‌గ‌న్‌-హెటిరో మ‌ధ్య‌ క్విడ్‌ప్రోకో న‌డిచింద‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. తెలుగుస్టేట్స్‌లో రెండో అత్యంత సంప‌న్నుడు, దేశంలోకే 58వ స్థానంలో ఉన్న ధ‌నిక పారిశ్రామిక‌వేత్త అయిన పార్థ‌సార‌థిరెడ్డికి చెందిన హెటిరో కంపెనీపై ఐటీ రైడ్స్‌ను మామూలు విష‌యంగా చూడ‌లేమంటున్నారు. ఇటీవలే విశాఖ ప‌రిధిలోని హెటిరో ప్లాంట్‌కు 83 ఎకరాల‌ను క్ర‌మ‌బద్ధీక‌రించింది జ‌గ‌న్ స‌ర్కారు. టీటీడీ పాల‌క మండ‌లి స‌భ్యుడిగానూ ఉన్నారు హెటిరో పార్థ‌సార‌ధిరెడ్డి. ఆ విధంగా కేసులున్నా.. ఇప్ప‌టికీ జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితంగా మెదులుతున్నారు ఈయ‌న‌.  ఈమ‌ధ్య‌నే జ‌గ‌న్‌కు మ‌రో స‌న్నిహితుడైన పారిశ్రామిక‌వేత్త‌, వైసీపీ ఎంపీ కూడా అయిన ఆళ్ల అయోధ్య‌రామిరెడ్డికి చెందిన రాంకీ గ్రూప్ ఆప్ కంపెనీస్‌పైనా ఐటీ దాడులు జ‌రిగాయి. ఇప్పుడు హెటిరోఉ పార్థ‌సార‌ధిరెడ్డి సంస్థ‌ల‌పై ఐటీ రైడ్స్ కొన‌సాగుతున్నాయి. ఇదంతా కాక‌తాళీయ‌మా?  లేక‌, కేంద్రం త‌ర‌ఫున ఏదో వ్యూహాత్మ‌క దాడులా? అనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. జ‌గ‌న్‌కు కేంద్ర ప్ర‌భుత్వ‌ ఆశీస్సులు ఎంత‌గా ఉన్నా.. అవినీతి, అక్ర‌మాలను మాత్రం బీజేపీ స‌ర్కారు అస‌లేమాత్రం ఉపేక్షించ‌ద‌నే పేరుంది. ఆ అరాచ‌కాలు పెరిగిపోవ‌డం వ‌ల్లే.. ఆ తోక‌లు క‌ట్ చేయ‌డానికేనా ఈ ఐటీ రైడ్స్ అనే అనుమానం వ‌స్తోంది.  ఏపీలో ఇసుక మైనింగ్ కాంట్రాక్ట్ మొత్తాన్ని గంప‌గుత్తగా రాంకీ గ్రూపున‌కు క‌ట్ట‌బెట్టింది వైసీపీ స‌ర్కారు. ఆ రాంకీ సంస్థ‌నే ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ఇసుక‌ను ట‌న్నుల‌కు ట‌న్నులు త‌వ్వేసుకుంటోంది. ఇక‌, విశాఖ‌లో హెటిరో ప్లాంట్‌కు భారీగా భూములు అప్ప‌గించింది జ‌గ‌న్ ప్ర‌భుత్వం. ఇలా, గ‌తంలో మాదిరే.. పారిశ్రామికవేత్త‌ల‌కు జ‌గ‌న్‌కు మ‌ధ్య పెద్ద స్థాయిలో మ‌ళ్లీ క్విడ్‌ప్రోకో య‌వ్వారాలు జ‌రుగుతున్నాయా? ఆ మేర‌కు కేంద్రం స‌మాచారం సేక‌రించిందా? అలాంటి చ‌ర్య‌ల‌కు చెక్ పెట్టేందుకే.. ఇలా ఐటీ రైడ్స్‌తో వార్నింగ్ ఇస్తున్నారా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. కార‌ణం ఏదైనా.. హెటిరో సంస్థ‌ల‌పై ఐటీ సోదాలతో ఏపీ పారిశ్రామిక వ‌ర్గాల్లో అల‌జ‌డి మొద‌లైందనే చెప్పాలి. 

వ‌రుణ్‌గాంధీ వ‌రుస ట్వీట్లు.. మేన‌కాగాంధీపై బీజేపీ వేటు..

