ప్రియాంక దూకుడుతో కాంగ్రెస్ బలపడేనా?యూపీలో అద్భుతాలు జరిగేనా?
ఉత్తర పదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పది సీట్లు గెలుచుకున్నా, గొప్పే, ఇది కాంగ్రెస్ శ్రేణులతో సహా అందిరిలో ఇప్పటికి ఉన్న అభిప్రాయం. తాజాగా, ఎబీపీ,సీ- ఓటర్ నిర్వహించిన సర్వే కూడా, కాంగ్రెస్ పార్టీ ఆరు శాతం ఓట్లు, మూడు నుంచి ఏడు వరకు సీట్లు వస్తే రావచ్చని తేల్చేసింది. అంటే, చాలా ఎక్కువ అనుకుంటే, కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్లు ఏడని చెప్పింది.
అయితే ఇది లఖీంపూర్ ఖీరీ ఘటనకు ముందున్నపరిస్థితి ... కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా యూపీలోని లఖీంపూర్ ఖీరీవద్ద ఆందోళన చేస్తున రైతులపైకి,కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర కాన్వాయ్’లోని వాహనం ఒకటి దూసుకు పోయి నలుగు రైతులు, అనంతర ఘర్షణలో మరో ఐదుగురు ప్రాణాలు పోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన తర్వాత యూపీ రాజకీయం మరో మలుపు తిరిగింది. ఈ దుర్ఘటనకు కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు. ఆశిష్ మిశ్ర కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం జూనియర్ మిశ్ర జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ సంఘటన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే సంచలనం సృష్టించింది.
ఇంత ‘చక్కటి’ అవకాశాన్ని రాహుల గాంధీ, ప్రియాంక వాద్రా అంత ‘చక్క’గా ఉపయోగించుకో లేదని ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ అసంతృప్తి,ఆగ్రహం వ్యక్తం చేస్తే చేసి ఉండవచ్చును. ఆలాగే రాహుల్ గాంధీ ఎప్పటిలానే ఈ డ్రామాలోనూ గెస్ట్ ఆర్టిస్ట్’గానే మిగిలిపోవచ్చును. కానీ, ప్రియాంక వాద్రా వదిలేయలేదు. ఒక్కసారిగా, మొత్తం వ్య్వహారాని తమ గుప్పిటలోకి తీసుకున్నారు. దూకుడు పెంచారు. రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు ఉధృత కార్యాచరణకు పూనుకున్నారు. బీజీపీకే కాదు, ఎస్పీ, బీస్పీ సహా ఇతర పార్టీలకు కాకలు తీరిన సీజన్ద్ పొలిటీషియన్స్ అనుకునే అఖిలేష్ యాదవ్, మాయావతికి కూడా ఝలక్ ఇచ్చారు.
అంతేకాదు ప్రధాని నరేంద్ర మోడీ సొంత నియోజక వర్గం వారాణసీ నుంచి సమర శంఖం పూరించారు ప్రియాంక. ’కిసాన్ న్యాయ ర్యాలీ’ పేరిట ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ టార్గెట్’గా అస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్’ను వదిలి పెట్టలేదు. దేశ, విదేశాల్లో తిరిగే మోడీకి రైతులను పరామర్శించేందుకు పది నిముషాలు సమయం చిక్కలేదని ఎద్దేవా చేశారు.అంతే కాదు, ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే అనిగర్జించారు. కేంద్ర మంత్రి రాజీనామ చేసే వరకు పోరాటం కొనసాగుతుందని, గట్టి శపధం చేశారు. అలాగే, ఇప్పటికే సుప్రీం కోర్టు సుమోటాగా విచారణ జరుపుతున్న లఖీంపూర్ ఖీరీ దుర్ఘటన విషయాన్ని రాష్టపతి రామ్ నాథ్ కొవింద్’కు విన్నవించి న్యాయం కోరతామని అన్నారు. ప్రతిజ్ఞా యాత్ర పేరిట 12 వేల కిలోమీటర్లు యాత్ర నిర్వహిస్తానని, మోడీ, యోగీ పాలనల బండారాన్ని బయట పెడతానని ప్రకటించారు.
ఇలా ప్రియాంక లఖీంపూర్ ఖీరీదుర్ఘటన ఆధారంగా సాగిస్తున్నరాజకీయ పోరాటం పుణ్యాన యూపీఅసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంతోకొంత ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. ఎన్నికలకు మరో నాలుగైదు నెలల సమయముంది. అందాకా ప్రియాంక దూకుడు కొనసాగితే, ఇంతవరకు అంటరని పార్టీగా చూస్తూ ఎవరూ దగ్గరకు కూడా రానీయని కాంగ్రెస్
పార్టీనే, రేపు ఎస్పీకో, బీఎస్పీకో ముద్దు రావచ్చును. కొత్త పొత్తు పొడవావచ్చును .. అదే జరిగితే, ప్రియాంక సారధ్యంలో కాంగ్రెస్ పునర్జీవన ప్రస్థానం ప్రారంభం కావచ్చును.. రాజకీయాల్లో ఏదైనా జరగ వచ్చును.