యూపీలో బీజేపీ,, పంజాబ్’ లో హంగ్! 

మూడు నాలుగు నెలల్లో, ఉత్తర ప్రదేశ్ సహా ఐదు రాష్ట్రలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ప్రస్తుతం ఈ ఐదు రాష్ట్రాలలో నాలుగు రాష్ట్రాలలో బీజేపీ, ఒక రాష్టంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయి. మరి వచ్చే సంవత్సరం (2022) ప్రారంభంలో జరిగే ఎన్నికల్లో, ఎవరి ఖాతాలో ఎన్ని రాష్ట్రాలు మిగులుతాయి, ఎవరి చేతినుంచి ఏఏ రాష్ట్రాలు చేజారతాయి అనే విషయంలో ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలలోనే కాదు, దేశం అంతటా కూడా రాజకీయ వర్గాలలో ఐదు రాష్ట్రల అసెంబ్లీ  ఎన్నికలు చర్చకు వస్తూనే ఉన్నాయో. ఎందుకంటే, ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, 2024లో జరిగే లోక్ సభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంకేతాలుగా నిలుస్తాయి, అందుకే యూపీ ఎన్నికల పై ఏపీ, తెలంగాణలో కూడా చర్చ జరుగుతూనే ఉంది.  ఎబీపీ-సీ- ఓటర్ నిర్వహించిన సర్వేలో, బీజేపీ ఇప్పుడున్న నాలుగు రాష్ట్రలు, ఉత్తర ప్రదేశ్, మణిపూర్, గోవా, ఉత్తరఖండ్ రాష్ట్రాలలో అధికారాన్ని నిలుపుకుంటుందని,సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి.ప్రస్తుతం హస్తం పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్’లో మాత్రం హంగ్ అసెంబ్లీ అనివార్యంగా కనిపిస్తింది,  ఎన్నికల్లో గెలుపు ఓటముల లెక్కలు ఎలా ఉన్నా, ఎబీపీ-సీ- ఓటర్ సర్వే ఫలితాల ఆధారంగా చూస్తే, జాతీయ రాజకీయ ముఖ్య చిత్రంలో వస్తున్న మార్పులు కూడా, ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. జాతీయ స్థాయిలో చూస్తే, బీజేపీకి ప్రధాన ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీ. అయితే, తాజా పరిణామాలను గమనిస్తే, కాంగ్రెస్ పార్టీకి పోటీగా ఒక వైపు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), మరో వైపు నుంఛి తృణమూల్ కాంగ్రెస్ భారీ అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా వచ్చే సంవత్సరం మొదట్లో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో, ఆప్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యాన్మాయంగా ఎదిగే సంకేతాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఎబీపీ-సీ- ఓటర్ సర్వే ఫలితాలలో కూడా, ఆ సంకేతాలు కనిపిస్తున్నాయి. పంజాబ్ లో ఇప్పటికే బీజేపీ, అకాలిదళ్’ను పడగొట్టి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నఆప్, వచ్చే ఎన్నికల్లో, కాంగ్రెస్ పార్టీని కూడా వెనక్కి నెట్టి,హంగ్ అసెంబ్లీ లో సింగల్ లార్జెస్ట్ పార్టీగా అవ్తరిస్తుదాని సర్వ చెపుతోంది. పంజాబ్’లోనే కాదు, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల లోనూ ఆప్,కాంగ్రెస్’ గట్టి పోటీ ఇచ్జే అవకాశాలు కనిపిస్తున్నాయి. పంజాబ్’లో లాగా అధికారం అంచులకు చేరక పోవచ్చును కానీ, కాంగ్రెస్ విజయావకాశాలను ఘనంగానే దెబ్బ తీస్తుందని సర్వే లెక్కలు చెపుతున్నాయి. పంజాబ్ తో పాటు మణిపూర్ లో కాంగ్రెస్ పార్టీలోని  అంతర్గత కుమ్ములాటలు,పార్టీని దేబ్బతీసే అవకాశం అధికంగా  కనిపిస్తోందని సర్వే నివేదిక తెలియ చేస్తోంది.   తాజా సర్వే ప్రకారం ఉత్తర ప్రదేశ్’లో బీజేపీ ఓటు షేర్ ఇంచు మించుగా గత (2017) అసెంబ్లీ ఎన్నికలలో  ఉన్నట్లే 41 శాతానికి కొంచెం అటూ ఇటుగానే ఉంటుంది. కానీ, సెట్ల సంఖ్య మాత్రం 241-249కే పరిమితం అవుతుంది. సమాజవాదీ పార్టీ, 32 శాతం ఓట్లతో 130 నుంచి 138సీట్లు , బీఎస్పీ 15 శాతం ఓట్లతో 15 నుంచి 19 సీట్లు, కాంగ్రెస్ 6 శాతం ఓటు షేర్’తో 3 నుంచి 7అసెంబ్లీ స్థానాల్లో గెలిచే అవకాసం ఉందాని సర్వే సూచిస్తోంది. పంజాబ్ విషయానికొస్తే ఎబీపీ-సీ- ఓటర్ సర్వే ప్రకారం 117 సభ్యుల పంజాబ్ శాసన సభలో ,ఆప్ 36 శాతం ఓటల్తో 49 నుంచి 55 స్థానాలు గెలుచుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ 32 శాతం ఓట్లతో 30 నుంచి 47 స్థానాలు, అకాలీ దళ్ 22 శాతం ఓటల్తో, 17నుంచి 25 స్థానాలు, బీజేపీ4 శాతం ఓట్లతో 0- 1 స్థానంలో గెలిచే అవకాశం ఉందని సర్వే చెపుతోంది. ఇక మిగిలిన మూడు రాష్ట్రాలు గోవా, మణిపూర్, ఉత్తరా ఖండ్’లో బీజేపీ అధికారం నిలుపుకుంటుందని ఎబీపీ-సీ- ఓటర్ సర్వే చెపుతోంది.

హుజురాబాద్‌తో జ‌ర‌గ‌బోయేది ఇదే.. రేవంత్‌రెడ్డి సంచ‌ల‌నం..

హుజురాబాద్ ఉప ఎన్నిక‌తో జ‌రిగేది ఏంటి? అయితే, ఈట‌ల రాజేంద‌ర్ ఎమ్మెల్యే అవుతారు. లేదంటే, గెల్లు శ్రీనివాస్ గెలుస్తారు. అంతేనా? అంటే, అలా కానేకాదు, అంత సింపుల్ అస‌లే కాదు.. ఇంకా చాల‌నే ఉందంటున్నారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. ఆ ఇద్ద‌రులో ఎవరు గెలిస్తే.. భ‌విష్య‌త్‌లో ఎలాంటి ప‌రిణామాలు జ‌రుగుతాయో త‌న‌దైన స్టైల్‌లో అంచ‌నా వేసి చెబుతున్నారు. ఇంత‌కీ రేవంత్‌రెడ్డి జోస్యం ఏంటంటే.. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో చివరికి బకరా అయ్యేది మంత్రి హరీశ్‌రావేనని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తేల్చేశారు. కేటీఆర్‌ను సీఎంను చేసేందుకు హరీశ్‌రావును కేసీఆర్ పావుగా వాడుకుంటున్నారని అన్నారు. కేటీఆర్ కోస‌మే ఈటల రాజేందర్, హరీశ్‌రావును పార్టీ నుంచి వెళ్లగొట్టాలని పన్నాగం పన్నారని ఆరోపించారు. ఈటలను పొమ్మనలేక పొగబెట్టి బయటికి పంపించేశారని చెప్పారు. ఒక‌వేళ హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ ఓడిపోతే.. అది సాకుగా చూపించి హరీశ్‌రావును సైతం పార్టీ నుంచి పంపించేస్తార‌ని అన్నారు. ఒక‌ప్పుడు మంచి మిత్రులైన ఈట‌ల‌, హ‌రీశ్‌ల‌ను ఒకరిపై ఒకరిని ఉసిగొల్పి.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు రాలుతాయనేది కేసీఆర్ వ్యూహ‌మ‌నేది రేవంత్‌రెడ్డి ఆరోప‌ణ‌. ఇక‌, బీజేపీ-టీఆర్‌ఎస్ మధ్య అంతర్గత ఒప్పందాలున్నాయని, అందుకే కేసీఆర్‌ అవినీతిపై కేంద్ర‌ దర్యాప్తు సంస్థలు ఒక్క కేసు కూడా నమోదు చేయడం లేదని పీసీసీ చీఫ్‌ ఆరోపించారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ గెలిస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిలకు ప్రమాదమని రేవంత్‌ అన్నారు.  సీఎం కేసీఆర్‌, ఈటల రాజేందర్‌ది ప్రజల సమస్య కాదని.. పైసలు, పంపకాల పంచాయితీ అని మండిప‌డ్డారు. వారిద్దరి స్వార్థం కోసమే హుజూరాబాద్ ఉప ఎన్నిక వచ్చిందన్నారు. కేసీఆర్‌, ప్రధాని మోదీ అక్రమాలను నిలదీయడానికే హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ పోటీ చేస్తోందని తెలిపారు. ఏడేళ్లలో తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ చేసిందేమీలేదని.. చేసిందల్లా అల్లుడిని అంబానీ, బిడ్డను బిర్లా, కొడుకును టాటా చేసి ఆయన చార్లెస్‌ శోభరాజ్‌ అయ్యారని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.  ఇలా, ఇటు టీఆర్ఎస్‌ను, అటు బీజేపీని కార్న‌ర్ చేస్తూ రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్లు హుజురాబాద్ ఎన్నిక వేళ క‌ల‌క‌లం రేపుతున్నాయి. రేవంత్ విశ్లేష‌ణ ఆస‌క్తిక‌రంగా ఉంద‌ని అంటున్నారు.   

హుజురాబాద్ పై లేటెస్ట్ సర్వే.. షేకవుతున్న బీజేపీ, టీఆర్ఎస్! 