ఒక‌ప్ప‌టి సైద్ధాంతిక ప‌రమైన బీజేపీ ఎప్పుడో చ‌చ్చిపోయిందంటారు. ఇప్పుడంతా మోదీ-అమిత్‌షాల బీజేపీనే అంటుంటారు. కార్పొరేట్ స్టైల్‌లో పార్టీని న‌డిపిస్తున్నారు ఆ ఇద్ద‌రు. పార్టీ క‌మిటీల‌న్నిటినీ త‌మ అనుచ‌రుల‌తో నింపేశార‌నే ఆరోప‌ణ ఉంది. అధికారాన్ని ఎర‌గా చూపించి, సీఏఏ, రామ‌మందిరం, ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌దిత‌ర చ‌ర్య‌ల‌తో సంఘ్ ప‌రివార్‌ను సంతృప్తి ప‌రుస్తూ బీజేపీని త‌మ గుప్పిట్లో పెట్టుకున్నారు న‌రేంద్ర‌ మోదీ. అందుకే, ఆయ‌న ఆడిందే ఆట‌.. పాడిందే పాట‌. పెద్ద నోట్ల ర‌ద్దు, ర‌ఫెల్ మ‌ర‌క‌లు, క‌రోనా క‌ట్ట‌డిలో వైఫ‌ల్యాలు త‌దిత‌ర ఎన్ని అప‌వాదులు మూట‌గ‌ట్టుకున్నా.. ఇప్ప‌టికీ మోదీనే సుప్రీం లీడ‌ర్‌గా చెలామ‌ని అవుతున్నారు. క్ర‌మ‌క్ర‌మంగా నియంత పోక‌డ‌లు పోతున్నారు. త‌ప్పైనా.. ఒప్పైనా.. పార్టీకి వ్య‌తిరేకంగా నోరు విప్పితే.. ఎంత‌టి నేత‌పైనైనా వేటు వేసేందుకు ఏమాత్రం వెన‌కాడ‌టం లేదు. అద్వానీ, జోషిల క‌థ ఇప్ప‌టికే కాశీకి చేర‌గా.. తాజాగా, పార్టీలో సీనియ‌ర్ మోస్ట్ లీడ‌ర్ మేన‌కాగాంధీపై చ‌ర్య‌లు షురూ అయ్యాయి. ఇంత‌కీ ఆమె చేసిన త‌ప్పేమీ లేదు.. మేన‌క త‌న‌యుడు వ‌రుణ్‌గాంధీ చేస్తున్న వ‌రుస‌ ట్వీట్లే మేన‌కాగాంధీపై వేటుకు కార‌ణమైంది.  కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీని భారతీయ జనతా పార్టీ కేంద్ర కమిటీ నుంచి తొలగించారు. ఆమె కుమారుడు, ఎంపీ వరుణ్ గాంధీ రైతు ఆందోళనపై ట్వీట్లు చేయడంతో మేనకాపై వేటు వేశారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో ఆదివారం జరిగిన ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది చనిపోయారు. ఆ ఘ‌ట‌న‌లో రైతులకు మద్దతుగా వరుణ్ గాంధీ వ‌రుస ట్వీట్లు చేస్తుండ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. ‘‘తన మనసును కలచివేసింది’’ అంటూ మొద‌ట వరుణ్ ట్వీట్ చేశారు. ఆ త‌ర్వాత ప్రమాదానికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. ‘‘వీడియోలో చాలా క్లియర్‌గా కనిపిస్తోంది. రైతులు రక్తం ధారపోశారు. ఆ రక్తానికి బాధ్యత ఎవరిది? రైతులు తీవ్ర ఆగ్రహానికి లోను కాకముందే న్యాయం లభించాలి’’ అని ట్వీట్ చేశారు.  గతంలో కూడా రైతు ఆందోళనపై వరుణ్ ఇలానే ట్వీట్‌ చేశారు. రైతులకు కనీస మద్దతు ధరతో పాటు వారికి కల్పించాల్సిన వసతులపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశారు. కొంత కాలంగా వరుణ్ గాంధీ వ్యవహారశైలిపై ఆగ్రహంగా ఉన్న బీజేపీ అధిష్టానం.. తాజాగా ఆయ‌న‌పై కాకుండా వ‌రుణ్‌గాంధీ త‌ల్లి మేన‌కాగాంధీని బీజేపీ కేంద్ర క‌మిటీ నుంచి తొల‌గించి ప్ర‌తీకార చ‌ర్య‌ల‌కు పాల్ప‌డింద‌ని అంటున్నారు. మ‌రి, బీజేపీలో ఉన్న ఈ గాంధీ కుటుంబం.. నెక్ట్స్ స్టెప్ ఎలా ఉంటుందో చూడాలి...

120 కార్లు సీజ్‌.. ఐటీ రైడ్స్‌తో హ‌ల్‌చ‌ల్‌..

అదేదో సినిమాలో చూపించిన‌ట్టు.. ఐటీ అధికారులు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు. మొత్తం 300 మంది ఆఫీస‌ర్స్‌. ట‌క్కుగిక్కు వేసుకొని.. ట‌ప‌ట‌పా దూసుకొచ్చారు. ఇన్‌క‌మ్‌ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అంటూ ఇంట్లో అందరినీ క‌ట్ట‌డి చేశారు. ఇక త‌మ‌దైన స్టైల్‌లో సెర్చ్ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. అయితే, సినిమాలో మాదిరి వీరేమీ న‌కిలీ ఐటీ అధికారులు కాదు.. నిజ‌మైన ఆఫీస‌ర్సే. తెల్ల‌వారుజామున 5 గంట‌ల నుంచి బెంగ‌ళూరు ఐటీ రైడ్స్‌తో హెరెత్తుతోంది.  ఒక‌టి రెండు కాదు.. 50కి పైగా ప్రాంతాల్లో ఏక‌కాలంలో విస్తృతంగా త‌నిఖీలు చేస్తున్నారు ఐటీ సిబ్బంది. పన్ను ఎగవేత ఆరోపణలు ఉన్న ప‌లువురు ఇళ్లు, కార్యాల‌యాలు, ఫామ్‌హౌజులపై వంద‌లాది మంది అధికారులు రైడ్ చేశారు. ఈ సోదాల్లో ఇప్పటి వరకు 120కి పైగా కార్లను సీజ్‌ చేసినట్టు తెలుస్తోంది.  వ్యాపారవేత్తలు, కాంట్రాక్ట‌ర్లు, ఛార్డెట్‌ అకౌంటెంట్ల నివాసాల్లో ఈ తనిఖీలు జరుపుతున్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప సన్నిహితుడు అమిత్ ఉమేశ్‌ నివాసంలోనూ ఐటీ సోదాలు జ‌రుగుతుండ‌టం క‌ల‌క‌లంగా మారింది. ఉమేశ్‌ నివాసం, కార్యాలయాలు, బంధువులకు చెందిన మొత్తం 6 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్న అధికారులు పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.  ఇక‌, కర్ణాటక ఇరిగేషన్‌ విభాగానికి చెందిన కాంట్రాక్టర్ల నివాసాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. ఇలా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో బీజేపీ స‌న్నిహితుల ఇళ్ల‌లో ఐటీ రైడ్స్ జ‌ర‌గ‌డం రాజ‌కీయంగా ఆస‌క్తిక‌రంగా మారింది. దాడుల వెనుక రీజ‌నేంటని తెగ చ‌ర్చించుకుంటున్నారు క‌న్న‌డ క‌మ‌ల‌నాథులు.

జగనన్న సర్కార్ పిచ్చి పీక్స్.. వైసీపీ వెలుగుల్లో బెజవాడ దుర్గమ్మ గుడి! 

ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వానికి రంగుల పిచ్చి.. ప్రభుత్వానికి సంబంధించిన ఓ కార్యక్రమానికైనా వైసీపీ రంగులు వేయడం పరిపాటిగా మారింది. ప్రభుత్వ కార్యాలయాలకు అవే రంగులు... దీనిపై కోర్టులు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా జగనన్న సర్కార్ తీరు మాత్రం మారడం లేదు. గ్రామ సచివాలయాలు, ప్రభుత్వ స్కూళ్లకు వైసీపీ రంగులను వేయడం తీవ్ర వివాదాస్పమైంది. కోర్టు ఆదేశాలతో తిరిగి తొలగించాల్సి వచ్చింది. జగన్ సర్కార్ తీరుతో ఖజానాలు వందల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. ప్రభుత్వ వాహనాలకు చివరకు చెత్తను తరలించే వాహనాలకు కూడా అవే రంగులు వేశారు. తాజాగా బెజ‌వాడ క‌న‌క‌దుర్గ గుడికి సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది. ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రుల‌ను పుర‌స్క‌రించుకుని ఏపీలోని అన్ని దేవాల‌యాల‌ను ముస్తాబు చేశారు. తిరుమ‌ల‌, శ్రీశైలం ఆల‌యాల‌తో పాటుగా బెజ‌వాడ క‌న‌క‌దుర్గ ఆల‌యానికి విద్యుత్ దీపాలతో అలంకరించారు. అయితే తిరుమ‌ల‌, శ్రీశైలం ఆల‌యాల్లో ఏటా క‌నిపించిన మాదిరే వేడుక‌ల ఏర్పాట్లు క‌నిపించ‌గా.. ఒక్క విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ గుడిలో మాత్రం గ‌తేడాది వేడుక‌ల‌కు తాజాగా ఇప్ప‌టి వేడుక‌ల‌కు మాత్రం తేడా కొట్టొచ్చిన‌ట్టుగా క‌నిపిస్తోంది. ఈ ఏడాది ఏర్పాట్ల‌లో భాగంగా ఆల‌యం చుట్టూ అలంక‌రించిన విద్యుద్దీపాలు అచ్చు గుద్దిన‌ట్లుగా వైసీపీ జెండా రంగుల‌తో కూడిన వెలుగుల‌ను విర‌జిమ్మాయి. ఈ చిత్రాలే ఇప్పుు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిపోయాయి. వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక‌.. ప్ర‌భుత్వ కార్యాలయాల‌తో పాటు క‌నిపించిన ప్ర‌తి దానికీ జ‌గ‌న్ స‌ర్కారు త‌న పార్టీ రంగులు వేస్తూ వస్తోంది. దీనిపై కోర్టులు కూడా తీవ్రంగానే స్పందిస్తున్నాయి. రంగుల విషయంలో హైకోర్టు సీరియస్ కావడంతో ఇక‌పై ఏ ప్ర‌భుత్వ భ‌వ‌నానికి గానీ, వాహ‌నానికి గానీ రంగులు వేయ‌బోమ‌ని, త‌మ త‌ప్పు తెలుసుకున్నామ‌ని తెలిపింది జగన్ రెడ్డి సర్కార్. అయితే క్లీన్ ఏపీ కింద కొనుగోలు చేసిన చెత్త సేక‌ర‌ణ యంత్రాల‌కు వైసీపీ రంగుల‌ను చెరిపేసిన త‌ర్వాత మ‌రోమారు క‌నిపించండంటూ జ‌గ‌న్ స‌ర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు జారీ అయిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే బెజ‌వాడ క‌న‌క‌దుర్గ గుడి చుట్టూ వైసీపీ రంగులు క‌నిపించ‌డం షాకింగ్ గా మారింది. తిరుమ‌ల శ్రీ‌వేంక‌టేశ్వ‌రుడి ఆల‌య‌మే. ఏ ర‌కంగా చూసినా దుర్గ గుడి కంటే తిరుమ‌ల ఆల‌యం పెద్ద‌దే. అయితే దుర్గ గుడి మాదిరిగా తిరుమ‌ల ఆల‌యం చుట్టూ విద్యుద్దీపాలు వెలుగులు విర‌జిమ్మేలా ఏర్పాట్లు చేసినా..అందులో వైసీపీ రంగులు క‌నిపించ‌లేదు.  క‌ర్నూలు జిల్లా శ్రీశైలంలోని భ్ర‌మ‌రాంబ మ‌ల్లికార్జుల ఆల‌యంంలో  రాత్రి విద్యుద్దీపాలు వెలుగులు విర‌జిమ్మినా.. జ‌గ‌న్ పార్టీ జెండా రంగులు మాత్రం క‌నిపించ‌లేదు. ఈ రెండు ఆల‌యాల్లో క‌నిపించ‌ని విధంగా ఒక్క బెజ‌వాడ దుర్గ గుడి వెలుగుల్లో మాత్ర‌మే వైసీపీ రంగులు క‌నిపించ‌డంపై ఇప్పుడు పెద్ద ర‌చ్చే జ‌రుగుతోంది. దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస్‌ సొంత జిల్లా, సొంత నియోజ‌కవ‌ర్గం అయిన కార‌ణంగానే దుర్గ గుడిలో వైసీపీ వెలుగులు క‌నిపించాయా? అన్న దిశ‌గా చర్చలు సాగుతున్నాయి. బెజవాడ గుడిలో వైసీపీ రంగులను పోలిన విద్యుత్ దీపాలు అలంకరించడంపై నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. గుళ్లను కూడా వదలలేదా జగనన్న అంటూ సెటైర్లు వేస్తున్నారు.

దేశానికి నేనే దిక్కు .. మమతా బెనర్జీ హాట్ కామెంట్స్..

