న్యాయవాదులకు హోమియోపతి మందుల పంపిణీ

కరోనా మహమ్మారి కట్టడికి హోమియో మందు కూడా దోహదపడుతుందని నాంపల్లి క్రిమినల్‌ కోర్డు బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి జి. వేణుగోపాల్‌ అన్నారు. ప్రాణాంతకమైన ఈ వైరస్‌ నుంచి కాపాడుకోవటానికి ఈ హోమియోపతి మందు ఇమ్మ్యూనిటి బూస్టర్‌ డోస్ లా ఉపయోగపడుతుందని చెప్పారు. శుక్రవారం నాంపల్లి క్రిమినల్‌ కోర్డు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ న్యాయవాదులకు ఉచిత హోమియోపతి మందులను ఆయన పంపిణీ చేశారు. ఆయా కోర్ఠుల పరిధిలోని పలువురు న్యాయవాదులు ఈ హోమియోపతి మందును తీసుకున్నారు.  హైదరాబాద్ కు చెందిన ఏటీఎం హోమియో స్టోర్స్‌ ఆధ్వర్యంలో ఈ హోమియో మందును తయారు చేశారు. సెవెన్‌ సీస్‌ ఎంటర్‌టైన్మెంట్‌ ఎండీ మారుతి శంకర్‌ లింగంనేని ఆధ్వర్యంలో మెట్రోపాలిటన్‌ క్రిమినల్‌ కోర్డుకుచెందిన న్యాయవాదులకు కూడా ఈ మందును ఉచితంగా పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఏటీఎం హోమియో స్టోర్స్‌ సంయుక్త కార్యదర్శి జక్కుల లక్ష్మణ్ ను బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి జి. వేణుగోపాల్‌ అభినందించారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు లక్ష్మినారాయణ, న్యాయవాది ఎ. విద్యాసాగర్‌, సుబ్బారావు ,చంద్రశేఖర్ ,నాగార్జున, శ్రీకాంత్ రాజేందర్ ,రూహి ,తిరుపతి తదితరులు పాల్గొన్నారు. సోమవారం కూడా ఈ మందును నాంపల్లి కోర్టు లో మళ్ళీ పంచుతామని బార్  అసోసియేషన్ అధ్యక్షులు మధుషేకర్ చెప్పారు. 

ఈటలతో మళ్లీ బిజెపి షో.. దుబ్బాక సీన్ రిపీట్? 

బిజెపి వాళ్లకు మళ్లీ ఓ ఛాన్స్ వచ్చింది. దుబ్బాకతో కాస్త లేచారు..గ్రేటర్ తో హుషారు పెరిగింది. మళ్లీ సాగర్ తో చతికిలపడ్డారు. కాని ఇప్పుడు లేవడానికి హుజురాబాద్ ఎదురొస్తోంది. ఈటల రాజేందర్ బిజెపిలో చేరుతుండటంతో.. హుజురాబాద్ ఉప ఎన్నిక పేరుతో మళ్లీ తెలంగాణలో హల్ చల్ చేయడానికి బిజెపి ప్లాన్ చేస్తోంది. ఎటూ ఈటలకే అవకాశం ఉంటుందనే అంచనాలు ఉండటంతో... ఆ సీటు గెలిచి.. మళ్లీ తొడగొట్టాలని చూస్తోంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలు అయిపోగానే ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయ వాతావరణం మారినట్లు అనిపించింది. కాంగ్రెస్ వెనక్కుతోసి బిజెపి ముందుకొచ్చిమరీ టీఆర్ఎస్ కు సవాల్ విసురుతున్నట్లే కనిపించింది. బండి సంజయ్ పంచ్ డైలాగులు, ధర్మపురి అరవింద్ విసుర్లుతో బిజెపియే తర్వాత అధికారంలోకి వచ్చేది అన్న పీలింగ్ తెప్పించేశారు.కాని అపర చాణక్యుడు కల్వకుంట్ల చంద్రశేఖరుడు వెంటనే ఢిల్లీ వెళ్లి మోదీగారితో భేటీ అయి.. మేం మేం కలిసిపోయాం.. తెలంగాణ బిజెపి నేతలంతా ఆటలో అరటిపండ్లన్న ఫీల్ తీసుకొచ్చేశాడు. అంతే బిజెపి వేడి అంతా చప్పున చల్లారిపోయింది.ఆ తర్వాత బిజెపి, టీఆర్ఎస్ నేతలు ఎంత పరుషంగా తిట్టుకున్నా.. జనానికి మాత్రం అది కామెడీ అయిపోయింది. దీనికి తోడు పెద్దగా పట్టు కూడా లేని నాగార్జునసాగర్ లో పోటీ చేసి అభాసుపాలయ్యారు.  ఈ ఎన్నిక తోనే..కాంగ్రెస్ ఉంది.. అది కూడా సెకండ్ ప్లేస్ లో..రాష్ట్రమంతా చూస్తే బిజెపికి కాంగ్రెస్ అంత బలం లేదనే లెక్కలు బయటికొచ్చాయి. దీనికి తోడు బిజెపి రాష్ట్రానికి ఏం చేయలేదనే వాదనలు పెరగటం.. కోవిడ్ విషయంలో యాంటీ మోదీ ఫ్లేవర్ మొదలవటం.. దేశవ్యాప్తంగానే మోదీ సంస్కరణలకు ఎదురుగాలి రావడంతో... మరింత నీరసపడ్డారు..డిఫెన్సులోనూ పడ్డారు.  ఇప్పుడు వీళ్లకి ఈటల రాజేందర్ హార్లిక్స్ లా దొరికాడు.  ఈటల హుజూరాబాద్ లో ఎలాగూ గెలవాలి. బిజెపి టిక్కెట్ మీద గెలిస్తే.. అది ఆయన సొంతబలం మీద గెలిచినా.. క్రెడిట్ బిజెపి అకౌంట్లో పడిపోతుంది. అందుకే మళ్లీ హడావుడి మొదలెట్టారు. మరో బీసీనాయకుడు తమకు పోటీ రావడం బండి సంజయ్, అరవింద్ లకు ఇష్టం లేకపోయినా..అధిష్టానం నిర్ణయంతో ఒప్పుకోక తప్పలేదు. అప్పుడే బిజెపి తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్ టీఆర్ఎస్ తో భవిష్యత్ లో కూడా పొత్తు ఉండదని... ఆ ఆలోచనే మానేయమని తమ నేతలకు, కార్యకర్తలకు క్లాసు తీసుకున్నాడు. ఇవన్నీ హుజూరాబాద్ పోరును గేరెక్కించడానికే.  ఇక ఈటల రాజీనామాతో మొదలెట్టి.. ప్రతి రోజూ మనం బిజెపి నేతల సవాళ్లు, పంచ్ లు.. బెదిరింపులు అన్నీ వినాల్సి ఉంటుంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక పేరుతో రాష్ట్రమంతా మార్మోగిపోయేలా మీడియాలో వాయించి పడేస్తారు. మరి కల్వకుంట్లవారు ఈ వ్యూహాన్ని ఎలాఎదుర్కొని..హుజురాబాద్ ను గెలుచుకుంటారో.. లేక సాధ్యం కాదని వదిలేస్తారో చూడాలి.

బాలికకు కరోనా..  ఊరి జనం వెలివేత.. 

మనిషి, మనిషికి దూరం అవుతున్నాడు..మానవత్వం మరిచి వందలో ఉన్న మందకొడిగా బతకాలనుకుంటున్నాడు.. ఇప్పుడు ఉన్న కరోనా పరిస్థితులు మనవాడు ఎవడు, మన మరణాన్ని కోరేవాడు ఎవరని తెలుస్తుంది.. తాజాగా ఒక అమ్మాయిలో కరోనా వచ్చింది.. ఆ విషయం ఆ ఊరి పెద్దలకు తెలిసింది.. ఇక అంటే పెద్దలు తెల్ల పంచలు కట్టుకుని, పెద్ద పెద్ద మీసాలు పెట్టుకుని ఒక తీర్మానం చేశారు.. అదేంటో మీరే చూడండి..      అది రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి. ఆ గ్రామానికి చెందిన ఒక  అమ్మాయికి కరోనా సోకింది. ఆ ఊరి పెద్దలంతా కలిసి ఆ బాలికను ఊరు బయట పంటపొలాల్లో వదిలేశారు. ఆ బాలిక తల్లి కూడా చేసేదేమిలేక ఆ అమ్మాయితో పాటు తల్లి పంట పొలాల్లో నల్లటి కవరుతో చిన్న గుడారం ఏర్పాటు చేసుకొని ఇద్దరు  నివాసముంటున్నారు. మైనర్ బాలికను ఇటీవల సఖి కేంద్రం నిర్వహకులు చేరదీసి ఆశ్రమం కల్పించగా రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో సఖి కేంద్రం నిర్వాహకులు బాలికను స్వగ్రామం వీర్నపల్లిలో వదిలిపెట్టారు. కరోనా సోకిన బాలిక కావడంతో గ్రామస్తులు ఆమె పట్ల వివక్షత చూపారు. ఊళ్లో ఎవరు కరోనా బారిన పడలేదని ప్రస్తుత బాలికతో ఇబ్బందులు ఏర్పడతాయని గ్రామస్థుల బాలికను ఊరి బయటకు పంపించారు. విధిలేని పరిస్థితుల్లో బాలికతోపాటు తల్లి ఇద్దరూ కవర్లతో గుడారం ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నారు. గ్రామస్తుల వివక్షత, సఖి నిర్వాహకుల నిర్వాకంపై జనం మండి పడుతున్నారు. కరోనా బారినపడ్డ వారిపట్ల వివక్షత చూపకుండా వారికి ధైర్యం చెబుతూ ఐసోలేషన్ సెంటర్ కు తరలించాల్సింది పోయి అమానుషంగా ప్రవర్తించడం విమర్శలకు దారి తీస్తోంది.  కరోనా ఈ ప్రపంచానికి వింత అనుభవం నేర్పిందనే చెప్పాలి.. డబ్బుంటే చాలు ఇంకా ఎవరు ఏం చేయలేరని.. ఉన్నోడైన, లేనోడైనా, పెడోదైనా పెద్దోడైన ఇలాంటి విపత్తు వస్తే కాలగర్భంలో కలిసిపోవాల్సిందే అని మంచి గుణపాఠం చెప్పింది..అల్లాగే కరోనా వచ్చిన సరే నాలాంటి ఇంకా ఎన్ని వైరుసులు వచ్చిన మనుషులు దైర్యంగా ఉండే ఎంతటి విపత్తునైనా జయించొచ్చని.. మనుషులు ఎప్పుడు ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలనే లాంటి గుణపాఠాలు ఎన్నో చెప్పింది కరోనా అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు.. అన్ని మాట్లాడుకుని మళ్ళీ ఇలాంటి దుశ్యర్యలకు పాలుపడుతున్నారు.. 

