పెళ్లి మొగుడితో .. రొమాన్స్ ప్రియుడితో.. 

పెళ్లి ఒక్కడితో కాపురం మరొకడితో ఈరోజుల్లో ఇది మామూలే అయిపొయింది.. ఎంత మామూలైయిందంటే మనం ఒక హోటల్ కి వెళ్లి ఏ టీ యో టిఫినో చేసినంత ఈజీ అయిపొయింది నేటి తరం వాళ్ళకి.. భర్తకు ఆఫీస్  ఉంటే  భర్త అవుట్ ప్రియుడికి ప్రియుడు ఇన్ ఇలా ఎంతో మంది పెళ్లి అయ్యాక అక్రమ సంబంధం పెట్టుకుని చివరికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతున్నారు..పెళ్లి తర్వాత కూడా పలువురు రహస్యంగా నెరుపుతున్న వివాహేతర సంబంధాలు కాపురాలను నాశనం చేస్తున్నాయి. కుటుంబ పరువు ప్రతిష్ఠలు రచ్చకెక్కుతున్నాయి. తాజాగా ఒక భార్య ప్రియుడితో రాసలీలలు నడుపుతూ భర్త కు  రెడ్ హ్యాండెడ్.. అది ఎక్కడ జరిగిందో..? ఆ తరువాత ఏం జరిగిందో మీరే తెలుసుకోండి.. నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలో భార్యా భర్తలు నివాసం ఉంటున్నారు. పెళ్లి జరిగిన తరువాత కూడా తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న విషయం తెలిశాక భర్త భార్యకు వార్నింగ్ ఇచ్చాడు. అయినా ఆమె వినలేదు. భర్త మాటలను పెడచెవిన పెట్టింది. రహస్యంగా ప్రియుడితో ఏకాంతంగా కలుస్తూనే ఉంది. ఇది గమనించిన భర్త వారిద్దరూ బెడ్ రూంలో ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అంతేకాదు వారిద్దరినీ గదిలో పెట్టి తాళం వేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, ఆ తర్వాతే లోపల ఉన్నవారు ఆ భర్తకు, పోలీసులకు ట్విస్ట్‌ ఇచ్చారు. చాలా సేపు బయటకి రాలేదు..లోపలే గడియ పెట్టుకున్నారు.. పిలిస్తే పలికారు.. చుస్తే కనిపించరు. చుక్కలు చూపించారు. వివాహేతర జంటను పట్టుకునేందుకు పోలీసులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. దాదాపు 4 గంటల వరకు గదిలోనే గడిపాక ఎట్టకేలకు తలుపు తీశారు. ఆ తర్వాత వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు.

టైమప్ జగన్ జీ...టైమప్!

జగన్ ప్రత్యర్ధులు ఎదురు చూస్తున్న సమయం వచ్చేసిందా? నవరత్నాల జగన్ బాబు నవరత్న ఆయుల్ రాసుకునే టైమ్ అయిందా? పైకి జనం కోసమంటూ ఏతులు.. సంక్షేమం అంటూ కోతలు.. ఇవన్నీ అధికారం నిలబెట్టుకోవడానికేనన్నది అసలు గీతలు. ఓటు బ్యాంక్ రాజకీయాన్ని సింగిల్ ఎజెండా గా అమలు చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బ్రేక్ పడుతుందా? ఆయన అప్పుడప్పుడు ఏదో ఒక పేరుతో డబ్బులు వేసేది.. ఆయన కోసమేనని.. జనం కోసం కాదని.. పైగా ఆ డబ్బు కూడా తమదేనని.. ఈ ప్రజలు అర్ధం చేసుకుంటారా? అవును.. సంవత్సరమంతా ఏదో ఒక పేరుతో ఒక ఫ్యామిలీకి 10 వేలు మూడు నెలలకొకసారి అకౌంట్లో పడుతుంటే ఆ సంతృప్తి వేరేగా ఉంటుంది.. అప్పుడు వాళ్లు చూపించే అభిమానం కూడా వేరే రేంజ్లో ఉంటుందని.. సరిగ్గా ఇదే ఫార్ములాతో నవరత్నాలు అమలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి కాలం ఎదురొస్తుందా? అవుననే అనిపిస్తోంది. ఇప్పటివరకు డబ్బులున్నా లేకపోయినా.. డబ్బులు ఏ అకౌంట్లో ఉంటే .. వాటిని లాగేసి ఈ పథకాలకు ఇచ్చేయడమే అధికారులకు ఇచ్చే సింగిల్ టార్గెట్.  ఇప్పటివరకు రకరకాల పేర్లతో ఉన్న పథకాలు, వాటి నిధులు అన్నీ.. ఈ నవరత్నాల్లోకి తోసేశారు. ఇష్టమొచ్చినట్లు డ్రా చేసేశారు.. ఆఖరికి కార్పొరేషన్లకు ఇచ్చిన నిధులు, ఎస్సీ ఎస్టీ నిధులు కూడా దారి తప్పించేశారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా..అవి దేని కోసం వచ్చినా సరే..వీరనుకున్న దానికి వాడేసుకోవడమే తక్షణ కర్తవ్యం అన్నట్లే వ్యవహారం నడుస్తోంది. ఇప్పుడు లేటెస్టుగా.. అవన్నీ అయిపోయి.. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టేపనిలో పడింది జగన్ ప్రభుత్వం. విశాఖలోని కొన్ని ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడానికి లిస్టు తయారు చేసి..కేవలం 1600 కోట్ల కోసం వాటిని బ్యాంకులకు తనఖా పెట్టడానికి సిద్ధమైపోయింది ప్రభుత్వం. అంటే ఎలా తెస్తారో తెలియదు.. డబ్బు కావాలి.. పథకాలకు ఇచ్చేయాలి ఇదే జగన్ అజెండా. ఇదంతా ప్రజల సంక్షేమం కోసం అనుకుంటే పొరపాటే. జనానికి డబ్బులేయాలి.. వీరు జైలుకెళ్లినా సరే..మళ్లీ వైసీపీయే అధికారంలోకి రావాలంటే.. అలా డబ్బులు వేస్తూ ఉండాలి..జనం దండాలు పెడుతూ ఓట్లు వేస్తూ ఉండాలి..అదే జగన్ స్ట్రాటజీ. ఇప్పుడు నిధుల మళ్లింపు నుంచి తాకట్టు దాకా వచ్చారంటే.. బాస్ నవరత్నాల కథ క్లయిమాక్స్కు చేరిందా అనే కామెంట్లు వినపడుతున్నాయి. కోవిడ్ కు ముందే దేశాన్ని ఆర్ధిక సంక్షోభం పట్టి పీడిస్తుంది. అందుకే పైన మోదీగారు స్టీల్ ప్లాంట్ వంటివాటిని కూడా అమ్మేస్తున్నారు. అమ్మితే డబ్బులు.. కొనేది మనోడైతే వేరే బెనిఫిట్..అలా ఆయన కంటిన్యూ అయిపోతున్నారు. కోవిడ్ దెబ్బకు సంక్షోభం ముదిరింది. కేంద్రం నిధులు ఇచ్చే పరిస్ధితిలో లేదు. రాష్ట్రంలో రావాల్సిన పన్నుల ఆదాయం రావాల్సినంత వచ్చే పరిస్ధితీ లేదు. మరేం చేయాలి? అందుకే తాకట్టు పెట్టేద్దాం.. అప్పులు తీసుకుందాం..పంచిపారేద్దాం.. ఇదే అజెండాతో జగన్ బాబు ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. ఈ సంక్షోభం ఇప్పట్లో ముగిసేది కాదు. కాబట్టి ముందు ముందు జగన్ సంక్షేమ పథకాలు అమలు చేయటం కష్టం. అవి ఆగాయంటే వీరి అరాచక పాలన అంతా భ్రమల నుంచి బయటపడే జనం త్రీడీ ఎఫెక్టులో చూడగలుగుతారు.. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేకతను తట్టుకోవడం కష్టం. ఆ టైమ్ ఇప్పుడొచ్చిందనే రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

మంత్రి పెద్దిరెడ్డికి కోపం! జగన్ రెడ్డి టీంలో కలవరం? 

చిత్తూరు పెద్దారెడ్డికి కోపం వచ్చింది. పాపం అంతా తానై అప్పట్లో నడిపించారు. అంతా తనకే అనుకున్నారు. గద్దలా మరొకరు వచ్చి కళ్ల ముందే తన్నుకుపోతే తమాయించుకున్నారు. కాని లెక్కలేసుకుంటున్న కొద్దీ ఫ్రస్టేషన్ పెరిగిపోతోంది. అందుకే కోపం వస్తోంది. కాని పైకి చెప్పుకోలేరు.. బయటికి కక్కలేరు. పోనీలే అని సర్దుకోనూ లేరు. పాపం కదా..నిజంగా. ఇప్పుడీ న్యూస్ లో నిజమెంతో అబద్ధమెంతో తెలియదు గాని.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్ మీద కోపం వచ్చిందంట. బట్.. గౌరవం తగ్గలేదు సుమా.  తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అంటారు కదా..అలా అధికార వ్యాపారమే వ్యాపారమే.. నాయకుడు నాయకుడే.. అక్కడే అసలు తేడా కొట్టిందంట. ఇసుక నుంచి తైలం పిండే ఘనులెవరా అనుకున్నారంతా..కాని జగన్ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే ఆ విషయంలో క్లారిటీ వచ్చేసింది. అసలు ఇసుక కనపడుకుండానే కాసులు సంపాదించిన ఘనత వారికే దక్కిందనే ఆరోపణలు ప్రతిపక్షాలు చేశాయి. ఇసుక వ్యాపారం నుంచి టీడీపీ నేతలను కట్ చేయడానికి.. కొత్త పాలసీ అనే పేరుతో మూడు నెలలు కాలం గడిపి.. జనానికి ఇసుక దొరకకుండా చేసిన గ్రేట్ నెస్ వైసీపీది.. దాని అధినేత జగన్ గారిది.. ఆ తర్వాత సంబంధిత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే. అసలు ఇసుక మన కంట్రోల్ లోకి తేవాలనుకున్నాం గాని.. అసలు దొరక్కుండా చేయాలని అనుకోలేదు కదా అని పాపం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డిని చాలాసార్లు అడిగారంట. అంతా సాఫ్ట్ వేర్ ప్రాబ్లెమ్..అధికారుల ప్రాబ్లెమ్.. లేదంటే వరదల సమస్య.. అంటూ చెప్పుకుంటూ వచ్చారు. బ్యాక్ గ్రౌండ్ లోకి వెళితే బ్లాక్ మార్కెటింగ్ ఓ రేంజ్లో జరుగుతున్న విషయం తెలిసేదని ప్రత్యర్ధులు కామెంట్లు చేశారు. టీడీపీ వాళ్లను అడిగితే ఇలా చెప్పుకొస్తారు. ఇసుకను మంత్రి పెద్దిరెడ్డి జిల్లాల్లో బ్లాక్ చేసేశారు... తనకు సన్నిహితులైన మంత్రులకు, నేతలకు (వైసీపీ వాళ్లు అయితే సరిపోదు మళ్లీ) ఏరియాల వారీగా పంచిపెట్టేశారు. కొన్నిఏరియాలు కొడాలి నాని, మరికొన్నిఏరియాలు మాజీ మంత్రి పార్ధసారథి..ఇంకా తూగో, పగో, విశాఖ, విజయనగరం అలా డివిజన్ జరిగిపోయింది. ఎక్కువ భాగం మాత్రం పెద్దారెడ్డి మనుషులే పోయి వ్యాపారం చేసుకున్నారంట. రెడ్డిగారు జగన్ పాదయాత్ర అప్పుడు మొత్తం స్పాన్సరింగ్ చేశారు కాబట్టి వదిలేసుంటారులే అని మిగతావాళ్లు సర్దుకున్నారంట. పెద్దారెడ్డి చల్లగా ఉంటే విజయసాయిరెడ్డికి నిద్ర పట్టదు కదా. అందుకే అన్నివిషయాలు తవ్వితీసి జగన్ కి ఏకరవు పెట్టేశారంట. అయితే పెద్దిరెడ్డిని కాదనలేరు..అలా అని అడ్డంగా వదిలేయలేరు..అందుకే జగన్, విజయసాయిరెడ్డి కలిసి ప్లాన్ చేసి.. రాష్ట్రమంతా ఒక్క కంపెనీకే ఇసుక తవ్వకం, సరఫరా కాంట్రాక్టు ఇప్పించేశారు. ఆ కంపెనీ మళ్లీ విజయసాయిరెడ్డి అల్లుడు తాలుకా .. చూశారా..లాగిపెట్టి కొడితే..ఆ చెంప మీద నుంచి ఈ చెంప మీదకు వాతలు మారాయన్నమాట.  పెద్దిరెడ్డిగారిని ప్రసన్నం చేశాకే అన్నీ చేసుకున్నాగాని.. బాస్ కి నచ్చలేదు. ఎంతైనా బిర్యానీ తినేవాడిని.. రోటీలతో సరిపెట్టుకోమంటే నచ్చుతుందా చెప్పండి.అందుకే కోపం వచ్చింది. మరి ఆ కోపం ఎప్పుడు బయటపడుతుందో చూడాలి. గతంలో వచ్చిన రూమర్ లాగా .. జగన్ జైలుకెళితే నేనేకదా సీఎం అని సరిపెట్టుకుంటారో మరి.