“కాంగ్రెస్ పార్టీ పనై పోయింది. బీజేపీ వ్యతిరేక పోరాటంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైంది. అందుకే ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపి,ఆధు నవ భారత నిర్మాణ బాధ్యతను దేశ ప్రజలు తృణమూల్ పై ఉంచారు”, భవానీపూర్ ఉపఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి పదవిని నిలబెట్టుకున్న తృణమూల్ అధినాయకురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన బోల్డ్ స్టేట్మెంట్ ఇది.  అంటే ఈ దేశానికి తానే దిక్కని ఆమె చెప్పకనే చెప్పారు. బీజేపీని ఎదిరుంచి నిలిచే శక్తి, యుక్తి, కుయుక్తి తనకు మాత్రమే ఉన్నాయని, ఆమె, ఒక సంచలన ప్రకటన చేశారు. ఇంతవరకు, రాష్ట్రాల్లో ఎలా ఉన్నా,బీహార్ వంటి రాష్ట్రల్లో కాంగ్రెస్ ప్రాతీయ పార్టీల నాయకత్వంలో పోటీ చేసినా, దేశంలో బీజేపీ వ్యతిరేక కూటమి (యూపీఏ)కి కాంగ్రెస్, కాంగ్రెస్ వ్యతిరేక కూటమి (ఎన్డీఏ)కి బీజేపీనే సారధ్యం వహిస్తున్నాయి. కానీ, ఇప్పుడు విపక్షాల నాయకత్వ పీఠం నుంచి కాంగ్రెస్ పార్టీని తప్పించి తృణమూల్’ను ప్రతిష్టించేందుకు మమత సిద్డమయ్యారు.    నిజానికి, మమత  ఇప్పుడు తమ మనసులోని మాటను బయట పెట్టారు. కానీ, ఆమెలో అలాంటి భావన ఒకటి ఎప్పటినుంచో గూడుకట్టుకుని ఉందని, ఆమె సన్నిహితులు ఎప్పటినుంచో చెపుతూనే ఉన్నారు. ఆమెలో జాతీయ అకాక్షలు ఉన్నాయన్నది రహస్యమేమీకాదు. అది అందరికీ తెలిసిన నిజం. దేశ ప్రధాని కావలానే, ఆశ ఆకాంక్ష ఆమెలో ఎప్పటి నుంచో నిండుగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్  అసెంబ్లీ ఎన్నికల విజయం తర్వాత మే ఢిల్లీ వెళ్లి ఓ వారం రోజులు అక్కడే  ఉండి, 2024 సార్వత్రిక ఎన్నికల నాటికీ బీజేపీ, మోడీ వ్యతిరేక కూటమి ఏర్పాటు  గురించి, ఒక  ప్రయత్నం చేశారు. ఇపుఉడు మళ్ళీ ఆ దిశగా మరో అడుగు వేశారు.  అదేమీ తప్పుకాదు కానీ, ఆమె అంచనాలు ఎంతవరకు నిజం అవుతాయి, అనే విషయంలో మాత్రం ఎవరికుండే అభిప్రాయం వారికుంది. భవానీపూర్ ఉపఎన్నికల్లో గెలిచి, ఈరోజు (గురువారం అక్టోబర్ 7) ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేస్తున్న మమతా బెనర్జీ, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, తృణమూల్ కాంగ్రెస్ అధికార పత్రిక, “జాగో బంగ్లా”లో ‘ఢిల్లీ పిలుస్తోంది’ మకుటంతో ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసంలో ఆమె, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో, త్రుణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించిన నేపధ్యంలో దేశ ప్రజలు  తృణమూల్ వైపు చూస్తున్నారు. దేశ ప్రజలంతా కట్టకట్టుకుని, దేశాన్ని బీజేపీ ఫాసిస్ట్ పాలననుంచి కాపాడే శక్తి సామర్ధ్యాలు ఒక్క తృణమూల్ కాంగ్రెస్’కు మాత్రమే ఉన్నాయనే నమ్మకానికి  వచ్చారనే అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు.  అంతే కాదు  బీజేపీతో బహుముఖ పోరాటం చేసే సత్తా సామర్ధ్యం తమకే ఉన్నాయని కూడా ఆమె చెప్పు కొచ్చారు. ‘అసెంబ్లీ ఎన్నికల ఓటమిని బీజేపీ జీర్ణించుకోలేక పోతోంది.కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోంది. అదలా ఉంటే, తృణమూల్ ముందు ఇప్పుడు మరో సవాలు వచ్చి పడింది. ఢిల్లీ పిలుస్తోంది’ . దేశ ప్రజలు కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధనాల నుంచి, ప్రజావ్యతిరేక రాజకీయాల నుంచి ఉపశమనం కోరుకుంటున్నారు. ఫాసిస్ట్ శక్తులను ఓడించాలని కోరుకుంటున్నారు, ఆ బాధ్యతను తమపై ఉంచారని’’ఆమె తమ వ్యాసంలో చెప్పు కొచ్చారు. అలాగే, దేశ ప్రజలు తృణమూల్ కాంగ్రెస్ ఆలంబనగా నవభారత స్వప్నం కంటున్నారని, ఆమె పేర్కొన్నారు. ఇప్పడు తృణమూల్ బెంగాల్ సరిహద్దులను దాటింది అనేక రాష్ట్రాల నుంచి అనేక మంది ఫోన్లు చేస్తున్నారు. బెంగాల్ ముందుండి (బెంగాల్ అంటే మమత)  దేశాన్ని నడిపించాలని కొరుకుంటున్నారని ఆమె చెప్పుకొచ్చారు. అందుకే బీజేపీ వ్యతిరేక  పార్టీలు అన్నీ ఒకే వేదికపైకి వచ్చి ప్రజల అకాక్షలు నేరవేర్చాలని మమతా బెనర్జీ వ్యాసంలో పేర్కొన్నారు.   ఒక విధంగా ఇది మమతా బెనర్జీ అహంభావానికి నిదర్శనంగా కనిపించవచ్చును కానీ, మమతా బెనర్జీ వెనకుండి ముందుకు నడిపించే ప్రశాంత్ కిశోర్ వ్యూహంలో భాగంగానే ఆమె ఈ ప్రకటన చేశారని,రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.ప్రశాంత్ కిశోర్ ప్రోద్బలంతోనే ఇటీవలనే, గోవా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీని వదిలి తృణమూల్ కాంగ్రెస్’లో చేరారు. అలాగే, అంతకు ముందే, అస్సాంకు చెందిన మహిళా అధ్యక్షురాలు సుమిత్రా దేవ్, కూడా ప్రశాంత్ కిశోర్ చొరవతోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్’లో చేరారు. ఆమెను, మమతా బెనర్జీ రాజ్యసభకు పంపుతున్నారు.ఇలా, ప్రశాంత్ కిశోర్, దేశ రాజకీయ చిత్ర పాఠం నుంచి కాంగ్రెస్ పార్టీని తొలిగించి, మమతా కాంగ్రెస్సే భారత జాతీయ కాంగ్రెస్ అనే విధంగా చరిత్రను చిత్రించే వ్యూహం తో ముందుకు సాగుతున్నారు.  అయితే ఎంత ప్రశాంత్ కిశోర్ వ్యూహమే అయినా, మమత అన్నట్లుగా  బీజేపీని ఎన్నికలలో ఎదుర్కోవడంలో వరసగా రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ విఫలమైన మాట నిజమే అయినా, ఒక ప్రాంతీయ పార్టీ  నాయకురాలు, ఒక్కసారిగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే స్థాయికి చేరుకోవడం,అంత ఈజీ విషయం అయితే కాదు. ఇది గతంలో అనేక మార్లు రుజువైంది.   మరోవైపు ప్రశాంత్ కిశోర్ ఎత్తుగడలను కాంగ్రెస్, ఎన్సీపీ,బీజీపీ యేతర పార్టీలు కొంచెం  ఆలస్యంగానే అయినా గుర్తిస్తున్నాయి. అందుకే, రాహుల్ గాంధీ యువ నాయకత్వం సారధ్యంలో కాంగ్రెస్ పార్టీకి కొత్త హంగులు దిద్దుతున్నారు. అలాగే, ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా ప్రశాంత్ కిశోర్ ట్రాప్’లో పడేందుకు సిద్దంగా లేవన్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి అంటున్నారు. ఎరైనా, చివరకు ప్రశాంత్ కిశోరే,అయినా, కొందరిని కొన్ని సందర్భాలలో మోసం చేయవచ్చును కానీ, ఆదరిని అన్ని సందర్భాలలో మోసం చేయడం కుదరదని, అది అయ్యే పని కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. 