తెలంగాణలో  రాజకీయ శూన్యత ?

తెలంగాణలో  రాజకీయ శూన్యత వుందా? ఏడేళ్ళ తెరాస పాలనాలో తెలంగాణ ఉద్యమ స్పూర్తి మరుగునపడి, ప్రజలు సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేసే మరో రాజకీయ వేదిక కోసం ఎదురు చూస్తున్నారా, అంటే, అవుననే సమాధానమే వస్తుంది. ఒక్క సామాజిక కోణంలోనే కాదు, ఇతరత్రా కూడా తెరాస ఏడేళ్ళ పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత వుంది. అది రోజు రోజుకు పెరుగుతోంది. ఆ విధంగా చూసినప్పుడు, రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందనిపిస్తుంది. అయితే,ఈ రాజకీయ శూన్యతను ఎవరు భర్తీ చేయాలి? మరో ప్రాతీయ పార్టీనా లేక జాతీయ పార్టీనా?   మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ ఉద్వాసన నేపధ్యంగా, రాష్ట్రంలో వివిధ కోణాల్లో జరుగుతున్న రాజకీయ చర్చల్లో, ఈ కోణంలోనూ లోతైన  చర్చ జరుగుతోంది. అందులో భాగంగా  ప్రత్యాన్మాయ ప్రాంతీయ పార్టీ ఏర్పాటు అంశం చాలా ప్రముఖంగా వినిపిస్తోంది.తెలంగాణ ఉద్యమ స్పూర్తితో, సామాజిక తెలంగాణ లక్ష్యంగా, బడుగు బలహీన వర్గాల వేదికగా మరో ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన, ఒక్క బడుగు బలహీన వర్గాల నుంచే కాకుండా అన్ని వర్గాల నుంచి వినవస్తోంది. ముఖ్యంగా కొండా విశ్వేశ్వర రెడ్డి, ప్రొఫెసర్ కోదండ రామ్ వంటి అగ్రవర్ణ కులాలకు చెందిన నాయకుల నుంచి చాలా బలంగా వినవస్తోంది. బర్తరఫ్’కు గురైన  ఈటల రాజేందర్, ఆ దిశగా అడుగులు వేస్తారని అనేక మంది ఆశించారు. అయితే, ఈటల చాంతాడంత  రాగంతీసి,  చివరకు బీజేపీ గూటికి  చేరారు. ఈ నేపధ్యంలోనే, ప్రొఫెసర్ కోదండ  రామ్’ “ఈటల మంచి అవకాశాన్ని చేజార్చుకున్నారు” అని వ్యాఖ్యానించారు.అంటే సొంత పార్టీ పెట్టి, కేసీఆర్’ను నేరుగా ‘ఢీ’ కొనే సువర్ణ అవకాశాన్ని ఈటల చేజార్చుకున్నారనేది, వారి అభిప్రాయం కావచ్చును.  అయితే, ఒక్క సారి చరిత్రను చూస్తే, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్’లో అలాగే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఏర్పడిన ప్రాంతీయ పార్టీలు ఏవీ బతికి బట్టకటలేదు. ఇందులో, కోదండరామ్ ఏర్పాటు చేసిన, తెలంగాణ జన సమితి (టీజేఎస్) కూడా వుంది. తెలంగాణ మలి దశ ఉద్యమం చాలా వరకు ఆయన చేతుల మీదుగానే నడిచింది. అయినా, ఆయన పార్టీని ప్రజలు ఆదరించలేదు. పార్టీనే కాదు, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పోటీచేసినా ప్రజలు ఆయన్ని గెలిపించలేదు. ఇప్పడు తెలంగాణలో తెలంగాణా ఉద్యమం పేరున నడుస్తున్న పార్టీలే నాలుగైదున్నాయి. నిజానికి ఇన్ని పార్టీలు, ఇన్ని వేదికలు ఉండడమే తెరాస ప్రధాన బలం, అని పలు సందర్భాల్లాలో రుజువైంది.ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలను ఉదాహరణగా తీసుకుంటే, కోదండరామ్, తీన్మార్ మల్లన్న, చెరుకు సుధాకర, రాణి రుద్రమ, అలాగే, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధులు అందరూ తెరాస వ్యతిరేకులే, ఇంకా, పోటీచేసిన స్వతంత్ర అభ్యర్ధులు అందరూ  తెరాసను వ్యతిరేకించారు.  కానీ, ఎవరి జెండా వారిదే, అందుకే అందరు ఓడి పోయారు. ఉమ్మడి శత్రువు విజయ కేతనం ఎగరేశారు. ఈటల గానీ మరొకరు కానీ, కోదండరామ్ కంటే గొప్ప ఉద్యమనాయకులు కాదు. సో .. ఈటల పార్టీ పెట్టినా ఫలితం ఇలాగే, ఉంటుంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తెరాసకు వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీలే కాదు, ఉద్యమ సమయంలో ఏర్పడిన, పార్టీలు కూడా చరిత్రలో కలిసి పోయాయి. ఆలే నరేంద్ర, విజయశాంతి, చివరకు బడుగు వర్గాల నేతగా మంచి పేరు తెచ్చుకున్న దేవేదర్ గౌడ్, ఇలా నేక మంది, సొంత పార్టీ పెట్టి చేతులు కాల్చుకుని చివరకు ఎవరి సొంత గూటికి వారు చేరున్నారు.. చివరకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గాన్ని నమ్ముకుని, పార్టీ పెట్టిన చిరంజీవి, మధ్యలోనే కాడి వదిలేసి, ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్’లో కలిపేశారు. అలాగే, లక్మీ్ట పార్వతి, నందమూరి హరికృష్ణ, ఇంకా అనేక మంది పార్టీలు పెట్టి, ఎత్తేశారు. కాబట్టి, ఈటల బీజేపీలో చేరడం కొందరికి నచ్చక పోతే నచ్చక పోవచ్చును, కానీ, సొంత పార్టీ ఆలోచన పక్కన పెట్టడం వరకు  మాత్రం గత అనుభావాల  దృష్టా ... విజ్ఞతతో తీసుకున్న మంచి నిర్ణయంగానే భావించవలసి ఉంటుంది.

కన్ను పడితే కొల్లగొట్టడమే? జగన్ పాలనలో ఇదే స్పెషల్.. 

ఖరీదైన భూములు, విలువైన ఆభరణాలు ఉన్నాయని తెలిస్తే..ఆల్సేషియన్ డాగ్స్ లా చుట్టుముట్టేస్తారు. అవి ఏడుకొండలవాడివైనా..సంస్థానాధిపతులవైనా.. వారి ఆస్తులపైనా కన్నేసిన కొందరు దాని కోసం దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటూ.. వారి సొంత స్క్రిప్టును నడిపిస్తున్నారు. విజయనగరం జిల్లాలో ఇది స్పష్టంగా కనపడుతోంది. గజపతిరాజుల సంస్థానంలో వారసుల పేరుతో మొదలైన దోపిడీ ప్రస్థానం.. ఇప్పుడు సుజయ వంశస్తులపైనా కొనసాగే అవకాశం కనపడుతోంది. గతంలోని వారు తప్పులు చేశారా..ఒప్పులు చేశారా అనేది పక్కన పెడితే... వారి నుంచి ఆస్తులను ఏదో ఒక పేరుతో లాక్కుని.. అవి ప్రభుత్వం కోసం కాకుండా.. తమ సొంతానికి ఉపయోగపడేలా ప్లాన్ చేస్తున్నారని వైసీపీ నేతలపై ఆరోపణలు వస్తున్నాయి.  ఇప్పుడు తాజాగా సుజయ రంగారావు వర్సెస్ బొత్స సత్యనారాయణ ఎపిసోడ్ లో అదే కనపడుతుందని అంటున్నారు.వేణుగోపాలస్వామి గుడి ఆస్తులను, ఆభరణాలకు అర్చకులకు ఉన్నపవర్ ను జాయింట్ పవర్ గా మార్చారు మాజీ మంత్రి సుజయ రంగారావు. గతంలో ఆస్థానం పరిధిలో ఉన్నప్పటికీ..ఇప్పుడా గుడి దేవాదాయశాఖ పరిధిలోకి వస్తుంది. దేవాదాయశాఖ పరిధిలో ఉన్నగుడికి చెందిన ఆస్తులు, ఆభరణాలపై ఇంకా పూర్వపు రాజవంశీయుల పెత్తనం ఎలా కొనసాగుతుందని.. ఇప్పుడే ఆ విషయం కొత్తగా తెలిసినట్లుగా మంత్రి బొత్స ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తమదే కాబట్టి.. మంత్రి వెల్లంపల్లి ద్వారా ఒక ప్రత్యేకాధికారితో విచారణకు కూడా ఆదేశించారు. ఇదంతా వేణుగోపాలస్వామి గుడి ఆస్తులను, విలువైన భూములను సుజయ రంగారావు బారి నుంచి కాపాడుతున్నట్లు బిల్డప్ ఇస్తారు. కాని వాస్తవంలో..ఆయన పట్టు నుంచి తప్పించి.. వీరి పట్టులోకి తెప్పించుకోవడమే అసలు లక్ష్యం.  అదే జరుగుతోందని సుజయ రంగారావు అనుచరులు ఆరోపిస్తున్నారు. సంచయిత గజపతిరాజును ఎంట్రీ చేయించి.. గజపతిరాజుల సంస్థానానికి చెందిన భూములపై ఎలా కన్నేశారో.. వాటిని ఎలా కొల్లగొట్టాలని చూస్తున్నారో ఇప్పటికే కనపడుతోంది. సంచయితే వారసురాలంటూ ప్రభుత్వం బుల్ డోజ్ చేసి సింహాచలం దేవస్థానానికి ఛైర్మన్ గా రాత్రికి రాత్రే చేసేశారు. ఆ తర్వాత వారి కింద ఉన్న ఒక స్కూల్ ను కూడా మూయించి.. ఆ భూములను ప్రైవేటువారికి కట్టబెట్టే ప్రాసెస్ మొదలెట్టారు. సింహాచలం పుణ్యక్షేతం క్రింద ఉన్నభూములను కూడా వేలం వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ కూడా లీగల్ కేసులు వేయడం వలనే...కోర్టుల్లో ఉండటం వలనే ఆగాయి. లేదంటే ఈపాటికి క్లీన్ వాష్ చేసేసేవారని.. టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలా విలువైన ఆస్తులు .. అవి భూములైనా..నగలైనా సరే..కొల్లగొట్టడానికి ఎలాంటి వివాదాలు అయినా రేపుతున్నారని వైసీపీపై టీడీపీ మండిపడుతోంది. ఆఖరుకు ఒక టైములో టీటీడీకి చెందిన భూములను కూడా అమ్మాలని ఏకంగా బోర్డులోనే ప్రతిపాదన పెట్టి..విమర్శలు రావడంతో వెనక్కు తగ్గారు.

