వీడని మర్డర్ మిస్టరీ.. 

అన్ని సీడీలు ఒకేలా ఉండవు అన్నట్లు.. మర్డర్ చేసిన క్రిమినల్స్..మర్డర్ సంబందించిన వివరాలు ఒకేలా ఉండవు.. ఒక్కొక కేసుకు ఒక్కొక స్పెషల్ విచారణ ఉంటుంది.. ప్రాధాన్యత ఉంటుంది.. ఒక్కోసారి ఎన్నో కేసులు సాల్వ్ చేసిన పోలీసులు కూడా తలలు పట్టుకుంటారు.. కొంత మంది పోలీసులు ఎలాంటి కేసు అయిన ఇట్టే తేల్చేస్తారు.. ఆ ఏరియా చాలా కాస్ట్‌లీ ఏరియా. ఒక్క మాటలో చెప్పాలంటే బడాబాబులు ఉండే ఏరియా. ఎక్కడ చూసిన సిసి కెమెరాలు.. అంతా సెక్యూరిటీ అలాంటి చోట ఒక అమ్మాయి చనిపోయింది, ఆ అమ్మాయి ఎలా చనిపోయింది. ఎవరైనా చంపారా..? లేదంటే ఆ అమ్మాయి ఆత్మ హత్య చేసుకుందా.. ? అనే విషయాలు  ఆసక్తికరంగా మారాయి. ఆ మిస్టరీ క్రైమ్ స్టోరీలో ఏ ట్విస్ట్ ఉందో చూద్దాం. ఓపెన్ చేస్తే.. ఉదయం  సమయం 8  గంటలు అవుతుంది. ఎస్సై పోలీస్ స్టేషన్ కి రెడీ అవుతుంటే...మొబైల్ మోగింది. లిఫ్ట్ చేయగానే.. అవతలి నుంచి ఆరిన గొంతు ఏదో చెప్పింది. అతను చెప్పిన మాటలు వినగానే.. ఎస్సై కళ్లు పెద్దవయ్యాయి. వస్తున్నాం అంటూ అక్కడి నిండి ఇద్దరు కానిస్టేబుల్ ని వేసుకొని బయల్దేరాడు. పావుగంటలో స్పాట్‌కి  చేరుకున్నారు.. అది  వెసు ఏరియా. పెద్దగా రద్దీగా లేదు. అంత అపార్టుమెంట్లో ఉన్నారు. పోలీసులు రాగానే  అపార్ట్‌మెంట్ పనులన్నీ పక్కన పెట్టేసి... చిల్లుకు పడ్డ చొక్కాల కళ్ళు వేసుకుని  భయం భయముగా చూడసాగారు. పోలీసులు అటూ ఇటూ చూస్తుంటే అంతలో ఒక వ్యక్తి వచ్చాడు. మీకు కాల్ చేసింది నేనే సార్.. అని ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేశాడు.. మా పక్క ఫ్లాట్‌లోనే అనగానే ఎస్ఐ ఒకే పదా అంటూ... ఆ వ్యక్తితో కలిసి ఆ ప్లాట్ వైపు నడిచాడు.. ఆ ఫ్లాట్ డోర్ క్లోజ్ చేసి ఉంది. లోపల గడియ వేసి ఉంది. కానిస్టేబుల్ వచ్చి గట్టిగా కొట్టారు. రాలా. అదిమారు, గుద్దారు... వెంటనే ఫైర్ డిపార్ట్‌మెంట్‌కి కాల్ వెళ్లింది. వాళ్లు వచ్చే లోపు స్థానికులు పోలీసులకు టీ ఇచ్చారు. అది తాగుతూనే ఎస్సై... ఆమె ఎవరు అని తమకు కాల్ చేసిన వ్యక్తిని అడిగారు. "సార్... ఆమె ఇక్కడి ఆమె కాదు. మిజోరం అమ్మాయి. ఏజ్ ఓ 20 ఏళ్లు ఉండొచ్చు. ఎవరి తాలూకో, పేరేంటో మాకేమీ తెలియదు. ఎందుకంటే తాను మాతో ఎప్పుడూ మాట్లాడదు. అలా వస్తుంది... తన ఫ్లాట్‌లోకి వెళ్తుంది. అంతే... అందుకే మాకు ఏ వివరాలూ తెలియవు" అన్నాడు. ఓకే ఓకే... నో ప్రాబ్లమ్  అంటూ... టీ లాగేశాడు ఎస్సై.  ఇంతలో... ఫైర్ డిపార్ట్‌మెంట్ వచ్చేసింది. కళ్లుమూసి తెరిచేలోపు డోర్ బద్దలు కొట్టారు. ఫ్లాట్ లోపలికి వెళ్లారు. లోపల వెళ్లి చూడగానే సోఫాపై ఆమె పడిపోయి ఉంది. పోలీసులు పల్స్ చెక్ చెయ్యగా... అప్పటికే ఆమె చనిపోయి ఉంది. ఆ శవం ఒక రకమైన దుర్వాసన వచ్చింది.  నిన్న లేదా మొన్న చంపేసి ఉండాలి అని ఎస్సై అనగానే... సార్... ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవచ్చుకదా... డోర్ కూడా లాక్ చేసి ఉంది. అని ఒక పాయింట్ పట్టుకున్నాడు ఓ కానిస్టేబుల్.  అనగానే ఎస్ఐ కానిస్టేబుల్ వేసిన ప్రశ్నకు తలా ఆడిస్తూ  ఇలా అన్నాడు కావచ్చు... కానీ... ఎదురుగా ఉన్న ఆ విండోస్ చూశావా... ఒకటే ఓపెన్ ఉంది.. మరొకటి క్లోజ్ లో ఉంది. నువ్వు అన్నట్లు అదే నిజం అందానికి ఆధారాలు లేవు. ఆమె కిటికీని తెరిస్తే... రెండు తలుపులూ తెరిచి ఉంచేది కదా... లేదా.. రెండూ మూసి ఉంచేది. ఎవరో ఈమెను గొంతు నొక్కి చంపేసి... కిటికీ లోంచీ ఎస్కేప్ అయ్యాడని  నేను డౌట్ పడుతున్నాను  అని ఎస్సై అన్నాడు.  అంతేకాదు... ఒక వేళ తను  సూసైడ్ చేసుకునుంటే.. ఏ మత్తు మందుతోనో. ఫ్యాన్ కి హ్యాంగ్గింగ్ లాంటివి ట్రై చేసి ఉండాలి.. కదా... అవి అలా జరిగినట్లు ఇక్కడ ఎలాంటి ఆధారాలు లేవు అని ఎస్ఐ  అనడంతో... మిగతా వారంతా కూడా మీరు చెపింది కరెక్ట్  కావచ్చు సార్ అని అన్నారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం తరలించారు. అలాగే... తాము పిలిచినప్పుడు రావాలని పక్కింటి వారికి చెప్పారు. అలాగే... ఆమె ఇంట్లో సెల్‌ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపారు. ఇంకా... ఆమె తాలూకు వారికి ఫోన్ చెయ్యడం కోసం ప్రయత్నిస్తున్నారు. అలాగే అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. త్వరలోనే మిస్టరీని ఛేదిస్తామని పోలీసులు చెప్పారు. కానీ ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తమ పోష్ ఏరియాలో ఇలా ఎప్పుడూ జరగలేదనీ... తమకు చాలా భయం వేసిందని స్థానికులు చెప్పారు.

జే ట్యాక్స్ 30 వేల కోట్లే పెట్టుబడులా! మేకపాటి ఇదిగో చంద్రబాబు ఘనత.. 

గత రెండేండ్లలో ఆంధ్రప్రదేశ్ లో 65 భారీ పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయన్న పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ప్రకటనపై ఏపీలో జోరుగా చర్చ జరుగుతోంది. మంత్రిగారు జోక్ చేశారా లేక జనాలను ఏప్రిల్ పూల్ చేశారా అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఏడాదిన్నర కాలంగా కరోనా కారణంగా ఉన్న పరిశ్రమలే సరిగా రన్ కావడం లేదు. ఇలాంటి సమయంలో పెట్టుబడులు రావడం అంటే వండరే. అయినా 65 భారీ పరిశ్రమలు ఏర్పాటు చేశామని మంత్రి ప్రకటన చేసి అభాసుపాలయ్యారనే చర్చ జరుగుతోంది. పరిశ్రమల శాఖ మంత్రి ప్రకటనపై సోషల్ మీడియాలోనూ సెటైర్లు పేలుతున్నాయి. మంత్రిగారు మీరు తీసుకొచ్చిన పరిశ్రమలు ఎక్కడున్నాయో సెలవివ్వండి అంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు.  ఏ జిల్లాలో ఏ పరిశ్రమ వచ్చిందో వివరాలు ఇవ్వగలరా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలైతే మంత్రి మేకపాటిని చెడుగుడు ఆడుకుంటున్నారు.  చంద్రబాబు నాయుడు  హయాంలో వచ్చిన కంపెనీలు వివరాలన్ని ఇస్తాం.. మీ పాలనలో వచ్చి పరిశ్రమల లిస్టు ఇస్తారా అంటూ నిలదీస్తున్నారు. అంతేకాదు గత టీడీపీ హయాంలో వచ్చిన విదేశీ పెట్టుబడులు, ఏర్పాటైన పరిశ్రమల పేర్లు, వచ్చిన ఉద్యోగాల వివరాలను జిల్లాల వారీగా చూపిస్తూ పోస్టులు పెట్టారు. మొత్తం 1220 కంపెనీలకు సంబంధించి పెట్టుబడి, కల్పించిన ఉద్యోగాల వివరాలు విడుదల చేశారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు 30000 కోట్లు పెట్టుబడులు వచ్చాయి అంటున్నారు.. మీరు కూడా ఇలా.. ఏ కంపెనీలు వచ్చాయో.. ఎక్కడ వచ్చాయో .. పెట్టుబడి ఎంతో చెబుతూ లిస్ట్ ఇవ్వగలరా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.   పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి టీడీపీ నేత నారా లోకేశ్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. రెండేళ్ల వైసీపీ పాలనలో పరిశ్రమలను బెదిరించి వసూలు చేసిన జగన్ ట్యాక్స్ (జే ట్యాక్స్) రూ. 30 వేల కోట్లనే... రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులుగా మీరు చెప్పినట్టున్నారని లోకేశ్ సెటైర్ వేశారు. రాష్ట్రానికి 65 భారీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయని సెలవిచ్చారనీ, ప్రెసిడెంట్ మెడల్ విస్కీ, ఆంధ్రా స్టార్ బ్రాందీ కంపెనీలు తప్పించి రాష్ట్రానికి వచ్చిన కొత్త కంపెనీలు ఏమీ లేవని ఎద్దేవా చేశారు. టీడీపీ పాలనలో విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ 3, 4 స్థానాల్లో ఉంటే, రెండేళ్ల జగన్ పాలనలో 13వ స్థానానికి పడిపోయిందని విమర్శించారు. చంద్రబాబు తీసుకొచ్చిన కియా మోటార్స్ యాజమాన్యాన్ని వైసీపీ ఎంపీలు వీధి రౌడీల కంటే ఘోరంగా బెదిరించడం చూశాక ఏ విదేశీ కంపెనీ ఏపీకి వస్తుందని ప్రశ్నించారు. జే ట్యాక్స్ చెల్లించని కంపెనీలపై పీసీబీని ప్రయోగించి మూసివేయిస్తుంటే.. కొత్తగా పెట్టుబడి పెట్టడానికి ఎవరొస్తారని నారా లోకేష్ ప్రశ్నించారు. 