టాప్ న్యూస్ @ 1PM

పోలవరం ప్రాజెక్టు నిధులపై కేంద్రం తేల్చేసింది. దేశంలోని మిగతా ప్రాజెక్టులకు మాదిరిగా పోలవరం ప్రాజెక్టుకు కూడా అదనంగా నిధులు మంజూరు చేయాలని కేంద్ర జల శక్తి శాఖ కోరింది. మరో రూ. 4వేల కోట్లను అదనంగా మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు, కేంద్ర జలశక్తి శాఖ లేఖ రాసింది. ఆ లేఖను పరిశీలించి నిధులు ఇచ్చేది లేదని ఆర్థిక శాఖ  తేల్చిచెప్పింది. 2017లో కేంద్ర క్యాబినెట్ తీర్మానం మేరకు రూ. 20 వేల కోట్లకు మించి ఇచ్చేది లేదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.  ------ నియంత, అసమర్ధుడు సీఎం అయితే ఎలా ఉంటుందో జగన్ పాలన చూస్తే తెలుస్తుందని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ అన్నారు. జగన్ ఒక్క చాన్స్ తీసుకోని ప్రజలకు బ్రతికే చాన్స్ లేకుండా చేశారన్నారు. ప్రభుత్వ ఆస్తులను జగన్ వాళ్ల తాత ఆస్తుల మాదిరిగా తాకట్టు పెడుతున్నారని కన్నా విమర్శించారు. అమ్మ ఒడి పేరుతో డబ్బులు ఇచ్చి నాన్న చేతిలో మద్యం బాటిల్ పెట్టి దోచుకుంటున్నారన్నారు. నవరత్నాలు పేరుతో ఓట్లు కొనుకొంటున్నారని విమర్శించారు. ------ ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపులపై గురువారం హైకోర్టు డివిజినల్ బెంచిలో విచారణ జరిగింది. ఈనెల 4 న రూ.372 కోట్లు పంచాయతీ అకౌంట్లలో జమ చేశామని ప్రభుత్వం అఫిడవిట్ వేసింది. గతంలో పంచాయతీ అకౌంట్లలో జమ చేసిన రూ.1100 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించామని ప్రభుత్వం పేర్కొంది. ఇందులో కేవలం రూ.60 కోట్లు మాత్రమే పంచాయితీ అకౌంట్లలో ఉన్నాయని తెలిపింది. దసరా లోపు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని  హైకోర్టు ఆదేశించింది. ------ వృద్ధులను  మోసం చేసిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ అన్నారు.ఫించన్ రూ.3 వేలు పెంచుతామని చెప్పి మూడేళ్లు కావొస్తున్నా.. కనీసం రూ.300 కూడా పెంచకపోగా కుంటి సాకులు చెబుతూ ఉన్న ఫించన్లు కోత కోసి వృద్దుల కడుపు మాడుస్తున్నారని మండిపడ్డారు. ఇంట్లో ఒక్కరికి మాత్రమే అంటూ పెన్షన్ వృద్ధుల నోటి దగ్గర కూడును కూడా లాక్కోవడం అత్యంత దుర్మార్గమన్నారు ------- గంజాయి వ్యవహారానికి సంబంధించి ప్రతిపక్షాలపై హోంమంత్రి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు బట్ట కాల్చి ముఖంపై వేస్తున్నాయని...తాలిబన్‌కు ఏపీకి సంబంధం అంటగడుతున్నారని అన్నారు. సీఎం ప్రతిష్టను దిగజార్చాలని ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని స్పష్టం చేశారు. మాదకద్రవ్యాలను నివారించడానికి సెబ్ ఏర్పాటు చేశామన్నారు. గుజరాత్‌లో డ్రగ్స్ దొరకాయని మోదీకి సంబంధం ఉందంటారా అని ప్రశ్నించారు. ------ బద్వేలు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పనతల సురేష్‌ను పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. దీంతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అభ్యర్థి పేరును ప్రకటించారు. జాతీయ పార్టీ ప్రకటించిన జాబితాను విడుదల చేశారు. కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు ఇటీవ‌లే ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. ---- బతుకమ్మలపై నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కారు వెళ్లడంపై దుమారం రేగుతోంది. మహిళల, తెలంగాణ రాష్ట్ర పండుగను కించపరిచిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చల్లా ధర్మారెడ్డి అహంకారానికి ఈ ఘటన నిదర్శనమని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ---------- పంజాగుట్టలో శ్రీకృష్ణ  జ్యువెల్లెర్స్‌లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు  అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. మొత్తం ఆరు బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. సోదాల్లో కీలక డాక్యుమెంట్లు, నగదు బయటపడినట్లు సమాచారం. మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు లభ్యం కావడంతో యజమానులను ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ---------- లఖింపూర్ బాధితుల పట్ల యోగి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, తమ పార్టీ నేతలను కాపాడుకోవడానికి బాధితులకు న్యాయాన్ని అందకుండా చేస్తోందని కాంగ్రెస్ పార్టీ కీలక నేత ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. న్యాయం పొందడం ప్రజల హక్కని, బాధితులకు న్యాయం అందే వరకు తన పోరాటం కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేశారు. ------ ఖింపూర్ ఖేరీ హింసాకాండ ఘటనపై బీజేపీ పార్లమెంటు సభ్యుడు వరుణ్ గాంధీ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు.లఖింపూర్ ఘటనపై సోషల్ మీడియాలో వైరల్ అయిన కొత్త వీడియోను వరుణ్ గాంధీ షేర్ చేస్తూ రైతుల గుంపుపై కారు నడిపి, వారిని హత్య చేశారని వరుణ్ ఆరోపించారు.  