బెంగాల్ లో ఘర్ వాపసీ.. బీజేపీకి ముకుల్ రాయ్ ఝలక్.. 

అనుకున్నదే జరిగింది. బెంగాల్ రాజకీయాల్లో కీలక నేత, రాష్ట్రంలో తృణమూల్ నుంచి బీజీపీలోకి వలసల వరదకు శ్రీకారం చుట్టిన కంద్ర మాజీ మంత్రి ముకుల రాయ్, సొంతగూటికి చేరుకున్నారు.  ఒక  విధంగా రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు బీజం నాటిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్, శుక్రవారం కుమారుడు సుభ్రన్షుతో కలిసి తృణమూల్ అధినాయకురాలు మమతా బెనర్జీ  సమక్షమలో తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. గతంలో పార్టీలో సీనియర్‌ నేతగాఉంటూ ఎన్నో పదవులు అనుభవించిన ముకుల్‌ రాయ్‌ 2017లో బీజేపీలో చేరారు. ఆయన బీజేపీ  చేరిన తర్వాతనే రాష్ట్రంలో కమల దళానికి ఊపోచ్చింది. అనేక మంది తృణమూల్ నాయకులు ఆయన్ని ఫాలో  అయ్యారు.  ఈ ఊపులోనే బీజేపీ గత లోక్ సభ ఎన్నికల్లో 18 సీట్లు గెలుచుకుంది.  అయితే, ఆసెంబ్లీ ఎన్నికల్లో ఉహించిన ఫలితాలు సాధించలేక చతికిల పడింది. ఇక అప్పటి నుంచి, తృణమూల్ గోడదూకి  బీజేపీలో చేరిన నాయకులు సొంతగూటికి చేరేందుకు తహతహ  లాడు తున్నారు. అయితే మమతా బెనర్జీ వ్యూహాత్మకంగా నిరయాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. చివరకు 2017లో వలసలకు శ్రీకారం చుటిన ముకుల్ రాయ్ తోనే ఘర్ వాపసీకి శ్రీకారం చుట్టారు.  ఇటీవల కాలంలో ఆయన బీజేపీలో ఉక్కపోతకు గురవుతున్నారని, అటు మీడియా వర్గాల్లో,ఇటు పొలిటికల్ సర్కిల్స్’లో చర్చ జరిగింది.  ముదొంచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లుగా, మొన్నటి ఆసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో చేరిన సువేందు అధికారికి బీజేపీ  ఢిల్లీ పెద్దలు పెద్ద పీట వేయడం, ఆయనను, బీజేపీ ఎల్పీ నేతగా,  ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికోవడం ముకుల్ రాయ్’ జీర్ణించుకోలేక పోతున్నారని , అందుకే ఆయన మళ్ళీ మమత వైపు చూస్తున్నారని గత కొంతకాలంగా మీడియా వర్గాల్లో వినవస్తోంది. ఆ విధంగా ఇద్దరి ఉమ్మడి శత్రువు సువేందు ఆ ఇద్దరినీ కలిపారు.  ఇటీవల  ముకుల్ రాయ్’ సతీమణి అనారోగ్యంతో కోల్’కతాలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, పార్టీ నూతన ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఆసుపత్రికి వెళ్లి ముకుల్ రాయ్ సతీమణిని పరామర్శించడంతో పాటుగా, ఆయనతో ఏకాంతంగా చర్చలు జరిపినట్లు వార్తలొచ్చాయి. నిజంగా ఆ ఇద్దరు ఏమి మాట్లాడుకున్నారో ఏమో కానీ, ఆ మర్నాడు ఉదయమే  ప్రధాని నరేంద్ర మోడీ ముకుల్ రాయ్’కి ఫోన్ చేసి, అయన భార్య ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఇలా, అభిషేక్ బెనర్జీ, ముకుల్ రాయ్’ని కలవడం ఆ వెంటనే ప్రధాని ఫోన్ చేయడంతో  అప్పుడే ఉహాగానాలు మొదలయ్యాయి. ఇప్పడు ఆ ఊహగానలేనాలే నిజమయ్యాయి.   నిజానికి అసెంబ్లీ ఎన్నికలలో మమతా బెనర్జీ, ఘన విజయం సాధించి మూడవసారి అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే సోనాలి గుహ, దిపేందు బిస్వాస్, సరళ మురు, అమల్ ఆచార్య సహా మరికొందరు సొంతగూటికి చేరేందుకు ఎదురుచూస్తున్నారు, ఇక ఇప్పుడు వారికి కూడా లైన్ క్లియర్ అయినట్లేనా  అనేది చూడవలసి ఉంది, అలాగే, బీజేపీ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యేలు కూడా త్వరలో క్యూ కడతారని అంటున్నారు. ముఖ్యంగా కొత్తగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన మమతా బెనర్జీ మేనల్లుడు, అభిషేక్ బెనర్జీ ఘర్ వాపసీ మీద దృష్టి కేంద్రీక రించారని, కొద్ది రోజుల్లోనే బీజేపీ ఖాళీ అవుతుందని పార్టీ వర్గాల్లో వినవస్తోంది.

ఆమె అతను సహజీవనం చేశారు.. చివరికి ఆమెకు నిప్పు అంటించాడు..  

ఒకప్పుడు మరి గురించి ఎదుటి వాళ్ళు తెలుసుకోవాలంటే.. మన అమ్మానాన్నలను అడిగి తెలుసుకునే వాళ్ళు.. లేదంటే మన స్నేహితులను అడిగి తెలుసుకునే వాళ్ళు . అదికూడా కాదంటే నేరుగా మనల్ని అడిగి తెలుసుకునే వాళ్ళు.. సోషల్ మీడియా ఎప్పుడైతే వచ్చిందో మన గురించి మన అలవాట్ల గురించి ఎవరైనా , ఎక్కడ ఉంది అయినా నేరుగా తెలుసుకుంటున్నారు.. ఒకరకంగా చెప్పాలంటే  సోషల్ మీడియా మన జీవితానికి తెరిచినా పుస్తకం అని చెప్పాలి. ఇంట్లో, బయట ఏ చిన్న విషయం జరిగిన అందరికి తెలిసేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కొందరికి అలవాటు.. తాజాగా అలాంటి అలవాటే ఒక అమ్మాయి ప్రాణాలు తీసింది.. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే పూర్తి వార్తను చదవండి  మీకే తెలుస్తుంది..  వాళ్ళ ఇద్దరి పేర్లు అథిర , షాన్వాజ్. ఒకరి వయసు 28 , మరొకరి వయసు 30 సంవత్సరాలు. వాళ్ళు ఇద్దరు కొన్నాళ్లుగా సహజీవనం చేశారు.. తనతో సహజీవనం చేస్తున్న అమ్మాయి సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన యువకుడు చివరికి ఆమెకు తనువును నిప్పంటించాడు. ఆ సోషల్ మీడియా పోస్ట్ విషయమై ఇద్దరి మధ్య జరిగిన గొడవ.. చినికి చినికి గాలివానలా మారినట్టు చివరికి ఆమె ప్రాణాలు తీసేదాకా వచ్చింది. చివరికి ప్రాణాలు మంటతో మొదలై గాలిలోకలిసిపోయాయి.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  కొల్లమ్‌లోని అంచల్‌కు చెందిన బాధితురాలు అథిర, షాన్‌వాజ్ లు కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. వీరికి మూడు నెలల చిన్నారి కూడా ఉంది. అథిర సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోపై షాన్‌వాజ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. కోపంతో ఊగిపోయిన షాన్‌వాజ్.. ఇంటిలో ఉన్న కిరోసిన్‌ను అథిర ఒంటిపై పోసి నిప్పంటించాడు. ఒంటికి నిప్పంటించిన తర్వాత అథిర పెద్దగా కేకలు వేయడంతో ఇరుగు పొరుగువారు చేరుకుని మంటలు ఆర్పారు. అనంతరం ఇద్దర్నీ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. మంగళవారం రాత్రి తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో తీవ్రంగా గాయపడిన అథిర తిరువనంతపురంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. ఈ ఘటనలో అథిర కాలిపోవడమే కాదు  షాన్‌వాజ్‌కు కూడా గాయాలు అయ్యాయి. చివరికి అతను కూడా ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ‘ఈ విషయం మీద బాధితురాలి తల్లి స్పందిస్తూ..  అథిర సోషల్ మీడియాలో పెట్టిన ఓ వీడియో గురించి షాన్‌వాజ్ వాగ్వాదానికి దిగాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది..ఈ ఘటనపై కేసు నమోదుచేసిన అంచల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేరళ రాష్ట్రంలో వెలుగు చూసింది..  

ఈటలకు బిగ్ షాక్.. గులాబీ గూటికి కౌశిక్ రెడ్డి?