కేసీఆర్ వీక్ నెస్ ఇదే.. ఈటల సంచలనం

టీఆర్ఎస్, ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ గా దూకుడు మరింత పెంచారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. హుజూరాబాద్ నియోజకవర్గంలో రెండవరోజు పర్యటించిన ఈటల.. తన మద్దతుదారులతో కలిసి బలప్రదర్శన చేశారు. ఇల్లందకుంటకు వెళ్లిన రాజేందర్.. స్థానికులతో మాట్లాడారు. తన పర్యటనతో మద్దతు కూడగట్టుకోవడంతో పాటు కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు ఈటల రాజేందర్. టీఆర్ఎస్ లో తనకు ఏ విధంగా అవమానం జరిగిందో వివరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో తన పాత్రను చెప్పుకుంటూ.. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో చెబుతున్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ బండారం బయటపెడుతున్నారు ఈటల రాజేందర్. కేసీఆర్ కు సంబంధించిన సంచలన విషయాలు వెల్లడిస్తున్నారు. తాజాగా కేసీఆర్ వీకెనెస్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపఎన్నిక వ‌స్తుందంటే ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌రాలు ప్ర‌క‌టిస్తారని ఈట‌ల రాజేంద‌ర్ ఎద్దేవా చేశారు. మ‌న ముఖ్య‌మంత్రికి ఒక అల‌వాటు ఉంది.. ఎప్పుడు ఎక్క‌డ ఉప ఎన్నిక‌లు వ‌చ్చినా ఆ ని‌యోజక వ‌ర్గాల్లో వ‌రాల జ‌ల్లు కురిపించే అల‌వాటు ఉంది..కాబ‌ట్టి ఈ నియోజ‌క వ‌ర్గంలో కూడా మూల‌న ప‌డ్డ ప‌నులు జ‌రిగేలా నిధులు విడుద‌ల చేయాల‌ని నేను కోరుతున్నానాను ఈట‌ల డిమాండ్ చేశారు.వావిరాలను మండ‌లంగా చేయాల‌ని కోరాను., గ‌తంలో చ‌ల్లూరు మండ‌లం కావాల‌ని  కోరాను. అలాగే, హుజూరాబాద్‌ను జిల్లా చేయాల‌ని కోరాను. ప‌రిపాల‌న సౌల‌భ్యం కోసం. మా కోరిక మేర‌కు త‌క్ష‌ణ‌మే ఈ దిశ‌గా అడుగులు వేయాలి.  అధికారంలో ఉన్నపుడు..  లేనప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నానన్నారు రాజేందర్.  హుజూరాబాద్ నియోజ‌క వ‌ర్గంలో తెల్ల రేష‌న్ కార్డులు, పింఛ‌న్ల‌ను వెంట‌నే విడుద‌ల చేయాలని డిమాండ్ చేశారు. 58 ఏళ్లు నిండిన అంద‌రికీ పింఛ‌న్లు ఇవ్వాలన్నారు. 2018 ఎన్నిక‌ల ముందు నిరుద్యోగ భృతి ఇస్తామ‌ని చెప్పారని.. ఇకనైనా వెంటనే అమలు చేయాలన్నారు ఈటల. హుజూరాబాద్‌లో ఓట్లు కావాలంటే నిరుద్యోగ భృతి ఇవ్వండి ముఖ్యమంత్రి గారు అంటూ  అని ఈట‌ల కామెంట్ చేశారు. తానుపార్టీ పెట్ట‌లేదు.. పార్టీ మార‌లేదని  ఈట‌ల అన్నారు.  ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు మాత్రం వ‌చ్చానన్నారు. ఎవ‌రో అనామ‌కుడు ఇచ్చిన ఫిర్యాదు వ‌ల్ల తనను తొలగించారని చెప్పారు. ఎవరూ తీసుకున్న బొందలో వాళ్లే పడతారని.. తనను వేధించిన వారికి తగిన శాస్త్రి జరుగుతుందని ఈటల ఆవేశంగా మాట్లాడారు. హుజూరాబాద్‌లో కొంద‌రు చెంచాగాళ్ల‌ను పెట్టుకుని దొంగ దెబ్బ కొట్టే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారని విమర్శించారు. హుజూరాబాద్ లో కురుక్షేత్ర యుద్ధం జ‌ర‌గ‌నుందని..  ఇక్క‌డ న్యాయ‌ యుద్ధం జ‌రుగుతుందని.. హుజూరాబాద్ ప్ర‌జ‌లే ఇక్క‌డ గెలుస్తారని చెప్పారు ఈటల రాజేందర్.  

హంపి పార్టీపై మంత్రి జగదీశ్ రెడ్డి రియాక్షన్.. చెత్త లీడరంటూ ఫైర్ 

కర్ణాటకలోని హంపిలో మంత్రి జగదీశ్ రెడ్డి నాయకత్వంలో జరిగిన పార్టీలో తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారగా.. అధికార టీఆర్ఎస్ పార్టీని షేక్ చేస్తోంది. ఈటల రాజేందర్ బర్తరఫ్ వేడి చల్లారకముందే .. తెరపైకి వచ్చిన హంపి మీటింగ్ రచ్చ గులాబీ లీడర్లలో గుబులు రేపుతోంది. హంపి పార్టీలో జరిగిన పరిణామాలపై గులాబీ   బాస్ సీరియస్ గా ఉన్నారని.. కేసీఆర్ కు అత్యంత నమ్మినబంటుగా ముద్ర పడిన మంత్రి జగదీష్ రెడ్డికి కేబినెట్ నుంచి ఉద్వాసన ఖాయమని తెలుస్తోంది. టీఆర్ఎస్ లో సెగలు రేపుతున్న  హంపీ పార్టీపై.. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు.  తనను ఉద్దేశిస్తూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన వ్యంగ్య ట్వీట్ పై మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. చెత్త మనుషులకు చెత్త ఆలోచనలే వస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారు మాట్లాడిన విషయాలపై స్పందించాల్సిన అవసరం తనకు లేదని తేల్చి చెప్పారు. జగదీశ్ రెడ్డి కుమారుడి పుట్టిన రోజు వేడుకలను హంపిలో జరిపినట్టు, ఆ వేడుకలకు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారంటూ ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, కేటీఆర్ ను సీఎం చేయాలన్న ఆలోచనలపై ఆ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు అందులో పేర్కొంది. ఇప్పటికే ఈటలపై వేటు పడడంతో.. తర్వాతి వేటు పడేది జగదీశేనా? అన్న కోణంలో వార్తను ప్రచురించింది. ఆ కథనాలను ట్వీట్ చేసిన రేవంత్.. ‘రస’కందాయంలో హంపి ‘ధూమ్ ధామ్’.. కోవర్ట్ ‘క్రాంతి’ కిరణాలతో కకావికలం.. యముడు జగదీశ్ రెడ్డి ‘ఘంటా’ కొట్టినట్టేనా? అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపైనే మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి జగదీష్ రెడ్డి కుమారుడు పుట్టిన రోజు సందర్భంగా గత జనవరిలో కర్నాటక రాష్ట్రంలోని హంపిలోని ఒక ఫాంహౌస్ లో పార్టీ ఏర్పాటు చేశారు. తనకు బాగా సన్నిహితులు అనుకున్న నలుగురైదుగురు ఎమ్మెల్యేలతో పాటు, అధికారంలో వివిధ హోదాలను అనుభవిస్తున్న పలువురు ముఖ్యులు ఈ పార్టీకి హాజరయ్యారు. హుషారుగా పార్టీ మొదలైంది. మందేసిన తర్వాత అసలు సినిమా మొదలైంది. కేసీఆర్ పాలన పై సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు మనసులో మాట బయట పెట్టారట. పాలన పూర్తిగా కుటుంబమయమైపోయిందని... పెత్తనం మొత్తం అయ్యా కొడుకుల దగ్గరే ఉందని ఒక్కొక్కరుగా రెచ్చిపోయారట. ఈటెల రాజేంద్రను  అధిష్టానం టార్గెట్ చేయడంపైనా కొందరు ఫైరయ్యారట. పెద్దసార్ నియంత అయినా భరించనం కాని..  రేపొద్దుగాల చిన్నసారు సీఎం అయితే... భరించుడు మనతో ఐతదా...!? అన్న కోణంలో చర్చ జరిగిందట. సహజంగా కళాకారుడైన ఓ ఎమ్మెల్యే మత్తులోనే కేసీఆర్ నియంత పాలన, రేపొద్దున కేటీఆర్ సీఎం అయితే చిన్నసారు నియంత పాలన ఎట్లుంటదో తనదైన శైలిలో ఊహించుకుని, పాటకట్టి పాడాడట. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ మనసులో మాట చెప్పుకోగలం అన్నట్టు ఎవరికి వారు రెచ్చిపోయారని సమాచారం.   

స్వామిరారా.. క‌రోనాను కాలితో న‌లిపేయ‌రా...

నిత్యానంద‌. ఆయ‌న గురించి తెలీని వారు ఉండ‌క‌పోవ‌చ్చు. ఒక‌ప్పుడు ఫుల్ ఫాలోయింగ్‌. రాస‌లీల‌ల ఎపిసోడ్‌తో ఆ త‌ర్వాత ఫుల్ డ్యామేజ్‌. ఆయ‌న‌పై లై*గిక ఆరోప‌ణ‌ల కేసుల‌తో దేశం విడిచి పారిపోయారు. ఈక్వెడార్ ప‌క్క‌న ఓ చిన్న‌దీవి కొనుక్కొని.. సొంత దేశంగా ప్ర‌క‌టించుకున్నారు. 'కైలాస' పేరుతో అప్ప‌టి నుంచీ తెగ ఓవ‌రాక్ష‌న్ చేస్తున్నారు. సొంత క‌రెన్సీ, సొంత బ్యాంకు, సొంత పాస్‌పోర్టుతో బిల్డ‌ప్ ఇస్తున్నారు. త‌న కైలాస  క‌ట్ చేస్తే, లేటెస్ట్‌గా నిత్యానంద ఓ అద్భుత‌మైన ప్ర‌సంగం చేశారు. ఆ స్పీచ్ ప‌ర‌మార్థం ఏంటంటే.. అవ‌తార స్వ‌రూపుడినైన తాను ఇండియాలో అడుగుపెడితే.. క‌రోనా ఖ‌తం అవుతుంద‌ని సెల‌విచ్చారు.  ఓ భక్తుడు అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న‌లా సెల‌విచ్చారు. ఆయ‌న మాట‌లను బ‌ట్టి స్వాములోరు మ‌ళ్లీ భార‌త్‌లో అడుగుపెట్టే ఉద్దేశ్యం ఉన్న‌ట్టు క‌న‌బ‌డుతోంది. అదే జ‌రిగితే.. ఇలా ఆయ‌న పాదం మోప‌గానే.. అలా క‌రోనా ఖ‌తం అవుతుందో లేదోగాని.. ఆయ‌న కాళ్ల‌తో పాటు చేతుల‌కూ సంకెళ్లు వేసి.. చెర‌సాల‌లో తోసేందుకు పోలీసులు మాత్రం రెడీగా ఉన్నారు.    త‌న 'కైలాస' దేశం నుంచి ఇండియాతో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న భ‌క్తులు, శిష్యుల‌తో త‌రుచూ సంభాషిస్తున్నారు నిత్యానంద‌స్వామి. ఆన్‌లైన్లోనే ఆశీర్వ‌చ‌నాలు ఇస్తున్నారు.  అంతేకాదు, కరోనా కార‌ణంతో ఇటీవ‌ల భార‌త్‌ నుంచి వ‌చ్చే భ‌క్తుల‌కు త‌న దేశంలోని నో ఎంట్రీ అంటూ రాక‌పోక‌ల‌ను నిషేధించారు స్వామి వారు. యూరప్ దేశాల నుంచీ 'కైలాస' దేశానికి ఎవ‌రూ రావొద్దంటూ ఆయా దేశాల దౌత్య కార్యాలయాలకు లేఖలు కూడా రాశారు. తాజాగా, ఇండియాలో క‌రోనా పోవాలంటే.. త‌న మ‌హిమాన్విత పాదం మోపాల్సిందేనంటూ సెల‌వివ్వ‌డం బ‌హు త‌మాషాగా ఉంది. స్వామిరారా.. నీ సంగ‌తి తేలుస్తాంరారా.. అంటూ క‌ర్ణాట‌క పోలీసులు నిత్యానంద‌ను హృద‌య‌పూర్వ‌కంగా ఆహ్వానిస్తున్నారు. మ‌రి వ‌స్తారా..?  సాములోరు వ‌స్తారా? అంత ధైర్యం, సాహ‌సం చేస్తారా?  

ఈటలకు మరో పార్టీ ఆహ్వానం.. మనసు మార్చుకుంటారా? 

కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్.. వేగంగా పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం సొంత నియోజకవర్గం హుజూరాబాద్ లో బలప్రదర్శనకు దిగిన రాజేందర్.. టీఆర్ఎస్ కు, సీఎం కేసీఆర్ టార్గెట్ గానే ముందుకు వెళుతున్నారు. ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేసిన తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో సత్తా చాటి తన పవరేంటో చూపించాలని చూస్తున్నారు. అయితే రాజేందర్ కేంద్రంగా తెలంగాణలో రసవత్తర రాజకీయం సాగుతోంది. బీజేపీలో చేరబోతున్నట్లు ఈటల సంకేతం ఇచ్చినా.. ఆయన కోసం మిగితా పార్టీలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో రాజేందర్ మంతనాలు సాగించినా..  ఇప్పటికి ఆయనపై తమ వైపు వస్తారనే ఆశతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే రాజేందర్ కు మద్దతుగానే హస్తం లీడర్లు ప్రకటనలు చేస్తున్నారు.  ఇదిలా ఉండగానే ఈటల రాజేందర్ కు మరో పార్టీ నుంచి ఆహ్వానం వచ్చింది. జూలై8న తన పార్టీని ప్రకటించనున్న వైఎస్ షర్మిల.. రాజేందర్ ను సాదరంగా తమ పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ పార్టీలో చేరాలంటూ ఈటలకు వెల్ కం పలికారు షర్మిల. కేసులకు భయపడే ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతున్నారని ఆమె కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చే వారిపై కేసులు పెట్టడం కామన్ అని అన్నారు. ఈటల రాజేందర్ తమ పార్టీలోని వస్తానంటే ఆహ్వానిస్తామని తెలిపారు. తెలంగాణలో కరోనా కట్టడి విషయంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని షర్మిల మండిపడ్డారు. కరోనా విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడమే సరిపోయింది.. ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని ఎద్దేవా చేశారు. కరోనాను ఎదుర్కొనే ఉద్దేశం కేసీఆర్ లేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.  తెలంగాణలో  రాజన్న రాజ్యమే లక్ష్యమంటున్న వైఎస్ షర్మిల.. బుధవారం లోటస్‌పాండ్‌లో కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీకి సంబంధించిన పలు అంశాలపై పార్టీ నేతలు, కార్యకర్తలకు షర్మిల దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రజల ఆశయాలకు, ఆంక్షలకు అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలు రూపొందించనున్నట్లు తెలిపారు. వైఎస్సార్ టీపీలో కార్యకర్తలే కీలకమని.. వారికే పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు. పార్టీలో కార్యకర్తలే కీలకం.. వారికే పెద్దపీట ఉంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలకు అద్దం పట్టేలా తమ పార్టీ అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడుతుందని తెలిపారు. పార్టీ ఏర్పాటుకు ఇంకా నెల రోజుల సమయం ఉన్నందున ఆలోగా కార్యకర్తలందరూ ప్రతీ గడపకు వెళ్లి.. ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవాలని సూచించారు. ప్రతి వర్గాన్ని కలవాలని షర్మిల నిర్దేశించారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలు రూపొందించాలని స్పష్టం చేశారు.

తన భర్త నుండి తన ప్రియుడిని కాపాడండి..

పెళ్లి చేసుకున్నారు.. సంసారం కూడా చేశారు..పెళ్లి అవగానే అందరూ ఆనందంగా ఉన్నట్లు.. ఈ జంట కూడా హ్యాపీ గా ఉన్నారు.. రోజు ఆమె భర్త పొగడ్తలతో ముంచెత్తే వాడు.. పొగడ్తలు అంటే ఆడవాళ్లు పొంగి పోతారన్న విషయం అందరికి తెలిసిందే.. అయితే కొద్దీ రోజుల తర్వాత మొగుడు ఆమెను ఆమె అందాన్ని పొగడగడం మానేశాడు.. ఇంకా అంతే భర్త పొగడం మానేశాడని ఆ భార్య ఏంచేసిందో చూడండి..  రాను రాను జనంలో  బంధాలకు, బంధుత్వాలకు చోటు లేకుండా పోతుంది.. విలువలను నిలువునా  గంగలో ముంచుతున్నారు.  పవిత్రమైన పెళ్లిని పక్కన పెట్టి అపవిత్రమైన పనులు చేస్తున్నారు. తాజాగా ఓ మహిళా  భర్త నుండి తన ప్రియుడిని కాపాడండి..అని ఏకంగా కోర్టుకెక్కింది. వారి అభ్యర్ధనను అంగీకరించిన కోర్టు వారికి పోలీస్ రక్షణ కల్పించాలంటూ తీర్పునిచ్చింది. ఈ విషయంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ కేసుకి సంబంధించిన పూర్తి   వివరాలలోకి వెళ్దాం పదండి..  అది పంజాబ్. ఫరీద్‌కోట్‌ ప్రాంతం.  ఇద్దరు దంపతులు. అతని వయసు  40 సంవత్సరాలు.. తన భార్య ఆమె వయసు 38 సంవత్సరాలు. ఇద్దరు కలిసి నివాసముంటున్నాడు. పెళ్లైన దగ్గర నుండి  కలతలు లేని, ప్రశాంతంగా సాగుతున్న ఆ కాపురంలో ఓ కుర్రాడు చిచ్చు పెట్టాడు. పెళ్లైన కొత్తలో రోజూ మెచ్చుకునే వాడు ఆమె భర్త.. ఆ తర్వాత మెచ్చుకోకపోయే సరికి ఆ భార్యకు ఏవోవో ఆలోచనలు రేకెత్తించాయి. మీకు తెలిసిందే కదా పొగిడితే అమ్మాయిలే కాదు ఎవరైనా పడిపోవాల్సిందే.. అదే పద్దతికి అలవాటు పడింది..  కట్ చేస్తే.. రోజు  తనను, తన అందాన్ని పొగుడుతూ ఉండే కుర్రాడి పై మనసుపడింది ఆమె..  దాంతో వారిద్దరి చనువు రెండు అడుగులు ముందుకు వేసింది. చివరికి వివాహేతర సంబంధానికి దారి తీసింది.కొన్ని రోజులు భర్తకు తెలియకుండా సాగిన చాటు మాటున సాగిన ఆంటీ, అబ్బాయి ప్రేమాయణం ఒకరోజు భర్తకు తెలిసిపోయింది. భర్త నిలదీయడంతో ఆమె ప్రియుడంటే తనకు ఇష్టమని తెగేసి చెప్పింది. ఆ మాట విన్న భర్త కోపోద్రేకుడయ్యాడు. భార్య ప్రియుడ్ని ఇద్దరినీ చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో భార్య, ప్రియుడితో కలిసి కోర్టుకెక్కింది. తన  భర్త నుండి ప్రియుడికి ప్రాణహాని  ఉందని, తమకు పోలీసుల రక్షణ కోరింది. రక్షణ  కావాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. ఇక ఈ పిటిషన్ పై కోర్ట్ సంచలన తీర్పునిచ్చింది. 2018 లో వివాహేతర సంబంధం తప్పు కాదు అనే చట్టాన్ని పరిగణలోకి తీసుకొంటూ వారిద్దరికీ పోలీసులు రక్షణ కల్పించవల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై ఇలా తీర్పు చెప్పినంత మాత్రాన  తాము వివాహేతర సంబంధాల్ని ప్రోత్సహిస్తున్నట్లు కాదు అని కూడా హైకోర్టు చెప్పింది. కోర్టు ఆదేశాల మేరకు వారిద్దరికీ పూర్తీ రక్షణ కల్పిస్తామని పోలీసులు తెలిపారు. ఇక ఈ సంచలన తీర్పుపై ప్రజలు పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. భార్య తప్పు చేసిందన్న కోసం లో భర్త చంపేస్తాను అంటే .. దానికోసం కోర్టుకెక్కాలా..? అని కొందరు. భారత దేశం కూడా పాశ్చ్యాత దేశాలుగా మారుతున్నది అని తెలపడానికి ఈ కేసు ఉదాహరణ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

కాంగ్రెస్ కు బిగ్ షాక్.. బీజేపీలోకి కీలక నేత

కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న హస్తం పార్టీకి మరో ముఖ్య నేత హ్యాండిచ్చారు. రాహుల్ గాంధీకి షాకిస్తూ యువ నేత కమలం గూటికి చేరారు. మరో ఆరేడు నెలల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో కాంగ్రెస్ కు ఇది ఊహించని ఎదురు దెబ్బని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు జితిన్ ప్రసాద బీజేపీలో చేరారు. న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో రైల్వే మంత్రి పీయుష్ గోయల్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. రాహుల్‌ గాంధీకి అత్యంత సన్నిహితుల్లో ఒకడైన జితిన్ ప్రసాద యూపీ ఎన్నికల వేళ బీజేపీలో చేరడం సంచలనం రేకెత్తించింది.  బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన జితిన్ ప్రసాద గత ఏడాది జులైలో బ్రాహ్మణ చేతనా పరిషత్ నెలకొల్పి ఆ సామాజిక వర్గ సమస్యల పరిష్కారానికి యత్నిస్తున్నారు కూడా. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన జితేంద్ర ప్రసాద తనయుడే జితిన్. 2001లో యూత్ కాంగ్రెస్‌లో చేరిన జితేంద్ర 2004 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని షాజహాన్‌పూర్‌ నుంచి పోటీ చేశారు. యూపిఏ హయాంలో మన్మోహన్ కేబినెట్‌లో యువ మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీతో తనకు మూడు తరాల అనుబంధం ఉందన్నారు. బీజేపీ ఒక్కటే జాతీయ పార్టీ అని, మిగతా వన్నీ ప్రాంతీయ పార్టీలేనని జితిన్ ప్రసాద బీజేపీలో చేరాక విలేకరులతో అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కథ ముగిసినట్టేనని చెప్పారు జితిన్ ప్రసాద  

పవర్ అంతా సినిమాల్లోనే ఉంది..అదే రాజకీయానికీ

సినిమాల్లో కరవాలం బాగా తిప్పుతున్నాడు కాని.. రాజకీయంలో తిప్పేదెప్పుడు అని ప్రశ్నలు వస్తున్నాయి. అయినా గాని జనసేనాని మాత్రం వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. ఒక్కో ప్రాజెక్టు అనౌన్స్ అవుతుంటే.. వకీల్ సాబ్ ఊపులో ఉన్న ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో మాత్రం పవన్ బయటకి రారా అని కామెంట్లు.. దానికి జనసైనికుల కౌంటర్లతో గొడవ నడుస్తోంది. పవన్ మాత్రం పీస్ ఫుల్ గా పోస్ట్ కరోనా రెస్ట్ అంటూ.. కాలం గడిపేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. తిరుపతి ఉపఎన్నికల సమయంలో బిజెపి వాళ్లు తమ కూటమి సీఎం అభ్యర్ధి పవన్ కల్యాణ్ అనగానే జనసైనికులు ఉర్రూతలూగారు. కాని తర్వాత పవన్ ప్రచారానికి రాకపోవడం.. కరోనా రావడం వీటన్నిటితో డీలాపడ్డారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వచ్చిన ఓట్లను చూసి అవాక్కయ్యారు. అయినాగాని వకీల్ సాబ్ విజయంతో మైమరిచిపోయారు. తిరుపతి సంగతే వదిలేశారు. తర్వాత అడపా దడపా ప్రెస్ స్టేట్ మెంట్లు తప్ప.. ఇంకేమీ లేవు. కరోనా కదా..ఎలా వస్తారని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. మళ్లీ టీడీపీ మహానాడుతో పవన్ కల్యాణ్ వ్యవహారం చర్చకు వచ్చింది. టీడీపీ బిజెపి కేంద్ర ప్రభుత్వానికి అంశాల వారీ మద్దతు ఇవ్వడానికి సిద్ధమని.. ప్రకటించడంతో... బిజెపికి స్నేహహస్తం చాచారనే కథనాలు వచ్చాయి. ఆ వెంటనే బిజెపి నేతల ఖండనలు కూడా వచ్చాయి. తాము ఎట్టిపరిస్ధితుల్లో జనసేనతో కలిసే ముందుకు వెళతామని..ఇంకెవరితోనూ పొత్తులుండవని ప్రకటించారు. దీంతో సోషల్ మీడియాలో మళ్లీ రచ్చ మొదలైంది. సినిమాలు చేసుకుంటూ.. రాజకీయాలకు అప్పుడప్పుడు టైమ్ ఇచ్చే పవన్ కల్యాణ్ నే బిజెపి నమ్ముకుందంటూ కామెంట్లు మొదలయ్యాయి. దీంతో జనసైనికులు కొందరు కౌంటర్ వీడియోలను కూడా వదిలారు. ఏ నాయకులు తిరుగుతున్నారో చెప్పాలంటూ ప్రశ్నించారు. అయితే ఓ రాజకీయ పార్టీ అధినేతగా..అన్ని అంశాలపై స్పందించాలని..కాని స్పందించటం లేదనే విమర్శలకు మాత్రం జనసైనికులు కూడా స్పందించలేదు. ఇలా సినిమాల్లో బిజీ అయిపోతే.. రాజకీయాలు కేవలం నాదెండ్ల మనోహర్ మాత్రమే చేస్తే..ఎలా ఎదుగుతామనే ప్రశ్నలు కొందరు వేస్తున్నారు. అయితే వకీల్ సాబ్ మళ్లీ పవన్ క్రేజ్ రేంజ్ చూపించిందని..అలా వరుస సినిమాలు చేస్తేనే క్రేజ్ పెరుగుతుందని.. అప్పుడే రాజకీయాల్లో కూడా వర్కవుట్ అవుతుందనే ఫార్ములాను జనసైనికులు వినిపిస్తున్నారు. అప్పుడే డిమాండ్ కూడా పెరుగుతుందని..బిజెపి సైతం చెప్పిన మాట వింటుందనే అభిప్రాయం గట్టిగా వినిపిస్తున్నారు. పైగా తమ నాయకుడికి దీర్ఘకాలిక వ్యూహం ఉందని.. హడావుడి పడాల్సిన అవసరం కూడా లేదంటూ వాదిస్తున్నారు.  కాని ప్రజల్లో తిరగకుండా..ప్రజా సమస్యలపై ఇన్ వాల్వ్ కాకుండా.. ఉంటే ఎలాఎదుగుతారని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. పాదయాత్రలు చేసి ముఖ్యమంత్రులైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబునాయుడు, జగన్..వీరంతా కష్టపడకుండా ఉంటే లక్ష్యాన్ని చేరేవారా అని కూడా అడుగుతున్నారు. పాదయాత్రలు చేయకపోయినా.. కనీసం రెగ్యులర్ గా కార్యకర్తలతో అయినా చర్చలు జరపకుండా.. సినిమా షూటింగులతో గడిపేస్తే ఎలా కుదురుతుందని నిలదీస్తున్నారు.