రాజీ లేని రాజేంద‌ర్‌.. ముచ్చ‌ట‌గా మూడోసారి.. దొరపై గెలిచి నిలిచేనా?

ప‌ద‌వి పొంద‌టం ఎంత క‌ష్ట‌మో.. ఆ ప‌ద‌విని వ‌దులుకోవ‌డం అంత‌క‌న్నా క‌ష్టం. హోరాహోరీగా సాగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌రుస‌గా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఈటల రాజేంద‌ర్‌. అందులో, మూడుసార్లు త‌న ఎమ్మెల్యే గిరిని తృణ‌ప్రాయంగా వ‌దిలేయ‌డం మామూలు విష‌య‌మేమీ కాదు. తాజాగా, ముచ్చ‌ట‌గా మూడోసారి ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు ఈట‌ల‌. ఉద‌యం ప‌ద‌కొండున్న‌ర‌కి ఇలా రాజీనామా లేఖ అసెంబ్లీ కార్య‌ద‌ర్శికి ఇచ్చారో లేదో.. అలా.. మ‌ధ్యాహ్నం ఒంటిగంట‌క‌ల్లా రాజీనామాను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస‌రెడ్డి ఆమోదించడం ఆస‌క్తిక‌రం. ఆ వెంట‌నే, హుజురాబాద్ నియోజకవర్గం ఖాళీ అయిన‌ట్టు చూపుతూ అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ విడుదల చేశారు. సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించడం వెంట‌వెంట‌నే జ‌రిగిపోయింది.   తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డాక‌.. ఈ ఏడేళ్లల్లో పదవికి రాజీనామా చేసిన తొలి టీఆర్‌‌ఎస్ ఎమ్మెల్యే ఈటల రాజేందరే. అయితే, ఇలా రాజీనామా చేయ‌డం ఆయ‌న‌కు కొత్తేమీ కాదు. ఉమ్మ‌డి రాష్ట్రంలో.. ప్ర‌త్యేక రాష్ట్ర సాద‌న కోసం రెండుసార్లు ఇలానే ఎమ్మెల్యే పోస్ట్‌కు రాజీనామా చేశారు. ఇప్పుడిలా స్వ‌రాష్ట్రంలో ప‌ద‌వి వ‌దులుకోవాల్సి వ‌స్తుంద‌ని ఆయ‌న క‌ల‌లో కూడా ఊహించి ఉండ‌రు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌తో విభేదించి.. బానిస భ‌వ‌న్ గోడ‌లు బ‌ద్ద‌లుకొట్ట‌డానికంటూ.. గ‌డీల పాల‌న‌కు వ్య‌తిరేకంగా.. దొర‌పై రాజీనామా అస్త్రాన్ని సంధించారు ఈ ఉద్య‌మ నాయ‌కుడు.  ఆనాడు ఉద్య‌మాన్ని ఉర‌క‌లు ఎత్తించ‌డానికి రాజీనామాను బ్ర‌హ్మాస్త్రంగా ప్ర‌యోగిస్తే.. ఈనాడు హుజురాబాద్ కేంద్రంగా మ‌రో ప్ర‌జా ఉద్య‌మానికి శ్రీకారం చుట్టేందుకు రాజీనామా చేశానంటున్నారు రాజేంద‌ర్‌. జ‌ర‌గ‌బోయేది కురుక్షేత్ర సంగ్రామ‌మేన‌ని.. ధ‌ర్మం త‌న ప‌క్షాన ఉంది కాబ‌ట్టి.. విజ‌యం త‌న‌దేన‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. గ‌తంలోనూ ఆయ‌న రెండుసార్లు ఇలానే రాజీనామా చేసి.. గెలుపొందారు మ‌రి. మూడోసారి కూడా చ‌రిత్ర రిపీట్ అవుతుంద‌నే న‌మ్మ‌కంతో.. కేసీఆర్‌తో రాజీ ప‌డ‌కుండా రాజీనామా అస్త్రం ప్ర‌యోగించారు.  2004లో టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా క‌మ‌లాపూర్‌లో పోటీ చేసి.. మాజీ మంత్రి ముద్ద‌సాని దామోద‌ర్‌రెడ్డిని ఓడించి త‌న ఉనికిని బ‌లంగా చాటుతూ.. ఘ‌నంగా అసెంబ్లీ ప్ర‌స్తానం ప్రారంభించారు ఈట‌ల రాజేంద‌ర్‌. 2009లో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన జరిగి కమలాపూర్‌ నియోజకవర్గం రద్దయింది. హుజూరాబాద్‌ కేంద్రంగా కొత్తగా నియోజకవర్గం ఏర్పడింది.  ఉద్య‌మంలో భాగంగా కేసీఆర్ పిలుపు మేర‌కు.. 2008, 2010లో ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేసి విజ‌యం సాధించి.. అసెంబ్లీలో ప్ర‌త్యేక రాష్ట్ర ప్ర‌కంప‌ణ‌లు తీసుకొచ్చారు.  అప్ప‌టి ముఖ్య‌మంత్రి వైఎస్ రాజశేఖ‌ర్‌రెడ్డి అసెంబ్లీలో ఈట‌ల‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు ఇప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో మారుమోగుతుంటాయి. ఏమ‌య్యా రాజేంద్ర‌.. ప‌ట్టుమ‌ని ప‌ది సీట్లు కూడా గెల‌వ‌లేక పోయారు.. త‌ల ఎక్క‌డ పెట్టుకుంటావ‌య్యా.. అంటూ వైఎస్సార్ చేసిన కామెంట్లు అప్ప‌డూ, ఇప్పుడూ హాట్ టాపికే.   ఈట‌ల చూట్టానికి సాదాసీదాగా క‌నిపించినా.. ఆయ‌న రాజ‌కీయ చ‌రిత్ర సంచ‌ల‌న‌మే. విద్యార్థి ద‌శ‌లో పీడీఎస్‌యూ నాయ‌కుడిగా, ఆ త‌ర్వాత న‌క్స‌లైట్‌గా.. అటుపిమ్మ‌ట ఉద్య‌మ నేత‌గా.. ఫౌల్ట్రీ వ్యాపారిగా.. వరుసగా నాలుగు సార్లు హుజురాబాద్‌ శాసనసభ్యుడిగా.. మొత్తంగా వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా.. ఘ‌న‌చ‌రిత్ర ఆయ‌న‌ది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో కేసీఆర్‌ మంత్రివర్గంలో ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2019లో కేసీఆర్‌ రెండో ద‌ఫా పాల‌న‌తో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే.. కేబినెట్ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌కు గుర‌య్యారు. ఆత్మాభిమానంతో ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి.. ఉప ఎన్నిక‌ల్లో మ‌రోసారి ఘ‌న విజ‌యం సాధించి.. కేసీఆర్‌కు గ‌ట్టి షాక్ ఇవ్వాల‌ని భావిస్తున్నారు. అయితే, ఇన్నేళ్లూ కేసీఆర్ నీడ‌లో గెలిచిన ఈట‌ల‌.. ఈసారి కేసీఆర్‌కే స‌వాల్ చేసి గెలిచి నిలుస్తారా? లేదా? అనేది తెలంగాణ రాజకీయ ముఖ‌చిత్రాన్ని మార్చేసే ప‌రిణామం. 

వాక్సిన్ వేసుకుంటే.. జరం ఎందుకు వస్తుంది.. 

వ్యాక్సిన్  అంటే చాలా మందికి భయం.. ఇంకొంత మందికి హ వ్యాక్సిన్  వేసుకున్న కరోనా వస్తుంది అప్పుడు వ్యాక్సిన్ ఎందుకు వేసుకోవాలి అని.. ఇంకొంత మంది వ్యాక్సిన్ వేసుకుంటే వారం రోజులు జ్వరం వస్తుంది.. వొళ్ళు నొప్పులు ఉంటాయి..కరోనా కు వ్యాక్సిన్ వచ్చి దాదాపు అటు ఇటుగా సంవత్సరం అయిన.. వ్యాక్సిన్ పై ప్రజలకు ఇంకా నమ్మకం లేదు..   కరోనా ఆ మాట వింటే చాలు ఒళ్ళు గుగ్గులు పెడుతుంది. కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాక కొంత మందికి జ్వరం వస్తుంది.  మరికొంత మందికి ఒళ్ల నొప్పులు.. లేదా ఆయాసం.. లేదా తీవ్రమైన తలనొప్పి.. ఆయాసం పెరగడం వంటి లక్షణాలు వస్తున్నాయి. మరికొంత మందిలో అసలు ఇలాంటి మార్పులు కనిపించలేదని చెబుతుంటారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత  ఏదైనా అనారోగ్యం వస్తే లేదా ఏమీ రాకుండా సాధారణంగా ఉండిపోవడంపై ప్రపంచ వ్యాప్తంగా వైద్య నిపుణులు ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నారు. అనివేశిస్తున్నారు.  కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. భౌగోళికంగా  వివిధ దేశాల్లో తీవ్రమైన చలి (మంచు కురిసే ప్రాంతాలు),తీవ్రమైన  ఎండ (ఎడారి), సముద్ర తీర ప్రాంతాలు, నదీ తీర ప్రాంతాల్లో ఆయా వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా పరిస్థితిని బట్టి వ్యాక్సిన శరీరంలో ఎలా పనిచేస్తున్నదో తెలుసుకుంటున్నారు. వాటిపై నిరంతరం అధ్యయనం మొదలు పెట్టారు. వ్యాక్సిన్ మార్కెట్లోకి రిలీజ్ కంటే ముందే క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినా.. చాలా తక్కువ సంఖ్యలోనే జరిగాయి. తాజాగా ఇప్పుడు వ్యాక్సినేషన్ ప్రక్రియ కోట్లకు చేరుకున్న నేపధ్యంలో వైద్య నిపుణులు కచ్చితమైన సమాచారం కోసం అధ్యయనం కొనసాగిస్తున్నారు. ఆయా దేశాల్లో పరిస్థితుల ఆధారంగా శరీరంలోవ్యాక్సిన్ తెచ్చే మార్పులను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నక  శరీరంలో ఏం జరుగుతుందంటే..? కరోనా వ్యాక్సన్ వేసుకున్నాక మనిషి శరీరంలో దాని ప్రభావం ఎంత మేరకు ఉందనేది తెలుసుకునేందుకు అధ్యయనాలు జరుపుతున్నారు. శరీరం రోగ నిరోధక వ్యవస్థ రెండు విధాలుగా పనిచేస్తుంది. ఒకటి సహజసిద్ధంగా స్పందించేది.. రెండోది మందులు, టీకాలు తదితర వాటి ఉత్ప్రేరకంతో పనిచేసేవి. అందుకే వ్యాక్సిన్ వేసుకున్నాక తెల్ల రక్త కణాలు వ్యాక్సిన్ తో కలసిపోయి ప్రక్రియను చేపడతాయి. దీని వల్ల వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఒళ్ల నొప్పులు, జ్వరం.. అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ ర్యాపిడ్ రెస్పాన్స్ ప్రక్రియ వయసును బట్టి క్షీణిస్తుంది. యువత చాలా బలంగా ఉంటారు  కాబట్టి ఈ  ప్రక్రియ వేగంగా జరిగిపోతుంది. అలాగే వృద్ధుల్లో యువతకు భిన్నంగా నిదానంగా పనిచేస్తుంది కాబట్టి వీరికి లక్షణాలు కాస్త ఎక్కువగా ఉంటుంది. వీరికే వ్యాక్సిన్ ఉత్తేజం అవసరం అవుతుంది. యాంటీ బాడీలను ఉత్పత్తి చేసేందుకే వ్యాక్సిన్ ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు తెల్లడించారు. మహిళలు వ్యాక్సిన్ వేసుకున్నాక గడ్డలు కట్టిందని వారు అంటున్నారు. అవి క్యాన్సర్ గడ్డలేమోనని అనుమానిస్తుంటారు. ఇలాంటి అనుమానాలు తలెత్తకూడదంటే మహిలలు రొమ్ము క్యాన్సర్ నిర్దారణకు మామో గ్రామ్ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. తాజా అధ్యయనాల ప్రకారం జ్వరం.. తలనొప్పి.. ఒళ్ల నొప్పులు రావడం సాధారణమే అని.. శరీర దృఢత్వాన్ని బట్టి ఇవి రెండు మూడ్రోజులు లేదా 15 రోజుల వరకు ఉండే ఛాన్స్ ఉందని తేలింది. ఇంతకు మించి ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించి జబ్బులను నిర్ధారించుకుని తగిన చికిత్స చేయించుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ అపోహలకు దూరంగా అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకుంటే ఇమ్యూనిటీ స్థాయి తెలిసిపోతుందని.. తక్కువగా ఉంటే వెంటనే పెంచుకోవాల్సిన అవసరం సూచిస్తుందని చెబుతున్నారు.  