తెలంగాణ రాజకీయాలన్ని మాజీ మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గం హుజూరాబాద్ కేంద్రంగానే సాగుతున్నాయి. సోమవారం బీజేపీలో చేరనున్న ఈటల రాజేందర్.. శనివారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. ఈటల రాజీనామాతో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగనుండటంతో.. నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. ఈటలను ఓడిచేందుకు వ్యూహాలు రచిస్తున్న టీఆర్ఎస్ పార్టీ.. అందివచ్చే అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని చూస్తోంది . అందులో భాగంగానే కీలక నేత కారెక్కేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.  హుజూరాబాద్ కు సంబంధించి ఓ కీలక భేటీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  మంత్రి కేటీఆర్ తో, కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి భేటీ అయ్యారు. కేటీఆర్, కౌశిక్ ఓ ప్రైవేటు ఫంక్షన్ లో కలుసుకున్నారు. ఇద్దరూ డైనింగ్ టేబుల్ పై చాలా సేపు మాట్లాడుకున్నారు.  ఆ తర్వాత కొద్ది సేపు ప్రైవేటుగా మాట్లాడుకున్నారు. చివరగా కేటీఆర్ ను కారు ఎక్కిస్తూ డోర్ దగ్గర నిలబడి కొద్ది సేపు ఇద్దరూ గుసగుసలాడుకున్నారు. .కౌశిక్ రెడ్డి.. కేటీఆర్ ను కలవడంతో  త్వరలోనే ఆయన టీఆర్ఎస్ లో చేరుతారని సమాచారం. గత ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు కౌశిక్ రెడ్డి. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్వయానా కజిన్ బ్రదర్. హుజూరాబాద్ నియోజకవర్గంలో కౌశిక్ రెడ్డికి గట్టి పట్టుంది. అన్ని గ్రామాల్లోనూ ఆయనకు అనుచరులు ఉన్నారు. హుజూరాబాద్ బై ఎలక్షన్స్ లో ఈటెలకు పోటీగా టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు అన్న చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో కౌశిక్ పేరు కూడా వినిపిస్తోంది.దీంతో కౌశిక్ రెడ్డి కారెక్కితే హుజూరాబాద్ ఉప ఎన్నిక మరింత రంజుగా మారనుంది. మరోవైపు పీసీసీ చీఫ్ఉ త్తమ్ కు చెప్పకుండా కౌశిక్ ఏమీ చేయరన్న అభిప్రాయం కూడా ఉంది. కేటీఆర్ తో భేటీ వ్యవహారం ఉత్తమ్ కు తెలియకుండానే జరిగిందా… లేక ఆయనకు ముందస్తు సమాచారం ఉందా అన్న ప్రశ్న కూడా ఇప్పుడు గాంధీ భవన్లో వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

జ‌గ‌న్‌రెడ్డికి పార్ల‌మెంట్ టెన్ష‌న్‌.. ర‌ఘురామపై వేటుకు స్కెచ్‌..

జూలైలో పార్ల‌మెంట్ స‌మావేశాలు. జ‌గ‌న్‌రెడ్డికి ఈ వార్త కంటిమీద కున‌కు లేకుండా చేస్తోందని అంటున్నారు. లోక్‌స‌భలో బెల్ మోగ‌గానే.. మొద‌ట త‌న పేరే వినిపిస్తుందేమోన‌నే ఆందోళ‌న‌. త‌మ పార్టీ ఎంపీ ర‌ఘురామ‌.. త‌న‌ను పార్ల‌మెంట్ బోనులో దోషిగా నిల‌బెడ‌తాడ‌నే టెన్ష‌న్‌. గోటితో పోతుంద‌ని అనుకొని.. ర‌ఘురామ‌ను అరెస్ట్ చేయిస్తే.. అది గొడ్డ‌లి వేటుగా త‌న‌కే రివ‌ర్స్ అవుతుంద‌ని అస్స‌లు ఊహించ‌లేక‌పోయార‌ని అంటున్నారు. చేసిన త‌ప్పుకు ఫ‌లితం అనుభ‌వించ‌క త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితులు రాబోతున్నాయ‌ని తెగ హైరానా ప‌డుతున్నార‌ట‌.  పార్ల‌మెంట్ సాక్షిగా జ‌గ‌న్‌ను శిక్షించాల‌ని ర‌ఘురామ ఢిల్లీలో కాచుకు కూర్చున్నారు. కేంద్ర పెద్ద‌లు, లోక్‌స‌భ స్పీక‌ర్‌తో పాటు దేశంలోని యావ‌త్ పార్ల‌మెంట్ స‌భ్యుల‌కు ఇప్ప‌టికే లేఖ‌లు రాశారు. త‌న కాలి గాయాల ఫోటోలను పంపి.. త‌న‌పై జ‌రిగిన దాడిని పార్ల‌మెంట్ మీద జ‌రిగిన దాడిలా చూడాల‌ని కోరారు. ప‌లు రాష్ట్రాలు, ప‌లు పార్టీలకు చెందిన ప‌లువురు ఎంపీలు ఇప్ప‌టికే ర‌ఘురామ‌కు బ‌హిరంగ మ‌ద్ద‌తు ప‌లికారు. ఇలా పావుల‌న్నీ జ‌గ‌న్‌రెడ్డికి వ్య‌తిరేకంగా క‌దులుతుండ‌టంతో.. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోవు పార్ల‌మెంట్ స‌మావేశాల్లో త‌న ప‌రువు పోవ‌డం ఖాయ‌మ‌నుకున్నారో ఏమో.. అందుకే జ‌గ‌న్‌రెడ్డి ముంద‌స్తుగా ర‌ఘురామ‌పై కౌంట‌ర్ అటాక్ మొద‌లుపెట్టారని అంటున్నారు.  తాజాగా.. ఎంపీ ర‌ఘురామ‌పై వేటు వేయాలంటూ లోక్‌స‌భ స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేసింది వైసీపీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద నర్సాపురం నుంచి ఎంపీగా ఎన్నికై, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కె. రఘురామకృష్ణరాజు పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ ఫిర్యాదు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.  రఘురామకృష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ చేసిన వ్యాఖ్యలపై గతంలోనే తాము ఆధారాలను లోక్ సభ స్పీకర్‌కు సమర్పించామని భరత్‌ రామ్‌ తెలిపారు. అనేక పర్యాయాలు రఘురామ డిస్ క్వాలిఫికేషన్‌కు సంబంధించి స్పీకర్‌ను కలిసి విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణరాజు పార్ల‌మెంట్ స‌భ్య‌త్వాన్ని వెంటనే ర‌ద్దు చేయాల‌ని మరోసారి స్పీకర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు లోక్‌స‌భ‌లో వైసీపీ చీఫ్ విప్‌ ఎంపీ భ‌ర‌త్‌.  వైసీపీ ఎంపీలంతా క‌లిసిక‌ట్టుగా వెళ్లి ఫిర్యాదు చేస్తే.. ర‌ఘురామ విష‌యంలో తాము భ‌య‌ప‌డుతున్నామ‌నే మెసేజ్ వ‌స్తుంద‌నుకున్నారో ఏమో.. ఎంపీ భ‌ర‌త్ ఒక్క‌రే సింగిల్‌గా వెళ్లి స్పీక‌ర్‌కు కంప్లైంట్ ఇచ్చారు. సీఎం జ‌గ‌న్ ఢిల్లీలో ఉన్న రోజే స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేయ‌డాన్ని బ‌ట్టి ఆయ‌న ర‌ఘురామ విష‌యంలో ఎంత ఆందోళ‌న‌తో ఉన్నారో అర్థం అవుతోంద‌ని అంటున్నారు. అస‌లు, జ‌గ‌న్ ఢిల్లీ వ‌చ్చి కేంద్ర పెద్ద‌ల‌ను క‌లిసిందే.. ఎంపీ ర‌ఘురామ విష‌యంలో వివ‌ర‌ణ ఇచ్చుకోడానికే అనే ప్ర‌చార‌మూ జ‌రుగుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను క‌లిసి ర‌ఘురామ ఎపిసోడ్‌లో త‌మ త‌ప్పేమీ లేద‌ని చెప్పుకొచ్చే ప్ర‌య‌త్నం చేశార‌ని తెలుస్తోంది. అటు, ర‌ఘురామ సీబీఐ కోర్టులో దాఖ‌లు చేసిన‌ జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు పిటిష‌న్‌పైనా అమిత్‌షాను జ‌గ‌న్ ప్రాధేయ‌ప‌డిన‌ట్టు స‌మాచారం. అయితే, అమిత్‌షా నుంచి ఎలాంటి హామీ ల‌భించ‌లేద‌ని అంటున్నారు. అందుకే, ర‌ఘురామ వ్య‌వ‌హారం పార్ల‌మెంట్ ముందుకు వ‌స్తే మ‌రింత ప్ర‌మాద‌మ‌ని భ‌య‌ప‌డుతున్నారట‌ జ‌గ‌న్‌రెడ్డి. ప‌క్కా ఆధారాలు, గాయాలు ఉండ‌టంతో త‌నకు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని భావించే.. లోక్‌స‌భ‌లో అడుగుపెట్ట‌కుండా ర‌ఘురామ‌ను అడ్డుకునేందుకే స్పీక‌ర్‌ను క‌లిసి అన‌ర్హ‌త వేటు వేయాల‌ని ఫిర్యాదు చేశార‌ని చెబుతున్నారు. ఇది వృధా ప్ర‌య‌త్న‌మ‌ని తెలిసినా.. పార్ల‌మెంట్ సెష‌న్ స్టార్ట్ అయితే.. ఇక ఢిల్లీ కేంద్రంగా దేశం ముందు తాను దోషిగా నిల‌బ‌డాల్సి వ‌స్తుంద‌నే భ‌యంతోనే జ‌గ‌న్‌రెడ్డి.. ర‌ఘురామ‌పై కౌంట‌ర్ అటాక్‌కి ట్రై చేస్తున్నార‌నేది విశ్లేష‌కుల మాట‌.