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నికే తెలంగాణ ఇప్పుడు హాట్ టాపిక్, రాష్ట్రంలో ఏ ఇద్దరు కలిసినా బైపోల్ గురించే చర్చ. హుజురాబాద్ ఏ పార్టీ గెలుస్తుంది అన్న దానిపైనే డిస్కషన్. ఈటల రాజేందర్ రాజీనామాతో జరుగుతున్న ఉప ఎన్నిక ఇప్పుడు ప్రధాన పార్టీలకు సవాల్ గా మారింది. అదే సమయంలో మీడిాయా సంస్థలు, వివిధ సర్వే సంస్థలు హుజురాబాద్ ఫలితంపై ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తున్నాయి.  హుజురాబాద్ ఉప ఎన్నికపై తాజాగా వచ్చిన ఓ సర్వే సంచలనంగా మారింది. నెల క్రితం జరిపిన సర్వేకు.. ఇప్పటి సర్వే ఫలితంలో తేడా రావడం అందిరిని ఆశ్చర్యపరుస్తోంది. దీంతో హుజురాబాద్ లో రోజు రోజుకు సమీకరణలు మారిపోతున్నాయని తెలుస్తోంది.  హుజురాబాద్ ఉప ఎన్నికపై వచ్చిన లేటెస్ట్ సర్వేలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఉన్నట్లు తేలింది. బీజేపీకి 42 శాతం మంది ఓటర్లు, టీఆర్ఎస్ కు 40 శాతం ఓటర్లు మద్దతు ఇచ్చారు. ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సమయంలో దాదాపు 75 శాతం మంది ఆయనకు మద్దతు ఇవ్వగా.. తాజా సర్వేలో అది బాగా తగ్గింది. గత నెలలో నిర్వహించిన సర్వేలోనూ ఆయనకు 55 శాతం మంది సపోర్టుగా నిలిచారు. ఇదే ఇప్పుడు బీజేపీని కలవరపరుస్తోంది. హరీష్ రావు ఎంట్రీ తర్వాత టీఆర్ఎస్ గ్రాఫ్ క్రమంగా పెరుగుతుందని చెబుతున్నారు. అందుకే మూడు నెలల క్రితం 20 శాతానికి తక్కువగా ఉన్న ఓట్ల శాతం ఇప్పుడు 40 శాతానికి చేరిందని చెబుతున్నారు.  రానున్న రోజుల్లో టీఆర్ఎస్ కు ఓట్ల శాతం మరింతగా పెరుగుతుందని గులాబీ లీడర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.  హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా  బీసీ సామాజిక వర్గానికి చెందిన ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ , కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెలమ సామాజిక వర్గానికి చెందిన వెంకట్ బల్మూర్, బీజేపీ తరపున మాజీ మంత్రి, ముదిరాజ్ కులానికి చెందిన ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. సామాజికవర్గాల వారీగా చూస్తే నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న వర్గాల్లో.. టీఆర్ఎస్ కు దళిత సామాజికవర్గానికి చెందినవారు 80%, గొల్లకుర్మల సామాజికవర్గానికి చెందినవారు 80%,గౌడలలో 50% ముదిరాజ్ లలో 20 % పద్మశాలిలు 60%,రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు 40 %మైనార్టీ వర్గానికి చెందిన వారు 80%మంది మొత్తంగా 40%ప్రజలు టీఆర్ఎస్ వైపే మొగ్గుచూపుతున్నారని తేలింది. ఇక బీజేపీకి  గౌడ సామాజికవర్గానికి చెందిన వారు 40% ,ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవారు 80 % పద్మశాలి వర్గానికి చెందిన వారు 40%,రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు 50%మైనార్టీ వర్గానికి చెందినవారు 10% మొత్తంగా 42% మంది ఓటర్లు మొగ్గుచూపారని సర్వేలో  తేలింది. సొంత ఇలాఖాగా భావిస్తున్న ఈటలకు కమలాపూర్ లోనూ గట్టి పోటీ కనిపిస్తోంది. జమ్మికుంటలో మాత్రం  టీఆర్ఎస్  కంటే ఈటల రాజేందర్ కు ఎక్కువ మద్దతు లభించింది. ఇల్లంతకుంట ,వీణవంక , హుజురాబాద్ లో రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది.  గత సార్వత్రిక ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ పార్టీకి మాత్రం కేవలం 13% మాత్రం జైకొట్టారు. గత ఎన్నికల్లో ఆరవై వేల ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈసారి డిపాజిట్లు కూడా దక్కవని ఆర్ధమవుతుంది.మరో ఐదు శాతం మంది మాత్రం ఎటూ చెప్పలేకపోయారు. దీంతో తటస్థంగా ఉన్న ఓటర్లు కీలకంగా మారే అవకాశం ఉంది.   

రాజీలేని రోజా.. పెద్దిరెడ్డికి దెబ్బ మీద దెబ్బ‌...

మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి. సీఎం జ‌గ‌న్ త‌ర్వాత అంత‌టి స్థాయి ఉన్న‌వారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు జ‌గ‌న్ చేసిన‌ పాద‌యాత్రకు ఫండింగ్ అంతా ఆయ‌నదే. అందుకే, జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక‌.. కీల‌క‌మైన శాఖ‌ను పెద్దిరెడ్డికి క‌ట్ట‌బెట్టి.. ఆర్థికంగా ఆయ‌న రుణం తీర్చుకున్నార‌ని అంటారు. ఒక‌వేళ సీబీఐ కేసుల్లో జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు అయి జైలుకెళితే.. ముఖ్య‌మంత్రి పీఠం సైతం పెద్దిరెడ్డిదేన‌నే ప్ర‌చార‌మూ ఉంది. వైసీపీలో ఇంత‌టి ఖ‌త‌ర్నాక్‌ లీడ‌ర్‌కు.. ఎమ్మెల్యే రోజా ఎప్ప‌టిక‌ప్పుడు జ‌బర్ద‌స్థ్ ఝ‌ల‌క్ ఇస్తున్నారు. జ‌గ‌న్‌కు చెల్లెలినంటూ.. న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో చ‌క్రం తిప్పుతున్నారు. రోజా, పెద్దిరెడ్డిల మ‌ధ్య ద‌శాబ్దాల వైరం ఉంది. ఇద్ద‌రి మ‌ధ్య ఏళ్లుగా ఆధిప‌త్య‌పోరు న‌డుస్తోంది. సీఎం జ‌గ‌న్‌కు పెద్దిరెడ్డి ఎంత‌టి ప్ర‌ధాన నాయ‌కుడైనా కూడా.. రోజా విష‌యం వ‌చ్చే  స‌రికి జ‌గ‌న్ సైతం సైడ్ అయిపోతుంటారు. వారి వైరంలో జ‌గ‌న్‌రెడ్డి జోక్యం చేసుకోరు. దీంతో.. రోజా వ‌ర్సెస్ పెద్దిరెడ్డి ఎపిసోడ్ చిత్తూరు జిల్లాలో హాట్ హాట్‌గా సాగుతూ ఉంటూనే ఉంటుంది.  తాజాగా, నిండ్ర మండ‌లాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పెద్దిరెడ్డి, రోజాల మ‌ధ్య పోరు మ‌రోసారి హీట్ పుట్టించింది. పెద్దిరెడ్డి నేరుగా ఎంట్రీ ఇవ్వ‌కుండా ప‌రోక్షంగా త‌న మ‌నుషులైన చ‌క్ర‌పాణిరెడ్డి, భాస్క‌ర్‌రెడ్డిల‌తో రోజాకు చెక్ పెట్టేలా రాజ‌కీయం చేశారు. కానీ, చివ‌రాఖ‌రికి రోజా చేతిలో పెద్దిరెడ్డికి ప‌రాభ‌వం త‌ప్ప‌లేదు. ఇలా ప‌దే ప‌దే రోజా దూకుడు ముందు పెద్దిరెడ్డి ప‌ర‌ప‌తి ప‌నికిరాకుండా పోతుండ‌టంతో పెద్దాయ‌న‌ తీవ్ర అవమాన భారానికి లోన‌వుతున్నార‌ని అంటున్నారు. ఇంత‌కీ న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో అస‌లేం జ‌రిగిందంటే... మండల పరిషత్ ఎన్నికల్లో నిండ్ర మండలంలో వైసీపీ ఘన విజయం సాధించింది. మండలాధ్యక్షుడిగా శ్రీశైలం ఆలయ బోర్డు చైర్మన్ చక్రపాణిరెడ్డి సోదరుడు భాస్కర్‌రెడ్డి కైవ‌సం చేసుకోవాల‌ని చూశారు. దీనికి న‌గ‌రి ఎమ్మెల్యే రోజా తీవ్ర అభ్యంత‌రం చెప్పారు. త‌న ఏరియాలో తాను చెప్పిన వారికే మండ‌లాధ్య‌క్ష ప‌ద‌వి ఇవ్వాలి కానీ, ఇక్క‌డ‌ పెద్దిరెడ్డి వ‌ర్గీయుల పెత్త‌నం ఏంట‌ని అడ్డుచెప్పారు. ఎంపీటీసీ దీప పేరును రోజా ప్ర‌తిపాదించారు. దీంతో ఇటు పెద్దిరెడ్డి వ‌ర్గం, అటు రోజా వ‌ర్గం.. వ్యూహ‌ప్ర‌తివ్యూహాల‌తో ప‌లుమార్లు అధ్య‌క్ష ఎంపిక వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. భాస్క‌ర్‌రెడ్డిపై నేరుగా మంత్రి పెద్దిరెడ్డికే ఫిర్యాదు చేసి రాజ‌కీయ చాణ‌క్యం ప్ర‌ద‌ర్శించారు రోజా. అయినా, ఫ‌లితం లేక‌పోవ‌డంతో చివ‌రాఖ‌రికి పంచాయితీ సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌రికి చేరింది.  ఇటు వైసీపీ టాప్ లీడ‌ర్ పెద్దిరెడ్డి.. అటు దేవుడిచ్చిన చెల్లెమ్మ రోజ‌మ్మ‌. ఇద్ద‌రిలో ఎవ‌రి వైపు నిల‌వాలో జ‌గ‌న్‌కు సైతం పెద్ద ప‌రీక్షే పెట్టింది. ఇరువురి వాద‌న‌లు విన్నాక‌.. న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక కాబ‌ట్టి.. స్థానిక ఎమ్మెల్యే అయిన రోజా సూచించిన దీపకే జ‌గ‌న్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చారు. ప‌దే ప‌దే త‌న ప‌రిధి దాటి.. రోజా ఇలాఖాలో మంత్రి పెద్దిరెడ్డి వేలు పెడుతుండ‌టంపై సీఎం జ‌గ‌న్ ఆగ్ర‌హం కూడా వ్య‌క్తం చేశార‌ని తెలుస్తోంది.  జ‌గ‌న్ జోక్యంతో పెద్దిరెడ్డి ఫుల్‌గా డిస‌ప్పాయింట్ అయ్యారట‌. ఎలాగైనా రోజాకు చెక్ పెట్టి.. త‌న వ‌ర్గీయుడైన చ‌క్ర‌పాణిరెడ్డికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో న‌గ‌రిని క‌ట్ట‌బెట్టాల‌ని ఎప్ప‌టి నుంచో గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్నారు. మిగ‌తా విష‌యాల్లో పెద్దిరెడ్డికి జ‌గ‌న్ స‌పోర్ట్ ఫుల్‌గా ఉన్నా.. ఎమ్మెల్యే రోజా విష‌యం వ‌చ్చేసరికి ఆయ‌న ఆమె వైపే మొగ్గు చూప‌డం మంత్రి రామ‌చంద్రారెడ్డికి మింగుడు ప‌డ‌టం లేదు. జ‌స్ట్ రోజానే ఎదుర్కోలేని ఆయ‌న‌.. జ‌గ‌న్ జైలుకు వెళితే సీఎం అవుదామ‌ని ఎలా క‌ల‌లు కంటున్నారో అర్థం కావ‌డం లేదంటూ.. రోజా వ‌ర్గీయులు సెటైర్లు వేస్తున్నారు.   