టీఎస్’లో బెంగాలీ సినిమా అడిద్డా ? అవుటయిద్డా?

ఇది యాదృచ్చికమే కావచ్చును, కానీ, బెంగాల్ రాజకీయాల్లో  సీనియర్ నాయకుడు, రాష్ట్రంలో తృణమూల్ నుంచి బీజేపీలోకి  వలసలకు శ్రీకారం చుట్టిన,ముకుల్ రాయ్, బీజేపీని వదిలి సొంత గూటికి చేరడం, అదే సమయంలో ఉద్యమ సమయం నుంచి తెలంగాణ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన మాజీ మంత్రి ఈటల రాజేందర్, తెరాసను వదిలి బీజేపీలో చేరడం నడుస్తున్న చరిత్రలో నిలిచిపోయే కీలక రాజకీయ పరిణామాలు. ముఖ్యంగా, తెలంగాణలో బెంగాల్ దూకుడు చుపుతామని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డా, స్పష్టం చేసిన నేపధ్యంలో, రాన్నున్న రోజుల్లో తెలంగాణా రాజకీయాలు కొత్త రూపును సంతరించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.   ముకుల్ రాయ్, ఈటల రాజేందర్ మధ్య ఒక చిన్న పోలిక కూడా వుంది. ఒకప్పుడు కేసీఆర్’కు ఈటల కుడి భుజంగా ఉన్నారు, ఆ విషయాన్ని కేసీఆర్ కూడా అనేక సందర్భాలలో చెప్పారు. అలాగే,ముకుల్ రాయ్ 2017లో పార్టీ వదిలి పోయే వరకు, మమతా బెనర్జీకి కుడి భుజంగా నిలిచారు. అలాగే, అక్కడ ముకుల్ రాయ్, ఇక్కడ ఈటల కూడా ఒక విధంగా అవమానకర పరిస్థితులలోనే సొంత పార్టీ నుంచి బయటకు వచ్చారు.అయితే ఎంతవరకు నిజమో గానీ, అక్కడ ముకుల్ రాయ్ పట్ల మమతకు, ఇక్కడ ఈటల పట్ల కేసీఆర్’కు మనసులో కాసింత సాఫ్ట్ కార్నర్’ ఉందనే మాట కూడా అక్కడా ఇక్కడా వినిపిస్తుంది.  అయితే, బెంగాల్లో సాగిన రీతిలో తెలంగాణలో వలసలు, ముఖ్యంగా అధికార పార్టీ నుంచి ఫిరాయింపులు సాధ్యమా? అంటే, ముందుముందు ఏమో కానీ, ప్రస్తుతానికి అయితే. బెంగాల్లా బారులు తీరే పరిస్థితి లేదు. ఈటలకు ఉద్యమ నాయకుడు అన్న ట్యాగుంది, బీసీ నాయకుడిగా గుర్తింపు వుంది. సామాజికంగానే కాకుండా, ఆర్థికంగా  ఇతరత్రా కేసీఆర్’ను ఎదుర్కునే సామర్ధ్యం (ఇతరులతో పోల్చుకుంటే) కొంచెం ఎక్కువగానే వుంది. పార్టీలో మంచి పేరుంది. ఎమ్మెల్యేలకు ఆయన పట్ల గౌరవం కొంచెం ఎక్కువగానే ఉందని అంటారు.అయినా, వందకు పైగా ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలలో కనీసం ఒక్కరు కూడా, ఆయనకు మద్దతుగా బయటకు రాలేదు. ఒక మంచి మాట మాట్లాడలేదు. ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక  జిల్లా పరిషత్ మాజీ, చైర్ పర్సన్ మినహ గుర్తింపుగల నాయకులు ఎవరూ ఈటల వెంట రాలేదు. అఫ్కోర్స్, ఆట ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కాలేదు కాబట్టి, ఇప్పటికిప్పుడు బలాబలలాను బేరీజు వేయడం సమంజసం కాదు. అయినా, బెంగాలీ సినిమా తెలంగాణలో ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది అనుమానమే అంటున్నారు రాజకీయ పండితులు. అయితే, ఈటల రాజీనామా చేసిన హుజురాబాద్’ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఏన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో విజయం  సాధించడంతో పాటుగా, కేసీఆర్’ పట్టాభి షేకం వంటి అనూహ్య పరిణామాలు  చోటుచేసుకుంటే తప్ప అధికార పార్టీ నుంచి బీజేపీలోకి వలసలు పరుగులు తీసే అవకాశం ఉండదని కమలం పార్టీ కీలక నేతల భావిస్తున్నారు. ఒక వేళ కేటీఆర్’కు పట్టాభిషేకం జరిగితే మాత్రం, అప్పుడు పార్టీలో చీలిక అనివార్యం అవుతుందని పార్టీ వర్గాల్లో వినవస్తోంది. అందుకే, ముఖ్యమంత్రి ఇంతకాలం దూరం పెట్టిన హరీష్ రావును దగ్గర  చేస్తున్నారని కూడా పార్టీ వర్గాల్లో వినవస్తోంది.  అదలా ఉంటే, ఈటల బీజేపీలో చేరడం వలన తెరాసకు జరిగే నష్టం ఎలా ఉన్నా, ప్రస్తుతానికి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి మాత్రం, ఈటల పోటు గట్టిగా ఉంటుందని పిస్తోంది. ఓ వంక జాతీయ స్థాయినుంచి, రాష్ట్ర స్థాయి వరకు అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న హస్తం పార్టీకి ఈటల బీజేపీ ఎంట్రీ అదనపు కష్టాలు తెచ్చిపెడుతుందని, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలసలు మొదలవుతాయని అంటున్నారు.ఇప్పటికే డీకే అరుణ మొదలు అనేక మంది సీనియర్ కాంగ్రెస్ నాయకుల బీజేపీలో చేరి కీలక బాధ్యతల్లో ఉన్నారు. అదే విధంగా,ఈటల చేరిక తర్వాత మరి కొందరు నాయకులు  కూడా బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఆదిలాబాద్ మాజీ ఎంపీ  రమేష్ రాథోడ్ వంటి సీనియర్ నాయకులూ కూడా ఉన్నారు. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న ఆయన తమ  అనుచరులు, అభిమానులతో మాట్లాడిన అనంతరం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రమేష్ రాథోడ్ బీజేపీలో చేరితే తెలంగాణలో కాంగ్రెస్‌కు ఆమేరకు నష్టం జరుగుతుంది. అంతేకాదు,మరి కొందరు అయన బాటలో పయనించినా ఆశ్చర్యపోనవసరం లేదు. రమేష్ రాథోడ్ బీజేపీలో చేరికపై పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటికే తన అనుచరులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ వారి అభిప్రాయాలకు అనుగుణంగా పార్టీ మారాలనే యోచనలో రమేష్ రాథోడ్ ఉన్నారు. రమేష్ రాథోడ్ చేరికతో ఆదిలాబాద్‌లో కాషాయం  బలపడనుంది.  గతంలో రమేష్ రాథోడ్ ఖానాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  రమేష్ రాథోడ్ తొలుత తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్‌లో చేరారు. టీఆర్ఎస్‌లో కూడా తనకు సరైన ప్రాధాన్యం దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీలోక చేరారు. కాంగ్రెస్‌లో కూడా ఆయనకు సరైన గుర్తింపు దక్కక పోవడంతో బీజేపీ వైపు చూస్తున్నారు. ఈటల రాజేందర్ నివాసంలో గురువారం భోజనానికి హాజరైన బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జీ తరుణ్ చుగ్‌ని కలిసిన రాథోడ్ తమ అభిప్రాయాన్ని తెలిపినట్లు సమాచారం. అయితే అయన ఈటలతో పాటుగా కాషాయ కడువా కప్పుకుంటారా ..లేక మరో ఈవెంట్ ప్లాన్ చేస్తారా అనేది చూడవలసి వుంది.

అమిత్ షాతో జగన్ ఏం మాట్లాడారు? రఘురామ పై వేటు పడనుందా?