సరికొత్త మద్యపాన నిషేధం.. ఏపీలో కనీవినీ ఎరుగని పాలసీ

దూబగుంట రోశమ్మ బతికి ఉంటే నేడు ఏపీలోని మద్యపాన నిషేధం తొలి అడుగులు చూసి మూర్ఛపోయేవారేమో. ఎన్టీఆర్ అయితే షాక్ తినేవారు. చంద్రబాబునాయుడు అయితే అరే ఈ టెక్నిక్ తెలియక మద్యపాన నిషేధాన్ని ఎత్తేశానని బాధపడుతున్నారేమో. మద్యపానంతో ముంచెత్తుతూ మద్యపాన నిషేధం హామీని నెరవేరుస్తున్న జగన్మోహన్ రెడ్డి తెలివికి జై కొట్టాల్సిందే. అసలు మాట తప్పను..మడమ తిప్పను అనేదాన్ని ఇలా కూడా నిరూపించుకోవచ్చని చేసి మరీ చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి.. ఇవన్నీఆయన ప్రత్యర్ధుల కామెంట్లు. కాని రోజురోజుకు కొత్త విషయాలతో కొత్త పుంతలు తొక్కుతుందీ మద్యపాన నిషేధం. మద్యపాన నిషేధం అమలు చేస్తానని..ప్రతిపక్షంలో ఉండగా ప్రకటించారు జగన్. అప్పట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఇప్పుడు వైసీపీయేలెండి.. ఆయన షాపులో కల్తీ మద్యం తాగి జనం చచ్చిపోయిన సందర్భంలోనే ఈ చర్చ వచ్చింది. అప్పుడే హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి.. కాని ఆయన దానిని నిలబెట్టుకుంటారని.. అది కూడా ఇలా నిలబెట్టుకుంటారని ఎవరూ ఊహించలేకపోయారు. ముందు మద్యం షాపులన్నీ ప్రభుత్వం చేతికి తెచ్చేశారు. స్టాఫ్ కూడా వీళ్లే పెట్టారు. అలా మద్యం వ్యాపారమంతా ప్రభుత్వం చేతికి.. అదే వైసీపీ నేతల చేతికి చిక్కింది. ఆ తర్వాత మరో వ్యాపారం మొదలైంది. కొత్త కొత్త బ్రాండ్లు తయారు చేశారు. వైసీపీ నేతలే బేవరేజెస్ కంపెనీలు తెరిచారు. ఫ్యాక్టరీలతో పొత్తు పెట్టుకుని బ్రాండ్లను ఉత్పత్తి చేశారు. ఆ తర్వాత అవే బ్రాండ్లు అమ్మాలని..అవే తాగాలని కండిషన్ పెట్టేశారు. నేషనల్,ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అమ్మటం మానేశారు. ఆ తర్వాత లోకల్ బ్రాండ్స్ తప్ప..ఏవీ రాష్ట్రానికి రానివ్వకుండా సరిహద్దుల్లో కాపలా పెట్టారు. అలా నిర్బంధంగా వీరి బ్రాండ్లు తాగిపిస్తూ.. ప్రభుత్వానికి, వారికీ ఇద్దరికీ ఆదాయం తెచ్చుకుంటున్నారు. ఇదే సరికొత్త మద్యపాన నిషేధం.  అదేమంటే ఐదేళ్లలోపు చేస్తానన్నాను.. 2023 ఎన్నికల ముందు మద్యం షాపులు మూసేసి.. అదిగో నిషేధం అంటారు..ఎన్నికలైపోయి అదికారంలోకి వచ్చాక ఆదాయం సరిపోవడం లేదని మళ్లీ తెరుస్తారు. అదే జరగబోయే కథ. ఇప్పుడు కొత్తగా ఈ షాపుల్లో స్కాములు జరుగుతున్నట్లు బయటపడింది. ఇప్పటికే స్టాక్ ను బయటకు తెచ్చి అక్రమంగా అమ్ముకోవటానికి వైసీపీ నేతలు లోకల్ గా షాపుల్లో స్టాఫ్ తో కుమ్మక్కయ్యారు. అది మరో అడుగు ముందుకేసి...అమ్మకాలతో వచ్చిన డబ్బును ప్రభుత్వానికి కట్టకుండా పక్కదారి పట్టే పరిస్ధితి వచ్చింది. విశాఖ, నెల్లూరు జిల్లాల్లో ఈ స్కాములు బయటపడ్డాయి.. కాని అన్ని జిల్లాల్లోనూ ఇది జరుగుతుందనేది సమాచారం.  అలా మద్యపాన నిషేధం పేరుతో వ్యాపారాలను స్వాధీనం చేసుకుని..సొంత వ్యాపారాలను డెవలప్ చేసుకుని..ఆఖరికి ప్రభుత్వానికి రావాల్సిన సొమ్మును కూడా కాజేసే రేంజ్ కి ఎదిగిపోయిందీ మద్యపాన నిషేధం. బెల్టు షాపులు అని గతంలో ఆందోళన చెందేవారు.. ఇప్పుడు బెల్టు షాపులు పోయి..బైకు షాపులు వచ్చేశాయి.  లోకల్ వైసీపీ నేతలు కొందరు రింగ్ అయి.. షాపు నుంచి సరుకు తెప్పించి డెలివరీ చేసేలా ఏర్పాటు చేశారు.. కాకపోతే.. దాని రేటు వేరేగా ఉంటుంది.  అలా మద్యపానం తగ్గింది లేదు..మద్యం తాగడం ఎవరూ మానింది లేదు.. రెండేళ్లు దాటిపోయింది... మద్యపాన నిషేధం మాత్రం అమలుకు అడుగులు వేస్తూనే ఉంది.

బెంగాల్ కాంగ్రెస్ కథ సమాప్తం.. 

ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ  ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం ఖాతా అయినా తెరవలేక పోయింది. సీపీఎంతో జట్టు కట్టి, పొత్తులో భాగంగా 90 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన హస్తం పార్టీ, ఒక్క సీటు గెలుచుకోలేక పోయింది. జోగీ జోగీ రాసుకుంటే బూడిత రాలింది, అన్నట్లుగా  సీపీఎం పార్టీ కూడా సున్నాకే పరిమితం అయింది.  మూడు దశాబ్దాలకు పైగా రాష్టాన్ని పాలించిన వామపక్ష కూటమికి ఒక్క స్థానం కూడా దక్కలేదు. మొత్తం 294 స్థానాలకు గాను, 292 స్థానాలకు ఎన్నికలు జరిగితే, తృణమూల్ కాంగ్రెస్ 213 సీట్లతో బ్రహ్మాండ విజయాన్ని సొంతం చేసుకుంది. అధికారానికి అర్రులు చాచిన బీజేపీ, మూడు  అంకెల సఖ్యను కూడా చేరుకోలేక పోయింది. కేంద్ర హోమ్ మంత్రి ఆశించిన 200 ప్లస్ ప్రభంజనం 77 దగ్గరే చతికిల పడింది.  బీజేపీ వంద మార్కు దాటదన్న ఎన్నికల  వ్యూహకర్త ప్రశాంత్’ కిషోర్, మాటా నిజమైంది.  తృణమూల్ అంత ఘన విజయం సాధించినా, ముఖ్యమంత్రి, పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీ, నందిగ్రామ్’లో ఓడి పోయారు. సొంత నియోజక వర్గం భవానీపూర్ నుంచి కాకుండా, మాజీ సహచరుడు, బీజేపీ అభ్యర్ధి సువేందు అధికారిని ఓడిచడమే లక్ష్యంగా, నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన దీదీ అదే సువేందు చేతిలో ఓడిపోయారు. అయినా, రాజ్యాంగం కల్పించిన వెసులుబాటును ఉపయోగించుకుని ఆమె మూడవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, రాజ్యాంగంలోలోని 164(4)అధికరణం ప్రకారం  ఎమ్మెల్యే  కాకుండా,ముఖ్యమంత్రి  పదవిని చేపట్టిన ఆమె ఆరు నెలలోగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావలసి ఉంటుంది. అమెకు అదేమీ కష్టం కాదు. ఏ నియోజక వర్గం నుంచి అయినా ఆమె  నామినేషన్ వేస్తే చాలు, ఆమె గెలిచి పోతారు. అందులో సందేహం లేదు.  అందునా ఆమె ఈసారి ఆమె సొంత నియోజక వర్గం, భవానీపూర్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.ఆమె కోసం మొన్నటి ఎన్నికల్లో భవానీపూర్ నుంచి గెలిచిన తృణమూల్ ఎమ్మెల్యే సోమన్ దేవ్ రాజీనామ చేశారు. దీంతో భవానీపూర్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే,ఈ ఉప ఎన్నికల్లో తప్పక గెలవవలసి ఉంటుంది. నిజానికి, ఇంతకూ ముందే అనుకున్నట్లుగా ఉపఎన్నికలలో దీదీ గెలుపు గురించి ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఈ నియోజక వర్గంలో మాములుగానే ఆమె గెలుపు నల్లేరు మీద నడక,అలాంటిది ప్రత్యేక పరిస్థితిలో ఆమె గెలుపు గురించి ఎవరికీ ఎలాంటి సందేహం లేదు.  మమతకు విజయం చేకూర్చడం కోసం, భవానీపూర్  ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయక పోవడం మంచిదని, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్ రంజన్  చౌదరి భావిస్తున్నారు. అంతే కాదు, ఆయన తమ అభిప్రాయాన్ని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేఖ  ద్వారా తెలియచేశారు. అదే ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉప ఎన్నికల్లో పోటీ చేయరాదన్న అధీర్ ఆలోచను కాంగ్రెస్ నాయకులే తప్పు పడుతునారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అలాంటి నిర్ణయం తీసుకుంటే అది ఆత్మహత్యా సాదృశ్యం అవుతుందని ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ నాయకు రాలు, ఎమ్మెల్యే అతిధి అన్నారు. బెంగాల్లోనే కాకుండా దేశం అంతటా ఆ ప్రభావం ఉంటుందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఆమె  బెంగాల్’ లో బీజేపీ అధికారంలోకి రానందుకు, రాహుల్ గాంధీ సంతోషం వ్యక్తం చేయడాన్ని కూడా తప్పు పట్టారు. మోడీ ఓటమిని చూసి ఆనందించే దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ నాయకత్వం ఉండడం, పార్టీ నాయకత్వం భావ దరిద్ర్యానికి అద్దం పడుతోందని, అలాగే ఉప ఎన్నికల్లో పోటీనే చేయరాదనే నిర్ణయమే తీసుకుంటే, బెంగాల్ కాంగ్రెస్ కథ ముగిసినట్లే భావించవలసి ఉంటుందని పార్టీ నాయకులు అంటున్నారు.