మాకు మీ ఓట్లు అవసరం లేదు.. బీజేపీ నేత ఓపెన్ స్టేట్ మెంట్

ఎన్నికలు వచ్చాయంటే ఓట్ల కోసం నేతలు ఎంతకైనా తెగిస్తుంటారు. తమ వ్యతిరేకులను సైతం కలిసి ఓట్లు అభ్యర్థిస్తుంటారు. కాని ఓ బీజేపీ నేత మాత్రం మాకు మీ ఓట్లు అవసరం లేదంటూ ఓ వర్గాన్ని ఉద్దేశించి బహిరంగంగానే ప్రకటన చేశారు, బీజేపీ నేత ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది.  బెంగాల్ నుంచి అసోంలోకి వచ్చిన మియా ముస్లింల ఓట్లు బీజేపీకి అవసరం లేదని అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అన్నారు. ‘‘నాకు మియాల ఓట్లు వద్దు. మేం సామరస్యంతో బతుకుతున్నాం. ఓట్ల కోసం వారి దగ్గరకు నేను వెళ్లను. వారూ నా దగ్గరకు రారు’’ అని చెప్పారు. వలస వచ్చిన ముస్లింల వల్లే అసోం తన ఉనికి, సంస్కృతి, భూమిని కోల్పోయిందని చాలా మంది భావిస్తున్నారన్నారని చెప్పారు.  రాష్ట్రంలో మత రాజకీయాలు లేవని సీఎం పేమంత్ శర్మ స్పష్టం చేశారు. వలస ముస్లింలు ఎక్కువ మందిని కంటున్నారని, దాని వల్ల ఎక్కువగా భూములు కబ్జాకు గురవుతున్నాయని చెప్పారు. స్వాతంత్రానికి ముందే ఇది ప్రారంభమైందని అస్సామీలు నమ్ముతున్నారని, తానూ ఆ భారాన్ని మోస్తున్నానని తెలిపారు. తాము ఎవరి మీదా ద్వేషం చూపించట్లేదన్నారు. 77 వేల ఎకరాల భూములు ఆక్రమణలకు గురయ్యాయని, వాటినే తొలగించామని చెప్పారు. కేవలం వెయ్యి కుటుంబాలే అంత భూమిని ఆక్రమించాయా? అని ప్రశ్నించారు. భూమి లేని రాష్ట్ర ప్రజలకు భూములు ఇవ్వాల్సి ఉందని, అందుకే వారిని ఖాళీ చేయించామని చెప్పారు. ఖాళీ చేయించడం నిరంతరం జరిగే ప్రక్రియ అన్నారు. ప్రియాంక గది ఊడ్చిన విషయంపై స్పందించిన హేమంత్ శర్మ.. అదేమంత పెద్ద విషయం కాదన్నారు. తన తల్లి కూడా ఇల్లు ఊడ్చేదన్నారు. మామూలు జనం ఎవరూ పెద్దగా దానిని పట్టించుకోరన్నారు. ఆమె ఊడ్చే విధానమూ కరెక్ట్ కాదని చెప్పారు.

నెలరోజుల్లో బిల్లులు చెల్లించాల్సిందే.. ఇరకాటంలో జగన్ రెడ్డి సర్కార్ 

పాలకులు వస్తుంటారు.. పోతుంటారు... కానీ ప్రభుత్వం అనేది మాత్రం నిరంతర ప్రక్రియ... అలా కొనసాగుతూనే ఉంటుంది. ఒక శాశ్వత వ్యవస్థ. ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉన్న ఎవరికైనా, ముఖ్యంగా అధికార రాజకీయాలలో మునిగితేలుతున్న వారికి, ఈ చిన్ని సత్యం తెలిసే ఉంటుంది. ఒక వేళ పుట్టుకతో అబ్బిన కొన్ని ‘సుగుణాల’ వలన చేత తెలియక పోయినా, తెలియచేప్పెందుకు అన్నీ తెలిసిన అధికారులు ఉండనే ఉన్నారు.  గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లు చేసిన పనులకు, చెల్లించవలసిన పెండింగ్ బిల్లులు, మా ప్రభుత్వం ఎందుకు చెల్లించాలి ... చెల్లించదు .. అని ఏ ప్రభుత్వం,ఏ ముఖ్యమంత్రి అయినా మొండికేశారంటే, ఆ ప్రభుత్వం నిస్సందేహంగా ఏపీని ఏలుతున్న వైసీపీ ప్రభుత్వమే అయి ఉంటుంది. ఆ ముఖ్యమంత్రి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డే అయ్యుంటారు. ఎందుకంటే ఇంకెవరూ కూడా, ఇంత ‘చక్కటి’ చండాల ఆలోచన చేయలేరు.ఇది వారికి మాత్రమే దేవుడు ప్రసాదించిన ప్రత్యేక వరం అంటారు, ఏపీ ప్రభుత్వ పనితీరును పరిశీలనగా చూస్తున్న రాజకీయ విశ్లేషకులు.   అయితే అది దేవుడు ప్రసాదించిన వరమే అయినా, ఇంకొకటే అయినా, రాజ్యాంగబద్దం కానప్పుడు కోర్టుల మొట్టి కాయలు తప్పవు. అఫ్కోర్స్, అలా మొట్టికాయలు తినడంలో కూడా, వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ పాత రికార్డులను తామే బద్దలు కొట్టుకుంటూ విజయపథంలో ముదుకు సాగుతున్నారు అనుకోండి,  ముఖ్యమంత్రి ‘సీతయ్య’ పోకడలు కారణంగా వస్తున్న కోర్టు తీర్పులతో ఏపీ ప్రభుత్వం మరో మారు ఇరకాటంలో పడింది.గత (టీడీపీ) ప్రభుత్వ హయాంలో వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో పనులు  చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు ఆపేసిన జగన్ రెడ్డి ప్రభుత్వంపై ఇప్పుడు కాంట్రాక్టర్లు యుద్ధం ప్రకటించారు. ఏకంగా రోడ్డెక్కి ప్రభుత్వాన్నినిలదీస్తున్నారు.అవును మరి,ఒకటా,రెండా  ఏకంగా 80 వేల కోట్ల రూపాయల బిల్లులను రెండున్నర సంవత్సరాలు పెండింగ్’లో పెడితే ఎవరైనా ఎందుకు ఊరుకుంటారు.అందుకే, జెండాలు పక్కన పెట్టి కాంట్రక్టర్లు రోడ్డెక్కారు. పాత బిల్లులు ఇవ్వకపోతే ఇకపై ఎవరూ కొత్త పనులు చేసేది లేదని అల్టిమేటం ఇచ్చారు. బిక్షాటన చేసి జగన్ రెడ్డి ప్రభుత్వం పరువును, బట్టలిప్పి బజారులో నిలబెట్టారు. రాష్ట్రంలో రోడ్ల దురవస్థ రాజకీయ కొరడా ఝుళిపిస్తోంది.జనసేన అదినేత శ్రమదానం అంటూ రోడ్డున పడ్డారు.తెలుగు దేశం పార్టీ, ఎక్కడిక్కడ ఆందోళననలు నిర్వహిస్తోంది. ఒక్క  రోడ్లనే కాదు, ఇంకా చాలా చిన్నాచితకా పనులు వివిద కారణాలతో నిలిచి పోయాయి. ఎదో ఒకటి రెండు శాఖలు కాదు, దాదాపు ప్రభుత్వ శాఖలన్నీ కాంట్రాక్టర్లకు బకాయిలు పడ్డాయి. చివరకు పంచాయతీ ఆఫీసులకు సొంత డబ్బులతో రంగులు వేయించిన పంచాయితీ కార్యదర్శులు కూడా ఇప్పుడు ప్రభుత్వంపై, అన్ని కోణాల్లో వత్తిడి తెస్తున్నారు.మరోవైపు వచ్చే నెలలోగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంతోపాటు.. అందరికీ బిల్లులు చెల్లించినట్లు అఫిడవిట్ ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుజగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఇటు చూస్తే, అటు చూస్తే ఎటు చూసినా అష్టమ దిక్కే కనిపిస్తోంది అన్నట్ల్గు, జగన్ ప్రభుత్వానికి ఎటుచుసిన పట్ట పగలే చుక్కలు కనిపిస్తున్నాయి.  నిజానికి,ఈ దయనీయ పరిస్థితి పూర్తిగా,ప్రభుత్వ స్వయంకృతం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లు అందరూ టీడీపీ వారే అనే దురాలోచనతో కావచ్చును , అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు,చంద్రబాబు మీద కోపాన్ని, కాంట్రాక్టర్ల మీద చూపారు. కాంట్రక్టర్ల  బిల్లులు ఆపేసి,వారికి  ఆర్థిక ఇబ్బందులు సృష్టించి, వారు పడుతున్న కష్టాలు తెలుసుకుని ఒక రకంగా అదోరకం ఆనందం పొందారు. అయితే, ఇప్పుడు వైసీపే ప్రభుత్వం తాను తీసుకున్న గోతిలో పడి, ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఓ పక్క నుంచి  కాంట్రాక్టర్లు వీధుల కెక్కి, ప్రభుత్వం పరువు తీస్తున్నారు, మరో వంక కోర్టు కొరడా పట్టుకుని కూర్చుంది, నెల రోజుల్లో బిల్లులు అన్నీ చెల్లించి, అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.  మరో వంక రోడ్లు ఇతర మౌలిక సదుపాయాల పనుల ఆగిపోయి అవస్థలు పడుతున్న ప్రజలు ప్రభుత్వం పై భగ్గుమంటున్నారు. అయితే ఈ ప్రభుత్వం కష్టాల్లో ఉందని ఎవరూ జాలి పడవలసిన అవసరం లేదు .. చేసుకున్నవారికి చేసుకున్నంత..  అంటున్నారు , జగన్ రెడ్డి బాధితులు.

జగన్ పాలనలో ఏపీ ఆగమాగం.. ఉండవల్లి సంచలనం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం జగన్మోహన్ రెడ్డిపై మాజీ ఎంపీ, వైఎస్సార్ ప్రధాన అనుచరుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారం అప్పులు చేస్తోందని ఉండవల్లి ఆరోపించారు. జగన్‌ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.6 లక్షల కోట్ల అప్పు చేసిందని.. అమరావతిని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారని మండిపడ్డారు. ఎంతో మంది సలహాదారులు ఉన్న ఈ ప్రభుత్వం ఆర్థిక దయనీయ పరిస్థితులు ఉండటం దారుణమన్నారు. ఇంత జరుగుతున్నా అసలు ప్రభుత్వ సలహాదారులు ఏం చేస్తున్నారు? అని మాజీ ఎంపీ ప్రశ్నించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏపీకి గడ్డు పరిస్థితి తప్పదని ఉండవల్లి హెచ్చరించారు. ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారిపోయిందని  అన్నారు. వన్ నేషన్.. వన్ రేషన్ కార్డుకు దేశంలోని ఏ రాష్ట్రం ఒప్పుకోకపోయినా ఏపీ మాత్రం ఒప్పుకుందని ఉండవల్లి విమర్శించారు. పోలవరంపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని,  ప్రాజెక్ట్‌ పనులు పూర్తికాకపోయినా హడావుడిగా ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. పోలవరం పనుల్లో ఎలాంటి మార్పులు రాలేదని, ప్రాజెక్ట్‌కు సంబంధించి రూ.4,068 కోట్లు కొర్రీలు వేశారని ఉండవల్లి ఆరోపించారు. పనులు పూర్తి కాకపోయినా మంత్రులు హడావుడి చేస్తున్నారని తెలిపారు. పోలవరం నిర్వాసితులకు ఇప్పటికీ పరిహారం అందడం లేదన్నారు. తాగునీటి విషయంలో పోలవరం ప్రాజెక్ట్‌కు అనుమతి ఇవ్వకపోవడం దారుణమన్నారు ఉండవల్లి. పోలవరం నిధులపై రాష్ట్రం ఏర్పాటు నుంచి చర్చ జరుగుతోందని.. అయినా  పోలవరం నిధులపై ఇప్పటికీ సరైన స్పష్టత లేదని  ఉండవల్లి కామెంట్ చేశారు. 