లోపల ఏం జరిగిందో తెలియదు గాని..బయట మాత్రం మోత వీళ్లేమో పెద్దపెద్ద ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తారు.. వాళ్లేమో అసలే నోరు విప్పరు..లేదంటే ఓ ట్వీట్ మన మొహాన పడేస్తారు. అసలేం మాట్లాడుకున్నారు...ఏం చర్చించారు... ఎవరు ఎవరికీ డీల్ ప్రపోజల్ చేశారు.. ఎవరు ఓకె అన్నారు..ఎవరు కాదన్నారు.. అసలా డీల్ ఏంటి? ఇలా పాపం ఏపీ జనం తెగ ఊహించుకుంటూ అల్లాడిపోతున్నారు. రెండు వర్గాలుగా ఉన్న మీడియా కూడా ఎవరి గోల వారిది వినిపిస్తున్నారు. ఒకరు అమిత్ షా జగన్ ను ఎమ్మెల్సీ పదవులు అడిగారని చెబుతుంటే..మరొకరు జగనే అమిత్ షాను కేంద్ర మంత్రి పదవులు అడిగారని వినిపిస్తున్నారు. ఆయన ఈయనను ఏం అడిగారో..ఈయన ఆయనను ఏం అడిగారో..ఎవరికీ సమజే కావటం లేదు. వాళ్లు కలిసింది గంట అయితే..మీడియా మాత్రం రెండు రోజుల నుంచి నాన్ స్టాప్ గా వాయిస్తోంది. అసలు జగన్, అమిత్ షా ఏం మాట్లాడుకున్నారు? ఏం డీల్ చేసుకున్నారు? అంటే కరెక్టు సమాధానం జగన్ కు, లేదంటే అమిత్ షాకు మాత్రమే తెలుస్తుంది. కాకపోతే వచ్చిన రూమర్ల వెనక లాజిక్ లాగీ..అది కరెక్టో కాదో తేలుద్దాం. ఒకటి అమిత్ షా జగన్ ను ఎమ్మెల్సీ పదవులు అడిగారని.. ఎమ్మెల్సీ పదవులు ఏం చేసుకుంటుంది బిజెపి. లోకల్ బిజెపి నేతలను ఆ పదవులిచ్చి సోపు వేయాల్సినంత అవసరం అమిత్ షాకు లేదు. వాళ్లకు అవసరమైంది రాజ్యసభ ఎంపీ పదవులు..అడిగితే గిడిగితే అవే అడుగుతారు. ఎందుకంటే బిజెపికి రాజ్యసభలో బలం పెరుగుతుంది కాబట్టి..వారనుకున్నవి ప్రశాంతంగా చేసుకోగలరు కాబట్టి. కాబట్టి ఈ రూమర్ రూల్డ్ అవుట్. ఇక జగన్ మంత్రి పదవులు కావాలని అమత్ షాను అడిగారని. ఇది కూడా ఇల్లాజిక్కే. జగన్ కు ఇప్పుడు కేంద్రంలో మంత్రి పదవులు అవసరమే లేదు. కావాల్సింది మోదీ, అమిత్ షాల సపోర్ట్. మీక్కావాల్సింది ఇస్తా..నేననుకున్నవి నన్ను చేసుకోనివ్వండి..అంతే అడిగేది. ఇంకా కరెక్టుగా చెప్పాలంటే పోలవరం నిధులు, ప్రత్యేక హోదా ఇలాంటివేమీ ఇవ్వకపోయినా పర్వాలేదు.. నా ప్లాన్లు అమలు చేసుకోవడానికి మీ సపోర్టు కావాలి అంతే. మూడు రాజధానులు అమల్లోకి రావాలి.. ఎవరూ అడ్డం రాకూడదు. చంద్రబాబు అండ్ కో ను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతా.. నన్ను అడక్కూడదు..రఘురామకృష్ణరాజును వెంటనే సస్పెండ్ చేస్తే..ఆడి సంగతి చూసుకుంటా..ఇలా ఉండుంటుంది లిస్ట్ అని ప్రత్యర్ధులు నవ్వుతూ కామెంట్ చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే కేంద్రంలో మంత్రి పదవులు అమిత్ షా యే జగన్ కు ఆఫర్ చేసి ఉంటారు. ఎందుకంటే జగన్ రాజధాని, రఘురామ, చంద్రబాబు లాంటి విషయాల్లో సపోర్ట్ అడుగుతారు కాబట్టి.. మీరు మాకు సపోర్ట్ చేస్తామని ఊరికే చెప్పడం కాదు.. వ్యవసాయ బిల్లు విషయంలో సభలో మద్దతు ఇచ్చి తర్వాత వ్యతిరేకిస్తారు.. అలా కుదరదు.. మీరు గవర్నమెంటులో చేరితే.. మీరు కూడా అన్ని నిర్ణయాల్లో భాగస్వాములు అవుతారు..మీకు కూడా మేం ఏమన్నా చేయలగం.. అని అమిత్ షా వివరంగా చెప్పి ఉంటారు. మరిప్పుడు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందో తెలిసిపోవటంలేదా..? రాజధాని షిఫ్టింగ్ కు ఓకె చెప్పేశారు..రఘురామకృష్ణరాజు సస్పెన్షన్ కు ఓకె చెప్పేసే ఉంటారు.. సో జగన్ బాబు కూడా కేబినెట్ లో చేరడానికి ఓకె చెప్పే ఉంటారు కదా.. జస్ట్ వెయిట్ అండ్ సీ

జ‌గ‌న్‌కంటే సోనూసూద్ బెట‌ర్‌.. ముఖ్య‌మంత్రి అభినవ నీరో చక్రవర్తి..

ఎన్నో విప‌త్తుల‌ను చూశాన‌ని.. క‌రోనా వంటి సంక్షోభం చూడ‌టం ఇదే తొలిసారి అని అన్నారు టీడీపీ అధినేత చంద్ర‌బాబు. అధికారంలో ఉన్నా.. లేకున్నా ప్ర‌జాసేవే టీడీపీ అజెండా అని స్ప‌ష్టం చేశారు. క‌రోనా విప‌త్తులోనూ టెలిమెడిసిన్ ద్వారా సాయం చేస్తున్న‌ట్టు చెప్పారు. సేవ చేయ‌డానికి ప్ర‌భుత్వానికి ఎన్నో అధికారాలు, అవ‌కాశాలు ఉంటాయ‌ని.. మూడో ద‌శ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని మ‌రింత బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని స‌ర్కారుకు సూచించారు చంద్రబాబు.  కొవిడ్‌పై పోరాటంలో కుటుంబ సభ్యులు కూడా బాధితుల వ‌ద్ద‌కు వెళ్ల‌డం లేద‌ని.. ఇదే స‌మ‌యంలో క‌రోనా బారిన ప‌డిన‌వారికి ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్‌ సేవలు అందిస్తుండ‌టం అభినంద‌నీయ‌మ‌ని చంద్ర‌బాబు అన్నారు. ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ద్వారా అందుతున్న వైద్య సేవ‌ల‌పై వివిధ రంగాల నిపుణుల‌తో ఆయ‌న వ‌ర్చువ‌ల్‌గా స‌మావేశ‌మ‌య్యారు. ఈ మీటింగ్‌లో న‌టుడు సోనూసూద్ కూడా పాల్గొన్నారు. సోనూసూద్‌ సేవ‌ల‌ను చంద్ర‌బాబు కొనియాడారు. క‌రోనా విప‌త్తులో సోనూసూద్ అపార సేవ‌లందించార‌న్నారు. ప్ర‌జాసేవ‌కు ఐక్య కార్యాచ‌ర‌ణ రూపొందిద్దామ‌ని చంద్ర‌బాబు సూచ‌న‌కు సోనూసూద్ అంగీక‌రించారు.   సోనూసూద్ మాట్లాడుతూ... విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డం బాధ్య‌త‌గా భావిస్తున్నాన‌న్నారు. ''తెలుగు రాష్ట్రాలు నాకు రెండో ఇల్లు లాంటివి. నా భార్య ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన వ్య‌క్తి కావ‌డం సంతోషం. సేవ చేయ‌డానికి కులం, మ‌తం, ప్రాంతం అవ‌స‌రం లేదు. తెలుగు రాష్ట్రాల్లో 18 ఆక్సిజ‌న్ ప్లాంట్ల నిర్మాణానికి చ‌ర్య‌లు తీసుకున్నాను. ప్ర‌జా సేవ‌కు స్పందించే ప్ర‌తి ఒక్క‌రూ నిజమైన హీరోలే. హైద‌రాబాద్ అభివృద్ధిలో చంద్ర‌బాబు పాత్ర ప్ర‌త్య‌క్షంగా చూశా. కొవిడ్‌పై పోరులో ఇద్ద‌రి ఆలోచ‌న‌లు క‌ల‌వ‌డం ఎంతో సంతోషం'' అని సోనూసూద్ అన్నారు.   అటు, సీఎం జగన్‌రెడ్డి అభినవ నీరో చక్రవర్తి అంటూ టీడీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఘాటుగా విమ‌ర్శించారు. కరోనా కారణంగా చితికిపోయిన పేదకుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.10లక్షలు ప‌రిహారం చెల్లించాల‌ని కోరారు. ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు రూ.10 వేల ఆర్థికసాయం చేయాలని,  ఉచితంగా సరుకులు అందించాలని కూన రవికుమార్ డిమాండ్ చేశారు. ఇక‌, సీఎం జగన్.. నవరత్నాల పేరుతో ప్రజలకు నవరత్న ఆయిల్ రాశార‌ని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిప‌డ్డారు. పన్నుల పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉండగా పెట్రోల్, డీజిల్ ధరలపై అసెంబ్లీలో మొసలి కన్నీరు కార్చారని... మరి ఇప్పుడు ఎలా పెంచారని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేసి గెలించారని వారికి పన్నుల బాదుడు బహుమతిగా ఇస్తున్నారా అని ఎద్దేవా చేశారు. పథకాల పేరుతో ప్రజలకు ఎర వేసి.. పన్నుల పేరుతో లూటీ చేస్తున్నారని మండిప‌డ్డారు కొల్లు ర‌వీంద్ర‌.  మ‌రోవైపు, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు లేఖ రాశారు. ఏపీపీఎస్‌సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష పేపర్ డిజిటల్ వాల్యుయేషన్, ఫలితాలపై  అనుమానాలను వివరిస్తూ లేఖ రాశారు. గ్రూప్ 1లో అవకతవలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అభ్యర్థులకు న్యాయం జరిగేలా గవర్నర్ జోక్యం చేసుకుని ప్రభుత్వానికి తగు ఆదేశాలు ఇవ్వాలని లేఖలో కోరారు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు. ఇలా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై టీడీపీ అధినేత చంద్ర‌బాబు నుంచి తెలుగు యువ‌త అధ్య‌క్షుని వ‌ర‌కూ.. జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. నిత్యం ప్ర‌జ‌ల శ్రేయ‌స్సు కాంక్షించే టీడీపీ నాయ‌కులు. ఇలా ఎప్ప‌టిక‌ప్పుడు జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారును నిల‌దీస్తూ.. ప్ర‌జ‌ల ప‌క్షాన పోరాడుతూ ప్ర‌జాభిమానం పొందుతున్నారు. 

ర‌మ‌ణ‌కు ర‌మ‌ణీయ స్వాగ‌తం.. కేసీఆర్‌ను చూసి నేర్చుకో జ‌గ‌న్‌!

ఆహా. ఏమి మ‌ర్యాద‌.. ఏమి గౌర‌వం.. అత్యున్న‌త న్యాయ‌మూర్తికి అత్యున్న‌త గౌర‌వం. అడుగ‌డుగునా అపూర్వ స్వాగ‌తం. తెలంగాణ గ‌డ్డ‌పై కాలు మోపింది మొద‌లు.. రాజ్‌భ‌వ‌న్‌లో సేద తీరే వ‌ర‌కూ.. ఆతిథ్యంతో.. సాద‌ర స్వాగ‌తంతో అబ్బుప‌రిచింది తెలంగాణ స‌ర్కారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తెలంగాణ‌కు విచ్చేసిన జస్టిస్‌ ఎన్వీ రమణకు ర‌మ‌ణీయ స్వాగ‌తం ల‌భించింది. రాజ్‌భవన్‌లో సీజేఐ ఎన్వీ రమణ దంప‌తుల‌కు.. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, సీఎం కేసీఆర్ ఘ‌న‌ స్వాగతం పలికారు. 3 రోజుల పాటు రాజ్‌భవన్ అతిథి గృహంలో ఉండనున్నారు జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌. అంతకుముందు శంషాబాద్‌ విమానాశ్రయంలో.. హైకోర్టు సీజే జస్టిస్‌ హిమా కోహ్లీ, రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్‌ అలీ, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి , ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌, పలువురు ఎమ్మెల్యేలు సీజేఐకు గ్రాండ్ వెల్‌క‌మ్ ప‌లికారు. ఇలా తెలంగాణ ప్ర‌భుత్వ‌మంతా క‌దిలొచ్చి.. సీజేఐకు సాద‌ర స్వాగ‌తం ప‌ల‌క‌డం నిజంగా అపూర్వం. అ నిర్వ‌చ‌నీయం.  ఓ తెలుగువాడు సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి పీఠం అధిష్టించ‌డం తెలుగువారంద‌రికీ గ‌ర్వ‌కార‌ణం. ఎన్వీ ర‌మ‌ణ దేశ అత్యున్న‌త న్యాయ స్థానాన్ని అలంక‌రించి తెలుగుజాతికి వ‌న్నె తీసుకొచ్చారు. ఆయ‌న్ను అత్యుత్త‌మంగా ఆహ్వానించి తెలుగు సంస్కారాన్ని ఘ‌నంగా చాటుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌.  ఎంత తేడా. ఎంత తేడా. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల్లో ఎంత తేడా. సీఎం కేసీఆర్‌.. జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌కు ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఇంత సాద‌రంగా ఆహ్వానిస్తే.. అదే ఏపీ స‌ర్కారు? ఏపీ సీఎం జ‌గ‌న్‌రెడ్డి ఏం చేశారు?  తెలుగోడి కీర్తిని సుప్రీం పీఠంపై కూర్చోబెట్టిన‌ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌కు ఏమేర‌కు గౌర‌వించారు? మ‌రి, ఇంత‌టి కుసంస్కార‌మా? మ‌రీ ఇంత‌టి కుళ్లుబోతుతన‌మా? మ‌రీ ఇంత‌టి దిగ‌జారుడుత‌న‌మా? అంటూ సాటి తెలుగువారు ప్ర‌శ్నిస్తున్నారు. సీజేఐ అయ్యాక జ‌స్టిస్‌ ఎన్వీ ర‌మ‌ణ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వ‌చ్చారు. వెళ్లారు. అంతే. ఆయ‌న‌కు ఏపీ ప్ర‌భుత్వం త‌ర‌ఫున‌ ఎలాంటి స్వాగ‌త‌మూ.. స‌త్కార‌మూ చేయ‌లేదు. సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్‌గా తొలిసారి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అడుగుపెట్టిన సంద‌ర్భానికి ఎలాంటి ప్ర‌త్యేక‌త‌ను, విశిష్ట‌త‌ను క‌ల్పించ‌లేదు జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం. ఇది నిజంగా దారుణ విష‌యం అంటున్నారు. అతిథ్యానికి ఖ్యాతి గాంచిన ఆంధ్రుల్లో ఇంత‌టి నీచ సంస్కృతి ఇంత‌కుముందు ఎప్పుడూ చూడ‌లేదంటున్నారు. జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌లోనే ఇలా తెలుగు గౌర‌వం నానాటికి దిగ‌జారిపోతోందనే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌న్మించిన ఎన్వీ ర‌మ‌ణ‌కు.. సాటి తెలుగువాడిగా తెలంగాణ స‌ర్కారు ఘ‌న స్వాగ‌తం ప‌లికింది. అదే, మ‌న‌ నేల మీద‌నే పుట్టిన ఆ న్యాయ‌కోవిదుడికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం త‌ర‌ఫున‌ ఎలాంటి ప్ర‌త్యేక గౌర‌వం ల‌భించ‌క‌పోవ‌డం జ‌గ‌న్‌రెడ్డి నిష్టూర‌పు చ‌ర్య‌ల‌కు నిద‌ర్శ‌న‌మ‌ని త‌ప్పుబ‌డుతున్నారు విజ్ఞులు. జ‌స్టిస్ ర‌మ‌ణ‌పై జ‌గ‌న్‌రెడ్డి మొద‌టి నుంచీ ఇలాంటి వైఖ‌రే అవ‌లంభిస్తున్నారు. అస‌లు ఓ తెలుగువాడు సీజేఐ అవ‌కుండా ఎంత‌గా కుట్ర చేయాలో అంతా చేశారు. ర‌మ‌ణ లాంటి వ్య‌క్తికి సైతం కులాన్ని ఆపాదిస్తూ.. ఓ పార్టీతో, ఓ వ్య‌క్తితో ముడిపెడుతూ.. ఆయ‌న‌పై అప్ప‌టి సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి ఫిర్యాదు చేయ‌డం జ‌గ‌న్‌రెడ్డి దుర్నీతికి నిద‌ర్శ‌నం. ఎన్వీ ర‌మ‌ణ సీజేఐ కాకుండా జ‌గ‌న్‌రెడ్డి ఆయ‌న‌పై అప‌వాదు మోపినా.. న్యాయం మాత్రం ఆ న్యాయ‌మూర్తి ప‌క్షానే నిలిచింది. అందుకే, దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానంలో, అత్యున్న‌త పీఠాన్ని అధిరోహించి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ తెలుగు జాతికే నిండు గౌర‌వం తీసుకొచ్చారు.  అంత‌టి వ్య‌క్తిప‌ట్ల‌.. ఏపీ ప్ర‌భుత్వం అంత ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రిస్తే.. అదే స‌మ‌యంలో తెలంగాణ స‌ర్కారు ఆసాంతం క‌దిలొచ్చి.. సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ‌కు ఘ‌న‌స్వాగ‌తం ప‌ల‌క‌డం.. తెలుగుజాతికంతటికీ గౌర‌వ‌ప్ర‌ద‌మే. అందుకే, న‌వ్విపోదురుగాక నాకేంటి.. అన్న‌ట్టూ సీఎం జ‌గ‌న్‌రెడ్డి మూతిముడుచుకొని కూర్చోకుండా.. క‌నీసం సీజేఐ హోదాకైనా, తెలుగువాడు అయినందుకైనా.. ఎన్వీ ర‌మ‌ణ‌కు స‌ముచిత స‌త్కారం చేసుంటే బాగుండేద‌ని అంటున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను చూసైనా నేర్చుకోవాల‌ని హిత‌వు ప‌లుకుతున్నారు. కానీ, ఇలాంటి మంచి మాట‌లు, మంచి చేష్ట‌లు.. దుర్బుద్ది గ‌లిగిన నేత‌ల చెవుల‌కు, క‌ళ్ల‌కు సోకుతాయా? జ‌గ‌మొండి ఘ‌టాలు అంత ఈజీగా మారుతాయా? మ‌ర‌క మంచిదే అనుకునే నాయ‌కులు.. మార్పు మంచికేన‌ని గ్ర‌హిస్తారా? అంటే క‌ష్ట‌మే అంటున్నారు.

మోడీ తో ‘డీ’ అంటున్న  ప్రశాంత్ కిశోర్ 

ఒక్క తెలుగు రాష్ట్రలోనే కాదు, దేశ వ్యాప్తంగా రాజకీయాలు అనూహ్యంగా వేడెక్కు తున్నాయి. యూపీలో వచ్చే సంవత్సరం మార్చిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఇప్పటికే అగ్గి రాసుకుంది. అధికార బీజేపీ ఓటమి భయంతో కిందామీదా అవుతోంది. బెంగాల్లో ఎన్నికల క్రతువు ముగిసినా, రాజకీయ దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మమతా బెనర్జీ, వేడి చల్లారక ముందే, రాష్ట్రంలో ఏకైక  ప్రతిపక్షంగా ఎదిగిన బీజేపీని మొగ్గలోనే తుంచేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఘర్ వాపసీకి గేట్లు తెరిచారు. ఎన్నికలకు ముందు బీజేపీలోకి వెళ్ళిన నాయకులు తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నారు. రాజస్థాన్’లో అధికార కాంగ్రెస్ పార్టీలో సంవత్సరం క్రితం ముఖ్యమంత్రి అశోక్ గేహ్లోట్, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ వర్గాల మధ్య రగిలిన చిచ్చు, అప్పటికి సర్దుకున్నా ఇప్పుడు మళ్ళీ మొదటి కొచ్చింది. పైలట్ ఢిల్లీ చేరుకున్నారు. అయన వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఒకరు రాజీనామ చేశారు. యూపీలో జితిన్  ప్రసాద కాంగ్రెస్’ను వదిలి కమల గూటికి  చేరిన నేపధ్యంగా తెరపై కొచ్చిన రాజస్థాన్’ డ్రామా ఏ మలుపు తిరుగుతుందో తెలియదు. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప మెడ మీద కత్తి వేలాడుతోంది, ఎప్పుడైనా ఆయన మాజీ అయ్యే ముహూర్తం పొంచి వుందని అంటున్నారు. ఆయన వ్యతిరేక వర్గం, ఆయన్ని గద్దె దించేందుకు చాలా గట్టిగా ప్రయత్నిస్తోంది. ఆయన వర్గం కుర్చీ కాపాడుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇలా ఎక్కడిక్కడ ప్రతి రాష్టంలో ఎదో ఒక రాజకీయ అలజడి  చోటు చేసుకుంటోంది. మరోవంక జాతీయ స్థాయిలో 2024 సార్వత్రిక ఎన్నికల వ్యూహలకు ప్రధాన పార్టీలు పదును పెడుతున్నాయి.  ఆ అన్నిటికంటే, మహా రాష్ట్ర పరిణామాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల వ్యుహకర్త’ ప్రశాంత్ కిషోర్ శుక్రవారం ముంబైలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ను కలవడం, ఆయనతో సుమారు మూడు గంటలకు పైగా చర్చలు జరపడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ప్రశాంత్ కిషోర్ ఎందుకు పవార్’ను కలిశారు, ఆ ఇద్దరు అన్ని గంటలు ఏమి చర్చించారు, అనేది మహా రాజకీయాల్లోనే కాకుండా, దేశ రాజకీయాలలోనూ ఆసక్తి రేకిస్తోంది.ఇటీవల శాసనసభ ఎన్నికల్లో బెంగాల్లో టీఎంసీ, తమిళనాడులో డిఎంకే’ను గెలిపించిన ప్రశాంత్ కిషోర్, ‘ఎన్నికల వ్యుహకర్త’ అవతారాన్ని ఇక చాలిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన కూడా లేదని, అన్నారు. గతంలో కొద్ది కాలంపాటు, జనతా దళ్ (యు) ఉపాధ్యక్షుడిగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్’తో కలిసి ప్రయాణించిన ప్రశాంత్ కిషోర్, ‘ తనను తాను ‘ఫెయిల్డ్ పోలిటిషియన్’ పేర్కొన్నారు. అయినా, ఆయన శరద్ పవార్’ను కలవడం ఇటు మహా రాష్ట్ర రాజకీయాల్లో అటు జాతీయ  రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. బెంగాల్, తమిళనాడులో తమ ‘ క్లైంట్స్’ గెలుపుకు సహకరించిన నాయకులకు కృతజ్ఞలు చెప్పేందుకే తాను వివిధ పార్టీల నాయకులను కలుస్తున్నానని,అందులో భాగంగానే శరద్ పవార్’ను కలిశానని, ప్రశాంత్ కిషోర్ పైకి చెప్పినా, 2024 ఎన్నికల వ్యూహరచనలో భాగంగానే ఈ ఇద్దరి మధ్య  చర్చలు జరిగాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.   అదలా ఉంటే, మహారాష్ట్ర రాజకీయాలలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా, జాతీయ రాజకీయాలతో ముడిపడినవి కావడంతో ఏమి జరుగుతోందనం ఆసక్తి వేడిని మరింత పెంచుతోంది. సుమారు పక్షం  రోజుల క్రితం బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్’ ఎన్సీపీ అదినేత శరద్ పవార్’ను అయన నివాసంలో కలిశారు. ఇక అక్కడి  నుంచి రాజకీయ ఊహాగానాలు మొదలయ్యాయి.అయితే, ఆ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత లేదని, అటు పవార్, ఇటు ఫడ్నవిస్’ పేర్కొన్నారు. అయినా, ఏదో ఉందనే ఊహాగానాలు మాత్రం ఆగలేదు. ఇక ఆ తర్వాత మహా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రధాని నరేంద్ర మోడీని అధికారికంగా కలిశారు. ఆయన వెంట ఉపముఖ్యమంత్రి ఎన్సీపీ నాయుడు, అజిత్ పవార్, కాబినెట్ మంత్రి కాంగ్రెస్ నాయకుడు అశోక్ చవన్ కూడా ఉన్నారు. అయితే అధికారిక చర్చలు ముగిసిన తర్వాత ఉద్ధవ్ థాకరే ఒక్కరే ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా, సమావేశమయ్యారు. ఈ పది నిముషాల్లో ఏమి జరిగింది, అనే విషయంలో ఉత్ఖంట చోటు చేసుకుంది. అది చాలదు అన్నట్లుగా ఉద్ధవ్ థాకరే, “నేను కలిసింది, పాక్ ప్రదాని ఇమ్రాన్ ఖాన్’ను కాదు భారత ప్రధాని మోడీని” అంటూ చేసిన వ్యాఖ్య, రాజకీయ ఉత్ఖంటను మరింతగా పెంచింది.  మరోవంక, బీజేపీ, మోడీని విమర్శించడంలో ముందుండే, శివసేన ఎంపీ, సంజయ్ రౌత్, ప్రధాని మోడీని పొగడ్తలతో ముంచెత్తారు. మీడియా సమావేశంలో, మోడీ పాపులారిటీ తగ్గిపోయిందని, అనుకుంటున్నారా,అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ . మోడీ బీజేపీకి మాత్రమే కాదు దేశానికే మహా నాయకుడు, అని పేర్కొన్నారు. దీంతో మహారాష్ట్రలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయా?  మళ్ళీ మరో మారు పాత మిత్రులు దగ్గరవుతున్నారా? అనే అనుమానాలు వినవస్తున్నాయి.మరో వంక, ప్రశాంత్ కిశోర్’ 2024 నాటికి జాతీయ స్థాయిలో బీజేపీ, మోడీకి ప్రత్యాన్మాయంగా మమత బెనర్జీని నిలిపేందుకు, ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందు సంబంధించి మమతా బెనర్జీని ప్రస్నించినప్పుడు  అవునని కాదనీ అనకుండా, 2024 ఎన్నికలలో అందరం కలిసి మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని అనుకుంటున్నాను” అని సమాధాన మిచ్చారు. మరో వంక ఇటీవల  తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన మమతా బెనర్జీ, మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరిస్తామని ప్రకటించారు. సో ... ఎన్నికలకు మూడేళ్లున్నా, ఇప్పటి నుంచే ప్రశాంత్ కిషోర్, మోడీని ఓడించడమే లక్ష్యంగా రంగంలోకి దిగారు..అయితే, ఆయన స్వయంగా ఈ బాధ్యతను నెత్తికి ఎత్తుకున్నారా?  లేక జాతీయ, అంతర్జాతీయ క్లైంట్స్ కోసం ఆయన పనిచేస్తున్నారా, అనేది తేలాలంటే ఇంకొంత కాలం ఆగవలసి ఉంటుంది.

వేటు అంత వీజీ కాదు.. న‌న్నేమీ చేయ‌లేరు.. జ‌గ‌న్‌రెడ్డికి ర‌ఘురామ స‌వాల్‌..

పార్ల‌మెంట్ సెష‌న్ జ‌ర‌గ‌బోతోంద‌నే టెన్ష‌న్ ఒక‌వైపు.. ర‌ఘురామ ఎపిసోడ్‌లో తాను దోషిగా నిల‌బ‌డాల్సి వ‌స్తుంద‌నే ఆందోళ‌న మ‌రోవైపు.. వెర‌సి సీఎం జ‌గ‌న్‌రెడ్డి ర‌ఘురామ విష‌యంలో మాన‌సికంగా బాగా న‌లిగిపోతున్నార‌ట‌. అందుకే, ర‌ఘురామ‌ను పార్ల‌మెంట్‌లో అడుగుపెట్ట‌కుండా చేయాల‌ని జ‌గ‌న్‌రెడ్డి అత్యంత బ‌లంగా కోరుకుంటున్నారట‌. జ‌స్ట్‌.. కోరుకుంటే స‌రిపోద్దా? ఎంపీ ర‌ఘురామపై వేటు వేయ‌డం అంత ఈజీనా? కానే కాదు. నేనేమి చేశాను నేరం.. అంటూ ర‌ఘురామ రివ‌ర్స్ అవ‌డ‌మే కాకుండా.. జ‌గ‌న్‌రెడ్డి త‌న‌పై చేసిన దారుణాల‌న్నిటిపైనా పార్ల‌మెంట్ ముందుంచేందుకు రెడీ అవుతున్నారు.  జూలైలో పార్ల‌మెంట్ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయ‌నే వార్త‌ల‌తో.. జ‌గ‌న్‌రెడ్డిలో క‌ల‌వ‌ర‌పాటు పెరిగిపోతోంది. స‌మ‌యం లేదు శ‌త్రువా.. అంటూ ర‌ఘురామకు కౌంట‌ర్ అటాక్ ఇచ్చేందుకు పావులు క‌దుపుతున్నారు. అయితే, వైసీపీ ముందున్న ఒకే ఒక ఆప్ష‌న్.. లోక్‌స‌భ స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేయ‌డం. అందులో భాగంగా.. వైసీపీ ఎంపీగా ఎన్నికైన రఘురామ.. పార్టీ వ్య‌తిరేక కార్య‌క్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నారు కాబ‌ట్టి.. ఆయ‌న‌ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్‌సభ స్పీక‌ర్‌ ఓం బిర్లాకు సభలో వైసీపీ చీఫ్‌ విప్‌ మార్గాని భరత్‌ శుక్రవారం ఫిర్యాదు చేశారు. దీనిపై ర‌ఘురామ కౌంట‌ర్ ఇచ్చారు.  తాను ఏ పార్టీతోనూ జట్టుక‌ట్ట‌లేద‌ని.. అధికార పార్టీ కార్య‌క‌లాపాల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించ‌లేదని అన్నారు ఎంపీ ర‌ఘురామ‌. ప్ర‌భుత్వ సంక్షేమ ఫ‌లితాల అమ‌లులో లోపాల‌ను మాత్ర‌మే ప్ర‌స్తావించాన‌ని.. తనపై అన‌ర్హ‌త వేటు వేయ‌డం సాధ్యం కాద‌ని తేల్చి చెప్పారు. '' కొంత‌మంది త‌ప్పుడు వ్య‌క్తుల నుంచి పార్టీని కాపాడుకునే ప్ర‌య‌త్నం చేశా. వాస్త‌వాలు ఎప్ప‌టికైనా బ‌య‌ట‌కు వ‌స్తాయి. నాపై దాడి చేసిన వారి విష‌యంలో మ‌రోసారి ప్రివిలైజ్‌ మోష‌న్ ఇస్తా. నాపై ఈ నెల 10న ఫిర్యాదు చేసి 11న చేసిన‌ట్లు ప్ర‌చారం చేస్తున్నారు. హోంమంత్రిని సీఎం క‌లిశాకే ఫిర్యాదు చేసిన‌ట్టు చెబుతున్నారు. అన‌ర్హ‌త వేటుపై ఇప్ప‌టికే నాపై నాలుగైదు సార్లు ఫిర్యాదు చేశారు''   అంటూ ర‌ఘురామ ఎదురుదాడి చేశారు.  ర‌ఘురామ అంత తెలివి త‌క్కువ వాడు ఏమీ కాదు. ఆయ‌న ఎక్క‌డా చిక్క‌కుండా.. ఎక్క‌డా పార్టీ లైన్ త‌ప్ప‌కుండా.. చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చారు. విమ‌ర్శ‌ల‌న్నీ సీఎం జ‌గ‌న్‌రెడ్డిపైనే అయినా.. స‌ల‌హాలు, సూచ‌న‌ల‌నే కాన్సెప్ట్‌తో స‌ర్కారును ఏకిప‌డేసేవారు. వైసీపీ ప్ర‌భుత్వం, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి త‌ప్పుడు విధానాల‌పై ప్ర‌తినిత్యం దుమ్మెత్తిపోసేశారు. టెక్నిక‌ల్‌గా చూస్తే.. ఇవేవీ పార్టీ వ్య‌తిరేక విధానాలు కావు. అందుకే అవేవీ రూల్స్ అతిక్ర‌మించిన‌ట్టు కాదు. అందుకే, త‌న‌పై బ‌హిష్క‌ర‌ణ వేటు వేయ‌డం అసాధ్య‌మ‌ని ర‌ఘురామ ధీమాగా చెబుతున్నారు. లోక్‌స‌భ స్పీక‌ర్‌కు వైసీపీ చీఫ్ విప్ భ‌ర‌త్ ఇచ్చిన ఫిర్యాదుతో ఉప‌యోగం ఏమీ ఉండ‌ద‌ని అంటున్నారు. జూలైలో జ‌ర‌గ‌బోయే పార్ల‌మెంట్ స‌మావేశాల‌కు తాను హాజ‌ర‌వుతాన‌ని.. త‌న‌పై జ‌రిగిన దాడిని పార్ల‌మెంట్ ముందు ఉంచుతాన‌ని.. సీఎం జ‌గ‌న్‌రెడ్డిని దేశ ప్ర‌జ‌ల ముందు దోషిగా నిల‌బెడ‌తాన‌ని స‌వాల్ చేస్తున్నారు ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. వెయింట్ ఇక్క‌డ‌.. అంటూ ఢిల్లీలో ఉంటూ ఏపీ సీఎం జ‌గ‌న్‌రెడ్డిని ద‌డ‌ద‌డ‌లాడిస్తున్నారు.   

వరంగల్ సతీష్ చేతబడి మిస్టరీ వీడింది.. 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలజడి సృష్టించిన చేతబడి కాబడిన యువకుడి అదృశ్యం కేసు చివరకు చిక్కుముడి వీడింది. వరంగల్ జిల్లా  చెన్నారావుపేట మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన చీమల సతీష్ (28) కి చేతబడి చేశారని, ఆ కారణంగానే సతీష్ అదృశ్యం అయ్యాడని భయబ్రాంతులకు గురైన స్థానికులు అతని కుటుంబ సభ్యులు ఆ యువకుడి ఆచూకీ తెలవడంతో ఊపిరి పీల్చుకున్నారు.  వివరాల్లోకి వెళ్తే.. గురువారం అదృశ్యమైన చీమల సతీష్ రాత్రి పడుకున్నాడు ఉదయం లేచి చూడగాలే అక్కడ అతను లేడు. అతను పడుకున్న చోట మంత్రాలకు సంబందించిన ముగ్గులు కనిపించాయి. సతీష్ పడుకున్న చోట ఆ ముగ్గులు ఉండడంతో అతనికి మంత్రాలు చేశారని అందుకే సతీష్ మాయమయ్యాడని అతని కుటుంబసభ్యులు స్థానికులు కంగారు పడ్డారు.. ఎక్కడ పడితే అక్కడ వెతికారు.. అయినా ఏం ఫలితం లేకపోయింది..  కట్ చేస్తే  బస్టాండ్ వద్ద శుక్రవారం తిరగాడుతూ కనపడ్డాడు. ఇది గమనించిన ఉప్పరపల్లికి గ్రామానికి చెందిన వారు అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సతిష్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉన్నపలంగా చెప్పాపెట్టకుండా అదృశ్యమైన వ్యక్తి తిరిగి రావడంతో అతని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా అసలు రాత్రి పడుకున్న వ్యక్తి అదృశ్యమవడం, పైగా మంచం పక్కనే మనిషి బొమ్మ ముగ్గు గీయడం, కుంకుమ, నిమ్మకాయల తో భయబ్రాంతులకు గురిచేసేలా చేసిన ఏర్పాట్లు ఎవరు చేశారు, సతీష్ ని తీసుకెళ్లిందేవరు.. రాత్రంతా సతీష్ ఎక్కడ ఉన్నాడన్న పూర్తి విషయాలు విచారణలో తేలనున్నాయి. అందుకే మనకు కాళ్ళ ముందు కనిపించిందే వాస్తవం కాదు. వినుడగానెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపఁదగున్ అన్నారు. ఇది కూడా అంతే ఎవ్వడో ఏదో చెప్పాడని ఏదో చేశాడని వెంటనే నమ్మొద్దు.. సో.. ఆలోచించండి. అనవసరంగా నిర్ణయాలు తీసుకోకండి.. అనే నీతి ఈ వార్త ద్వారా తెలుస్తుంది..     

ఇక స‌మ‌ర‌మే.. ఈట‌ల రాజీనామా.. 14న కాషాయ కండువా...

హుజురాబాద్‌లో కురుక్షేత్ర సంగ్రామం జరగబోతోందని.. కౌరవులకు.. పాండవులకు మధ్య యుద్ధంలో.. అంతిమంగా తెలంగాణ ప్రజలే గెలుస్తారంటూ.. సీఎం కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెబుతారంటూ.. స‌వాల్ చేస్తూ.. ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు ఈట‌ల రాజేంద‌ర్‌. చట్టాన్ని అపహాస్యం చేసేలా తెలంగాణలో రాజకీయాలు సాగుతున్నాయన్నారు. ఇతర పార్టీల్లో గెలిచిన వారు రాజీనామా చేయకుండానే.. నిస్సిగ్గుగా మంత్రులుగా కొనసాగుతున్నారని ఈట‌ల మండిప‌డ్డారు.  గన్‌పార్క్ ద‌గ్గ‌ర‌ అమరవీరుల స్థూపానికి నివాళ్ళులర్పించిన అనంతరం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా స‌మ‌ర్పించారు ఈట‌ల రాజేంద‌ర్‌. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధ‌న‌ కోసం పోరాటం చేయడానికి ముందుకు పోతున్నానని ఈటల అన్నారు. నిర్బంధాలు త‌న‌కు కొత్త కాదని.. వాటిని తొక్కి పడేస్తానంటూ స‌వాల్ విసిరారు ఈట‌ల‌. నియంత నుంచి తెలంగాణను విముక్తి చేయడమే తన ఎజెండా అన్నారు. యావత్ తెలంగాణ ప్రజల కోసం తాను రాజీనామా చేస్తున్నానన్నారు. వందల కోట్ల రూపాయలు కేసీఆర్ దగ్గర ఉన్నాయని.. ఓడగొడతారని.. రాజీనామా చేయవద్దని చాలా మంది తనతో అన్నార‌ని.. అయినా వెన‌క్కి త‌గ్గ‌లేద‌ని ఈటల తెలిపారు. మేధావులు త‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని.. హుజూరాబాద్ వచ్చి ప్రజలకు అండగా ఉండాలని ఈటల పిలుపిచ్చారు.  ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన ఈట‌ల రాజేంద‌ర్‌.. శ‌నివారం సాయంత్రం ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు. 14న జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేర‌నున్నారు. ఈటలతో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి, రమేష్ రాథోడ్, తుల ఉమ, మరికొంతమంది నేతలు బీజేపీలో చేరనున్నారు.  

వ్యాక్సిన్ దెబ్బకు అయస్కాంతం మనిషి 

కరోనా గత సంవత్సరం పైగ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వైరస్. అదే కరోనా మన  దేశాన్ని కూడా అతలాకుతలం చేస్తోంది. ఇక కరోనాని కథం చేస్తామని సంవత్సరం నుండి ప్రభుత్వం మాటలు చెప్పడమే కానీ..అందుకు చర్యలు చేపటడం లో దేశ ప్రభుత్వం విఫలమైయిందనే చెప్పాలి.. అయితే, కరోనాను కట్టడి చేయడానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని, అది ఒక్కటే శ్రీరామ రక్షా అని  అటు ప్రభుత్వాలు,ఇటు  వైద్యులు తెలుపుతున్నారు. వాళ్ళు ఎంత చెప్పిన వాక్సిన్ వేసుకున్న కరోనా రావడం మానలేదు.. ప్రభుత్వాలు, వైద్య సిబ్బంది చెప్పిన వివరాల ప్రకారం కరొనకు ఒక్క డోస్ చాలు మటాష్ అన్నారు.. ఆంటీ బాడీలు వస్తాయి అన్నారు.. ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన ఒక వ్యక్తి వాక్సిన్ వేసుకున్న ఆంటీ బాడీలు రాలేదని కోర్ట్ లో కేసు కూడా వేశాడు.. అలాగే తమిళ నాడు కు చెందిన ఒక మహిళా వ్యాక్సిన్ తీసుకున్నాకే నా భర్త చనిపోయాడని చెప్పింది.. ఇది పక్కన పెడితే కోవిషిల్డ్ కంపెనీ అధినేత ఇతర వ్యాక్సిన్ గురించి మాట్లాడుతూ అది ఉట్టి నీళ్లు మాత్రమే అన్నారు.. మరి ఈ వాక్సిన్ నీళ్లు అయినప్పుడు ప్రజలకు ఎందుకు ఇస్తున్నారు.. దీని వెనక ఉన్న అంతరంగం ఏంటి ? ఇది ఇలా ఉంచితే ఫస్ట్  డోస్ తీసుకున్న కరోనా రావడంతో .. మళ్ళీ సెకండ్ డోస్ తీసుకోవాలి అని చెప్పారు.. సెకండ్ డోస్ తీసుకున్న రావడంతో మళ్ళీ ఇప్పుడు థర్డ్ డోస్ అంటున్నారు..ఇది విషయాలు అన్ని పక్కన పెడితే వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి బాడీ తాజాగా అయస్కాంతగా మారింది..   ప్రపంచంలో పలు దేశాల్లో ఇప్పటికే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలైంది. మన దేశంలో కూడా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇకపోతే వ్యాక్సిన్ వేయించుకున్న మొదటి వారం రోజులు జ్వరం, ఒళ్లునొప్పులు ఉంటాయని వైద్యులు తెలుపుతున్నారు. అయితే నాసిక్ కి చెందిన ఒక వ్యక్తికీ మాత్రం వ్యాక్సిన్ వేయించుకున్నాక శరీరం మొత్తం ఆయస్కాంతంలా మారిందంట.  ఇంట్లో ఉన్న స్పూన్లు, ప్లేట్లు, నాణేలు అతడి శరీరానికి అయస్కాంతానికి అతుకున్నట్లు అంటుకుంటున్నాయట. దానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. నాసిక్ కి చెందిన  71 ఏళ్ల అరవింద్‌ సోనార్‌ అనే వ్యక్తి ఇటీవల దగ్గర్లోని ఆసుపత్రిలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండో డోస్  వేయించుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న రెండు రోజుల తరువాత ఆయన శరీరం అయస్కాంతంలా మారిపోయింది. అతణ్ని శరీరం ఇనుప వస్తువులను, కాయిన్స్‌ను, చెంచాలను అయస్కాంతంలాగా ఆకర్షించుకుంటుంది. ఈ వీడియోను ఆయన సోషల్ మీడియా లో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది.       

జ‌గ‌న్‌రెడ్డికి ర‌ఘురామరాజు లేఖాస్త్రం.. ముచ్చ‌ట‌గా మూడో బాణం..

ర‌ఘురామ మ‌రింత దూకుడు పెంచారు. త‌న‌పై జ‌రిగిన దాడిపై దేశ‌వ్యాప్తంగా మ‌ద్ద‌తు కూడ‌గ‌డుతున్నారు. పార్ల‌మెంట్‌లో జ‌గ‌న్‌రెడ్డిని దోషిగా నిల‌బెట్టేందుకు స‌ర్వం సిద్ధం చేస్తున్నారు. ఓవైపు ఇలా త‌న వ్య‌క్తిగ‌త రివేంజ్ తీర్చుకుంటూనే.. మ‌రోవైపు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పైనా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. లేఖాస్త్రాల‌తో సీఎంను కుళ్ల‌బొడుస్తున్నారు. గ‌తంలో ఇచ్చిన హామీల‌న్నీ ఏమ‌య్యాయంటూ లేఖ‌ల‌తో నిల‌దీస్తున్నారు. ర‌ఘురామ రాస్తున్న లేఖ‌ల‌న్నీ ప్ర‌జల గురించే కావ‌డం.. అవ‌న్నీ జ‌గ‌న్‌రెడ్డి మ‌డ‌మ తిప్పిన హామీలే కావ‌డంతో.. వైసీపీ ప్ర‌భుత్వం ఇర‌కాటంలో ప‌డుతోంది. ఇప్ప‌టికే రెండు అంశాల‌పై లేఖ‌లు రాయ‌గా.. తాజాగా ముచ్చ‌ట‌గా మూడో లేఖ ముఖ్య‌మంత్రికి సంధించారు ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. పెళ్లి కానుక‌, షాదీ ముబార‌క్ ప‌థ‌కాల‌పై నిల‌దీస్తూ జ‌గ‌న్‌రెడ్డికి లేఖ రాశారు ర‌ఘురామ‌. అధికారంలోకి వ‌స్తే పెళ్లికానుక సాయం పెంచుతామ‌ని ఎన్నిక‌ల‌కు ముందు చెప్పిన విష‌యం గుర్తు చేశారు. పెళ్లికానుక సాయాన్ని రూ.ల‌క్ష‌కు పెంచుతామ‌ని ప్ర‌క‌టించార‌ని.. దానికి ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు ల‌భించింద‌ని.. అందుకే వెంట‌నే ఇచ్చిన హామీని నిల‌బెట్టుకోవాల‌ని ముఖ్య‌మంత్రిని కోరారు ఎంపీ ర‌ఘురామ‌.  ఇంత‌కుముందు ఇలాంటివే మ‌రో రెండు లేఖ‌లు రాశారు. ఇచ్చిన హామీ మేర‌కు.. వృద్ధాప్య పింఛనును రూ.2,750కు పెంచాలని.. ఏపీలో సీపీఎస్‌ విధానం రద్దు హామీని వెంటనే నిలబెట్టుకోవాలని.. ముఖ్య‌మంత్రిని లేఖ‌ల‌తో డిమాండ్ చేశారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఎంపీ ర‌ఘురామ సీఎం జ‌గ‌న్‌రెడ్డికి రాస్తున్న లేఖ‌లు ఏపీలో తీవ్ర క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. ర‌ఘురామ లేవ‌నెత్తుతున్న స‌మ‌స్య‌ల‌పై ప్ర‌జ‌ల్లో విస్తృత చ‌ర్చ జ‌రుగుతోంది. ర‌ఘురామ లేఖ‌ల‌తో జ‌గ‌న్‌రెడ్డి జ‌నాల ముందు.. మాట త‌ప్పిన, మ‌డ‌మ తిప్పిన నేత‌గా.. దోషిగా.. నిల‌బ‌డాల్సి వ‌స్తోంది.  లేఖ‌ల‌తో జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వ‌ లోటుపాట్ల‌ను ఎత్తిచూప‌డంలో ర‌ఘురామ విజ‌యం సాధించిన‌ట్టే క‌నిపిస్తోంది.  

మైనర్ల ప్రేమ.. మరణానికి దారి.. 

తెలంగాణాలో ఒక జానపదం పాట ఉంది.. అదే ఈ పాట.. ఆనాడు ఏ ఇంట పెళ్లి జరిగిన గానీ గౌరవంగా మస్తు గమ్మతుగుండేది.. తల్లిదండ్రి పెళ్లి సంబంధము చూస్తే..సచినట్టు మెచ్చి సంబర పడుదురు.. ఇవేమి రోజులో పాడు బీడుగాను.. సినిమాల సిత్రమో చదువు విచిత్రమో.. పట్టుమని పదేండ్లు నిండి ఉండవ్ వాడు.. లాగు తొడిగాడు వాడు లవ్వని అంటాడు.. అని ఒక రచయిత తన పాటలో చాలా చక్కగా చెప్పడు.. మన దురదృష్టవశాత్తు ఆ అలాంటి పిల్లలను మనం చూస్తేనే.. తాజాగా ఇద్దరు మైనర్లు ప్రేమించుకుని చివరికి ప్రాణాలు తీసుకున్నారు..  ఇంకా వాళ్ళకి జీవితమంటే ఏంటో తెలియదు.. సినిమాలు, పెరిగిన వాతావరణం, చేసిన సావాసమో తెలియదు గానీ ఏమి తెలియని  వయసులోనే ఒకరితో ఒకరు ఆకర్షణలో పడిపోయారు. అదే ప్రేమనుకున్నారు.. జీవితం అనుకున్నారు.. ఏం జరుగుతుందో తెలిసేలోగానే ప్రేమ అనే పద్మ వ్యూహం లో చిక్కుకున్నారు. అయితే ఏం జరిగిందో తెలీదు గానీ కలిసి చనిపోవాలనుకున్నారు. ఇద్దరూ కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. వీరిలో బాలిక మృతి చెందగా, బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా అది కర్నూల్ జిల్లా. అవుకు మండలం. రామాపురం గ్రామానికి చెందిన బాలిక (13), బాలుడు (16) గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. వారిమధ్య ఏం జరిగిందో తెలియదు గానీచనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కలిసి బాలుడి ఇంటికి వెళ్లి ముందుగా ఫ్యానుకు ఉరేసుకున్నారు. కొక్కెం సరిగా లేని కారణంగా ఫ్యాను ఊడి కింద పడిపోయింది. దీంతో వారు మరో ప్రయత్నంగా పురుగుల మందు తాగారు. పనులకు వెళ్లి తిరిగొచ్చిన పెద్దలు వీరిని చూసి షాక్‌కు గురయ్యారు. బాలిక అప్పటికే చనిపోగా.. కొన ప్రాణాలతో ఉన్న బాలుడిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గ్రామంలో విచారణ చేపట్టారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లి వైద్యశాలకు తరలించారు. ఎప్పుడైతే ఇంటర్ నెట్ ఇంట్లోకి వచ్చిందో.. అదే మన కొంప ముంచింది.. ప్రముఖ గాయకుడూ గద్దర్ కూడా ఎప్పుడో ఒక పాట రాశాడు.. కయ్యం పెట్టిందో కలర్ టీవీ ఇంట్లకోచి.. ఇప్పుడు అదే జరుగుతుంది..ఇంకా రాను రాను ఎలాంటి పరిమాణాలు చూడాల్సి వస్తుందో.. ఏదేమైనా పిల్లలు ఉన్న తల్లి దండ్రులు వాళ్ళని ఓ కంట కనిపెట్టండి.. మనం ఉన్న ఈ బిజీ లైఫ్ లో వాళ్లకి కొంత టైం కేటాయించండి.. వాళ్ళ ఆందోళనను అర్థం చేసుకోండి..        

సీఎం ఇలాఖాలో ఉద్యోగుల మందుపార్టీ.. క‌ట్ చేస్తే....

అస‌లే క‌రోనా టైమ్‌. ఇద్ద‌రు గుమ్మికూడితేనే డేంజ‌ర్‌. సామాజిక దూరం కంప‌ల్స‌రీ. మాస్కులు మ‌స్ట్‌. లాక్‌డౌన్‌లు, క‌ర్ఫ్యూలు పెట్టినా కొత్త‌ కేసులు వ‌స్తూనే ఉన్నాయి. ఇంత‌టి క‌ల్లోల స‌మ‌యంలో బాధ్య‌తాయుతంగా ఉండాల్సిన ప్ర‌భుత్వ ఉద్యోగులు.. ఇదే మంచి టైమ్ అనుకున్నారో ఏమో.. మామిడితోట‌లో మందు పార్టీ చేసుకున్నారు. ఓ జిల్లాలోని 22 మండ‌లాల అధికారులు సామూహిక విందు భోజ‌నం చేశారు. ఈ త‌తంగ‌మంతా స్వ‌యానా సీఎం ఇలాఖాలో జ‌ర‌గ‌డం.. ఆ పార్టీ వీడియో వైర‌ల్‌గా మార‌డంతో మేట‌ర్ సీరియ‌స్ అయింది. క‌ట్ చేస్తే.. ఘ‌ట‌న‌పై క‌లెక్ట‌ర్ విచార‌ణ‌కు ఆదేశించారు. ఓ అధికారిని సస్పెండ్ చేయ‌గా.. మ‌రో ఆఫీస‌ర్‌పై బ‌దిలీ వేటు ప‌డ‌టం క‌ల‌క‌లంగా మారింది.  సిద్దిపేట జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు డ్యూటీకి డుమ్మా కొట్టి.. మందు పార్టీ చేసుకున్నారు. కొండపాకలోని ఓ మామిడితోటలో మందేసి, చిందేసి.. మ‌స్తు ఎంజాయ్ చేశారు. కొవిడ్ నిబంధలను ఉల్లంఘిస్తూ అధికారులు పార్టీలో తాగి ఊగిపోయారు. విందు పార్టీలో మ‌హిళా ఉద్యోగులు సైతం హాజ‌ర‌వ‌డం మ‌రింత ఇంట్రెస్టింగ్ పాయింట్‌. ఆ పార్టీని హోస్ట్ చేసింది కొండపాక మండల పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులు. త‌లా ఇంత వాటా వేసుకొని.. జిల్లాలోని 22 మండ‌లాల‌ పంచాయ‌తీరాజ్ శాఖ‌ ఉద్యోగులంద‌రికీ ఓ మామిడితోట‌లో గ్రాండ్ పార్టీ అరేంజ్ చేశారు. జిల్లాలోని 22 ఎంపీఓలకు ఆహ్వానం అందగా.. డీఆర్‌డీ, ఓపీడీ, ఇన్‌ఛార్ట్ డీపీవో సైతం వ‌చ్చి.. భోజనం చేసి వెళ్లినట్టు తెలుస్తోంది.  అయితే, ఆ పార్టీ వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో అది కాస్తా వైర‌ల్‌గా మారింది. సీఎం కేసీఆర్ ఏరియాలోనే కొవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌కుండా ప్ర‌భుత్వ ఉద్యోగులు ఇలా మందు, విందు పార్టీలు చేసుకోవ‌డ‌మేంట‌ని జ‌నం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆ వీడియో కాస్త వైర‌ల్ అయి.. అది జిల్లా క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామిరెడ్డిని చేరింది. పార్టీపై సీరియ‌స్‌గా స్పందించిన క‌లెక్ట‌ర్ వెంట‌నే విచార‌ణ‌కు ఆదేశించారు. ప్రాధ‌మిక నివేదిక ఆధారంగా కొండ‌పాక ఎంపీవో న‌ర‌సింహారావును స‌స్పెండ్ చేశారు. ఎంపీడీవో రాజేశ్‌ను ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. 

జగన్ ఢిల్లీ పర్యటనలో ఏం జరిగింది? అమిత్ షా క్లాస్ పీకారా? 

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఏం జరిగింది? వైసీపీ నేతలు చెబుతున్నట్లు రాష్ట్రం గురించే మాట్లాడారా? జగన్ కేసుల గురించి అసలు చర్చే రాలేదా? అమిత్ షాతో జగన్ గంటన్నర సేపు సమావేశమైంది నిజమేనా? ఇవే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో.. సీఎం జగన్ దాదాపు 90 నిమిషాల సేపు సమావేశమయ్యారని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే జగన్ , అమిత్ షా సమావేశానికి సంబంధించి సంచలన విషయాలు తెలుస్తున్నాయి. ఢిల్లీ వర్గాల విశ్వసనీయ సమాచారం ప్రకారం అమిత్ షా, జగన్ సమావేశం.. వైసీపీ నేతలు చెబుతున్నట్లుగా కాకుండా మరోలా సాగిందని తెలుస్తోంది. కొన్ని అంశాల్లో జగన్ కు అమిత్ షా క్లాస్ పీకారని అంటున్నారు.  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసానికి రాత్రి తొమ్మిది గంటలకు వెళ్లారు సీఎం జగన్. ఆయనతో పాటు ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి ఉన్నారు. వైసీపీ నేతలు చెబుతున్నట్లు 90 నిమిషాల పాటు జగన్ టీమ్.. అమిత్ షా నివాసంలోనే ఉంది. అయితే అందులో జగన్ తో అమిత్ షా మాట్లాడింది కేవలం 25 నిమిషాలు మాత్రమే అని తెలుస్తోంది. 9 గంటలకు జగన్ వెళితే.. 9 గంటల 40 నిమిషాల వరకు అమిత్ షా వాళ్లకు కలవలేదట. అప్పటి వరకు జగన్ ఒక గదిలో... ఎంపీలు మరో గదిలో వెయిట్ చేశారట. తర్వాత సిగ్నల్ రావడంతో అమిత్ షాను జగన్ కలిశారట. మొదట ఇద్దరే మాట్లాడుకున్నారని తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వ  సమస్యలకు సంబంధించి వినతి పత్రం ఇచ్చాక.. పూర్తిగా రాజకీయాల గురించే ఇద్దరి మధ్య చర్చ జరిగిందని సమాచారం. నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు విషయంపైనే అమిత్ షా, జగన్ మధ్య ఎక్కువ సేపు చర్చ జరిగిందని తెలుస్తోంది. ఎంపీ రఘురామ అరెస్టు, థర్డ్ డిగ్రీ పై జగన్ ను అమిత్ షా ప్రశ్నించారని తెలుస్తోంది. రఘురామ విషయంలో వివరణ ఇచ్చిన జగన్.. ఈ కేసులో తనకు మద్దతు ఇవ్వాలని కోరారట. కేంద్ర ప్రభుత్వానికి తాము మద్దతుగా ఉన్నందున రఘురామ విషయంలో సహకరించాలని విన్నవించారట జగన్. అయితే అమిత్ షా మాత్రం ఈ విషయంలో సీరియస్ గానే స్పందించారని పక్కా సమాచారం.  చట్టం తన పని తాను చేసుకుపోతుందని తేల్చి చెప్పారట. ఎంపీ విషయంలో అలా వ్యవహరించడమేంటని క్లాస్ తీసుకున్నారట. అంతేకాదు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎలా అని ప్రశ్నించారట. అమిత్ షా రియాక్షన్ తో జగన్ షాకయ్యారని తెలుస్తోంది. ఎంపీ రఘురామ కేసు విషయంలో జాతీయ స్థాయిలో దోషిగా నిలబడే పరిస్థితి రావడంతో.. కేంద్రంతో కాళ్లబేరానికి వెళ్లిన జగన్ కు అమిత్ షా నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో... వైసీపీ శ్రేణులు ఆందోళనలో ఉన్నాయని అంటున్నారు. రాత్రి 10 గంటల తర్వాత ఇద్దరు ఎంపీలు సమావేశంలో పాల్గొన్నారట. ఈ సందర్భంగా విభజన హామీలు, పెండింగ్ సమస్యలపై చర్చ జరిగిందని తెలుస్తోంది. 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత అంటే 10 గంటల 15 నిమిషాలకే అమిత్ షా.. జగన్ టీమ్ దగ్గర నుంచి లోపలికి వెళ్లిపోయారని తెలుస్తోంది. అమిత్ షా వెళ్లిపోయిన తర్వాత కూడా లోపలే కాసేపు కూర్చుని 10 గంటల 30 నిమిషాలకు జగన్ .. ఆ ఇంటి నుంచి బయటికి వచ్చారని సమాచారం. అమిత్ షా నివాసంలో జరిగింది ఇదైతే.. వైసీపీ నేతలు మాత్రం గంటన్నర సేపు జగన్ తో అమిత్ షా మాట్లాడారని, తమ పర్యటన సక్సెస్ అని చెప్పుకుంటున్నారు. జగన్ పర్యటన మొత్తం ఆయన వ్యక్తిగత అంశాలపైనే సాగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్ర సమస్యలపైనే కేంద్ర మంత్రులతో చర్చిస్తే.. వాళ్ల నుంచి ఎలాంటి హామీలు వచ్చాయో ఎందుకు చెప్పడం లేదనే ప్రశ్న విపక్షాల నుంచి వస్తోంది. 

సీజేఐ ఎన్వీ రమణకు తెలంగాణ సర్కార్ ఘన స్వాగతం

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసిన జస్టిస్‌ ఎన్వీ రమణకు అపూర్వ స్వాగతం లభించింది. రాజ్‌భవన్‌ చేరుకున్న సీజేఐ ఎన్వీ రమణకు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, సీఎం కేసీఆర్‌ స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అయ్యాక హైదరాబాద్ కు ఎన్వీ రమణ రావడం ఇదే తొలిసారి. దీంతో ఆయన రాక కోసం తెలంగాణ  సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జస్టిస్‌  ఎన్వీ రమణ 3 రోజుల పాటు రాజ్‌భవన్ అతిథి గృహంలో ఉండనున్నారు. అంతకుముందు శంషాబాద్‌ విమానాశ్రయంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున జస్టిస్‌ ఎన్వీ రమణకు ఘన స్వాగతం లభించింది. తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్‌ హిమా కోహ్లీ, రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్‌ అలీ, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి , ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌, పలువురు ఎమ్మెల్యేలు సీజేఐకు స్వాగతం పలికారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి సీజేఐ నేరుగా  రాజ్‌భవన్ వెళ్లారు.