నామాతో టీజ‌ర్‌.. కేసీఆర్‌తో క్లైమాక్స్‌!.. ఈట‌ల క‌ళ్ల‌ల్లో ఆనందం కోస‌మేనా?

టీఆర్ఎస్ కీల‌క నేత‌, ఎంపీ నామా నాగేశ్వ‌ర్‌రావు ఇళ్లు, ఆఫీసుల‌పై ఈడీ దాడులు. రుణాల పేరుతో బ్యాంకుల‌ను మోసం చేసిన‌ట్టు ఆరోప‌ణ‌లు. బ్రేకింగ్ న్యూస్ ఇది. స‌డెన్‌గా ఈడీకి నామా ఎందుకు గుర్తొచ్చార‌నేది ఇంట్రెస్టింగ్ పాయింట్‌. ఏకంగా టీఆర్ఎస్ లోక్‌స‌భ‌ ఫ్లోర్‌లీడ‌ర్‌పై కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు ఎందుకు దాడులు చేశాయ‌నే దానిపై పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జరుగుతోంది. స‌మ‌యం, సంద‌ర్భాన్ని బ‌ట్టి.. టీఆర్ఎస్‌కు వ్య‌తిరేకంగా కేంద్రంలో ఏదో జ‌రుగుతోంద‌నే అనుమానం మ‌రింత బ‌ల‌ప‌డుతోంది.  ఇటీవ‌ల ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీ పెద్ద‌ల‌ను క‌ల‌వ‌డం.. కేసీఆర్ అక్ర‌మాల‌పై విచార‌ణ జ‌రిపించాల‌ని కోర‌డం.. స‌రైన స‌మ‌యం కోసం చూస్తున్నామ‌ని బీజేపీ జాతీయ అధ్య‌క్షులు జేపీ న‌డ్డా చెప్ప‌డం.. నెల రోజులుగా కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా సాక్షాలు సేకరిస్తున్నామ‌ని, త్వ‌ర‌లోనే సీఎం కేసీఆర్ జైలుకు వెళ్ల‌డం ఖాయ‌మంటూ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు బండి సంజ‌య్ ప్ర‌క‌టించడం.. ఇలా వ‌రుస ప‌రిణామాల త‌ర్వాత‌.. తాజాగా టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు ఆస్తుల‌పై ఈడీ అటాక్స్ జ‌ర‌గ‌డం కాక‌తాళీయం కాక‌పోవ‌చ్చు అంటున్నారు. భ‌విష్య‌త్‌లో కేసీఆర్ టార్గెట్‌గా జ‌రిగే చ‌ర్య‌ల‌కు.. ఇప్పుడు నామా ఎపిసోడ్ జ‌స్ట్ టీజ‌ర్ మాత్ర‌మేన‌ని.. పిక్చ‌ర్ అబీ బాకీహై.. అంటూ వార్నింగ్ ఇస్తున్నారు క‌మ‌ల‌నాథులు. కాషాయ కండువా క‌ప్పుకునేందుకు ఈట‌ల బీజేపీ ముందు పెట్టిన ఒకే ఒక్క డిమాండ్‌.. కేసీఆర్ అక్ర‌మాస్తుల భ‌ర‌తం ప‌ట్ట‌డం. ఆ ఒక్క డిమాండ్‌పై ప‌క్కా హామీ ఇస్తే చాలు.. తాను బీజేపీలో చేరుతానంటూ ఈట‌ల ఢిల్లీతో క‌మిట్ అయ్యార‌ట‌. ఆ మేర‌కు కాషాయం పెద్ద‌ల నుంచీ ఆయ‌న‌కు ప్రామిస్ ల‌భించింద‌ని చెబుతున్నారు. అయినా.. ఈట‌ల‌లో ఏదో అనుమానం. బీజేపీని న‌మ్మొచ్చా?  జిత్తుల‌మారి కేసీఆర్ మోదీతో మిలాఖ‌త్ అయితే? భ‌విష్య‌త్‌లో ఆ రెండు పార్టీలు క‌లిస్తే త‌న ప‌రిస్థితేంటి? ఇలా అనేక డౌట్స్ రాజేంద‌ర్‌ను వెంటాడాయి. అందుకే ఆ పార్టీలో చేర‌డం కాస్త ఆల‌స్య‌మైంది. ఈట‌ల‌కు డౌటే అవ‌స‌రం లేదు.. కేసీఆర్ సంగ‌తి త్వ‌ర‌లోనే తేలుస్తామ‌ని అధిష్టానం అభ‌యం ఇచ్చింది. అయినా, ఈట‌ల‌లో సందేహం వీడ‌క‌పోవ‌డంతో.. ఆయ‌న అనుమానం నివృత్తి చేయ‌డానికే.. టీజ‌ర్‌గా నామాపై ఈడీ దాడులు జ‌రిగాయంటూ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. నామా ఎపిసోడ్‌తో ఇటు ఈట‌ల‌కు భ‌రోసా ఇవ్వ‌డంతో పాటు.. అటు కేసీఆర్‌కూ ఝ‌ల‌క్ ఇచ్చిన‌ట్టు అవుతుంద‌ని.. అందుకే రాబోవు కాలంలో.. కాబోవు ప‌రిణామాల‌కు నామా ఉదంతంతో శ్రీకారం చుట్టార‌ని విశ్లేష‌కులు చెబుతున్న మాట‌. నిప్పు లేనిదే పొగ రాదు అన్న‌ట్టు.. సీఎం కేసీఆర్ జైలు వెళ్ల‌డం ఖాయ‌మంటూ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు బండి సంజ‌య్ ప‌దే ప‌దే ఊద‌ర‌గొడుతున్నారు. నెల రోజులుగా ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా సాక్షాలు సేక‌రించే ప‌నిలో ఉన్నామంటూ ఇటీవ‌ల సంచ‌ల‌న స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు. తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని.. కేసీఆర్‌ను కాస్త సైడ్ చేసే.. ఇక తెలంగాణ‌ను దున్నేయ‌వ‌చ్చనేది క‌మ‌ల‌నాథుల లెక్క‌. ఆ లెక్క‌న‌.. గులాబీ బాస్ అక్ర‌మాలు, అవినీతిపై ర‌హ‌స్యంగా చిట్టా సేక‌రిస్తున్నారట‌. కాషాయ భావ‌జాల‌మున్న ఓ టీవీ ఛానెల్‌లో కేసీఆర్, ఆయ‌న సంబంధీకుల‌ అవినీతిపై నిత్యం వార్త‌లు రావ‌డం అందులో భాగ‌మేనంటున్నారు. డైరెక్ట్‌గా ముఖ్య‌మంత్రిపైనే మొద‌ట‌గా అటాక్ చేయ‌కుండా.. నామా లాంటి వారితో మొద‌లుపెట్టి.. టీఆర్ఎస్‌లో భ‌యం పుట్టించి.. చివ‌రాఖ‌రికి అవినీతి తిమింగ‌లాన్ని వ‌ల‌లో బంధించాల‌నేది ఎత్తుగ‌డ‌లా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.  త‌మ పార్టీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్న ఈట‌ల క‌ళ్ల‌ల్లో ఆనందం నింపేందుకు.. కేసీఆర్ అండ్ కోపై తాము సీరియ‌స్‌గానే ఫోక‌స్ పెట్టామ‌నే స్ట్రాంగ్ మెసేజ్ పంపేందుకు.. నామాపై ఈడీ దాడులతో ముంద‌స్తు టీజ‌ర్‌ రిలీజ్ చేశార‌ని అంటున్నారు. ఇక కేసీఆర్‌తోనే క్లైమాక్స్ అని అనుమానిస్తున్నారు. ఈ మ‌ధ్య‌లో ముందుముందు మ‌స్తు డ్రామా న‌డ‌వ‌బోతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

శూద్రపూజలంటూ.. యువతిని నగ్నంగా చేసి.. 

శాస్రం, సైన్స్ ఎప్పుడు పోటీ పడుతుంటాయి. మన దేశంలో సైన్సు కంటే శాస్త్రాన్ని నమ్మేవాళ్లు ఎక్కువ బహుశా అందుకే మన దేశం ఇంకా ఇంత వెనకపడడానికి కారణం కావచ్చు. మన దేశంలో ఎదుటి వాడి బలహీనతే మరొకడి బలం.. కొంత మంది ప్రజల నమ్మకమే ఇంకొంత మంది పెట్టుబడి. ఇంకో మాటలో చెప్పాలంటే మూఢనమ్మకాలను, శూద్రపూజలు మన దేశంలో పెట్టునది లేని వ్యాపారం.. ఎందరో ప్రజల మూఢనమ్మకాలను  కొంతమంది కేటుగాళ్లు సొమ్ము  చేసుకొంటున్నారు.  క్షుద్ర పూజల పేరిట ప్రజలను నమ్మించి, యేమరిచి  నిలువునా దోచేస్తున్నారు. అదే శునకానందమో అర్థం కాదుగానీ.. శూద్ర పూజలు అనగానే బ్లు ఫిలిమ్స్ ని తలపిస్తాయి చాలా చోట్ల. ఈ మధ్య కాలంలో ఈ వార్తలు చాలా విన్నాం.. చూస్తున్నాం.. తాజాగా క్షుద్ర పూజల పేరిట ఓ యువతిని అర్ధనగ్నంగా కూర్చోబెట్టి పూజలు చేస్తూ వీడియోలు తీసి, ఆమెను బెదిరించి డబ్బు గుంజుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లాలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.  అది గుంటూరు నగరం. శారదానగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు దంపతులు. వారి పేర్లు వినుకొండ సుబ్బారావు, వినుకొండ శివపార్వతిలు వాళ్ళు తరుచుగా క్షుద్ర పూజలు నిర్వహిస్తుంటారు. తాంత్రిక శక్తులను పోగొడతామని, చేతబడులు పోగొడుతామని, ప్రజలను నమ్మించడం.. ఏదో ఒకటి చెయ్యడం.. ఒక రకంగా మసిపూసి మారేడు కాయను చేయడం లాంటివి చేసి ప్రజల నుంచి డబ్బు దండుకోవడం వల్ల పని. ఈ నేపథ్యంలోనే గూడూరు మండలానికి చెందిన ఓ యువతికి ఎవరో తాంత్రిక పూజలు జరిపారని ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో.. దానికి  పూజలు చేసి నయం చేస్తామని నమ్మించారు. ఇక ఇదంతా నిజమేంనని నమ్మిన తల్లిదండ్రులు కూతుర్ని వారి వద్దకు పంపారు. ఇక అంటే వాళ్ళు రంగ ప్రవేశం కాదు ఏకంగా పరకాయ ప్రవేశం చేశారు.. అనంతరం  యువతిని అర్ధనగ్నంగా కూర్చోబెట్టి పూజలు చేస్తూ వీడియోలు చిత్రీకరించారు. తర్వాత ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని యువతి తల్లిదండ్రులను బెదిరించడం ప్రారంభించారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితులను నిఘా వేసి పట్టుకున్నారు. మాయలు మంత్రాలూ తెలుసని, మంత్రాలతో రోగాలు నయం చేస్తామని ఎవరైనా మాయమాటలు చెప్తే నమ్మవద్దని ప్రజలకు, పోలీసులు సూచించారు.