బీజేపీకి బైబై.. కాంగ్రెస్‌కు జైజై.. జ‌గ‌న్‌రెడ్డికి పీకే బంప‌ర్ ఆఫ‌ర్‌!

టైటిల్ చూసి షాకై ఉంటారు కొంద‌రు. అవును, అది నిజ‌మేన‌ని అంటున్నాయి ఢిల్లీ వ‌ర్గాలు. ఎందుకంటే.. రంగంలోకి దిగింది ది గ్రేట్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిశోర్ కాబ‌ట్టి. ఆయ‌న జ‌గ‌న్‌రెడ్డికి అత్యంత స‌న్నిహితుడు కాబ‌ట్టి. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చోబెట్టింది పీకేనే కాబట్టి. త్వ‌ర‌లో రాహుల్‌గాంధీని ప్ర‌ధానిని చేసేందుకు రెడీ అవుతున్నాడు కాబట్టి. ఇన్ని కాబ‌ట్టిలు ఉన్నాయి కాబ‌ట్టే.. బీజేపీతో ఏమాత్రం తేడా వ‌చ్చినా.. త‌న‌పై ఉన్న సీబీఐ కేసులు ఉచ్చు మ‌రింత బిగిసినా.. మోదీకి హ్యాండ్ ఇచ్చేసి.. కాంగ్రెస్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు జ‌గ‌న్‌రెడ్డి సిద్ద‌మ‌వుతున్నాడ‌ని అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల నుంచి స‌మాచారం. ఇదే ఇప్పుడు హ‌స్తిన‌లో హాట్ టాపిక్ అయింద‌ని కూడా తెలుస్తోంది. పొగ లేనిదే నిప్పు రాదు. అది మీడియా వ‌ర‌కు అస్స‌లు రాదు. బెంగాల్ ఘ‌న విజ‌యం త‌ర్వాత రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ ఫోక‌స్ ఢిల్లీ పీఠంపై ప‌డింది. మోదీపై వ్య‌తిరేకత‌తో రాహుల్‌గాంధీని ప్ర‌ధానిని చేయాల‌ని గ‌ట్టిగా ఫిక్స్ అయిపోయిన‌ట్టున్నాడు. అందుకే, ఎవ‌రూ అడ‌గ‌క‌ముందే.. రాహుల్‌ను పీఎం కేండిడేట్‌గా ప్ర‌క‌టిస్తే తాను కాంగ్రెస్ త‌ర‌ఫున ప‌ని చేయ‌డానికి సిద్ద‌మ‌ని ప్ర‌క‌టించి క‌ల‌క‌లం రేపాడు. ప్ర‌స్తుత ప‌రిస్థితిల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావ‌డం అంత ఈజీనా. వేరే వారికైతే కాక‌పోవ‌చ్చు కానీ, పీకే మాత్రం చేసి చూపిస్తానంటున్నాడు. ఇప్ప‌టికే త‌న వ‌ల్ల అధికారంలోకి వ‌చ్చిన ఏపీ సీఎం జ‌గ‌న్‌, త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్‌, బెంగాల్ సీఎం మ‌మ‌తాబెన‌ర్జీల మ‌ద్ద‌తుతో యూపీఏను ప‌వ‌ర్‌లోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఓ ద‌ఫా ప్రాథ‌మిక చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయ‌ని స‌మాచారం. అయితే, ఈ జాబితాలో స్టాలిన్‌, మ‌మ‌త‌ల‌తో పాటు జ‌గ‌న్ పేరు కూడా ఉండ‌ట‌మే సంచ‌ల‌న విష‌యం.   ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డితో ప్ర‌శాంత్ కిశోర్‌కు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. త‌న‌ను గెలిపించిన వ్యూహ‌క‌ర్త‌గా పీకే అంటే జ‌గ‌న్‌రెడ్డికీ విప‌రీతమైన అభిమానం. అందుకే, ఆనాడు అసెంబ్లీ ఫ‌లితాలు వెలువ‌డిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌శాంత్ కిశోర్‌తో పాటు ఆయ‌న టీమ్‌ను క‌లిసి అభినంద‌న‌లు, కృత‌జ్ఞ‌త‌లు కూడా తెలిపారు. వారిద్ద‌రి మ‌ధ్య ఆ అనుబంధం ఇప్ప‌టికీ అలానే కొన‌సాగుతోంది. ఆ చొర‌వ‌తోనే వైసీపీని యూపీఏ కూట‌మిలోకి తీసుకొచ్చేలా పీకే మ‌ధ్య‌వ‌ర్తిత్వం నెర‌పుతున్నార‌ని చెబుతున్నారు.  పీకే స‌రే.. మ‌రి జ‌గ‌న్‌కు ఏం లాభం అనే ప్ర‌శ్న రాక‌మాన‌దు. జ‌గ‌న్‌రెడ్డి ఎందుకు బీజేపీని వీడి కాంగ్రెస్ చెంత‌కు చేరుతార‌నే అనుమానం స‌మంజ‌స‌మే. తాజా ప‌రిణామాల‌ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే.. ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం సులువే. జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వంపై బీజేపీ వ్యూహం, కేంద్రం వైఖ‌రిలో ఇటీవ‌ల స్ప‌ష్ట‌మైన మార్పు క‌నిపిస్తోంది. ఏ రాష్ట్రంలోనైనా సొంతంగా అధికారంలోకి రావ‌డ‌మే బీజేపీ ల‌క్ష్యం. తాత్కాలిక ప్ర‌యోజ‌నాల కోస‌మే ప్రాంతీయ పార్టీల‌కు స‌పోర్ట్ చేస్తుంటుంది కాషాయం. అవ‌స‌రం తీరాకా.. పుట్టి ముంచేస్తుంది. అందుకు, మ‌హారాష్ట్ర‌నే బెస్ట్ ఎగ్జాంపుల్‌. అదే విధంగా ఏపీలోనూ జ‌గ‌న్‌రెడ్డికి కేంద్రం నుంచి మ‌రెంతో కాలం మ‌ద్ద‌తు వ‌చ్చే ప‌రిస్థితి లేదు. సీబీఐ కేసుల విష‌యంలో క‌ఠిన వైఖ‌రి ప్ర‌ద‌ర్శిస్తోంది. ఇటీవ‌ల జ‌గ‌న్‌రెడ్డి బెయిల్ ర‌ద్దు చేయాలంటూ ర‌ఘురామ వేసిన పిటిష‌న్‌పై సీబీఐ త‌ట‌స్థ వైఖ‌రి అవ‌లంభించ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం. ఆ కేసు అనూహ్యంగా.. వేగంగా విచార‌ణ జ‌రుగుతుండ‌టం ఆస‌క్తిక‌రం. ర‌ఘురామ సైతం బీజేపీ సానుభూతిప‌రుడేన‌ని.. ఆ పార్టీ డైరెక్ష‌న్‌లోనే ఆయ‌న‌లా చెల‌రేగిపోతున్నార‌ని టాక్‌. జ‌గ‌న్‌రెడ్డిపై సీబీఐ కేసుల ఉచ్చు మ‌రింత బిగించి, ఆయ‌న్ను జైలుకు త‌ర‌లించి.. త‌మిళ‌నాడులో శ‌శిక‌ళను సైడ్ చేసిన‌ట్టు చేసి.. ముఖ్య‌మంత్రి పీఠంపై జ‌గ‌న్‌రెడ్డి స్థానంలో వైఎస్‌ ష‌ర్మిల‌ను కూర్చోబెట్టే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్టు.. ఇప్ప‌టికే పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందులో వాస్త‌వం ఎంత ఉన్నా.. జ‌గ‌న్‌రెడ్డిపై కేంద్రం, సీబీఐ వైఖ‌రి మారింద‌నేది మాత్రం ప‌క్కా.  కేంద్రం తీరుకు త‌గ్గ‌ట్టే.. జ‌గ‌న్‌రెడ్డి ఆలోచ‌న‌లోనూ మార్పు వ‌స్తోంద‌ని అంటున్నారు. ఆనాడు త‌న తండ్రి వైఎస్సార్ మ‌ర‌ణం త‌ర్వాత త‌న‌ను ఉన్న‌ప‌ళంగా సీఎం చేయ‌కుండా.. సీబీఐ కేసుల‌తో త‌న‌ను జైల్లో చిప్ప‌కూడు తినిపించార‌నే కోపంతోనే.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీ పంచ‌న చేరారు. ఇప్పుడు అదే బీజేపీ.. త‌న‌కు హ్యాండ్ ఇచ్చి.. మ‌ళ్లీ త‌న‌ను జైల్లో వేసే ప్ర‌య‌త్నం చేస్తుంటే.. త‌న దారి తాను చూసుకోవ‌డంలో త‌ప్పేముంద‌నేది జ‌గ‌న్ వ‌ర్ష‌న్‌లా అనిపిస్తోంది. కాంగ్రెస్‌తో శ‌తృత్వం.. గ‌తం గ‌తః. ఇప్పుడు వ‌ర్త‌మానం ఎలా ఉంద‌నేదే ముఖ్యం. భ‌విష్య‌త్ ఎలా ఉండ‌బోతుంద‌నేది మ‌రింత ముఖ్యం. అందుకే, కాంగ్రెస్‌తో గ‌త వైరాన్ని వీడి.. ఫ్రెష్‌గా రాజ‌కీయ బంధం క‌లుపుకునేందుకు జ‌గ‌న్‌రెడ్డి సైతం సంసిద్దంగానే ఉన్న‌ట్టు స‌మాచారం. ఆ మేర‌కు జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి ప్ర‌శాంత్ కిశోర్ బ్రెయిన్ వాష్ చేశార‌ని తెలుస్తోంది.   బీజేపీని న‌మ్మ‌లేని ప‌రిస్థితులు రావ‌డంతో.. కాంగ్రెస్‌ను న‌మ్ముకుంటే ఎలా ఉంటుంద‌ని జ‌గ‌న్‌రెడ్డి ఇప్ప‌టికే త‌న స‌న్నిహిత సీనియ‌ర్ మంత్రుల ద‌గ్గ‌ర ప్ర‌స్తావ‌న తీసుకొచ్చార‌ట‌. పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, బొత్సా స‌త్య‌నారాయ‌ణ లాంటి మాజీ కాంగ్రెస్ ఘ‌నులు.. హ‌స్తం పార్టీ అన్నిర‌కాలుగా సుర‌క్షితంగా ఉంటుంద‌ని.. యూపీఏలోనైతే ఎవ‌రి ఆట వారు ఇష్టం వ‌చ్చిన‌ట్టు ఆడుకోవ‌చ్చ‌ని.. గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అలానే చేశార‌ని.. ఆయ‌న త‌న‌యుడిగా జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి యూపీఏలో మంచి ప్రాధాన్యం త‌ప్ప‌కుండా ఉంటుంద‌ని ఆ సీనియ‌ర్ మంత్రులు సైతం జ‌గ‌న్‌కు న‌చ్చజెప్పార‌ని తాడేప‌ల్లి ప్యాలెస్ వ‌ర్గాలు అంటున్నాయి.  అటు, రాజ‌కీయంగానూ జ‌గ‌న్‌రెడ్డి లెక్క‌లు బేరీజు వేసుకుంటున్నార‌ట‌. బీజేపీకి మ‌ద్ద‌తుగా ఉండటం వ‌ల్ల‌.. ముస్లిం వ‌ర్గాలు జ‌గ‌న్‌కు బాగా దూర‌మ‌య్యాయి. బీసీల పార్టీగా ఉన్న టీడీపీ నుంచి గ‌ట్టి స‌వాల్ ఎదుర‌వుతోంది. కాంగ్రెస్‌కు ద‌గ్గ‌రైతే ఆ మేర‌కు మ‌రింత లాభ‌ప‌డొచ్చు. ఎస్సీ, క్రిస్టియ‌న్ల ఓట్లు 100శాతం కొల్ల‌గొట్టొచ్చ‌నేది జ‌గ‌న్‌ పొలిటిక‌ల్ మ్యాథ‌మెటిక్స్‌.  మ‌రోవైపు, దేశ‌వ్యాప్తంగా మోదీ గ్రాఫ్ దారుణంగా ప‌డిపోతుండ‌టం.. ప‌లు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో బీజేపీకి చేదు అనుభ‌వాలు ఎదుర‌వుతుండ‌టం.. క‌రోనా విష‌యంలో మోదీ ఇమేజ్ ఫుల్‌గా డ్యామేజ్ అవ‌డం.. కీల‌కమైన యూపీలో బీజేపీ అంత‌ర్మ‌థ‌నం.. వ‌చ్చే పార్ల‌మెంట్ ఎల‌క్ష‌న్ నాటికి దేశంలో బీజేపీ ప‌రిస్థితి మ‌రింత ప‌త‌న‌మ‌య్యేలా ఉండ‌టం.. చూస్తుంటే ఇంకా కాషాయ‌పార్టీకే గులాంగురి చేస్తే తీవ్రంగా న‌ష్ట‌పోక త‌ప్ప‌ద‌నే భావ‌న వైసీపీ నేత‌ల్లో వ్య‌క్తం అవుతోంద‌ట‌. ఇదే విష‌యాన్ని కొంద‌రు నేత‌లు ఇప్ప‌టికే జ‌గ‌న్‌రెడ్డి దృష్టికీ తీసుకొచ్చార‌ట‌. బీజేపీతో ఉంటే మ‌న‌కూ గ‌డ్డుకాలం త‌ప్ప‌ద‌ని.. ప్ర‌త్యామ్నాయం చూసుకుంటే బెట‌రేమోన‌ని చ‌ర్చించుకున్నార‌ట‌. అదే స‌మ‌యంలో.. సీబీఐ కేసుల విష‌యంలో కేంద్రం నుంచి స‌హాయ స‌హాకారాలు త‌గ్గిపోవ‌డం.. జ‌గ‌న్‌రెడ్డిని గ‌ద్దె దింపి.. ఆ స్థానంలో ష‌ర్మిల‌ను తీసుకొచ్చే కుట్ర‌లు చేస్తున్నట్టు అనుమానం రావ‌డంతో.. జ‌గ‌న్ అటెన్ష‌న్‌లోకి వ‌చ్చార‌ని చెబుతున్నారు. స‌రిగ్గా ఇలాంటి సందిగ్థ స‌మ‌యంలో.. అనూహ్యంగా ప్ర‌శాంత్ కిశోర్ ట‌చ్‌లోకి రావ‌డం కాక‌తాళీయ‌మే అయినా.. క‌లిసొచ్చే ప‌రిణామమ‌ని జ‌గ‌న్ భావిస్తున్నార‌ట‌.  త‌నకు స‌న్నిహితుడైన పీకేను న‌మ్మొచ్చ‌ని.. అందులోనూ ఆయ‌నే స్వ‌యంగా రాహుల్‌గాంధీ కోసం ప‌ని చేస్తాన‌న‌డం.. రాహుల్‌ పేరును ప్ర‌ధానిగా ప్ర‌క‌టిస్తే కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తాన‌ని స్ప‌ష్టం చేయ‌డం.. కేంద్రంలో జ‌ర‌గ‌బోవు అధికార మార్పుకు ముంద‌స్తు సంకేతం అంటున్నారు. అందుకే, ప్ర‌శాంత్ కిశోర్ పిలుపు మేర‌కు.. కాంగ్రెస్‌తో పాత వైరాన్ని ప‌క్క‌నబెట్టి.. తేడా వ‌స్తే బీజేపీని వ‌దిలిపెట్టి.. క‌లిసొచ్చే కాలానికి క‌లిసొచ్చే పార్టీతో జ‌త‌కట్టేందుకు జ‌గ‌న్‌రెడ్డి మెంట‌ల్‌గా ప్రిపేర్ అయ్యార‌ని అంటున్నారు. అయితే, కేవ‌లం ప్ర‌శాంత్ కిశోర్ ఆఫ‌ర్ ఇచ్చార‌ని ఇప్ప‌టికిప్పుడే బీజేపీకి బైబై చెప్పేసి.. కాంగ్రెస్‌కు జైజై కొట్ట‌కున్నా.. 2024 ఎన్నికల వ‌ర‌కూ వేచి చూడాల‌ని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ, ఈలోగా సీబీఐ కేసుల చిక్కుముడి త‌న మెడ‌కు మ‌రింత బిగుసుకుంటే.. స‌మ‌యం లేదు మిత్ర‌మా అంటూ కాంగ్రెస్‌కు స్నేహ‌హ‌స్తం చాచినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేద‌ని అంటున్నారు. అందుకే కాబోలు.. ఇటీవ‌ల ప‌లువురు కాంగ్రెస్‌పార్టీ జాతీయ నేత‌లు జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి అనుకూల స్టేట్‌మెంట్లు చేస్తున్నారు. అందుకే అంటారు రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు, శాశ్వ‌త మిత్రులు అంటూ ఉండ‌ర‌ని. ఏమో రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మే.. గుర్రం ఎగ‌రావ‌చ్చు....

