తెలుగు రాష్ట్రాల్లో టాప్ టెన్ ధనవంతులు వీళ్లే..
posted on Oct 7, 2021 @ 11:29AM
తెలుగు రాష్ట్రాల్లో ధనవంతులు పెరిగిపోతున్నారు. గత ఏడాది కంటే దేశంలోని టాప్ ధనవంతుల జాబితాలో తెలుగు వారి సంఖ్య పెరిగింది. తాజాగా విడుదలైన ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా సంపన్నుల జాబితా–2021 స్పష్టం చేసింది. ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 69 మంది చోటు సంపాదిస్తే.. వీరి మొత్తం సంపాదనను కలిపితే రూ 3.79లక్షల కోట్లుగా లెక్క తేల్చారు. గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు 54 శాతం వృద్ధి కనిపించగా.. కొత్తగా 13 మంది జాబితాలో చేరారు.
అయితే జాబితాలోని మొత్తం 69 మంది తెలుగువారిలో ఇద్దరు మాత్రమే మహిళలు ఉన్నారు. మొత్తం 69 మంది సంపన్నుల్లో ఔషధ రంగానికి చెందిన వారే 21 మంది ఉండటం విశేషం. ఈ జాబితాలో వెయ్యి కోట్ల కు మించి సంపద ఉన్న వారిని పరిగణలోకి తీసుకున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్ 10 సంపన్నులు వీళ్లే..
ర్యాంక్ పేరు సంపద(రూ.కోట్లల్లో) కంపెనీ
01 మురళి దివి 7900 దివీస్ ల్యబొరేటరీస్
02 పార్థసారధిరెడ్డి 26100 హెటెరో ల్యాబ్స్
03 పిచ్చిరెడ్డి.. క్రిష్ణారెడ్డి 23400 మేఘా ఇంజనీరింగ్
04 సతీష్ రెడ్డి 12300 డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ
05 అమరేందర్ రెడ్డి 12000 జీఏఆర్
06 సత్యానారాయణరెడ్డి 11500 ఎంఎస్ఎన్ ల్యాబ్స్
07 జీవీ ప్రసాద్ 10300 డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్
08 వెంకటేశ్వర్లు జాస్తి 9700 సువెన్ ఫార్మా
09 పీవీఎన్ రాజు 9300 గ్లాండ్ ఫార్మా
10 వీసీ నన్నపనేని 9100 నాట్కో ఫార్మా