దేవుని గుళ్ళో దొంగలు పడ్డారు.. జగనన్న పాలనలో కామనేనా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోమారు వెంకన్న హుండీలో చేయి పెట్టింది. భక్తుల కళ్లు మాత్రమే  కాదు, దేవుని కళ్లు కూడా కప్పి ఒకేసారి ఏకంగా రూ.50 కోట్లు మూట కట్టుకుని పట్టుకు పోయింది. ఇది ఒకసారి ‘చోరీ’ కాదు, ప్రతి సంవత్సరం ఇదే మొతాన్ని దేవుని హుండీ నుంచి సర్కార్ ఖజానా పట్టుకు పోతుంది. అంతేకాదు ప్రతి  ఐదు సంవత్సరాలకు ఈ మొత్తం మరో 10 శాతం పెరుగుతుంది. ఇలా దేవుని హుండీని కొల్లగొట్టేందుకు వైసీపీ  ప్రభుత్వం ఏకంగా  ఆర్డినెన్సు జారీ చేసింది.   వివరాలలోకి వెళితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ఆంధ్ర ప్రదేశ్ ధార్మిక, హిందూ మత సంస్థలు, ధర్మదాయ చట్టం (దేవాదాయ ధర్మాదాయ చట్టం) 1987ను సవరిస్తూ ఆర్డినెన్సును జారీ చేసింది. ఈ ఆర్డినెన్సు ద్వారా తెచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ఇంతవరకు , సంవత్సరానికి రెండున్నర కోట్ల రూపాయలు మాత్రమే, ప్రభుత్వానికి కామన్ గుడ్ ఫండ్ కింద ప్రభుత్వానికి చెల్లిస్తున్నటీటీడీ  ఇకపై సంవత్సరానికి  రూ.50 కోట్లు చేల్లిచవలసి ఉంటుంది. అంటే, భక్తుల కానుకలలో నుంచి  ప్రభుత్వం రూ .50 కోట్లు పట్టుకు పోతుంది.  అంతేకాదు, ఈ మొత్తం ప్రతి ఐదు సంవత్సరాలకు  10 శాతం వంతున పెరిగిపోతుంది.   అంత అర్జెంటుగా ఆర్డినెన్సు తెచ్చి మరీ, చట్టాన్ని సవరించి వెంకన్న హుండీకి కన్నం పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది, అంటే, అందులో అంత విశేషం ఏమీలేదు. కోడి మాంసం, కుక్క మాంసం ప్రభుత్వం ఎందుకు అమ్మవలసి వచ్చింది? సినిమా టికెట్ల ఆన్లైన్ విక్రయం ప్రభుత్వం ఎందుకు చేయవలసి వచ్చింది? సారా దుకాణాలు ప్రభుత్వం ఎందుకు నిర్వహిస్తోంది? ఇది కూడా అందుకే ... పేరు ఏదైనా కావచ్చును, ప్రభుత్వం చెప్పేది ఇంకేదైనా కాకవచ్చును,కానీ, ఈ అన్నిటికీ ఒకటే కారణం, జగన్ రెడ్డి ప్రభుత్వం దివాలా అంచుల్లోకి చేరింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్వాన్న స్థితి నుంచి అధః పాతాళానికి పరుగులు తీస్తోంది. అందుకే ఎక్కడ వీలయితే అక్కడ చేయి పెట్టి, చిక్కి నంత  తెచ్చుకుంటోంది. పుచ్చుకుంటోంది.   తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2,000 కోట్లు అప్పు చేసింది. రిజర్వు బ్యాంకు ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేసి ఈ రుణం తీసుకొచ్చింది. ఇందులో రూ.1,000 కోట్లను 7.04 శాతం వడ్డీకి 13 ఏళ్లలో చెల్లించేలా తీసుకుంది. మిగతా రూ.1,000 కోట్లను 7.09 శాతం వడ్డీకి 18 ఏళ్లలో చెల్లించేలా తీసుకుంది. ఈ నెలలో ఇంకా రూ.3,000 కోట్లు అప్పు తీసుకుంటామని రిజర్వు బ్యాంకుకు రాష్ట్ర ఆర్థిక శాఖ సమాచారం ఇచ్చింది. కేంద్రం సెప్టెంబరు 3వ తేదీన అనుమతిచ్చిన కొత్త అప్పులు రూ.10,500 కోట్లలో మంగళవారంతో రూ.7,000 కోట్లు తెచ్చేసింది. ఇంకో రూ.3,500 కోట్లు మాత్రమే మిగిలి ఉంది. దానిని కూడా అక్టోబరులోనే తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇలా ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేస్తున్న ప్రభుత్వం అడపా దడపా వెంకన్న స్వామి మీద పడి, ఏదో రూపంలో సర్కార్ ఖజానాకు కైంకర్యం చేస్తోంది.  అయితే ప్రభుత్వం మాత్రం అసలు నిజాన్ని కప్పిపెట్టి, కామన్ గుడ్ ఫండ్ కోసం, దేవుళ్ళు, దేవాలయ  మధ్య సమన్యాయం సాధించేందుకు అంటూ కట్టు కథలు, పిట్ట కథలు, పుక్కిటి పురాణాలు వినిపిస్తోంది. ఈ 50 కోట్ల రూపాయలను, దేవాదాయ శాఖ పరిధిలోని తక్కువ ఆదాయం ఉన్న దేవాలయాలలో, ధూప, దీప నైవేద్యాలు, అర్చక స్వాముల యోగ క్షేమాలు,సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని ప్రభుత్వం ఆర్డినెన్సు లోనే చెప్పు కొచ్చింది. అయితే, వాస్తవంలో ప్రభుత్వం దేవాలయాల ఆదాయం, ఆస్తులను కొల్లగొట్టి, పాస్టర్లకు జీతాలు చెల్లించి, అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహిస్తోంది. చర్చిల నిర్మాణానికి ఖర్చుచేస్తోందని, హిందూ ధార్మిక సంస్థలు, భక్తులు, రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. నిజానికి, ఇది ఆరోపణ కాదు, ఆధారాలతో రుజువైన వాస్తవం.   ఈ ఆర్డినెన్సులో ప్రభుత్వం,తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడీ) కి భక్తులు ఇచ్చే విరాళాలు, దర్శనం టికెట్ల విక్రయం, ఆర్జిత సేవ, ప్రసాదం విక్రయం ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది, అయినా, కేవలం, రూ.2.5 కోట్లు మాత్రమే దేవాదాయ శాఖకు కామన్ గుడ్ ఫండ్ చెల్లిస్తోంది. విజయవాడ కనక దుర్గమ్మ, సిహచలం, కాణిపాకం, అన్నవరం, ద్వారకా తిరుమల ఆలయాలు చెల్లిస్తున్న మొత్తం కంటే ఇది చాలా తక్కువ, కాబట్టి దేవుళ్ళు, దేవాలయాల మధ్య ఆదాయాలను బట్టి సమన్యాయం సాధించేందుకు టీటీడీ చెల్లింపును రూ. 50కోట్లు పెంచినట్లు చెప్పుకుంది. నిజంగా, చిన్న చిన్నదేవలయాల అభివృద్ధికి ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తే, కాదనేది లేదు. దేవుని సొమ్ము దేవునికి ఖర్చు చేస్తే, అభ్యంతరం చెప్పేది ఉండదు,  కానీ, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ట్రాక్ రికార్డు చూస్తే, హిదువుల జేబులు కొట్టి అన్య మతస్తుల జేబులు నింపుతున్న వైనమే కనిపిస్తోంది. అదీ అసలు విషాదం..   

బతుకమ్మలపై నుంచి దూసుకెళ్లిన కారు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు మహిళల శాపనార్ధాలు.. 

తెలంగాణలో బతుకమ్మ వేడుకలు సంబరంగా మొదలయ్యాయి. తొలి రోజు ఎంగిలి పువ్వు బతుకమ్మను మహిళలు వైభవంగా నిర్వహించుకున్నారు. బతుకమ్మ ఉత్సవాలకు టీఆర్ఎస్ సర్కార్ ఘనంగానే ఏర్పాట్లు చేసింది. అయితే ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే మాత్రం బతుకమ్మ రోజే చిల్లరగా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి.  మహిళలంతా బతుకమ్మలతో వచ్చి భక్తి శ్రద్ధలతో బతుకమ్మ ఆడుతుండగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే  కారు ఆ బతుకమ్మల మీదుగా దూసుకెళ్లింది. దీంతో బతుకమ్మలు చెల్లాచెదరయ్యాయి. ఆ సమయంలో ఎమ్మెల్యే వాహనంలోనే ఉన్నారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ మహిళలు శాపనార్థాలు పెట్టారు. ఎమ్మెల్యే డౌన్‌ డౌన్‌ అంటూ గ్రామస్థులు నినాదాలు చేశారు.బతుకమ్మలపై దూసుకెళ్లిన కారు  పరకాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిది.    ఆత్మకూరు గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూరుకు విచ్చేసిన చల్లా ధర్మారెడ్డి అక్కడ సెంట్రల్‌ లైటింగ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. అదే సమయంలో పోచమ్మ సెంటర్‌ వద్ద ఉన్న వేణుగోపాలస్వామి దేవాలయం ఎదుట మహిళలు బతుకమ్మలు పెట్టుకొని ఆడుకుంటున్నారు. ఎమ్మెల్యే వస్తున్నారని, రోడ్డుపై నుంచి బతుకమ్మలు తీసివేయాలని ధర్మారెడ్డి అనుచరులు కోరారు.  ఎంతో భక్తితో ఆడుకుంటున్న బతుకమ్మలను మధ్యలో తీసివేయలేమని మహిళలు తేల్చి చెప్పారు. అక్కడే ఉన్న సర్పంచ్‌ పర్వతగిరి రాజు ఓ పక్క నుంచి ఎమ్మెల్యే కారు పోనివ్వండిని ప్రాధేయపడ్డా పోలీసులు, అనుచరులు వినిపించుకోలేదు. బతుకమ్మ ఆడుతున్న మహిళలను తోసేసి ఎమ్మెల్యే కారును బతుకమ్మల మీదుగా ముందుకు పోనివ్వడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ధర్మారెడ్డి కారును గ్రామస్థులు, మహిళలు అడ్డుకుని  ఆయనకు వ్యతిరేకంగా  నినాదాలు చేశారు.  గ్రామస్థులను పోలీసులు తోసేయడంతో కొందరు సోమ్మసిల్లి కిందపడిపోయారు. ఆత్మకూరు సీఐ రంజిత్‌.. అదనపు పోలీసులను రప్పించి అక్కడి నుంచి ఎమ్మెల్యే వాహనాన్ని పంపించారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మహిళలు ఎంతో గౌరవంగా పూజించే బతుకమ్మలపై కారు పోనివ్వడంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. 

బద్వేలు బీజేపీ అభ్యర్థిగా సురేష్.. టీడీపీ, జనసేన మద్దతు ఎవరికో? 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. అధికార వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణంతో జరుగుతున్న ఉప ఎన్నికలో వైసీపీ తన అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించింది. దివంగత ఎమ్మెల్యే సతీమణి సుధ.. ఆ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. తాజాగా బీజేపీ బద్వేలు అభ్యర్థిని ప్రకటించింది.  బద్వేలు ఉప ఎన్నికలో సురేశ్ ప‌న‌తల బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని సోము వీర్రాజు ట్వీట్ చేశారు. అభ్య‌ర్థి పేరును పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసిన‌ట్లు వివ‌రించారు.'వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా, కుటుంబ పాలనకు దూరంగా, ప్రజాసంక్షేమమే ధ్యేయంగా బద్వేల్ అసెంబ్లీ ఉపఎన్నిక బరిలో నిలుస్తోంది బీజేపీ. 14 సంవ‌త్స‌రాలు విద్యార్థి నాయకుడిగా, గత 5 సంవ‌త్స‌రాలుగా యువనాయకుడిగా ప్రజా సమస్యల సాధనకు అనేక పోరాటాలు సాగించిన సురేష్ ను అభ్యర్థిగా ప్రకటిస్తున్నాం.. బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు మీ అమూల్యమైన ఓటును కమలం గుర్తుపై వేసి, మీ సమస్యల సాధనకై గల్లీ నుండి ఢిల్లీ వరకు పోరాటం చేయగల ఒక యువనాయకుడిని గెలిపించుకోవాలని కోరుతున్నాను' అని సోము వీర్రాజు ట్వీట్ చేశారు. ఏపీలో బీజేపీ-జనసేన పొత్తులో ఉన్నా ఉప ఎన్నికలో మాత్రం బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తోంది. బద్వేలులో రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పోటీ చేస్తుందని ప్రచారం జరిగినా.. తాము పోటీకి దూరంగా ఉంటామని ప్రకటించి అందరికి షాకిచ్చారు పవన్ కల్యాణ్. దీంతో బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించింది. ఇక టీడీపీ కూడా బద్వేలు బరి నుంచి తప్పుకుంది. మొదట పోటీ చేస్తామని ప్రకటించింది టీడీపీ. తన అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసిన ఓబులాపురం రాజశేఖర్ పేరును ప్రకటించింది. రాజశేఖర్ తన ప్రచారం కూడా ప్రారంభించారు.  తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుంది టీడీపీ. దివంగత దళిత ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు పోటీ చేస్తున్నందున.. గత సంప్రాదాయాలను గౌరవిస్తూ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపింది. బద్వేలు ఉప ఎన్నికలో పోటీ చేస్తోంది కాంగ్రెస్. మాజీ ఎమ్మెల్యే కమలమ్మ ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. టీడీపీ, జనసేన బరిలో లేకపోవడంతో ఉప ఎన్నిక ఆసక్తిగా మారింది. కాంగ్రెస్, బీజేపీలు పోటీలో ఉండటంతో... టీడీపీ, జనసేన కార్యకర్తలు ఎవరికి మద్దతు ఇస్తారన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు అధికార వైసీపీ మాత్రం గతంలో కంటే ఎక్కువ మెజార్టీ సాధించేలా పావులు కదుపుతోంది. బద్వేలు ఉప ఎన్నిక ఇంచార్జ్ గా సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డిని నియమించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. మరో ముగ్గురు మంత్రులకు ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. 