దేశాధ్యక్షుడిని లాగి కొట్టేశాడు.. వైరల్ గా మారిన వీడియో

అతనో దేశాధ్యక్షుడు.. జనంలోకి వచ్చాడు. వారితో కరచాలనానికి యత్నించాడు. అక్కడే అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. దేశాధ్యక్షుడు ఒక వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇవ్వగా.. అనూహ్యంగా అతను చెంపదెబ్బ కొట్టాడు.  ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ కు ఈ చేదు అనుభవం ఎదురైంది.ప్రెసిడెంట్ ను చెంప దెబ్బ కొట్టిన ఘటన షాకింగ్ గా మారింది. ఆ వీడియో వైరల్ గా మారింది. ప్రజల్ని స్వయంగా కలుసుకోవాలని భావించిన ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్.. రెండు నెలల వ్యవధిలో దేశంలోని 12 ప్రాంతాలకు వెళ్లాలని ప్లాన్ చేశాడు. అందులో భాగంగా చేసిన రెండో పర్యటనలోనే ఆయనకు ఈ షాకింగ్ ఘటన ఎదురైంది. ఆగ్నేయ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన మక్రాన్.. అక్కడో హైస్కూల్ ను సందర్శించారు. అనంతరం తన కారు వైపు వెళుతుండగా.. పెద్ద ఎత్తున నిలబడి ఉన్న ప్రజలు.. ప్రెసిడెంట్ ను తమ దగ్గరకు రావాలని కోరారు. దీంతో  రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఉత్సాహంగా అక్కడికి వెళ్లారు మక్రాన్. ఇంతలోనే గుంపులోని ఓ వ్యక్తి మక్రాన్ చెంప చెల్లుమనిపించాడు.   మెరుపు వేగంతో భద్రతా సిబ్బంది స్పందించినప్పటికి.. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఈ ఘటన పెను సంచలనంగా మారింది. చెంపదెబ్బ కొట్టిన వ్యక్తితో పాటు.. మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెంప దెబ్బ కొట్టే సమయంలో ‘డౌన్ విత్ మాక్రోనియా.. మోంట్ జోయి సెయింట్ డెనిస్’’ అంటూ నినాదం వినిపించింది. ఇది ఫ్రాన్స్ రాజరిక సమయంలో ఫ్రెంచ్ సైన్యం యుద్ధ నినాదంగా చెబుతున్నారు. దేశాధ్యక్షుడు మాక్రాన్ పై దాడి ప్రయత్నం జరిగినట్లుగా ఫ్రెంచ్ అధ్యక్ష కార్యాలయం ధ్రువీకరించింది.అయితే.. ఈ దాడి ఎందుకు జరిగింది? చేసిన వారి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? వారెందుకు చేశారు? అన్న ప్రశ్నలకు ఇంకా సమాధానం లభించలేదు. దేశాధ్యక్షుడిని చెంపదెబ్బ కొట్టిన ఘటనను ఫ్రాన్స్ రాజకీయ నేతలంతా తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యం అంటే చర్చ.. చట్టబద్ధమైన అసమ్మతి తెలపటమే కానీ ఇలా చేయి చేసుకోవటం పద్దతి కాదని దేశ ప్రధాని జీన్ కాస్టెక్స్ పేర్కొన్నారు. అధ్యక్షుడికి సంఘీభావం తెలుపుతూ ఫ్రాన్స్ విపక్ష నేత జీన్ లూక్ మెలెన్ చాన్ కూడా ట్వీట్ చేశారు. 

ఐసీయూలో ఉన్నా..నిర్ణయం తీసుకోని కాంగ్రెస్

తమ పేషెంట్ కు కరోనా వచ్చిందని తెలుసు.. ట్రీట్ మెంట్ తప్పదని తెలుసు.. ఏ ఇంజెక్షన్ ఇస్తే బతుకుతాడో తెలుసు.. అయినా సరే.. ఏ మందూ ఇవ్వకుండా అలాగే వదిలేశారు. ఒక ఇంజెక్షన్ ఇద్దామని రెడీ అయ్యారు.. మిగతా బంధువులంతా ఇవ్వడానికి వీల్లేదంటూ అడ్డం పడుతున్నారు. దాంతో ఏం ఛేయాలో తెలియక పేషెంట్ ను ఐసీపీయూలోనే వదిలేశారు. సరిగ్గా ఇలాగే ఉంది తెలంగాణ కాంగ్రెస్ పరిస్ధితి. పీసీసీ చీఫ్ ను ఎంపిక చేయడంలో జరుగుతున్న ఆలస్యం ఆ పార్టీ భవిష్యత్ నే మింగేస్తుందన్న సత్యం తెలుస్తున్నా కూడా.. ఎవరికి వారు తమ తమ వ్యూహాల్లో మునిగిపోయారు.  తెలుగుదేశం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి ఎలా ఇస్తారని సీనియర్ కాంగ్రెస్ నేతలు అడ్డం తిరుగుతున్నారు. కాని వారు చేయగలిగిందేమీ లేదని వారికీ తెలుసు. ఒక ఎంపీ అయితే.. తాను ఒక జిల్లాకే పరిమితం అని తెలిసినా కూడా.. పీసీసీ చీఫ్ తనకే కావాలని వాదిస్తున్నాడు. మరో నాయకుడు అయితే ఆయన నియోజకవర్గంలోనే ఇప్పుడు గెలవలేని పరిస్ధితి..ఆయన కూడా ఆ పదవి తనకే ఇచ్చి, ఓ అవకాశం ఇవ్వాలని వాదిస్తున్నాడు.  రేవంత్ రెడ్డి కి పీసీసీ చీఫ్ పదవి ఖాయం అనే వార్తలొచ్చిన దగ్గర నుంచి టీకాంగ్రెస్ లో మొదలైన లొల్లి అలాగే కంటిన్యూ అవుతోంది. రకరకాల ప్రయత్నాలు చేశారు. చివరికి నాగార్జునసాగర్ ఉఫ ఎన్నిక అయ్యేవరకు ఆపాలని పెద్దలు జానారెడ్డి కోరినందుకు.. అప్పటివరకు అని చెప్పి ఆగారు. ఇప్పుడు అది అయిపోయినా కూడా ఏమీ తేల్చలేకపోతున్నారు. మరోవైపు బిజెపిది ప్రతాపం కాదు.. ఆరంభ శూరత్వమే అని కొందరు నేతలు విమర్శిస్తున్నారు. ఎప్పుడైతే కేసీఆర్ డిల్లీకి పోయి అవగాహన కుదుర్చుకున్నారో.. అప్పటి నుంచే బిజెపి బలం సగం పడిపోయిందని వారంటున్నారు. అన్నీ ఉన్నా..అల్లుడి నోట్లో శని అన్నట్లు.. అవకాశు ఉన్నా.. కాంగ్రెస్ బతికిబట్ట కట్టి మళ్లీ బలం చూపేందుకు ఛాన్స్ ఉన్నా కూడా..ఒక్క నిర్ణయం తీసుకోలేక భవిష్యత్ ను చేతులారా నాశనం చేసుకుంటున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇలాగే ఆలస్యం చేస్తే.. బిజెపికి మళ్లీ పుంజుకోవటానికి అవకాశం ఇచ్చినట్లువుతుందని కాంగ్రెస్ లోనే కామెంట్లు వినపడుతున్నాయి.  రేవంత్ రెడ్డి ఓపికగా ఎదురుచూడటంపైనా కామెంట్లు వస్తున్నాయి. కూన శ్రీశైలం గౌడ్, కొండా విశ్వేశ్వర రెడ్డి మొన్న దూరమైతే..నిన్న ఈటల రాజేందర్ కూడా బిజెపి దారి చూసుకోవడం.. ఇవన్నీరేవంత్ రెడ్డి పై ఒత్తిడి పెంచుతున్నాయి. సొంత పార్టీ పెట్టాలనే ఒత్తిడి కూడా రేవంత్ పై ఎప్పటి నుంచో ఉంది. కాని జాతీయ పార్టీ అండ లేకుండా లక్ష్యాన్ని చేరుకోలేమనే ఫార్ములాను రేవంత్ రెడ్డి తన అనుచరులను వినిపిస్తున్నారంట. అందుకే కాంగ్రెస్ అధిష్టానం ఇంత లేటు చేసినా..తాను మాత్రం దాన్నే నమ్ముకుని ఎదురు చూస్తానని చెబుతున్నారంట. ఏమైనా మొత్తం మీద రేవంత్ రెడ్డికే అధిష్టానం మొగ్గు చూపుతుందని.. కాని మిగతావాళ్లు ఒప్పుకోనందునే ఆలస్యం చేస్తుందని..తర్వలోనే రేవంత్ రెడ్డికే అప్పచెబుతూ ప్రకటన వస్తుందని.. ఆయన వర్గం చెబుతోంది. అది జరగకపోతే మాత్రం కాంగ్రెస్ ను తెలంగాణలో మళ్లీ లేపడం సాధ్యమయ్యే పని కాదని వారంటున్నారు.