కాంగ్రెస్ కు షాక్.. ఈటల వెంట బీజేపీలోకి కీలక నేతలు 

తెలంగాణ రాజకీయాల్లో సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా మారిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవి రాజీనామాకు ముహూర్తం ఖరారైంది. శనివారం ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయనున్నారు. గులాబీ పార్టీకి వారం రోజుల క్రితం రాజీనామా చేసిన ఈటల.. కారు పార్టీ సింబల్ తో గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. కాని వారం రోజులు ముగిసినా రాజీనామా సమర్పించకపోవడంతో పలు అనుమానాలు తలెత్తాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా విషయంలో రాజేందర్ పునరాలోచన చేస్తున్నారనే చర్చ జరిగింది. ఉప ఎన్నికలో కేసీఆర్ కు ఎదుర్కోవడం కష్టమని ఈటల భయపడుతున్నారనే వాదన కూడా వినిపించింది. తాజాగా వాటన్నింటికి పుల్ స్టాప్ పెడుతూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారు ఈటల. ఈ నెల 14న ఈటల రాజేందర్ బీజేపీలో చేరతారని తెలుస్తోంది. సోమవారం సాయంత్రం జేపీ నడ్డా సమక్షంలో చేరికలు ఉంటాయని అంటున్నారు. ఇప్పటికే జేపీ నడ్డా అపాయింట్ మెంట్ ఖరారైందని సమాచారం. శనివారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్న ఈటల.. ఆదివారం తనతో వచ్చే నేతలతో కలిసి ఢల్లీ వెళతారని చెబుతున్నారు. ఢిల్లీకి వెళ్లేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ బీజేపీలో చేరునున్నారని గతంలోనే ప్రకటన వచ్చింది. తాజాగా రాజేందర్ కు మరో ముగ్గురు నేతలు తోడయ్యారు.  కాంగ్రెస్ పార్టీకి షాకిస్తూ ముగ్గురు కీలక నేతలు కమలం గూటికి చేరనున్నారు. ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, సీనియర్ నేత కేశవరెడ్డితో పాటు టీఎంయీ మాజీ అధ్యక్షుడు అశ్వథామరెడ్డి కూడా ఈటలతో కలిసి కాషాయ కండువా కప్పుకోబోతున్నారు. బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తో పాటు తెలంగాణ సీనియర్ నేతలు డీకే అరుణ, ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజాసింగ్ సహా పలువురు నేతలు శుక్రవారం ఈటల నివాసానికి వెళ్లారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామాతో పాటు పార్టీలో చేరిక అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా ఈటల నివాసంలో బీజేపీ నేతలను కలిశారు రమేష్ రాథోడ్, కేశవరెడ్డి, అశ్వథామరెడ్డి. తాము కూడా బీజేపీలో చేరుతామని తెలిపారు.  ఇక శనివారం ఉదయం గన్‌పార్క్ దగ్గర రేపు అమరవీరుల స్థూపానికి ఈటల నివాళులు అర్పించనున్నారు. అనంతరం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు.  

ఎంపీడీవో కాళ్లు పట్టుకున్న మహిళ.. వైసీపీ నేతల అరాచకం! 

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల అరాచకాలకు హద్దే లేకుండా పోతోంది. ఎన్ని విమర్శలు వస్తున్నా తమ తీరు మార్చుకోవడం లేదు. తమకు మద్దతుగా లేనివారికి ప్రభుత్వ పథకాలు అందించడం లేదు. అర్హులు అయినా సాయం అందకుండా కుట్రలు చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలైతే అప్లయ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు. ప్రభుత్వ పథకాలు తమకు అందడంలేదని మొరపెట్టుకున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యారు. మీ దిక్కున్నచోట చెప్పుకోండంటూ వైసీపీ కార్యకర్తలు ప్రవర్తిస్తున్న తీరు విస్మయం కలిగిస్తోంది.  వాలంటీర్ల ద్వారానే వైసీపీ నేతలు వేధింపులు, కుట్రలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో ఓ మహిళ.. వైసీపీ నేతల అరాచకాలు భరించలేక ఎంపీడీవో కాళ్లపై పడింది. తమకు న్యాయం చేయాలని వేడుకుంది. నెల్లూరు జిల్లా, ఆత్మకూరు మండలం, అప్పారావు పాలెంలో ఈ ఘటన జరిగింది.  చెంచెమ్మ అనే మహిళ జగనన్న చేయూత పథకానికి అర్హురాలు అయినప్పటికీ.. ఇప్పటి వరకు ఆ పథకం నిధులు ఆమెకు అందలేదు. గ్రామ వాలంటీర్‌ను అడిగితే మా నాయకులు చెబితేనే జగనన్న చేయూత పథకం వస్తుందని లేకుంటే రాదని చెప్పారు. వైసీపీ నేతల దగ్గరకు వెళ్లినా వాళ్లు పట్టించుకోలేదు. దీంతో బాధిత మహిళ ఎంపీడీవో రాఘవేంద్రరావును కలిసి తన గోడును వెల్లబోసుకుంది. నాయకులను అడిగితే వేధిస్తున్నారని కాళ్లమీదపడి వేడుకుంది. దీనిపై స్పందించిన ఆయన గ్రామంలో విచారించి పథకం అందేటట్లు చూస్తానని హామీ ఇచ్చారు.మహిళ ఎంపీడీవో కాళ్లపై పడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. 

డాక్ట‌ర్లు దేవ‌దూత‌లు.. టీకాపై దిగొచ్చిన బాబా.. జ్ఞానోద‌యానికి అదే కార‌ణ‌మా?

నెల రోజులుగా దేశంలో రామ్‌దేవ్ బాబా ర‌చ్చ అంతా ఇంతా కాదు. అల్లోప‌తితో ఓ ఆట ఆడుకుంటున్నారు ఈ యోగా గురు. అల్లోప‌తి అస‌లు వైద్య‌మే కాదంటూ ప్ర‌శ్న‌ల ప‌రంప‌ర‌తో దాడి చేస్తున్నారు. వైద్యులు సైతం ఎక్క‌డా త‌గ్గ‌ట్లేదు. కేంద్రానికి లేఖ‌లు, కోర్టు కేసుల‌తో రామ్‌దేవ్ బాబాకి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇస్తున్నారు డాక్ట‌ర్లు. దీంతో.. దేశంలో అల్లోప‌తి వ‌ర్సెస్ ఆయుర్వేదం వార్ ఓ రేంజ్‌లో సాగుతోంది.  భ‌య‌మో లేక బాధ్య‌తో.. కార‌ణం ఏంటో తెలీదు కానీ.. రామ్‌దేవ్ బాబా బాగా కూల్ అయిపోయారు. ఆయ‌న మాట‌లు బాగా మారిపోయాయి. వైద్యులు భూమిపై తిరుగాడుతున్న‌ దేవ‌దూత‌లంటూ కొనియాడారు. అత్యవసర చికిత్స, సర్జరీలకు అల్లోపతి ఉత్తమమైనదని ప్ర‌శంసించారు బాబా వారు.  ఆయుర్వేదానికి మించిన వైద్యం లేదని, తాను కరోనా టీకా వేయించుకోబోనని గ‌తంలో తెగేసి చెప్పారు రామ్‌దేవ్ బాబా. ఇప్పుడు ఆ అభిప్రాయం కూడా మార్చుకున్నారు. త్వ‌ర‌లో తాను కూడా కరోనా టీకా వేయించుకుంటానంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ప్రజలంతా టీకాలు వేయించుకోవాలని పిలుపు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ రెండు డోసులు టీకా తీసుకోవాలని కోరారు. కొవిడ్‌ కారణంగా ఎవ‌రూ ప్రాణాలు కోల్పోకూడదని అన్నారు. అందరికీ ఉచితంగా టీకాలు ఇవ్వనున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రకటనను స్వాగతించారు రామ్‌దేవ్ బాబా. తనకు ఎవరితోనూ శత్రుత్వం లేదని రామ్‌దేవ్ బాబా స్పష్టం చేశారు. యోగా గురులో స‌డెన్‌గా వ‌చ్చిన ఈ మార్పుకు కార‌ణ‌మేంటా అని అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారా? వారం రోజుల్లోనే అల్లోప‌తి అద్భుతమ‌ని ఎందుకు అనిపించింద‌ని ఆరా తీస్తున్నారు. త‌న‌ను అరెస్ట్ చేసే ధైర్యం ఎవ‌రికీ లేదంటూ ప‌రోక్షంగా కేంద్రాన్నే స‌వాల్ చేసిన బాబా నోటి వెంట‌.. హ‌ఠాత్తుగా ఇలా మంచి మాట‌లు రావ‌డం వెనుక ఢిల్లీ నుంచి వ‌చ్చిన స్ట్రాంగ్ వార్నింగే కార‌ణ‌మంటున్నారు. వైద్య‌,ఆరోగ్య శాఖ‌తో పెట్టుకుంటే.. క‌రోనిల్ బిజినెస్‌కు ఎక్క‌డ దెబ్బ ప‌డుతుందోన‌నే భ‌యంతోనే బాబా దిగొచ్చార‌ని అంటున్నారు. 

ఢిల్లీలో యోగి.. ఏంటి కథ ? సీఎం పదవి పోయినట్టేనా! 

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఎనిమిది నెలల సమయం మాత్రమే వుంది. ఈ ఎనినిమిది నెలలు అక్కడ అధికారంలో ఉన్న, బీజేపీకి మాత్రమే కాదు, అన్ని పార్టీలకు అత్యంత కీలకం. ఇతర పార్టీల సంగతి ఎలా ఉన్నా, గత ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన బీజేపీ, మరో అద్భుత విజయం కోసం, తహతహ లాడుతోంది. ముందస్తు వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా, కొవిడ్ సెకండ్ వేవ్ సృష్టించిన వ్యతిరేకత నుంచి బయటపడేందుకు పడరాని పాట్లు పడుతోంది. అందులో భాగంగానే, పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్,రాష్టంలో పర్యటించి పరిస్థితిని క్షుణ్ణంగా సమీక్షించి, కేంద్ర నాయకత్వానికి నివేదికను సమర్పించారు.  ఈ నేపద్యంలో, ముఖ్యమత్రి యోగీ ఆదిత్యనాథ్ రెండురోజుల ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఊహాగానలకు తెరతీసింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి, తమ పర్యటనలో భాగంగా, పార్టీ త్రిమూర్తులు, ప్రధాని నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్  షా,పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలుస్తునారన్నవార్త, మీడియా మేతకు కొదవలేకుండా చేసింది. ఇప్పటికే. సంతోష్ పర్యటన నేపధ్యంగా ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి యోగీల మధ్య విబేధాలు ఉన్నట్లు, కధనాలను నడిపిన మీడియా,మరో అడుగు ముందుకేసి, యోగీకి ఉద్వాసన తప్పదని బ్రేకింగ్’ ఇచ్చింది. అయితే, అదేమీ లేదని స్వయంగా సంతోష్ మీడియాకు వివరణ  ఇచ్చారు.  అదలా ఉంటే, ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్, డిల్లీ పర్యటన నిస్సందేహంగా  ఎన్నికల సమీపిస్తున్న సమయంలో తీసుకోవలసిన నష్ట నివారణ చర్యలపై చర్చించేందుకే అని పార్టీ వర్గాలు అంగీకరిస్తున్నాయి.అదే సమయంలో ఇప్పడు ముఖ్యమంత్రి మార్పు ఉండదనీ స్పష్టం చేస్తున్నాయి. అయితే మంత్రి వర్గ విస్తరణ ఉడే అవకాసం ఉందని,ఆ విషయం చర్చించేందుకే, యోగీ ముఖ్య నేతలు ముగ్గురినీ కలుస్తున్నారని తెలుస్తోంది.  ఆదిత్యనాథ్ అనుచరులు మాత్రం కొవిడ్, వాక్సినేషన్ సంబందిత విషయాలతో పాటుగా రాజకీయ అంశాలు కూడా చర్చకు రావచ్చని, అంటున్నారు.ముఖ్యంగా ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో, బీజేపీ పై సమాజ్ వాదీ పార్టీ ఆధిక్యత సాధించడం ఆందోళన కలిగించే అంశంగానే పార్టీ భావిస్తోంది. మరో ఎనిమిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జగరనున్న నేపధ్యంలో జరిగిన పంచాయతి ఎన్నికల్లో ఎస్పీ ఆధిక్యత సాధించడంతో, అన్ని కోణాలలో విశ్లేషణ జరుగుతుందని, అవసరమైన దిద్దుబాటు చర్యలు ఉంటాయని, పార్టీ నేతలు అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, అయితే ప్రస్తుతం ఉన్నఖాళీలను భర్తీ చేయడం వరకే  విస్తరణ ఉంటుందా, లేక సంస్థాగతమార్పులతో కలిపి భారీగా మార్పులు చేర్పులు ఉంటాయా .. అన్నది మాత్రం ఇంకా స్పష్టం  కాలేదు.  ఇదిలా ఉంటే, కొవిడ్ సృష్టించిన బ్యాడ్ ఇమేజ్’నుచి అదుత్యనాథ్ ప్రభుత్వం బయట పడుతోందని పార్టీ వర్గాలతో పాటుగా విపక్షాలు కూడా గుర్తించాయి. అందుకే, వాక్సిన్ మీద విశ్వాసం లేదని, తాను తీసుకోనని, వాక్సినేషన్ వ్యతిరేక ప్రచారం  సాగించిన మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అదినేత అఖిలేష్ యాదవ్, తండ్రి ములాయంతో కలిసి వాక్సిన్ తీసుకోవడమే కాదు, అందరూ తీసుకోవాలని తండ్రీ, కొడుకులు ఇద్దరూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.  ప్రస్తుతం  రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితి పూర్తిగా అదుపులోకి రావడంతో  పాటుగా, వాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోందని, అందుకే, అఖిలేష్ యాదవ్, నెగటివ్ నుంచి పాజిటివ్ పదాలకి ట్యూన్ మార్చారని అంటున్నారు.  అదే విధంగా థర్డ్ వేవ్ వచ్చినా సంర్ధవంతంగా తట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. దీంతో, బీజేపీలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

అంద‌రికీ వ్యాక్సిన్లు ఇస్తే ప్ర‌మాదం! కొత్త వేరియంట్ల ముప్పుపై మోదీకి వైద్య నిపుణుల‌ లేఖ‌

క‌రోనా సైంటిస్టుల్లో హైరానా పుట్టిస్తోంది. సూక్ష్మ‌జీవి మాన‌వ శాస్త్ర విజ్ఙానానికి ఓ ప‌ట్టాన అంతుప‌ట్ట‌డం లేదు. అందుకే, ఎప్ప‌టిక‌ప్పుడు వైర‌స్ విష‌యంలో అంచ‌నాలు త‌ప్పుతున్నాయి. వైర‌స్ వ్యాప్తి నుంచి చికిత్సా విధానం, మందుల వ‌ర‌కూ.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎందులోనూ పూర్తిస్థాయి ప‌ట్టు సాధించ‌లేక‌పోతున్నారు. తాజాగా, కొవిడ్ పాటిట బ్ర‌హ్మాస్త్రంగా భావిస్తున్న వ్యాక్సిన్ల‌ విష‌యంలోనూ వ‌ర్రీ మొద‌లైంది. ఇష్టం వ‌చ్చిన‌ట్టు టీకాలు వేస్తే.. వైర‌స్‌లో కొత్త వేరియంట్లు పుట్టుకొస్తాయంటూ వైద్య నిపుణుల బృందం హెచ్చ‌రిస్తోంది. ఆ మేర‌కు వారంతా క‌లిసి ప్ర‌ధాని మోదీకి లేఖ రాయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.  కొవిడ్‌ విజృంభణ కొన‌సాగుతున్న ప్ర‌స్తుత తరుణంలో.. సామూహిక, విచక్షణారహిత, అసంపూర్ణ వ్యాక్సినేషన్‌ వల్ల తీవ్ర పరిణామాలుంటాయని లేఖ‌లో తెలిపారు. ఇబ్బ‌డిముబ్బ‌డిగా టీకాలు ఇవ్వ‌డం వ‌ల్ల వైరస్‌లో మ్యుటేషన్లు చోటుచేసుకొని కొత్త స్ట్రెయిన్లు పుట్టుకొచ్చే ముప్పుందని హెచ్చ‌రించారు. ఎయిమ్స్‌ వైద్యులతో పాటు ఇండియన్ పబ్లిక్‌ హెల్త్ అసోసియేషన్‌, ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ అండ్ సోషల్‌ మెడిసిన్‌, ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఎపిడెమాలజిస్ట్‌కు చెందిన నిపుణులు.. మోదీకి రాసిన లేఖ వ్యాక్సినేష‌న్‌పై డేంజ‌ర్ బెల్ మోగిస్తోంది.  దేశ ప్ర‌జ‌లంద‌రికీ టీకా వేయ‌డం కంటే.. వైరస్‌ సోకే ముప్పు ఎక్కువగా ఉన్నవారికి మొద‌ట టీకా ఇవ్వ‌డం మంచిద‌ని సూచించారు. కరోనా బారిన పడిన వారికి టీకాలు ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. చిన్న‌పిల్ల‌ల‌కు కూడా వ్యాక్సిన్‌తో ప‌ని తేద‌ని తెలిపారు. యువ‌త‌కు కాకుండా.. వృద్ధులు, ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న వారికి టీకా ఇవ్వ‌డం వ‌ల్ల ఉప‌యోగం ఉంటుంద‌న్నారు. డెల్టా వేరియంట్‌ విజృంభణతో కేసులు ఎక్కువగా వస్తున్న ప్రాంతాల్లో కొవిషీల్డ్‌ డోసుల మధ్య వ్యవధిని తగ్గించాల‌ని సూచించారు.  వైరస్ వ్యాప్తిపై ఉన్న శాస్త్రీయ సమాచారం, ధ్రువీకరించిన గణాంకాల ఆధారంగానే ముందుకు సాగాలని వైద్య నిపుణులు ప్ర‌ధానికి రాసిన లేఖ‌లో తెలిపారు. ప్రాధాన్య‌తా క్ర‌మంలో కాకుండా.. అందరికీ వ్యాక్సినేషన్ వల్ల.. జనాభాలో చాలా తక్కువ మందికి టీకాలు చేరతాయని.. అలా చేస్తే వైరస్‌ కట్టడి క‌ష్ట‌మేన‌నేది నిపుణుల‌ అభిప్రాయం.   

టీఆర్ఎస్ ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు..

తెలంగాణ రాష్ట్ర సమితి లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు ఇంట్లో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్న నామాకు చెందిన మధుకాన్ ప్రధాన కార్యాలయంలో పాటు అతని ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నాయి. రూ.1064 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ముమ్మర సోదాలు చేస్తున్నారని తెలుస్తోంది. Madhucon Company పేరు తో పలు బ్యాంకు ల్లో భారీగా లోన్స్ తీసుకొని పలు విదేశీ కంపెనీలకు డబ్బులు మళ్లించారని నామాపై అభియోగాలు ఉన్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలోనే ఈడి సోదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఈ సోదాలు కలకలం రేపుతున్నాయి