హుజురాబాద్ స్టార్ క్యాంపెయినర్లు వీళ్లే..

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నామినేషన్లు ముగియడంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. ఇప్పటికే అధికార టీఆర్ఎస్, బీజేపీలు స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల చేయగా.. తాజాగా కాంగ్రెస్ తన స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ విడుదల చేసింది.  20 మందితో క్యాంపయిన‌ర్ల‌ జాబితాను ఏఐసీసీ అధికారికంగా విడుదల చేసింది, హుజురాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూర్ వెంకట్ శుక్రవారం నామినేషన్ వేశారు. హుజురాబాద్ లో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్ ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు దామోద‌ర రాజ‌న‌ర్సింహా \ పొన్నం ప్రభాకర్  మధుయాష్కీ గౌడ్ మహేశ్వర్ రెడ్డి  హనుమంతరావు  పొన్నాల లక్ష్మయ్య  అజారుద్దీన్  జగ్గారెడ్డి  మహ్మద్ అలీ షబ్బీర్  ఎమ్మెల్యే సీతక్క కరీంనగర్ డీసీసీ ప్రెసిడెంట్ కవ్వంపల్లి సత్యనారాయణ నాయిని రాజేందర్ రెడ్డి  

వార్నింగ్ కాదు విషెష్.. స‌జ్జ‌ల‌పై సంఘాల రివ‌ర్స్ ప్రెస్‌మీట్‌..

ఏపీ ఉద్యోగ సంఘాల‌ నేత‌లు ఇర‌కాటంలో ప‌డ్డారు. స‌మ‌స్య‌లపై పోరాడితే స‌ర్కారుకు ఆగ్ర‌హం.. అలాగ‌ని మౌనంగా ఉంటే ఉద్యోగుల‌కు సంక‌టం. ఇలా వారి ప‌రిస్థితి ఇర‌కాటంలో ప‌డింది. అందుకే, వార్నింగ్ ఇచ్చిన వారినే.. విషెష్ చెప్పారంటూ చెప్ప‌క త‌ప్ప‌ని దుస్థితి. ఎవ‌రి వ‌ల్ల ఇబ్బందులో.. వారినే పొగుడుతూ ప్రెస్‌మీట్లు పెట్టాల్సిన దౌర్భాగ్యం. నాయ‌క‌త్వ ప‌రిణితి లేని ఉద్యోగ సంఘ నాయ‌కుల వ‌ల్ల‌.. ఏపీ ప్ర‌భుత్వ‌ ఉద్యోగులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారని అంటున్నారు. సంఘం నేత‌ల‌పై ఉద్యోగులు క‌న్నెర్ర జేస్తున్నారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే... మూడురోజుల కిందట ఉద్యోగ సంఘం నేతలు విజయవాడలో ప్రెస్‌మీట్‌ పెట్టి ప్రభుత్వంపై విమ‌ర్శ‌లు చేశారు. స‌మ‌యానికి జీతాలు, పెన్ష‌న్లు ఇవ్వాల‌ని.. పీఆర్సీ అమ‌లు చేయాల‌ని.. ప‌లు స‌మ‌స్య‌లు వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని.. ఇలా వారి క‌ష్టాల‌న్నీ మీడియా ముఖంగా ఏక‌రువు పెట్టారు. ప్ర‌భుత్వ తీరు మార‌క‌పోతే.. పోరాటం త‌ప్ప‌ద‌నీ హెచ్చ‌రించారు. అయితే, ఆ ప్రెస్‌మీట్‌కు ముందు ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న జ‌రిగింది. అదిప్పుడు మ‌రో ప్రెస్‌మీట్‌కు కార‌ణ‌మైంది. అప్పుడు ఆగ్ర‌హం కాస్త ఇప్పుడు సంజాయిషీగా రూపు మార‌డం మ‌రింత ఇంట్రెస్టింగ్ పాయింట్‌. ఇటీవ‌లి ప్రెస్‌మీట్‌కు ముందు ఏపీఎన్జీవో నేత బండి శ్రీనివాసరావుకు ప్ర‌భుత్వ స‌ల‌హాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి ఫోన్ వచ్చింది. మీడియా మైక్‌ల‌న్నీ ఆన్‌లో ఉండటంతో బండి శ్రీనివాసరావు.. స‌జ్జ‌ల‌తో ఫోన్‌లో మాట్లాడారు. "కంట్రోల్‌లోనే ఉంటాం సార్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడం సార్" అంటూ స‌జ్జ‌ల‌తో ఉద్యోగ సంఘాల నేత‌లు బెదురు బెదురుగా మాట్లాడ‌టం మీడియాలో రికార్డ్ అయింది. బండి శ్రీనివాస‌రావు రియాక్ష‌న్‌ను బ‌ట్టి.. అటునుంచి ఫోన్లో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి బెదిరిస్తున్న‌ట్టు ఈజీగా తెలిసిపోతోంది. కంట్రోల్‌లోనే ఉంటాం సార్‌.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడం సార్.. అంటే మీనింగ్ ఏంటి? కంట్రోల్‌లో ఉండాల‌ని స‌జ్జ‌ల హెచ్చ‌రించిన‌ట్టేగా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడ వ‌ద్ద‌ని ఉద్యోగ సంఘాల నేత‌ల‌ను స‌జ్జ‌ల బెదిరించిన‌ట్టేగా? ఇదే టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. స‌జ్జ‌ల వార్నింగ్‌పై ర‌చ్చ న‌డుస్తోంది. దీంతో.. స‌జ్జ‌ల‌ను వెన‌కేసుకొచ్చేందుకు తాజాగా మ‌రోసారి ప్రెస్‌మీట్ పెట్టారు ఉద్యోగ సంఘాల నాయ‌కులు. ఆ ప్రెస్‌మీట్‌లో వాళ్ల వివ‌ర‌ణ వింటే.. ప్ర‌భుత్వం బ‌ల‌వంతం మీదే వారంతా మ‌రోసారి మీడియా ముందుకు వ‌చ్చి.. స‌ర్కారును వెన‌కేసుకు వ‌చ్చార‌ని ఇట్టే అర్థ‌మైపోతుంది.   సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేశారు కానీ తమను బెదిరించలేదని.. శుభాకాంక్షలు చెప్పారని ఏపీ ఎన్జీవో నేత‌లు చెప్పుకొచ్చారు. ఫ్రెండ్లీ ప్రభుత్వంతో ఘర్షణ ఉండొద్దని స‌జ్జ‌ల అన్నార‌ట‌. సెక్రటేరియట్‌లో తమ సమస్యలు చెప్పుకోవడానికి జీతాలు, పెన్షన్లు రాలేదని అడగడానికి సెక్రటేరియట్‌లో ఎవరూ ఉండరని.. తమకు ఒక్క సజ్జల మాత్రమే అందుబాటులో ఉంటారని.. తెగ వెన‌కేసుకొచ్చారు. అయినా.. ఉద్యోగుల స‌మ‌స్య‌లు విన‌డానికి స‌జ్జ‌ల ఎవ‌రు? ఆయ‌న కేవ‌లం ప్ర‌భుత్వ స‌ల‌హాదారు మాత్ర‌మే క‌దా? అనే అనుమానం రాక‌మాన‌దు..అది వేరే విష‌యం. ఇక‌, తాజా ప్రెస్‌మీట్‌లోనూ ఏపీ ఎన్జీవో నేత‌ల క‌ళ్ల‌ల్లో, మాట‌ల్లో.. ప్ర‌భుత్వంపై భ‌యం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. స‌జ్జ‌ల బెదిరించ‌లేదు, శుభాకాంక్ష‌లు చెప్పార‌ని వారెంత న‌మ్మించే ప్ర‌య‌త్నం చేసినా.. సజ్జ‌ల ఒత్తిడితోనే ఉద్యోగ సంఘాల నేత‌లు ఈ మీడియా స‌మావేశం పెట్టార‌ని.. ఇలాగైతే వీళ్లు ఉద్యోగ స‌మ‌స్య‌ల‌పై స‌ర్కారుపై ఇంకేం పోరాటం చేస్తార‌ని ఏపీ ఉద్యోగులు త‌మ నేత‌ల తీరుపై మండిప‌డుతున్నారు.   

కమలం నేతలను కారెక్కిస్తున్న హరీష్.. రేవంత్ రెడ్డిపైనే ఈటల ఆశలు!

తెలంగాణ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్న కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రధాన ఘట్టం ముగిసింది, నామినేషన్లు ముగియడంతో ప్రధాన పోటీదారులెవరన్నది తేలిపోయింది. నామినేషన్లు ముగియడంతో అంతా ప్రచారంపై ఫోకస్ చేశారు. అక్టోబర్  ముప్పైన జరగనున్న పోలింగ్ కోసం శ్రమిస్తున్నారు. అయితే అన్ని పార్టీలు సవాల్ గా తీసుకోవడంతో ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. దీంతో రోజురోజుకు పార్టీల బలాబలాలు మారుతున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకున్న సీఎం కేసీఆర్, ఆయన డైరెక్షన్ లోనే ప్రచారం సాగుతోంది, ట్రబుల్ షూటర్ గా పేరున్న మంత్రి హరీష్ రావుకు ఎన్నికల బాధ్యతలు అప్పగించారు ముఖ్యమంత్రి. దీంతో హరీష్ తో పాటు ముగ్గురు మంత్రులు దాదాపు డజన్ మంది ఎమ్మెల్యేలు హుజురాబాద్ లోనే మకాం వేశారు, ప్రచారం నిర్వహిస్తూనే ఈటల రాజేందర్ కు మద్దతుగా ఉన్న నేతలపై ఫోకస్ చేశారు గులాబీ లీడర్లు, మంత్రి హరీష్ రావు స్వయంగా వాళ్లతో మాట్లాడుతూ తన వైపునకు తిప్పుకుంటున్నారు, హరీష్ ఎత్తులతో రోజుకో ఈటల అనుచరుడు కారెక్కేస్తున్నారు. గతంలో టీఆర్ఎస్ లో ఉండి ప్రస్తుతం రాజేందర్ వెంట నేతలతో పాటు స్థానిక బీజేపీ నేతలను కూడా తమ పార్టీలో చేరేలా పావులు కదుపుతున్నారు హరీష్ రావు. ఈటల వెంట ఉన్న నేతలకు భారీగా నజరానాలు ముట్టజెప్పుతున్నారట టీఆర్ఎస్ లీడర్లు, వాళ్ల స్థాయిలను బట్టి వేల నుంచి లక్షల వరకు ముట్టజెప్పుతున్నారట. వార్డు స్థాయి లీడర్ కు ఒక రేటు... గ్రామస్తాయి లీడర్ కు మరో రేటు ఇస్తున్నారట. మండలస్థాయి నాయకుడైతే 10 లక్షల వరకు ఆఫర్ ఇస్తున్నారట కారు పార్టీ నేతలు. మంత్రి హరీష్ రావే స్వయంగా వాళ్లతో మాట్లాడుతున్నారని చెబుతున్నారు, ఇక కుల సంఘాల లీడర్లు, యువజన సంఘాలు, మహిళా సంఘాలకు వల వేస్తున్నారట. హరీష్ డైరెక్షన్ లోనే జరుగుతున్న ఈ ఎత్తులు ఫలిస్తున్నాయని, ఈటల రాజేందర్ వెంట ఉన్న నేతలు ఒక్కొక్కరుగా కారెక్కుతున్నారని తెలుస్తోంది. ఎన్నికల నాటికి ఈటల అనుచరులలో మెజార్టీ నేతలను తమ వైపు తిప్పుకునేలా హరీష్ రావు ముందుకు సాగుతున్నారని టీఆర్ఎస్ వర్గాల సమాచారం, గ్రామ స్థాయిలో బీజేపీకి బూత్ మేనేజ్ మెంట్ లేకుండా చేయడమే హరీష్ రావు వ్యూహమంటున్నారు. హుజురాబాద్ పై తాజాగా వెలువడుతున్న సర్వేల్లోనూ టీఆర్ఎస్ క్రమంగా పుంజుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పుడు ఈటలకు నియోజకవర్గంలో దాదాపు 80 శాతం మద్దతు కనిపించగా.. ప్రస్తుతానికి అది 45 శాతానికి పడిపోయిందని అంటున్నారు. జూలైలో 15 శాతం దగ్గరే ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు 40 శాతాన్ని క్రాస్ చేసింది, రోజురోజుకు ఇది పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడు రాజేందర్ ఆశలన్ని కాంగ్రెస్ పైనే ఉన్నాయనే చర్చ కూడా సాగుతోంది. హుజురాబాద్ లో కాంగ్రెస్ బలంగా పోరాడితే,, ఈటల ఓడిపోయి టీఆర్ఎస్ గెలవడం ఖాయమంటున్నారు. కారును ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేసి.. మొక్కుబడిగా ప్రచారం చేస్తే మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత ఓటు మొత్తం ఈటలకు పడవచ్చు, అది జరిగేేతేనే ఈటలకు ప్లస్ అవుతుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని అంటున్నారు. బీజేపీ కూడా తమకు బద్ద వ్యతిరేకి అయినప్పటికీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో టీఆర్ఎస్ ను ఓడించడమే తమకు ముఖ్యమనే భావనలో రేవంత్ ఉన్నారని అంటున్నారు. అందుకే స్థానికేతరుడైన వెంకట్ ను బరిలోకి దింపారంటున్నారు. మొత్తానికి రాజకీయ పార్టీల పోటాపోటీ వ్యుహాలతో హుజురాబాద్ ఉప ఎన్నిక రంజుగా మారుతోంది. రోజుకో మలుపు తిరుగుతోంది. పోలింగ్ నాటికి పరిస్థితులు ఎలా మారుతాయో ఊహించడం కూడ కష్టంగా ఉందంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. 

య‌థా రాజా.. త‌థా మంత్రి.. సీబీఐ కేసుతో ఆది-మూలాలు క‌దిలేనా?

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి. ఏపీ ముఖ్య‌మంత్రి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిందితుడు. 11 సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న నాయ‌కుడు. అలాంటి సీఎం జ‌గ‌న్‌రెడ్డి కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేశ్‌. ముఖ్య‌మంత్రి కాక‌ముందే జ‌గ‌న్‌పై అవినీతి కేసులు ఉన్న‌ట్టు.. మంత్రి కాక‌ముందే సురేశ్‌పై సీబీఐ కేసు న‌మోదైంది. త‌మ పార్టీ అధినాయ‌కుడినే ఆద‌ర్శంగా తీసుకున్నారో, లేక‌, జ‌గ‌నే త‌న అనుభ‌వంతో స‌ల‌హా ఇచ్చారో ఏమో కానీ, ఆ అవినీతి కేసు నుంచి త‌ప్పించుకునేందుకు ఆదిమూల‌పు సురేశ్ గ‌ట్టిగా ప్ర‌య‌త్నించారు. హైకోర్టు స్థాయిలో నెగ్గారు కూడా. కానీ, సీబీఐ మాత్రం జ‌గ‌న్ కేసుల్లో మాదిరి మ‌డ‌మ తిప్ప‌లేదు. సురేశ్‌పై సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానంలో మంత్రి సురేశ్‌కు చెక్ ప‌డింది. ఏపీ కేబినెట్ మినిస్ట‌ర్ ఆదిమూల‌పు సురేశ్‌పై ఉన్న‌ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ద‌ర్యాప్తును కొన‌సాగించాల్సిందేన‌ని సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. జ‌గ‌న్‌పై సీబీఐ, ఈడీ కేసులున్నాయి. ఈ కేసుల విచార‌ణ‌లు త్వ‌ర‌లోనే మొద‌లుకానున్నాయి. ఇప్ప‌టిదాకా కేసుల విచార‌ణ మొద‌లు కాని నేప‌థ్యంలో..వాటిపై జ‌రుగుత‌న్న అనుబంధ పిటిష‌న్ల విచార‌ణ‌కు జ‌గ‌న్ వ్య‌క్తిగ‌త హాజ‌రు నుంచి మిన‌హాయింపు పొందుతున్నారు. త్వ‌ర‌లోనే ఆ కేసుల్లో ట్ర‌య‌ల్స్ స్టార్ట్ కానున్నాయి. అప్పుడు కోర్టుకు సీఎం జ‌గ‌న్ వ్య‌క్తిగ‌త హాజ‌రు త‌ప్ప‌నిస‌రి కావొచ్చు. సరిగ్గా ఇలాంటి స‌మ‌యంలో ఆయ‌న మంత్రివ‌ర్గంలోని మ‌రో మంత్రిపై సైతం సీబీఐ కేసు విచార‌ణ జ‌ర‌గ‌నుండం క‌ల‌క‌లంగా మారింది. ఆదిమూల‌పు సురేశ్‌తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి, ఐఆర్ఎస్ అధికారిణి విజ‌య‌ల‌క్ష్మిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు న‌మోదైంది. సాంకేతిక కార‌ణాల‌తో ఈ కేసుల నుంచి త‌ప్పించుకోవాల‌ని చూడ‌గా.. సుప్రీంకోర్టు తీర్పుతో చెక్ ప‌డింది.  ఆదిమూల‌పు సురేశ్‌పై ఉన్న సీబీఐ కేసు ఏంటంటే... సురేశ్‌, ఆయ‌న స‌తీమ‌ణి విజ‌య‌ల‌క్ష్మి ఆ ఇద్ద‌రూ సివిల్ స‌ర్వీసెస్ అధికారులు. విజ‌య‌ల‌క్ష్మి ఇండియ‌న్ రెవెన్యూ స‌ర్వీస్ కాగా, గ‌తంలో సురేశ్ ఇండియ‌న్ రైల్వే అకౌంట్స్ స‌ర్వీస్‌లో ప‌నిచేసేశారు. 2009లో జాబ్‌కి రిజైన్ చేసి పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చారు సురేశ్‌. కాంగ్రెస్‌లో చేరి.. వైఎస్సార్‌ను మెప్పించి.. ఎమ్మెల్యే అయ్యారు. వైఎస్ మ‌ర‌ణానంత‌రం జ‌గ‌న్ వెంట న‌డిచారు. 2014, 2019లో వైసీపీ త‌ర‌ఫున గెలిచారు. ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టి.. జ‌గ‌న్ కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా ఎదిగారు.    సురేశ్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత.. త‌న స‌తీమ‌ణి విజ‌య‌ల‌క్ష్మి అవినీతికి పాల్ప‌డేలా ప్రోత్స‌హించార‌నేది ఆరోప‌ణ‌. 2017లో విజ‌య‌ల‌క్ష్మి ఆదాయానికి మించి ఆస్తులు క‌లిగి ఉన్నార‌ని.. ఆమె అవినీతికి పాల్ప‌డేలా ప్రోత్సహించారంటూ భ‌ర్త సురేశ్ పైనా కేసు న‌మోదు చేసింది సీబీఐ. అయితే, ప్రాథ‌మిక ద‌ర్యాప్తు చేయ‌క‌ముందే త‌మ‌పై సీబీఐ చార్జిషీట్ దాఖ‌లు చేసింద‌ని, ఈ ప‌ద్ద‌తి చెల్ల‌ద‌ని వాదిస్తూ.. త‌మ‌పై సీబీఐ న‌మోదు చేసిన కేసును కొట్టివేయాల‌ని తెలంగాణ హైకోర్టులో గ‌తంలో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. సాంకేతిక కార‌ణాల‌తో తెలంగాణ హైకోర్టు సీబీఐ ద‌ర్యాప్తును నిలిపేసింది. దీనిపై సీబీఐ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. సుదీర్ఘ విచార‌ణ త‌ర్వాత‌.. సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. అవినీతి కేసుల్లో ప్రాథ‌మిక ద‌ర్యాప్తు అనంత‌ర‌మే చార్జిషీట్ దాఖ‌లు చేయాల‌న్న నిబంధ‌న ఏమీ లేద‌ని, మంత్రి సురేశ్ దంప‌తుల‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ద‌ర్యాప్తును కొన‌సాగించ‌వ‌చ్చ‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేయ‌డంతో.. సీఎం జ‌గ‌న్ లాగానే మంత్రి సురేశ్‌కు సైతం సీబీఐ కేసు బిగియ‌నుంది.   

న్యాయ సంరక్షణలో ఆయనే సుప్రీం! సీజేఐ జస్టిస్ రమణకు జనం జేజేలు..

మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా, అత్యున్నత పదవులను నిర్వర్తించిన వ్యక్తులు చరిత్రలో మిగిలిపోతారు. అయితే, అందులో కొందరే, తాము అలంకరించిన పదవులకు మరింత హుందాతనాన్ని, గౌరవాన్ని చేరుస్తారు. కొత్త అందాలు అద్దుతారు. అలా పదవుల వాళ్ళవల్ల తమకు కాకుండా తమ వ్యక్తిత్వ పరిమళాలతో  పదవుల ప్రతిష్టను పెంచిన వ్యక్తులు కొద్దిమందే ఉంటారు. అలాంటి వారిలో ముఖ్యంగా నడుస్తున్న చరిత్రలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఒకరు.ఆయన మన తెలుగువారు కావడం, మనకు మరింత గర్వకారణం. సుప్రీం కోర్టు ప్రాధాన న్యాయమూర్తిగా, జస్టిస్ ఎన్వీరమణ పోషిస్తున్న పాత్ర, అనేక సందర్భాలలో సామాన్యుల నుంచి న్యాయకోవిదుల వరకు అందరి ప్రశంసలు అందుకుంటోంది.ఇప్పడు సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది దుశ్యంత్‌ దవే, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ అద్భుత పనితీరు కనబరుస్తున్నారని, నిజమైన రాజ్యాంగ సంరక్షుడి పాత్రను పోషిస్తున్నారని అన్నారు. ఉత్తరప్రదేశ్’లోని లఖింపుర్‌ ఖేరి ఘటనపై విచారణ సందర్భంగా సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం వ్యవహరించిన తీరుపై.. ప్రముఖ పాత్రికేయుడు కరణ్‌థాపర్‌తో దవే ముఖాముఖి మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన, లఖింపుర్‌ ఖేరి కేసు విచారణ సందర్భంగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ప్రజలకిచ్చిన సందేశం ఎంతో సానుకూలంగా ఉందని అన్నారు. దేశ ప్రజలకు నిజమైన కాలపాదారు సుప్రీంకోర్టేనని ప్రధానన్యాయ మూర్తి స్పష్టం చేశారని అన్నారు . అసాధారణ రీతిలో విచారణ చేపట్టి... ఎంతో నమ్మకం కలిగించారని దవే పేర్కొన్నారు. సర్వోన్నత న్యాయస్థానాన్ని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ముందుండి నడిపిస్తూ, రాజ్యాంగానికి నిజమైన కాపలాదారుగా దాన్ని నిలిపారని ప్రశంసించారు.”ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు ప్రధానన్యాయమూర్తి పనిచేస్తుండటం నాకెంతో సంతృప్తి కలిగిస్తోంది. అధికారంలో ఉన్నవారు న్యాయ వ్యవస్థపై నిరంతరం ఒత్తిడి తెస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగబద్ధంగా పనిచేసే న్యాయమూర్తులకు లాయర్లు అండగా నిలవాలి. తాను చేసిన రాజ్యాంగబద్ధ ప్రమాణానికి కట్టుబడి ఉన్నట్టు సీజేఐ రోజురోజుకూ నిరూపించుకుంటున్నారు’’ అని దవే పేర్కొన్నారు. నిజానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా  పదవీ  బాధ్యతలు చెప్పట్టిన తర్వాత, జస్టిస్ ఎన్వీ రమణ ఎంతో  క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారని అందరూ అంటూనే ఉన్నారు.ప్రతి రోజు ఏదో ఒక విశేష వ్యాఖ్య, విమర్శ, సూచనతో పత్రికలు, మీడియా ద్వారా ప్రజలకు జస్టిస్ ఎన్వీరమణ మార్గ నిర్దేశం చేస్తూనే ఉన్నారు. సహజంగా న్యాయమూర్తులు, మరీ ముఖ్యంగా ప్రధాన న్యాయమూర్తులు పత్రికలో అంతగా కనిపించరు. కానీ, జస్టిస్ ఎన్వీరమణ ప్రసార, ప్రచార మాధ్యమాల ద్వారా ప్రతి రోజు ప్రజలకు చేరువవుతూనే ఉన్నారు. అంతేకాదుతద్వారా న్యాయ వ్యవస్థ పట్ల సామాన్య  ప్రజల్లోనూ విశ్వాసం పెంచుతున్నారని న్యాయకోవిదులు అంటున్నారు.

తమిళ తెరపైకి మళ్ళీ శశికళ.. అన్నాడీంకేలో చీలిక తప్పదా?

తమిళనాడు రాజకీయాలలో పరిచయం అవసరం లేని పేర్లలో, దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు, అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శిగా శశికళ కూడా ఒకరు.అయితే, జయలలిత మరణంతో అనివార్యంగా అజ్ఞాతంలోకి వెళ్ళిన ఆమె, మళ్ళీ రాజకీయ తెరంగేట్రం చేసేందుకు, మరోమారు సిద్దమవుతున్నారు. నిజానికి, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే, జైలు నుంచి బయటకు వచ్చిన ఆమె (జయలలిత అక్రమాస్తుల కేసులో, సహా ముద్దాయిగా ఆమెకు శిక్ష పడింది. జయ మరణం తర్వాత కొద్దిరోజులకే కోర్టు శిక్ష ఖరారు చేయడంతో ఆమె జైలుకు వెళ్లారు) రాజకీయ సన్యాసం ప్రకటించారు. అయితే, ఎన్నికలలో అన్నా డిఎంకే ఓడిపోయిన నేపధ్యంలో ఆమె, మళ్ళీ వస్తున్నా’ అంటూ ఆ మధ్యన   సంకేతాలు పంపించారు.అయితే కారణం ఏమిటో ఏమో కానీ ఆ తర్వాత గత కొన్ని నెలలుగా ఆమె ఎక్కడా కనిపించలేదు. వినిపించ లేదు. మరోమారు అజ్ఞాతంలోకి వెళ్లి పోయారు. అయితే, ఇప్పుడు మరో సారి, సమయం సందర్భం చూసుకుని, నేనొస్తున్నా ..పార్టీని కాపాడుకుంటా .. అంటూ ప్రకటించారు. ఒకప్పటి అన్నా డీఎంకే అధికారపత్రిక ‘నమదు ఎంజీఆర్‌’లో శశికళ పేరుతో ప్రచురితమైన వ్యాసంలో ఆమె  తమ రీఎంట్రీకి సబందించి, పార్టీ, రాష్ట్ర రాజకీయాల గురించి పలు ఆసక్తికరమైన, కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ పతనావస్థలోకి వెళ్లిపోతున్నాఇంకా చేతులు ముడుచుకుని కూర్చోలేనని, అందరి సహకారంతో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని శశికళ ఈ వ్యాసంలో పేర్కొన్నారు. అలాగే, రీఎంట్రీకి సంబంధించి ఎదురవుతున్న అవరోధాలు, అడ్డంకులను పరోక్షంగా ప్రస్తావిస్తూ, తన సంకల్పం ముందు ఎవ్వరూ నిలవలేరని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం  అన్నాడీఎంకేను కాపాడుకోవడమే జయలలిత అభిమాను లు, ఆమె విశ్వాసపాత్రుల ముందున్న ఏకైక లక్ష్యమని ఆ వ్యాసంలో దిశా నిర్దేశం చేశారు. మళ్లీ అమ్మ పాలనను తీసుకురావాలన్న తన లక్ష్యంలో  ఎలాంటి మార్పు కూడా లేదని, తన మాటకు కట్టుబడి శాయశక్తులా కృషి చేస్తానని శశికళ ప్రకటించారు.   కొంత కాలంగా మౌనంగా ఉన్న శశికళ ఇప్పుడు మళ్ళీ, తెర మీదకు రావడం వెనక పక్కా ప్రణాళిక ఉందని అంటున్నారు. అక్టోబర్ 17 న జరిగే, అన్నాడీఎంకే స్వర్ణోత్సవాలను వేదిక చేసుకుని ముందడుగు వేసేందుకు ఆమె ప్రణాలికా బద్ధంగా పావులు కడుపుతున్నారు.ఇందులో భాగంగా  ఈనెల 16వ తేదీన శశికళ స్థానిక మెరీనాతీరంలో వున్న జయ, ఎంజీఆర్‌ల సమాధులకు నివాళులర్పించనున్నారు. అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లే ముందు చివరిగా జయ సమాధి వద్ద అంజలి ఘటించిన . జైలుశిక్ష ముగించుకుని చెన్నై చేరగానే జయ సమాధి వద్దకు వెళ్లాలని భావించారు. కానీ సమాధి వద్ద మరమ్మతుల పేరుతో నాటి అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రజల సందర్శననే రద్దు చేసింది. దీంతో ఊరుకున్న శశికళ.. అన్నాడీఎంకే స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని జయ సమాధి వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు ఆమె అనుచరులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తరువాత నేరుగా స్థానిక రామాపురం వెళ్లి, దివంగత ఎంజీఆర్‌ గృహంలో ఏర్పాటు చేసిన బధిరుల పాఠశాలను సందర్శిస్తారు. అక్కడ ఎంజీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించనున్నారు. అనంతరం ఆమె ప్రజాప్రస్థానం కోసం ప్రణాళిక రూపొందించనున్నట్టు సమాచారం.  అయితే, శశికళ రాకను పార్టీలోని రెండు ప్రాధాన వర్గాలు, మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి వర్గం,మాజీ ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం .. ఇద్దరు నాయకులు వ్యతిరేకిస్తున్నారు. అలాగే, తమిళనాడులో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న అన్నాడిఎంకే మిత్ర పక్షం, బీజీపీ కూడా శశికళ రాజకీయ పునరాగమనాన్ని వ్యతిరేకిస్తోంది. ఈ నేపధ్యంలో తమిళ రాజకీయలను అవపోసన పట్టిన రాజకీయ పండితులు.శశికళ ఆశలు ఎంతవరకు ఫలిస్తాయి అనేది, ప్రశ్నార్ధకమే అంటున్నారు.  

ఫేస్‌బుక్‌ మళ్లీ ఫ‌స‌క్‌.. అస‌లేం జ‌రుగుతోంది?

ఇటీవ‌ల ఏడు గంట‌ల పాటు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌లు ప‌ని చేయ‌లేదు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా నెటిజ‌న్లు విల‌విల్లాడిపోయారు. అతిక‌ష్టం మీద ప్రాబ్ల‌మ్ సాల్వ్ చేసింది ఫేస్‌బుక్‌. హ‌మ్మ‌య్యా.. ఇక ఏ స‌మ‌స్య లేద‌ని ఊపిరిపీల్చుకుంది. కానీ, అంత‌లోనే తాజాగా మ‌రోసారి ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ సేవ‌లకు అంత‌రాయం ఏర్ప‌డింది. ఈసారి వాట్సాప్ మాత్రం సేఫ్‌. దీంతో.. ఫేస్‌బుక్‌కు అస‌లేం జ‌రుగుతోంది? ఇది కేవ‌లం టెక్నిక‌ల్ ఇష్యూనేనా?  లేక‌... మ‌రేదైనానా..? అనే అనుమానం వ్య‌క్త‌మ‌వుతోంది.  శుక్రవారం రెండు గంటల పాటు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, మెసెంజర్‌ సేవలు నిలిచిపోయాయి. కాన్ఫిగరేషన్‌ మార్పుల్లో జరిగిన పొరబాటు కారణంగా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్లకు ఫేస్‌బుక్‌కు చెందిన కొన్ని యాప్‌లు ప‌ని చేయ‌లేదు. కొంతమంది యూజర్లకు ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీడ్ రాలేదు. మరికొందరికి మెసెంజర్‌ నుంచి మెసేజ్‌లు వెళ్లలేదు.  సమస్యను పరిష్కరించామని, ప్రస్తుతం సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని ఫేస్‌బుక్‌ వెల్లడించింది. ‘‘రెండు గంటల పాటు మా యాప్‌ సేవల్లో అంతరాయం కలిగినందుకు గానూ యూజర్లకు క్షమాపణలు తెలియజేస్తున్నాం. సమస్యను పరిష్కరించాం. ఇప్పుడు సేవలు సాధారణ స్థితికి వచ్చేశాయి. క్లిష్టపరిస్థితుల్లో మాకు అండగా నిలిచిన వినియోగదారులకు కృతజ్ఞతలు’’ అంటూ ఫేస్‌బుక్ ఓ ప్ర‌క‌ట‌న రిలీజ్ చేసింది.  టెక్నిక‌ల్ ప్రాబ్ల‌మ్‌తో ఫేస్‌బుక్ గ్రూప్ సేవ‌లు నిలిచిపోవడం వారంలో ఇది రెండోసారి. గత సోమవారం ఇదే కాన్ఫిగరేషన్‌ మార్పుల సమస్య కారణంగా ఏడు గంటల పాటు ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు నిలిచిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌ సేవలు స్తంభించడానికి ఆ సంస్థ చేసిన పొరపాటే కారణమని తెలుస్తోంది. ‘బ్యాక్‌బోన్‌ రౌటర్స్‌ కాన్ఫిగరేషన్‌’లో మార్పులు చేయడం వల్లే ఈ సమస్య తలెత్తింది. తాజాగా మరోసారి సేవలు నిలిచిపోవడంతో ఫేస్‌బుక్‌పై యూజర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘‘చూస్తుంటే ఫేస్‌బుక్‌ వారానికి మూడు రోజులే పనిచేస్తున్నట్లుంది’’ అంటూ నెటిజ‌న్లు కామెంట్లతో కుమ్మేస్తున్నారు. 

రూ. 300 కోట్ల నోట్ల కట్ట‌లు.. హెటిరోలో భారీగా బ్లాక్‌మ‌నీ..!

లీడ‌ర్ సినిమా చూశారుగా. సేమ్ టు సేమ్ అలాంటి సీన్లే. ఓ ఫ్లాట్‌లో మొత్తం క‌ట్ట‌ల‌కు క‌ట్ట‌లు నోట్ల క‌ట్ట‌లు. క‌బోర్డ్స్ నిండా క‌రెన్సీ నోట్లు. బెడ్ కింద‌ మొత్తం నోట్ల కుప్ప‌లు. సినిమాలో జ‌స్ట్ ఒక్క ఫ్లాట్‌లో మాత్ర‌మే డ‌బ్బులు ఉంటాయి. కానీ, ఇక్క‌డ వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న నాలుగు ఫ్లాట్స్‌లో ఇలా నోట్ల క‌ట్ట‌ల‌ను దాచారు. అచ్చం సినిమాటిక్‌గా ఉన్న ఈ సీన్స్‌.. హెటిరో డ్ర‌గ్స్ కార్యాల‌యాల్లో ఐటీ రైడ్స్ సంద‌ర్భంగా వెలుగుచూశాయి. తెలంగాణ‌, ఏపీలో మూడు రోజుల పాటు జ‌రిగిన సోదాల్లో.. దాదాపు 300 కోట్ల న‌గ‌దు స్వాధీనం చేసుకున్న‌ట్టు స‌మాచారం. ఇదంతా లెక్క‌ల్లో చూప‌ని సొమ్ము కావ‌డంతో.. ఇంత బ్లాక్ మ‌నీ ఎక్క‌డిద‌నే దిశ‌గా ఐటీ అధికారులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈడీ సైతం రంగంలోకి దిగ‌నుంద‌ని తెలుస్తోంది.  హెటిరో డ్రగ్స్‌ కార్యాలయాలు, ప్లాంట్లు, ల్యాబ్స్‌, డైరెక్టర్ల ఇళ్లలో జరిగిన సోదాల్లో రూ. 300 కోట్ల దాకా నగదును గుర్తించినట్లు సమాచారం. ఒక సంస్థ కార్యాలయాలపై జరిపిన దాడుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఇంత పెద్దమొత్తంలో నగదు లభ్యమవ్వడం ఇదే మొదటిసారి అని ఐటీ శాఖ అధికారులు చెబుతున్నారు. నగదుతో పాటు స్థిర చరాస్తులు, డాక్యుమెంట్‌, బ్యాంకు లావాదేవీలు.. ఇలా చాలా అంశాలపై అసెస్‌మెంట్ జరగాల్సి ఉంది.  తెలంగాణ, ఏపీ సహా.. ముంబై తదితర ప్రాంతాల్లో మొత్తం 30 చోట్ల దాడులు జ‌రిగాయి. ఈ దాడులు సైతం సినిమాటిక్ స్టైల్‌లోనే నిర్వ‌హించారు. హెటిరోపై రైడ్స్‌ ప్రారంభించేదాకా ఈ సోదాల్లో పాల్గొన్న చాలా మంది ఐటీ సిబ్బందికి విషయం తెలియదట‌. మంగళవారం ఉదయమే హైదరాబాద్‌లోని ఆయ్‌కార్‌ భవన్‌, విశాఖలోని ప్రాంతీయ కార్యాలయంలో సీఐయూ, పలువురు జోనల్‌ ఇన్‌స్పెక్టర్లకు ఉన్నతాధికారులు మెసేజ్‌ పెట్టార‌ట‌. బిగ్ ఫిష్‌ను ప‌ట్టుకోవ‌డానికి భారీ సెర్చ్ ఆప‌రేష‌న్ చేయాల‌ని చెప్పార‌ట‌. 300 మంది ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లు, ఇతర అధికారులు, సిబ్బందిని ఒక్క‌చోటికి చేర్చాక‌.. 40 ఎస్‌యూవీల్లో ఎక్కడి వారు అక్కడికి వెళ్లారు.  బుధవారం ఉదయం ఉన్నతాధికారుల ఆదేశాలు రాగానే.. సనత్‌నగర్‌లోని హెటిరో ప్రధాన కార్యాలయం, చౌటుప్పల్‌, గుండ్లపోచంపల్లి, విశాఖలోని నక్కపల్లి, ముంబై తదితర ప్రాంతాల్లోని హెటిరో ప్లాంట్లు, ప్రాంతీయ కార్యాలయాలు, డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు ప్రారంభమయ్యాయి. నాలుగు రోజులుగా సిబ్బంది ఈ దాడుల్లో నిమగ్నమయ్యారు. రూ.300 కోట్లకు పైగా నగదు పట్టుబడగా.. ఆ మొత్తం సొమ్ము ఎక్కడిది? ఇంత భారీ మొత్తంలో న‌గ‌దును ఎలా సేక‌రించ‌గ‌లిగారు? హ‌వాలా మ‌నీనా? బ్యాంకులూ స‌హ‌క‌రించాయా? అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. . హెటిరో కార్యకలాపాలపై ఐటీశాఖ ఆర్నెల్లుగా నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. కొవిడ్‌ సెకండ్‌వేవ్‌ సమయంలో ఫుల్ డిమాండ్ ఉన్న రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు హెటిరో డ్ర‌గ్స్ త‌యారు చేసిన‌వే కావ‌డంతో భారీగా బిజినెస్ జ‌రిగింది. ఆ తర్వాత హెటిరో కంపెనీ కొవిడ్‌కు టోసిలిజుమాబ్‌ను తీసుకువచ్చింది. కొవిడ్‌ సోకి ఆస్పత్రుల్లో వెంటిలేటర్‌పై ఉండే సీరియస్‌ రోగులపై స్టెరాయిడ్స్‌ పనిచేయని పరిస్థితుల్లో టోసిలిజుమాబ్‌ సంజీవనిలా పనిచేస్తుంది. ఇలా కొవిడ్ టైమ్‌లో కోట్ల‌లో వ్యాపారం చేసిన హెటిరో డ్ర‌గ్స్‌.. ఆ మేర‌కు లావాదేవీల‌ను రికార్డ్స్‌లో చూపించ‌క‌పోయేస‌రికి ఐటీ అధికారుల‌కు అనుమానం వ‌చ్చింది. నెల‌ల త‌ర‌బ‌డి నిఘా వేసి.. ఇప్పుడు స‌డెన్‌గా హెటిరోపై రైడ్స్ చేశారు. కానీ, ఇంత భారీ మొత్తంలో న‌గ‌దు దొరుకుతుంద‌ని ఐటీ అధికారులు సైతం ఊహించి ఉండ‌రు. క్యాషే 300 కోట్లు ఉంటే.. ఇక మిగ‌తా స్థిర‌చ‌రాస్తులు ఇంకెన్ని ఉన్నాయో.. అనే దిశ‌గానూ ద‌ర్యాప్తు చేస్తున్నారు.  

హుజారాబాద్ బరిలో నలుగురు రాజేందర్లు.. టీఆర్ఎస్ ఎత్తులతో కమలంలో కలవరం

హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సంబదించి ఒక కీలక ఘట్టం ముగిసింది. అక్టోబర్ 2 న మొదలైన నామినేషన్ ఘట్టం  ముగిసింది. మొత్తం 61 మంది నామినేషన్ వేశారు. నామినేషన్ల చివరి రోజునే మూడు ప్రదాన పార్టీల అభ్యర్ధులు నామినేషన్ దాఖలు చేశారు. అధికార తెరాస తరపున గెల్లు శ్రీనివాస్, బీజీపీ తరపున మాజీ మంత్రి ఈటల రాజేందర్, కాంగ్రెస్ పార్టీ తరపున ఆ పార్టీ విద్యార్ధి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పోటీలో ఉన్నారు.  కాగా మూడు ప్రధాన పార్టీల అభ్యర్ధులతో పాటు, మరో 46 మంది చివరి రోజున నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీ అభ్యర్ధులకు మద్దతుగా మూడు పార్టీల సీనియర్ నాయకులు హుజూరాబాద్ రావడంతో పార్టీల కార్యకర్తలలో ఉత్స్సాహం చిందులేసింది. బీజేపీ అభ్యర్ధి ఈటల వెంట ఆ పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్, తెరాస అభ్యర్ధి  గెల్లు శ్రీనివాస్ వెంట మంత్రి  హరీష్ రావు, ఇటీవల తెరాసలో చేరిన పది కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధి వెంట మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా నామినేషన్ల ఉపసంహరణకు, అక్టోబర్ 13 మధ్యాన్నం 3 గంటల వరకు సమయ ఉంది.ఆ తర్వాత పోటీలో ఎంత మంది ఉన్నారో అధికారికంగా ప్రకటిస్తారు.  అదలా ఉంటే, ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని ఆరోపిస్తూ, అందుకు నిరసనగా నామినేషన్ వేసేందుకు ప్రయత్నించిన నిరుద్యోగులు, ఉపాధి హామీ క్షేత్రస్థాయి సహకుల్లో కొద్ది మంది మాత్రమే చివరి రోజున నామినేషన్ వేయగలిగారు. గత కొన్ని రోజులుగా క్షేత్రస్థాయి సహాయకులు పెద్ద సంఖ్యలో నామినేషన్ వేసేందుకు ప్రయత్నించినా, ఫలితం లేక పోయింది.  అదలా ఉంటే హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో నామినేషన్‌ దాఖలు చేసిన వారిలో రాజేందర్‌ పేరుతో నలుగురు ఉన్నారు. బీజేపీ తరఫున ఈటల రాజేందర్‌ బరిలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆఖరు రోజున రాజేందర్‌ పేరుతో ఉన్న మరో ముగ్గురు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. వారి ఇంటిపేర్లు కూడా ఈటల మాదిరిగానే ఈ (E) అనే అక్షరంతో ప్రారంభమయ్యాయి. ఇమ్మడి రాజేందర్‌ (రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా), ఈసంపల్లి రాజేందర్‌ (న్యూ ఇండియా పార్టీ), ఇప్పలపల్లి రాజేందర్‌ (ఆల్‌ఇండియా బీసీ ఓబీసీ పార్టీ)లు నామినేషన్లు సమర్పించారు.కాగా, నామినేషన్ దాఖలు చేసిన 61 అభ్యర్ధులలో గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు 13 మంది, 43 మంది స్వతంత్రులు ఉన్నారు.  కాగా, ఈటల రాజేందర్ పేరును పోలిన పేరున్న వారిని, ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు అధికార పార్టీనే బరిలో దించిందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే, ఇలాంటి ట్రిక్కులు అధికార పార్టీ డొల్లతనాన్ని బయట పెట్టేందుకు తప్ప ఇంకెందుకు పనిచేయవని. కమల గుర్తు ప్రజల గుండెల్లో ‘ఈటల’లా నాటుకు పోయిందని బీజేపీ శ్రేణులు విశ్వాసంతో ఉన్నాయి.

టీఆర్ఎస్ లో కసబ్ ఉన్నాడట..! 

తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తున్న కరీంనగర్ జిల్లా హుజురుబాద్ ఉప ఎన్నికలో ప్రచారం పర్వం హోరెత్తుత్తోంది, నామినేషన్ల ఘట్టం ముగియడంతో అన్ని పార్టీలు మరింత స్పీడ్ పెంచాయి. తమ ప్రసంగాల్లో తీవ్రత పెంచారు లీడర్లు, వ్యక్తిగత దూషణలతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. సంచలన ఆరోపణలతో కాక రేపుతున్నారు.  తన పంచ్ డైలాగులతో హోరెత్తించే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఉప ఎన్నికల షెడ్యూల్ తర్వాత తొలిసారి  హుజురాబాద్ పర్యటించారు. తమ  పార్టీ అభ్యర్థి బల్మూర్ వెంకట్ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన రేవంత్ రెడ్డి,, సంచలన ఆరోపణలు చేసి రాజకీయాన్ని హీటెక్కించారు. గతంలో కాంగ్రెస్ లో ఉండి ఇటీవలే టీఆర్ఎస్ లో చేరిన  కౌశిక్‌రెడ్డిపై రేవంత్‌రెడ్డి పరోక్షంగా మండిపడ్డారు. టీఆర్ఎస్‌లోకి పోతే పదవి వస్తుందని అనుకున్నారని రేవంత్‌రెడ్డి చెప్పారు. పదవీ రాలే.. పైసలు కూడా రాలేదని రేవంత్‌రెడ్డి సెటైర్లు వేశారు. హరీష్‌రావు, ఈటల ఇద్దరూ తోడు దొంగలేనని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఈటల వందల కోట్లు, కేసీఆర్ వేల కోట్లు సంపాదించారని  ఆరోపించారు.  గత శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ తరపున హుజురాబాద్‌లో కౌశిక్‌రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్ తన పదవికి రాజీనామా చేయడంతో హుజురాబాద్‌లో ఉప ఎన్నికలు వచ్చాయి. అయితే తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాదేమోనని భావించిన కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు. టీఆర్ఎస్‌లో చేరగానే కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా సీఎం కేసీఆర్ నామినేట్ చేసారు. అయితే గవర్నర్ అభ్యంతరాల ఎమ్మెల్సీ పదవి పెండింగ్‌లో ఉంది. 

టాప్ న్యూస్ @7PM

జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీ పరిస్థితి దిగజారిపోయిందని, చేసిన పనికి డబ్బులు రాక కాంట్రాక్టర్లు రాష్ట్రంలో ఆందోళన చేస్తున్నారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.  ‘మేము కాంట్రాక్టర్లం.. మా బిల్లులు చెల్లించండి, మా ప్రాణాలు కాపాడండి, ఆస్తులు కరిగాయి, అప్పులు పెరిగాయి’ అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, చిప్పతో ఆర్ధిస్తున్నారని అన్నారు. ------ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పాలనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘ఎన్ని వాగ్దానాలు చేసినా...ఎన్ని అరుపులు అరిచినా... రాష్ట్ర బడ్జెట్టుని ఎంత మసిపూసి మారేడుకాయ చేసినా.... సంపాదన కన్నా ఎక్కువ ఖర్చుపెట్టలేరు...పండించిన దానికన్నా  ఎక్కువ పంచలేరు...ఈ మౌలిక ఆర్ధిక సూత్రాన్ని  'వైసీపీ  ప్రభుత్వం' మరిచినట్టుంది’’ అంటూ పవన్ ట్వీట్ చేశారు. -----  ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మహిళా వాలెంటీర్ సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. వైసీపీ నేత వేధింపులను సీఎం జగన్‌కు మహిళా వాలెంటీర్ సెల్ఫీ వీడియో ద్వారా తెలిపారు. నాదెండ్ల ఎంపీటీసీ గుడికందుల యల్లారావు వేధింపుల నుంచి తనను కాపాడలని మహిళా వాలెంటీర్ వేడుకున్నారు. తన ప్రియురాలు కుమార్తెను వాలెంటీర్‌గా పెట్టాలని తనను ఎంపీటీసీ వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించారు.  ----- ఏపీ సర్కారు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి దిగజారిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ విమర్శించారు. ఆర్థికమంత్రి అప్పులు శాఖ మంత్రిగా మారారని వ్యాఖ్యానించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వవయ్యా స్వామీ... పనిచేసిన వాళ్లకు జీతాలు ఇవ్వకపోతే ఎలాగ? అంటూ సీఎం జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ---- హుజూరాబాద్‌లో జరుగుతున్న ఉప ఎన్నిక ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ పట్టణంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లతో కలిసి బీజేపీ నేత ఈటల రాజేందర్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధికార దుర్వినియోగం, ప్రజాస్వామిక వ్యతిరేక విధానాలు ఇంతకు ముందు చూడలేదన్నారు. --------- రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య అంశంగా, ప్రతిష్టాత్మకంగా వంద శాతం ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా నీరు అందిస్తున్న మిషన్ భగీరథ పథకానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఏర్పడిన కేంద్ర నీతి ఆయోగ్ మరోసారి ప్రసంశించింది. సాక్షాత్తూ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ట్విట్టర్ వేదికగా నూటికి నూరు శాతం ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీరు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అంటూ ట్వీట్ చేశారు. ------------- హుజురాబాద్‌లో ఉప ఎన్నికలు నిజాయితీగా జరిగితే టీఆర్ఎస్‌కు డిపాజిట్ కూడా రాదని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. ఏబీఎన్‌తో బీజేపీ నేత  ఈటల మాట్లాడుతూ ఎమ్మెల్యే పదవికి తనను రాజీనామా చేయాలని డిమాండ్ చేసిందే టీఆర్‌ఎస్ వారేనని ఈటల ఆరోపించారు. తనపై మంత్రి హరీష్‌రావు మతిలేకుండా మాట్లాడుతున్నారన్నారు. టీఆర్ఎస్ పార్టీకి నిజాయితీ లేదన్నారు. డబ్బు, మద్యాన్ని కేసీఆర్ నమ్ముకున్నారని ఆయన ఆరోపించారు.  ------- టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. హుజురాబాద్ టీఆర్‌ఎస్ నాయకుడు కౌశిక్‌రెడ్డిపై రేవంత్‌రెడ్డి పరోక్షంగా మండిపడ్డారు. టీఆర్ఎస్‌లోకి పోతే పదవి వస్తుందని అనుకున్నారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పదవీ రాలే.. పైసలు కూడా రాలేదని రేవంత్‌రెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. హరీష్‌రావు, ఈటల ఇద్దరూ తోడు దొంగలేనని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈటల వందల కోట్లు, కేసీఆర్ వేల కోట్లు సంపాదించారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.  ---- డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న బాలీవుడ్ అగ్రహీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు తీవ్ర నిరాశ తప్పలేదు. ఆర్యన్ ఖాన్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై ముంబయి కోర్టు విచారణ జరిపింది. ఆర్యన్ కు బెయిల్ మంజూరు చేయొద్దని ఎన్సీబీ తరఫున అడిషినల్ సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ వాదనలు వినిపించారు. బెయిల్ ఇస్తే, కేసు దర్యాప్తుపై ఆ ప్రభావం పడుతుందని, సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని అన్నారు. ----    

కాంట్రాక్టర్లకు చిప్పే గతి.. జగనన్న పాలనలో వెరైటీ! 

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. సంక్షేమ పథకాల పేరుతో అడ్డగోలుగా ఖర్చు చేస్తోంది వైసీపీ సర్కార్. ప్రతి నెలా అప్పులు తెచ్చి మరీ పంపకాలు చేస్తోంది. దీంతో ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడానికి కూడా నిధుల కటకటే. ఉద్యోగులకే వేతనాలు లేనప్పుడు కాంట్రాక్టర్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడమే కష్టం. నిజానికి గత రెండున్నర ఏండ్లుగా ఏపీలో అభివృద్ధి పనులేవి సాగడం లేదు. చిన్న చితకా పనులు తప్ప, అయితే ఆ పనులు చేసిన కాంట్రాక్టర్లకు కూాడా బిల్లులు ఇవ్వడం లేదు. దీంతో లక్షలాది రూపాయలు ఖర్చు చేసిన కాంట్రాక్టర్లు,, ఇప్పుడు రోడ్డున పడ్డారు. ఏపీలో కాంట్రాక్టర్ల దుస్థితిపై నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు స్పందించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీ పరిస్థితి దిగజారిపోయిందని, చేసిన పనికి డబ్బులు రాక కాంట్రాక్టర్లు రాష్ట్రంలో ఆందోళన చేస్తున్నారని అన్నారు. ‘మేము కాంట్రాక్టర్లం.. మా బిల్లులు చెల్లించండి, మా ప్రాణాలు కాపాడండి, ఆస్తులు కరిగాయి, అప్పులు పెరిగాయి’ అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, చిప్పతో ఆర్ధిస్తున్నారని అన్నారు.  గత ప్రభుత్వంలో కంపెన్సివ్  ఫైనాన్షియల్ మేనేజింగ్ సిస్టం ఉండేదని, ఇప్పుడు ఆ వ్యవస్థను జగన్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని రఘురామ ఆరోపించారు. కాంట్రాక్టర్లకు డబ్బులివ్వకుండా గత ప్రభుత్వం హాయంలో చేసిన పనులకు, ఈ ప్రభుత్వానికి సంబంధం లేదంటున్నట్లు తెలిసిందన్నారు. రేపు వచ్చే ప్రభుత్వం కూడా ఇదే మాట అంటే పరిస్థితేంటని రఘురామ ప్రశ్నించారు. ఎన్నికల్లో ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని రఘురామ ప్రభుత్వానికి సూచించారు. ఉద్యోగులంతా ఆందోళనకు దిగితే పరిస్థితి చేయిదాటిపోతుందన్నారు రఘురామ. కాలేజీలకు బకాయిలు చెల్లించలేదని, రేపో మాపో వారు కూడా నిరసనకు దిగే అవకాశముందన్నారు. రాష్ట్ర పరిస్థితి ఇలానే ఉంటే.. ఏపీ దివాళా తీస్తుందన్నారు. బిహార్, ఒరిస్సాలను చూసి పాలన నేర్చుకోవాల్సి ఉంటుందని రఘురామ వ్యాఖ్యానించారు.