ప్రేమ పాఠాల పంతులమ్మ.. స్టూడెంట్ తో జంప్.. 

గుండె గుబులుని గంగకు వదిలి ముందు వెనకలు ముంగిట వదిలి.. ఊరి సంగతి ఊరికి వదిలి దారి సంగతి దారికి వదిలి.. తప్పు ఒప్పులు తాతలకొదిలి సిగ్గు ఎగ్గులు చీకటికొదిలి తెరలను వదిలి పొరలను వదిలి తొలి తొలి విరహపు చెరలను వదిలి..గడులుని వదిలి ముడులని వదిలి గడబిడలన్నీ గాలికి వదిలేసి..ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.. ఈ పాట వినే ఉంటారు.. తాజాగా ఓ టీచర్ కూడా ఎవరు ఏమనుకున్నా సరే అని ఎగిరిపోయింది.. ఎగిరిపోవడం కామన్ అందులో కొత్తదనం ఏముంది అని అనుకుంటున్నారా..? అవును ఈ వార్తలో కొత్తదనం ఉంది అదేంటో మీరే తెలుసుకోండి..?  ఈ మధ్య కాలంలో పంతులమ్మలు బడిలో పాఠాలు చెప్పడం మానేశారు. ప్రేమ పాఠాలు చదువుతున్నారు.. ప్రేమపాఠాలు అంటే తోటి పంతులయ్యా తోనో.. పక్కింటి అంకుల్ తోలతోనో కాదు వాళ్ళ దగ్గర పాఠాలు నేర్చుకునే స్టూడెంట్స్ తో ప్రేమ పాఠాలు నేర్చుకుంటున్నారు.. ఈ మధ్య కాలంలో ఈ వార్తలు చాలానే ఉంటున్నాం..  కరోనా మహమ్మారి కారణంగా పిల్లలు సరిగ్గా పుస్తకాలు పట్టుకుని ఏడాది దాటిపోయింది. స్కూళ్లు మూతపడటంతో పాఠాలన్నీ ఆన్‌లైన్‌లో సాగిపోతున్నాయి. అయితే తమ పిల్లలు చదువులో వెనకబడుతున్నారని అనుకుంటున్న కొందరు తల్లిదండ్రులు ట్యూషన్ టీచర్లను నియమించుకుని చదువు చెప్పిస్తున్నారు. అయితే ఇలా చేయడమే ఓ తల్లిదండ్రుల కొంప ముంచింది. విద్యార్థికి చదువు చెప్పాల్సిన ట్యూషన్ టీచర్ అతడికి ప్రేమ పాఠాలు చెప్పింది.. అక్కడితో ఆగక ఇంకో అడుగుముందుకు వేసి స్టూడెంట్ ని  తనతో తీసుకొని ఎగిరిపోయింది..  ఓపెన్ చేస్తే.. అతను  ఒక స్టూడెంట్. తొమ్మిదో తరగతి చదువుతున్నాడు ఆ అబ్బాయి వయసు 14 సంవత్సరాలు. కరోనా కావడం వల్ల స్కూల్స్ అన్ని మూత పడిన విషయం తెలిసిందే.. తమ కొడుకు చదువులో వెనకాపాడాడని ట్యూషన్  చెప్పడానికి ఓ యువతి (20)ని నియమించారు. ఆ స్టూడెంట్ తల్లిదండ్రులు. ఇక ఆ పంతులమ్మ గత మూడు నెలల నుంచి రోజూ వారి ఇంటికెళ్లి నాలుగు గంటల పాటు బాలుడికి ట్యూషన్‌ చెబుతోంది.  కట్ చేస్తే.. గత నెల 29న స్టూడెంట్  దేస్రాజ్ కాలనీలో ఉంటున్న ట్యూషన్ టీచర్ ఇంటికి వెళ్లాడు. టైం గడుస్తుంది.. రాత్రి అయ్యింది అయిన  కూడా కొడుకు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడ్డారు. అతడికి చాలా సార్లు  ఫోన్ చేశారు.. ఫోన్  స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు కంగారు మరింత పెరిగింది.. అసలే రోజులు బాగాలేవు తమ కొడుక్కి ఏం జరిగుంటుందని..  ఆలోచించడం మొదలు పెట్టారు ఆ తర్వాత నేరుగా ట్యూషన్ టీచర్ ఇంటికి చేరుకుని కుమారుడి కోసం వాకబు చేశారు. అయితే తమ కూతురు కూడా కనిపించడం లేదంటూ యువతి కుటుంబ సభ్యులు చెప్పడంతో షాకయ్యారు. దీంతో ఆ టీచర్పై మైనర్‌ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు టీచర్‌పై కిడ్నాప్ కేసు నమోదు చేసి వారి కోసం గాలింపు చేపట్టారు. ఆ టీచర్‌కు గతంలోనే పెళ్లికాగా కొద్దిరోజులకే విడాకులు కూడా తీసుకున్నట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటన హర్యానా లో జరిగింది. 

ఉచితం టీకాపై  రాజకీయ  వివాదం ...

కొంచెం ఆలస్యంగానే కావచ్చును, కేంద్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్షాలు, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని, 18 ఏళ్ల వయసు పైబడిన ప్రతి ఒక్కరికీ, కొవిడ్ టీకా ఉచితంగా ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. సరే, అది కూడా నిజమే కావచ్చును, కాంగ్రెస్ నాయకులు చెపుతున్నట్లుగా కోర్టు అక్షింతలకు భయపడే, ప్రధాని మోడీ ఈ నిర్ణయం తీసుకున్నదీ నిజమే కావచ్చును. ఏది ఏమైనా కేంద్రం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. రాజకీయాలను పక్కన పెడితే, దేశ ప్రజలు అందరూ కోరుకుంటున్నది, అదే, కేంద్రం ఇచ్చిందీ అదే. ఉచిత వాక్సిన్’తో పాటుగా ప్రధానమంత్రి, దేశంలో 80 కోట్ల మంది పేద ప్రజలకు వచ్చే నవంబర్ వరకు ఉచిత రేషన్ కొనసాగిస్తామని, ప్రకటించారు. ఇది స్వాగతించవలసిన నిర్ణయం అయినా కాకపోయినా, అవసరమైన నిర్ణయం.  కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, కేరళ ముఖ్యమంత్రి, సిపిఎం నాయకుడు పినరయి విజయన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే,  తమిళనాడు సీఎం స్టాలిన్, పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్  సహా పలు రాష్ట్రల ముఖ్యమంత్రులు స్వాగతించారు. మరో వంక కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రల ముఖ్యమంత్రులు పార్టీ లైన్ ఫాల్లో అయ్యారు. ఇందులో, తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్’కూడా ఉన్నారు. నిజానికి కేసీఆర్ నెగిటివ్, పాజిటివ్ కాకుండా న్యూట్రల్’గా ఉండిపోయారు. అయితే, మంత్రి కేటీఅర్’ అనవసర వివాదానికి తెర తీశారు. కొన్ని నిజనాలు, కొన్ని అసత్యాలు,మరి కొన్ని అర్థ సత్యాలను కలిపి, అందరికీ ఉచిత వాక్సిన్ ఇవ్వాలన్న కేంద్ర నిర్ణయంలో బొక్కలు వెతికి విమర్శలకు దిగారు. కోడి గుడ్డుమీద ఈకలు పీకి బీజేపీ నాయకుల నోటికి పని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ సీనియర్  నాయురాలు విజయశాంతి కేటీఆర్’కు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కేటీఅర్ వాస్తవాలు తెలుసుకోవాలని చురకలు అంటించిన విజయశాంతి కరోనా పేరిట కార్పొరేట్ ఆసుపత్రులు చేసిన కోట్ల ..కోట్ల రూపాయల దోపిడీలో తెరాస నాయకులకు, ముఖ్యమంగా కేసీఆర్ ఫ్యామిలీకి వాటా ఉందని ఎదురుదాడి చేశారు. అలాగే,రాష్ట్రానికి వచ్చిన 80 లక్షల వ్యాక్సిన్లను సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని, వ్యాక్సిన్లను వృథా చేయడంలో ముందుందని ఆరోపించారు, బండి సంజయ్. ఫ్రీ వ్యాక్సిన్‌ కారణంగా రూ.2,500 కోట్లలో తమకు వచ్చే కమీషన్లు పోయాయనే బాధతోనే కేటీఆర్  నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ప్రతివిమర్శ చేశారు. ఒక  రకంగా, అధికార పార్టీ ఇరకాటంలో పడింది.   ఇదలా ఉంటే, అందరికి ఉచిత వాక్సినేషన్ నిర్ణయం నేపధ్యంలో  కేంద్రం ప్రకటించిన తాజా మార్గదర్శకాలు తెలంగాణకు ఇబ్బందికరంగా మారనున్నాయా? రాష్ట్రంలో కేసుల లెక్కను పరిగణనలోకి తీసుకుంటే టీకా సరఫరాలో కోత పడనుందా? వ్యాక్సిన్‌ వృథా కూడా తక్కువ డోసులు రావడానికి కారణం అవనుందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకాలిస్తామని ప్రధాని ప్రకటించిన నేపథ్యంలో జాతీయ వ్యాక్సినేషన్‌ విధానంపై మంగళవారం కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రాల్లోని జనాభా, కేసుల సంఖ్య, వ్యాక్సినేషన్‌లో పురోగతి వంటి అంశాల ఆధారంగా టీకాల కేటాయింపులు ఉంటాయని పేర్కొంది. టీకా వృథాను కూడా లెక్కలోకి తీసుకుంటామంది. ఈ నిబంధనలతో రాష్ట్రానికి చిక్కులు తప్పవన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కరోనా కేసుల సంఖ్యలో తెలంగాణ ప్రస్తుతం 16వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో 5.93 లక్షల కేసులున్నట్లు కేంద్ర గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో నమోదవుతున్న కేసులకు, వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేస్తున్న లెక్కలకు పొంతన ఉండడం లేదన్న ఆరోపణలున్నాయి.  ప్రజలు భయాందోళనకు గురికావొద్దనే ఉద్దేశంతో కేసులు తక్కువగా చూపించారనే వాదనలూ ఉన్నాయి. కానీ, ఆ లెక్కలే ఇప్పుడు రాష్ట్ర సర్కారుకు ఇబ్బందికరంగా మారాయి. కేంద్రం సెకండ్‌ వేవ్‌లో కేసుల సంఖ్య ఆధారంగా కేంద్రం రెమ్‌డెసివిర్‌, ఆక్సిజన్‌ కేటాయింపులు చేసింది. తక్కువ కేసులు ఉండడంతో రాష్ట్రానికి ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ కోటా తగ్గింది. ఇప్పుడు టీకాల విషయంలోనూ అదే జరిగే ప్రమాదముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. టీకా వృథా కూడా తెలంగాణలో ఎక్కువగా జరుగుతున్నట్లు కేంద్రం ఒకటి రెండుసార్లు ప్రకటించింది. ఈ నేపధ్యంలో, రాష్ట్రానికి అవసరం అయిన మేరకు వాక్సిన్ అందుతుందా లేదా ఆనం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇవ్వన్నీ ఎలా ఉన్నప్పటికీ, వైఎస్ షర్మిల అన్నట్లుగా ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు బురద చల్లుకునే ప్రయత్నాలు మానుకొని కరోనా మూడో దశ రాకముందే అందరికీ త్వరితగతిన వ్యాక్సిన్‌’ ఇచ్చే ప్రయత్నం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