తెలుగు రాష్ట్రాల్లో టాప్ టెన్ ధనవంతులు వీళ్లే.. 

తెలుగు రాష్ట్రాల్లో ధనవంతులు పెరిగిపోతున్నారు. గత ఏడాది కంటే దేశంలోని టాప్ ధనవంతుల జాబితాలో తెలుగు వారి సంఖ్య పెరిగింది. తాజాగా విడుదలైన ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా సంపన్నుల జాబితా–2021 స్పష్టం చేసింది. ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 69 మంది చోటు సంపాదిస్తే.. వీరి మొత్తం సంపాదనను కలిపితే రూ 3.79లక్షల కోట్లుగా లెక్క తేల్చారు. గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు 54 శాతం  వృద్ధి కనిపించగా.. కొత్తగా 13 మంది జాబితాలో చేరారు.  అయితే జాబితాలోని మొత్తం 69 మంది తెలుగువారిలో ఇద్దరు మాత్రమే మహిళలు ఉన్నారు. మొత్తం 69 మంది సంపన్నుల్లో ఔషధ రంగానికి చెందిన వారే 21 మంది ఉండటం విశేషం. ఈ జాబితాలో వెయ్యి కోట్ల కు మించి సంపద ఉన్న వారిని పరిగణలోకి తీసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్ 10 సంపన్నులు వీళ్లే..  ర్యాంక్   పేరు                       సంపద(రూ.కోట్లల్లో)          కంపెనీ 01       మురళి దివి                    7900                   దివీస్ ల్యబొరేటరీస్ 02      పార్థసారధిరెడ్డి                26100                  హెటెరో ల్యాబ్స్ 03      పిచ్చిరెడ్డి.. క్రిష్ణారెడ్డి        23400                 మేఘా ఇంజనీరింగ్ 04     సతీష్ రెడ్డి                      12300                   డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ 05      అమరేందర్ రెడ్డి            12000                   జీఏఆర్ 06     సత్యానారాయణరెడ్డి        11500                   ఎంఎస్ఎన్ ల్యాబ్స్ 07      జీవీ ప్రసాద్                    10300                 డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ 08     వెంకటేశ్వర్లు జాస్తి            9700                   సువెన్ ఫార్మా 09     పీవీఎన్ రాజు                   9300                    గ్లాండ్ ఫార్మా 10      వీసీ నన్నపనేని               9100                    నాట్కో ఫార్మా

తాలిబన్లతో వైసీపీ నేతలకు లింక్స్? డ్రగ్స్ మాఫియా అడ్డాగా ఏపీ? 

గుజరాత్ లోని ముంద్రా పోర్టులో పట్టుబడిన ఆప్ఘనిస్తాన్ హెరాయిన్ కు విజయవాడ లింకులు బయటపడటం తీవ్ర కలకలం రేపగా.. ఆ కేసు విచారణలో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తు సాగుతుండగానే ఏపీలో డ్రగ్స్ దందా ఆనవాళ్లకు సంబంధించి కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. గత నెలలో కాకినాడలో బోటు తగలబడి పోవడం కలకలం రేపుతోంది. ఆ బోటును పరిశీలించడానికి వెళ్లిన టీడీపీ నేతలపై వైసీపీ కార్యకర్తలు దాడికి యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది.  గత నెల 16న కాకినాడలో ఓ బోటు అగ్నికి ఆహుతైంది.  జగన్నాథపురం బోటు యార్డ్‌ నుంచి సముద్రంలో వేటకు బయలుదేరిన స్పీడ్‌ బోటు తగలబడింది. అయితే ఆ ప్రమాదంపై అనుమానాలు తలెత్తాయి. బోటులో మాదక ద్రవ్యాలు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ బోటును పరిశీలించడానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పట్టాభి మరికొందరు నేతలతో కలిసి బుధవారం కాకినాడ వచ్చారు. అయితే అధికార వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ఏకంగా తూర్పుగోదావరి జిల్లా టీడీపీ కార్యాలయంపైనే దాడికి ప్రయత్నించారు. పూటుగా మద్యం సేవించిన కొందరు.. మత్స్యకారుల ముసుగులో..మూడుగంటలపాటు హల్‌చల్‌ సృష్టించారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ బూతులతో నిరసనకు దిగారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ నాయకులపై దాడిచేశారు.  టీడీపీ నేతలపై దాడికి యత్నించిన వారంతా కాకినాడ నగర వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మనుషులేనని తెలుస్తోంది. వారిలో ఆయన సోదరుడు, బంధువులు, వైసీపీ కార్పొరేటర్లు, కొందరు రౌడీషీటర్లు కూడా ఉన్నారని అంటున్నారు. పోలీసులు వచ్చినా వీరిని కనీసం చెదరగొట్టకపోవడంతో మరింత గొడవ చేశారు. కార్యాలయం లోపల ఉన్న పట్టాభి.. తాను మత్స్యకారులను అవమానించలేదని వివరణ ఇచ్చారు. అయినా ద్వారంపూడి అనుచరులు శాంతించలేదు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. పట్టాభి, రాజప్ప, కొండబాబు, నవీన్‌తో ఫోన్లో మాట్లాడారు. ద్వారంపూడి తీరును సహించవద్దని, వెనక్కి తగ్గకుండా పోరాడాలని సూచించారు.  టీడీపీ నేతలపై దాడికి ప్రయత్నించడంపై చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. తాలిబన్లతో వైసీపీ నేతలు సంబంధాలు పెట్టుకొని డ్రగ్స్‌ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు.  వాటిని అన్నింటినీ బయట పెడతాం.. డ్రగ్స్‌ మాఫియా దాడులకు బెదిరే ప్రసక్తి లేదని చెప్పారు. డ్రగ్స్  మాఫియా నాయకుడైన వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తన మూకలతో దాడులకు తెగబడటం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని చంద్రబాబు మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ కార్యాలయంపై డ్రగ్స్‌ మాఫియా దాడికి దిగితే పోలీసు యంత్రాంగం నిద్రపోతోందా అని చంద్రబాబు ప్రశ్నించారు. డ్రగ్స్‌ వ్యవహారంలో తన పాత్ర బయటపడుతుందన్న భయంతోనే ద్వారంపూడి దాడులకు తెగబడ్డారన్నారు చంద్రబాబు. ఈ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తి లేదని వ్యాఖ్యానించారు. దాడికి దిగిన మాఫియా మూకలను తక్షణం అరెస్టు చేయాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. టీడీపీ నాయకులకు ఏ హాని జరిగినా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, డీజీపీ, పోలీస్‌ యంత్రాంగం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.