90 మంది సిట్టింగులకు ఫిట్టింగ్? వైసీపీ ఎమ్మెల్యేలకు పీకే భయం?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, గత ఎన్నికల్లో ఎలా గెలిచారో...అందరికీ తెలిసినవిషయమే. ఒక్కచాన్సు ఇస్తే అద్భుతాలు చేసి చూపిస్తానని పాదయాత్ర పొడుగునా ఇచ్చిన హామీలు, నవరత్నాల పేరిట కురించిన ఉచిత వరాలు, ప్రత్యేక హోదా, రాజధాని విషయంలో చేసిన మోసపూరిత వాగ్దానాలు ఇలా అనేక కారణాల వలన చేత, వైసీపీ, జగన్ రెడ్డి ఆ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించారు. ఏకంగా 151 అసెంబ్లీ సీట్లు, 22 లోక్ సభ సీట్లు గెలుచుకున్నారు.
సహజంగా ఏ రాష్ట్రంలో అయినా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఐదేళ్ళపాలన తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత వస్తుంది. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పట్ల కొంత వ్యతిరేకత వచ్చింది అది నిజం. టీడీపీ సీనియర్ నాయకుడు, రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పినట్లుగా టీడీపీ ఓటమిలో ఎంతోకొంత స్వయంకృతం కూడా ఉంటే ఉండవచ్చును. అయినా, ఇవన్నీ కూడా జగన్ రెడ్డి గెలుపుకు కారణమే అయినా, అసలు కారణం పీకే, ప్రశాంత్ కిశోర్. ఒక్క ఛాన్స్’డైలాగు అయినా నవరత్నాల వంటకాలు అయినా, అభ్యర్ధుల ఎంపిక మొదలు వైసీపే విజయానికి తోడ్పడిన ప్రతి అంశం కూడా, పీకే సృష్టే అనేది కొంచెం ఆలస్యంగానే అయినా అందరికీ తెలిసిన నిజం. గెలిచించి వేసీపీ, జగన్ రెడ్డే అయినా గెలిపించిన వాడు మాత్రం పీకేనే, అనేది అందరూ అనుకునే విషయం. అందులో అంతా కాకపోయినా కొంతైనా నిజం ఉందనేది కాదన లేని నిజం.
అయితే, ఇలా, వందల (వేల?) కోట్ల రూపాయలు ఫీజుగా వ్యూహరచన చేసేవాడు ఎవడైనా, ఒకటే అలోచిస్తారు, తమ క్లైంట్’ను గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తారు.మంచి చెడు, తమ వ్యూహం, వేసే అడుగు సమాజానికి మేలు చేస్తుందా? ఈడు చేస్తుందా? అనేది ఆలోచించరు. ఉచ్చనీచాలు పట్టించుకోరు. ప్రజలను మోసం చేసేందుకు ఏ మాత్రం వెనకాడరు. గత (2019) అసెంబ్లీ ఎన్నికల్లో మోసాలను మూటకట్టే, జగన్ రెడ్డిని పీకే గెలిపించారు. పర్యవసానం చూస్తున్నాం, అనుభవిస్తున్నామని జనాలు అంటున్నారు. పీకే ‘వ్యూహం’ లో భాగంగా మేనిఫెస్టోలో పెట్టిన, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రెండున్నర సంవత్సరాల్లోనే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దివాళా అంచుల్లోకి నేట్టేశాయి. అంతే కాదు, జగన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న అప్పు సూక్తం కూడా పేకే పుణ్యమే అంటున్నారు.
మళ్ళీ ఎన్నికలకు కూడా జగన్ రెడ్డి, పీకేతో డీల్ కుదుర్చుకున్నారని వార్తలొస్తున్నాయి. ఎవరో కాదు,స్వయంగా ముఖ్యమంత్రే ఈ విషయం కాబినెట్ సమావేశంలో మంత్రుల చెవిలో వేశారు. ప్రశాంత్ కిశోర్ బృందం వస్తోంది, ఇక ఎన్నికల మూడ్ లోకి వచ్చేయండని స్వయంగా ముఖ్యమంత్రే మంత్రులకు చెప్పినట్లు వార్తలొచ్చాయి. అ వార్తలను, సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా ఖండించలేదు కాబట్టి నిజమే అనుకోవచ్చును.అంతే కాకుండా, ఇప్పటికీ పీకే బృందం ఎంట్రీ ఇచ్చందని, వైజాగ్, తిరుపతి, విజయవాడ ఇంకొన్ని చోట్ల ‘పని’ ప్రారంభించడం , నివేదికలు సిద్డంచేయడం జరిగిపోయిందని అంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కొందరు సిట్టింగు ఎమ్మెల్యేలకు ‘తొలి ప్రమాద హెచ్చరిక’ లు అందినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో సిట్టింగు ఎమ్మెల్యేలలో వణుకు మొదలైనదని అంటున్నారు.
పీకే పెరామీటర్స్ ప్రకారం చూస్తే కనీసం తక్కువలో తక్కువ, అదికూడా ఇప్పటికున్న సమాచారం ప్రకారం 42 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు గెలిచే అవకాశాలు లేనేలేవు. అంటే ఏమి చేసినా వారు ఓడిపోవడం ఖాయం. మరో 40-50 మంది గత ఎన్నికల్లో కంటే రెట్టింపుకు పైగా ఖర్చుచేసి తమ అడుష్టాన్ని పరిక్షించుకో వచ్చును. అందుకు సిద్దం ఆయితేనే, టిక్కెట్ అశించాలని సందేశాలు వెళ్ళినట్లు తెలుస్తోంది.
మరో వంక పీకే టీము, ఏపీ కోసం ప్రత్యేక రిక్రూట్మెంట్ డ్రైవ్ కూడా ప్రారంభించినట్లు సమాచారం.ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం తాత్కాలిక ప్రాతిపదికిన నెలకు లక్షన్నర వేతనంతో పనిచేసేందుకు 150 మంది గ్రాడ్యూయేషన్ పూర్తి చేసుకున్న మెరికలు కావాలని, దేశంలోని వివిధ ఐఐటీలను పీకే టీమ్ సంప్రదించినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే వీరు రాష్ట్రంలోకి ఎంట్రీ ఇస్తారు.
అంతే కాకుండా, పీకే టీము స్పీడ్ చూస్తుంటే, ముందస్తు ఎన్నికలు తప్పవనే భయం, ఆందోళన కూడా ఎమ్మెల్యేలు వ్యక్త పరుస్తున్నారు. మొత్తానికి, వైసీపీ ఎమ్మెల్యేలను పీకే భయం వెంటాడుతోందని ఎమ్మెల్యేల మాటల్లోనే వ్యక్తమవుతోంది.