ఒకే కాన్పులో 10 మంది పిల్లలు! దక్షిణాఫ్రికా మహిళా వరల్డ్ రికార్డ్ 

కవల పిల్లలు పుట్టడమే అరుదుగా జరుగుతోంది.. ముగ్గురు పిల్లలు పుడితే ఆశ్చర్యమే.. ఒకే కాన్పులో అంతకంటే ఎక్కువ పిల్లలు పుడితే వింత.. సంచలనం.. కాని ఒకే కాన్పులో ఏకంగా  10 మంది పిల్లలు పుడితే... అసలు ఇది జరుగుతుందని నమ్ముతున్నారా.. కాని ఇది జరిగింది.. దక్షిణాఫ్రికాకు చెందిన ఓ మహిళ ఏకంగా 10 మంది పిల్లలకు జన్మనిచ్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ప్రపంచంలో ఒకే కాన్పులో అత్యంత ఎక్కువ మంది పిల్లలు పుట్టడం ఇదే తొలిసారి కావచ్చనీ... ఇదే ప్రపంచ రికార్డు అవుతుందని అంటున్నారు. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.  గత నెలలో మొరాకోలో హాలిమా సిస్సే అనే మహిళ... 9 మంది పిల్లలకు జన్మనిచ్చింది. ఇప్పుడు 37 ఏళ్ల గోసియామే థమారా సిథోలే... 10 మంది పిల్లలకు జన్మనిచ్చింది. వారిలో ఏడుగురు మగ పిల్లలు కాగా... ముగ్గురు ఆడ పిల్లలు. ఆమె భర్త తెబోగో సోతెత్సీ చెప్పిన వివరాల ప్రకారం ప్రిటోరియాలోని ఆస్పత్రిలో... సిజేరియన్ సెక్షన్‌లో జున్ 7న గోసియామే థమారా సిథోలే ఈ పిల్లలకు జన్మనిచ్చింది. డాక్టర్లు మొదట ఆమెను స్కాన్ చేసినప్పుడు... ఆరుగురు పిల్లలకు జన్మనిస్తుందని అన్నారు. ఆ తర్వాత మరో సందర్భంలో చెక్ చేసినప్పుడు... ఎనిమిది మంది పిల్లల పుట్టబోతున్నారని కానీ ఇప్పుడు పిల్లలు పుట్టినప్పుడు మాత్రమే... మొత్తం 10 మంది ఉన్నట్లు తేలింది. గోసియామే సిథోలే... ఆమె భర్త తెబోగో సోతెత్సీకి ఆల్రెడీ ఆరేళ్ల కవల పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం తెబోగో నిరుద్యోగి. కానీ ఇంత మంది పిల్లలు పుట్టడం తనకు ఆనందంగా ఉందనీ చెప్పారు. "ఏడుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు... నేను చాలా ఆనందంగా ఉన్నాను. చాలా ఎమోషనల్ అవుతున్నాను. నేను మాట్లాడలేకపోతున్నాను" అని తెబోగో అన్నారు. ఈ ప్రెగ్నెన్సీ సహజమైనదేనని వైద్యులు చెబుతున్నారు. సహజంగా ఇలా ఇంత ఎక్కువ మంది పుట్టడానికి అండం విడుదలైనప్పుడు ఎక్కువ ఎంబ్రియోలు చొచ్చుకు వెళ్లడమే కారణం అంటున్నారు. ప్రస్తుతం ఆ తల్లి, పిల్లలంతా క్షేమంగానే ఉన్నారంటున్న డాక్టర్లు వారిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు.  

ఈట‌ల లెక్కెంత‌? హుజురాబాద్‌లో ఎవ‌రి బ‌లమెంత‌?

ఈట‌ల రాజీనామాతో హుజురాబాద్‌లో ఉప ఎన్నిక వ‌స్తే..? గెలుపు అవ‌కాశాలు ఎవ‌రికి ఎక్కువ‌గా ఉన్నాయి? రాజేంద‌ర్ బీజేపీ నుంచి బ‌రిలో దిగితే ఎవ‌రికి లాభం? గ‌త ఎన్నిక‌లో ఏం జ‌రిగింది? ఇప్పుడు ఏం జ‌రుగుతుంది? ఇలా హుజురాబాద్ బైపోల్ మీద స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. అయితే.. ఈట‌ల ఇలాఖాలో రాజ‌కీయ లెక్క‌లు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇన్నాళ్లూ పార్టీని, ఈట‌ల‌ను వేరు చేసి చూడ‌లేని ప‌రిస్థితి. ఇక‌పై ఆ ఓటు బ్యాంకు ఎటు వైపు మ‌ళ్లుతుందో..? ఓట‌ర్లు టీఆర్ఎస్‌ను ఆద‌రిస్తారా? ఈట‌ల వెంటే నిల‌బ‌డ‌తారా? ఆయ‌న బీజేపీలో చేరితే.. ఈట‌ల‌కు బ‌లం పెరుగుతుందా? లేక‌, ఈట‌లే బీజేపీకి బ‌లంగా మారుతారా? ఇలా అనేక ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లు.  హుజురాబాద్. అక్క‌డ బీజేపీ బ‌లం దాదాపు శూన్యం. అదంతా ఈట‌ల ఇలాఖా. ఇప్ప‌టిదాకా టీఆర్ఎస్‌దే గుత్తాధిప‌త్యం. అయితే, ఈటల బీజేపీలో చేరితే.. టీఆర్ఎస్ బ‌లం బ‌ల‌హీన‌మై.. కాషాయం మ‌రింత బ‌లోపేత‌మ‌వడం మాత్రం ఖాయం. హుజురాబాద్‌లో ఓట్ల లెక్క‌ల చిక్కుముడులు విప్పితే ప‌లు సంచ‌ల‌నాలు క‌నిపిస్తాయి. 2018లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల ఓట్ల‌ను ప‌రిశీలిస్తే.. ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలుస్తాయి. హుజురాబాద్‌లో బీజేపీ ఉనికే ప్ర‌శ్నార్థ‌కం. గ‌త ఎన్నిక‌ల్లో పువ్వు గుర్తుకు నోటా కంటే త‌క్కువ ఓట్లు రావ‌డం ఆస‌క్తిక‌రం. 2018లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ 1,04,840 ఓట్లు కొల్ల‌గొట్టి.. .కాంగ్రెస్‌ అభ్యర్థి కౌశిక్‌రెడ్డిపై 43,719 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి రఘుకు 1,683 ఓట్లు రాగా.. నోటాకు ఏకంగా 2,867 ఓట్లు రావడం విశేషం. ఇలా, హుజురాబాద్‌లో అస‌లేమాత్రం బ‌ల‌మేలేని బీజేపీకి.. ఈట‌ల చేరిక‌తో వెయ్యి ఏనుగుల బ‌లం వ‌చ్చిన‌ట్టు అవుతుంది. గ‌త ఎన్నిక‌ల్లో ఈట‌లకు ప‌డిన ల‌క్ష పైచిలుకు ఓట్ల‌లో.. ఈసారి ఈట‌ల‌కు ఎన్ని? టీఆర్ఎస్‌కు ఎన్ని? ప‌డ‌తాయ‌నేదే గెలుపుఓట‌ముల‌ను డిసైడ్ చేస్తుంది.  ఎలాగైనా ఈట‌ల‌ను అసెంబ్లీలో అడుగుపెట్ట‌కుండా చేయాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌ గులాబీ బాస్‌. హుజురాబాద్‌లో బ‌ల‌మైన కేండిడేట్‌గా ఉండి.. గ‌త ఎల‌క్ష‌న్‌లో ఈట‌ల‌పై కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసిన కౌశిక్‌రెడ్డిని కారు ఎక్కించుకునేలా పావులు క‌దుపుతున్నార‌ని తెలుస్తోంది. పార్టీ నేత‌లు టీఆర్ఎస్‌ను వీడి ఈట‌ల పంచ‌న చేర‌కుండా చెక్ పెడుతున్నారు. ఇప్ప‌టికే ఇద్ద‌రు బీజేపీ కౌన్సిల‌ర్స్‌కు గులాబీ కండువ క‌ప్పేశారు. మాజీ టీడీపీ, తాజా బీజేపీ నేత పెద్దిరెడ్డిని లాగేసేందుకు రెడీగా ఉన్నారు. బ‌ల‌మైన బీసీ నేత ఎల్.ర‌మ‌ణ కోస‌మూ గాలం వేశారు. మంత్రుల‌ను మోహ‌రించి హుజురాబాద్‌లో ఈట‌ల‌ను ఇర‌కాటంలో ప‌డేసేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.  ఈట‌ల సైతం వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తూ.. టీఆర్ఎస్‌కు ధీటుగా రాజ‌కీయం నెర‌పుతున్నారు. టీఆర్ఎస్‌లోనే ఉంటామంటూ ప్ర‌క‌టించిన ప‌లువురు స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు ఆ త‌ర్వాత తూచ్ అంటూ ఈట‌ల చెంత‌న‌ చేరిపోయారు. తాజాగా, ప‌లు గ్రామాల‌కు చెందిన 12 మంది స‌ర్పంచులూ టీఆర్ఎస్‌ను వీడి ఈట‌ల‌కు జై కొట్టారు. మ‌రోవైపు.. తానే స్వ‌యంగా బ‌రిలో నిలిచి.. కేసీఆర్‌ని క‌వ్వించి.. కారుపై కాలు దువ్వే బ‌దులు.. త‌న త‌ర‌ఫున త‌న స‌తీమ‌ణి జ‌మునారెడ్డిని పోటీలో నిలిపి.. అధికార పార్టీ దూకుడును డైల్యూట్ చేసేలా ఈట‌ల స్కెచ్ వేస్తున్న‌ట్టు స‌మాచారం. జ‌మునారెడ్డి బ‌రిలో దిగితే.. రాజ‌కీయాల‌కు కొత్త కాబ‌ట్టి.. ఆమెపై టీఆర్ఎస్ శ్రేణులు డైరెక్ట్‌గా అటాక్ చేయ‌డానికి కాస్త ఇబ్బందిప‌డ‌తారు. రాజేంద‌ర్ మీద చూపించినంత అగ్రెసివ్‌నెస్.. జ‌మునారెడ్డిపై చూపించ‌లేరు. దాన్ని అడ్వాంటేజ్‌గా మార్చుకొని.. హుజురాబాద్‌లో నెగ్గుకురావాల‌నే ఆలోచ‌న సైతం చేస్తున్నార‌ని అంటున్నారు. అయితే, ఈట‌ల బీజేపీలో చేరితే.. తాను పోటీ చేయాలా? లేక‌, త‌న భార్య జ‌మునారెడ్డిని పోటీకి దింపాలా? అనేది పార్టీ నిర్ణ‌యం మేర‌కే న‌డుచుకోవాల్సి ఉంటుంది. బీజేపీ నేత‌లు మాత్రం ఈట‌ల రాజేంద‌ర్ బ‌రిలో దిగితేనే.. కేసీఆర్‌కు ధీటుగా ఉంటుంద‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.  అయితే.. ఎవ‌రి అంచ‌నాల‌కు అంద‌ని విధంగా ఎత్తుగ‌డ‌లు వేయ‌డంలో కేసీఆర్ దిట్ట‌. అందుకే, టీఆర్ఎస్ నుంచి గులాబీ బాస్ బ‌రిలో నిలిపే.. కేండిడేట్ ఎవ‌ర‌నేది ఇప్పుడే చెప్ప‌లేం. జాబితాలో అనేక పేర్లు ఉన్నా.. చివ‌రి నిమిషంలో ఏదైనా జ‌ర‌గొచ్చు. అభ్య‌ర్థి విష‌యంలో టీఆర్ఎస్ ఏమాత్రం తొంద‌ర‌ప‌డ‌టం లేదు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ వ‌చ్చాకే కారు డ్రైవ‌ర్ ఎవ‌రో తేలుతుంది. అందాక కేవ‌లం తెర‌మీద ఈట‌ల‌పై దాడి చేసే గులాబీ సైన్య‌మే క‌నిపిస్తుంది. అయితే, కేసీఆర్‌ను దాదాపు రెండు ద‌శాబ్దాలుగా ద‌గ్గ‌రుండి మ‌రీ గ‌మ‌నించిన ఈట‌ల రాజేంద‌ర్‌.. త‌న గులాబీ బాస్ చెడుగుడుకు.. ఎలా విరుగుడు చూపిస్తారో చూడాలి...

తెలంగాణ ఇంటర్‌ పరీక్షలు రద్దు.. మరీ ఏపీలో! 

తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్‌ పరీక్షలను రద్దు చేసింది. ఇంటర్ సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు రద్దు చేస్తూ తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం.. ఫస్ట్‌ ఇయర్‌లో వచ్చిన గ్రేడ్‌ల ప్రకారమే సెకండియర్‌లో గ్రేడింగ్‌ ఇవ్వనున్నట్టు తెలిపింది.  కరోనా కల్లోలంతో పరీక్షల నిర్వహణ కష్టతరంగా మారింది. రాష్ట్ర స్థాయిలో పదో తరగతి పరీక్షలను, ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలను రద్దు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు, ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను సైతం రద్దు చేస్తున్నట్లు గత ఏప్రిల్‌ నెలలో ప్రకటించారు. పరీక్షలు లేకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేసింది. అయితే సెకండ్ ఇయర్ పరీక్షలను వాయిదా వేస్తూ.. జూన్ నెలలో నిర్వహించనున్నట్టు ప్రకటించింది. అయితే కరోనా తీవ్రక ఇంకా కొనసాగుతుండటం.. కేంద్రం కూడా తన పరిధిలోని సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేసింది. దీంతో తెలంగాణ సర్కార్ కూడా ఇంటర్ సెకండియర్ పరీక్షను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  తెలంగాణలో ఇంటర్ పరీక్ష రద్దు కావడంతో ఏపీ పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది. దేశమంతా  ఒకలా ఉంటే.. ఏపీలో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. పరీక్షలపై పంతానికి పోతోంది జగన్ రెడ్డి సర్కార్. పరీక్షలు నిర్వహించి తీరుతామని చెబుతోంది. పరిస్థితులు చక్కబడిన తర్వాత పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు ఏపీ విద్యాశాఖ మంత్రి సురేష్. తగ్గించిన సిలబస్‌లతో ఇప్పటికే పరీక్షలకు ప్రశ్నాపత్రాలు కూడా రూపొందించామని  చెప్పారు. ఏపీ సర్కార్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. విద్యార్థుల జీవితాలతో చెలగాడుమాడుతున్నారని విపక్షాలతో పాటు పేరెంట్స్ కూడా ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వమే పరీక్షలను రద్దు చేసినప్పుడు.. ఏపీ ప్రభుత్వానికి అంత పంతం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.  

జగన్ రెడ్డిపై ఎంపీ రఘురామ మరో బాంబ్! అడ్డంగా బుక్కయినట్లేనా.. 

నర్సాపురం ఎంపీ రఘురామ రాజు.. ఇప్పుడు ఈ పేరు వింటేనే వైసీపీ నేతలకు నిద్ర పట్టడం లేదట. ముఖ్యంగా జగన్ శిబిరానికి కొన్ని రోజులుగా కంటి మీద నిద్ర లేదని తెలుస్తోంది. జగన్ రెడ్డి ప్రభుత్వంపై ఢిల్లీలో ర‌ఘురామ ఎదురుదాడి మామూలుగా లేదు. సుప్రీంకోర్టు, పార్ల‌మెంట్‌, ఎన్‌హెచ్ఆర్‌సీ.. ఇలా దేనినీ వ‌దిలిపెట్ట‌డం లేదు. త‌న‌కు జ‌రిగిన దారుణంపై, త‌న‌పై జ‌రిపిన థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగంపై.. ఢిల్లీ స్థాయిలో జ‌గ‌న్‌రెడ్డితో చెడుగుడు ఆడుకుంటున్నాడు ర‌ఘురామ‌. ఇక త‌న అరెస్టులో పాత్ర‌ధారులు, సూత్ర‌ధారులైన ప్ర‌తీ ఒక్క‌రినీ.. పేరు పేరుగా శిక్షిస్తున్నాడు. రాజు గారి దెబ్బ‌కు.. దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతోంది చాలామందికి .అంతేకాదు ఏపీ సర్కార్ అవినీతిని ఒక్కొక్కటికి బయటికి తీస్తున్నారు ఎంపీ రఘురామ రాజు. చీకటి బాగోతాలను బయటపెడుతున్నారు. ప్రభుత్వ సొమ్మును అమూల్ లాంటి సంస్ఖల మాటున నోక్కేసే ప్రయత్నాలను అడ్డుకుంటున్నారు రఘురామ. తాజాగా జగన్ సర్కార్ పై ఎంపీ రఘురామ రాజు మరో బాంబ్ పేల్చారు. జగన్ రెడ్డి సర్కార్ భారీ అవినీతి గుట్టును ఢిల్లీలో బట్టబయలు చేశారు. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టులో జరిగిన, జరుగుతున్నఅవినీతిపై కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదు చేశారు ఎంపీ రఘురామ రాజు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యేతో పాటు నేతలు.. పోలవరం నిర్వాసితుల పునరావసం ప్యాకేజీలో పాల్పడుతున్న అక్రమాలకు సంబంధించి పక్కా ఆధారాలను ఆయన సేకరించారు. బోగస్ పేర్లతో పునరావాసం ప్యాకేజీని పోలవరం ఎమ్మెల్యే కాజేసినట్లు కనిపెట్టిన రఘురామ.. అందుకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు, డబ్బులు డ్రా చేసినట్లుగా ఉన్న ఆధారాలను కూడా కేంద్రానికి అందించారు. ఇద్దరు మహిళల పేరిట దాదాపు 2 కోట్ల రూపాయలను వైసీపీ నేతలు స్వాహా చేసినట్లు ఎంపీ రఘురామ ఆధారాలు సంపాందించారు.  పోలవరం ముంపు ప్రాంతంలో నిర్వాసితుల పేరుతో పరిహారం సొమ్మును భారీగా అధికార పార్టీ నేతలు దిగమింగుతున్నారనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. దీనిపై ఫోకస్ చేసిన నర్సాపురం ఎంపీ రఘురామ... పక్కా ఆధారాలు సేకరించారు.  ముంపు పరిహారం కోసం ఎవరూ తమదని పేర్కొనని (అన్‌ క్లెయిమ్డ్‌) భూములను గుర్తించి, వాటి ద్వారా పక్కాగా కుంభకోణం నడిపించినట్లు గుర్తించారు. ఈ భూములకు పరిహారం ఇవ్వాలంటే కలెక్టర్‌ ప్రొసీడింగ్స్‌ ఉండాలని, లేదా కోర్టు ఆదేశాలైనా ఉండాలి.. కానీ, అవేవీ లేకుండానే అధికార పార్టీకి చెందిన పోలవరం ఎమ్మెల్యే, స్థానిక ఉన్నతాధికారులతో కలిసి ఈ వ్యవహారం నడిపించారని రఘురామ కనిపెట్టారు. దీనికి సంబంధించి పక్కా ఆధారాలను కేంద్ర జలశక్తి శాఖకు అందించారు.   ‘మచ్చా మహాలక్ష్మి అనే గిరిజన మహిళకు ముంపు భూమి పరిహారం కింద 1.16 కోట్లు మంజూరైనట్లు గతేడాది జూలై 13న అధికారులు ప్రొసీడింగ్స్‌ జారీ చేశారు. అదే రోజు ఆమె పేరుతో భద్రాచలంలోని హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకులో ఖాతా తెరిచారు. ప్రభుత్వం మంజూరు చేసిన డబ్బు డిసెంబరులో ఆ ఖాతాలో జమ అయింది. అదే రోజు మడకం సావిత్రి అనే మరో గిరిజన మహిళకు రూ. 99 లక్షలు మంజూరైనట్లు ప్రొసీడింగ్స్‌ జారీ చేశారు. అదే బ్యాంక్‌లో అదే రోజు ఆమె పేరుతో ఖాతా తెరిచారు. ఆ వెంటనే ఆ డబ్బు మరొకరి ఖాతాకు తరలిపోయింది. మచ్చా మహాలక్ష్మి పేరుతో రెవెన్యూ రికార్డుల్లో ఒక ఎకరా ఉంది. కానీ,11 ఎకరాలు ఉన్నట్లుగా రికార్డులు మార్చారు. అలాగే సావిత్రి పేరు మీదకు 9ఎకరాలు మార్చి పరిహారం కొట్టేశారు. ఇందుకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు, నగదు డ్రా చేసిన రషీదులన్ని రఘురామ సేకరించారు. వీటన్నింటిని కేంద్రానికి అందించి పోలవరం నిర్వాసికుల ప్యాకేజీలో జరుగుతున్న అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు.  పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసంలో ఎంపీ రఘురామ బయటపెట్టిన అవినీతి సంచలనంగా మారింది. ఈ రెండే కాదు.. ఇంకా చాలా మంది పేర్లతో డబ్బులను కొట్టేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిర్వాసితులకు ఇస్తున్న పరిహారంలోనూ అక్రమాలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. మరీ రఘురామ ఫిర్యాదుపై కేంద్ర సర్కార్ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది. 

కోడి కూత.. చికెన్ మోత.. 

వచ్చేది వర్షాకాలం అందుకు చూచికంగా మృగశిర కార్తీ మొదలైయింది.. ఈ కార్తె రోజు ప్రతి ఇంట్లో చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. దీని వెనుక ఆరోగ్య రహస్యం దాగివుంది. రోళ్లు పగిలే ఎండలను మోసుకొచ్చిన రోహిణికార్తె ముగిసి.. చల్లబరిచే మృగశిర మొదలవుతుంది.  అందులోనూ వచ్చేది వర్షాకాలం.. చల్లటి వాతావనానికి రాత్రి అయితే రెండు పెగ్గులు మందు అందులోకి వేడి వేడి చికెన్ పకోడీ.. వర్షం పడ్డప్పుడల్లా చల్లటి వాతావరణానికి వేడి వేడి చికెన్ తినాలని మీరు అనుకుంటే.. దాదాపు కిలో రూ.140నుంచి రూ.180కి పెరిగింది. మీరు చికెన్ షాప్ వైపు వెళ్లంటే  దాదాపు 200 మీ  జేబులో ఉండాలి. లేకపోతే చికెన్ సెంటర్ కి కాదు కాదు.. ఆ వాసనా కూడా చూడలేరు. కరోనా కారణంగా ఏప్రిల్‌, మేనెలల్లో సెకండ్‌ వేవ్‌లో కొవిడ్‌ బారినపడిన చాలా మంది నెల రోజులపాటు చికెన్‌ తీసుకోలేదు. ఇప్పుడు పోషకాహారం కోసం అనేక మంది చికెన్‌ బాటపడుతున్నారు. పొద్దున్న కోడి కూస్తే మనం లేవడం ఆనవాయితీ..బట్ ఫర్ ఆ చేంజ్ ఇప్పుడు అదే కోడి కూస్తే చికెన్ ధరలు పెగరడం ట్రెండ్..   ఆంధ్రప్రదేశ్‌లో మాంసాహార ప్రియులకు కోడి ధర షాకిస్తోంది. వేసవికాలం, కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి కారణంగా రెండు నెలలుగా చికెన్‌ అమ్మకాలు తగ్గాయి. దీంతో మార్చిలో కిలో రూ.200దాకా అమ్మిన స్కిన్‌లెన్ చికెన్‌ ధర రూ.50-60 దాకా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం కరోనా సెకండ్‌వేవ్‌ కాస్త తగ్గుముఖం పట్టడం, వర్షాకాలం మొదలవుతున్న నేపథ్యంలో చికెన్‌ వినియోగం మళ్లీ పెరుగుతోంది. దీంతో ప్రస్తుతం కిలో రూ.140నుంచి రూ.180కి పెరిగింది. అయితే డిమాండ్‌కు తగ్గ చికెన్‌ ఉత్పత్తి లేకపోవడంతో వ్యాపారులు ధర అమాంతం పెంచేశారు. తొలకరి తర్వాత కొత్త బ్యాచ్‌లను పౌల్ర్టీ యజమానులు తెస్తుంటారు. దీంతో డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి కొరవడింది. అదే సమయంలో ఏప్రిల్‌, మేనెలల్లో సెకండ్‌ వేవ్‌లో కరోనా బారిన పడిన చాలా మంది నెల రోజుల పాటు చికెన్‌ తీసుకోలేదు. ఇప్పుడు పౌష్టికాహారం కోసం అనేక మంది చికెన్‌‌ను ఓ పట్టు పడుతున్నారు. దీంతో మూడు రోజులు క్రితం వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లో బాయిలర్‌ కోడి మాంసం కిలో(ఫాం గేట్‌) రేటు రూ.85-87ఉండగా.. ఇప్పుడు రూ.100 దాటేసింది. ప్రాసెసింగ్‌, ఇతర ఖర్చులు కలుపుకొని వ్యాపారులు కిలో స్కిన్‌లెస్ చికెన్‌ రూ.180 అమ్ముతున్నారు. మరోవైపు గుడ్డు ధర కూడా భారీగా పెరిగింది. రిటైల్‌గా ఒక్కో గుడ్డును రూ.7-8వరకు అమ్ముతున్నారు. పౌల్ర్టీలకు కొత్త బ్యాచ్‌లు వచ్చే వరకు గుడ్లు, చికెన్‌ ధరలు ఎక్కువగానే ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. ఆదివారం కదా చికెన్ తినేద్దాం అనే వాళ్ళు  ఈ విష్యాన్ని దృష్టిలో పెట్టుకొని చికెన్ షాప్ కి వెళ్ళండి.. వర్షాకాలం కదా ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి.. లాక్ డౌన్ తీస్తెస్తే మళ్లీ నూడిల్స్ షాప్.. చికెన్ పకోడీ, రెస్టారెంట్స్, హోటల్స్ అన్ని ఓపెన్ అవుతాయి కాబట్టి సో భవిష్యత్తు కాలంలో మరో వంద పెరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు..