కేసీఆర్, ఈటల ఒకటేనా! రాజకీయ డ్రామా చేస్తున్నారా?

మాజీ మంత్రి ఈటల రాజేందర్ కేంద్రంగానే తెలంగాణ రాజకీయాలు సాగుతున్నాయి. కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత ఈటల ఏం చేస్తారన్నది జనాలు ఆసక్తిగా గమనించారు. కేసీఆర్ టార్గెట్ గా తెలంగాణ ఉద్యమకారులందరిని రాజేందర్ ఏకం చేస్తారని ఎక్కువ మంది భావించారు. కొత్త పార్టీ దిశగానే ఈటల కూడా సంకేతాలిచ్చారు. కాని చివరికి ఆయన సొంత దుకాణం తన వల్ల కాదంటూ కమలం గూటికి చేరారు. ఈటల బీజేపీలో చేరడంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కమ్యూనిస్టు భావజాలంతో ఎదిగిన ఈటల రాజేందర్... రైటిస్ట్ పార్టీలో చేరడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనపై పలు సంఘాల నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి.  తాజాగా   ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరడంపై మావోయిస్టు పార్టీ కూడా స్పందించింది. ఈటలకు సంబంధించి తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఘాటు లేఖ విడుదల చేశారు. ఈటల అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తూ ఇచ్చిన ప్రకటనను తెలంగాణ మావోయిస్టు పార్టీ ఖండించింది. ఈటల అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తూ చేసిన ప్రకటనను జగన్ తప్పుబట్టారు. కేసీఆర్ ఫ్యూడల్ పెత్తనానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడతానని ఈటల ప్రకటన చేశారు. ఆ ప్రకటన చేసిన అనంతరం హిందూత్వ పార్టీ అయినా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారని జగన్ విమర్శించారు. ఇది సీఎం కేసీఆర్‌కు ఈటలకు మధ్య జరుగుతున్న పోరాటమని.. దీనితో తెలంగాణ ప్రజలకు సంబంధం లేదన్నారు. కేసీఆర్, ఈటల ఒకే గూటి పక్షులని మావోయిస్టు పార్టీ స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. కేసీఆర్, ఈటల రాజేందర్ అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రజల ఆకాంక్షకు తూట్లు పొడిచారన్నారు. వీరి పాలన ప్రజా వ్యతిరేకమైనదన్నారు. మొన్నటి వరకూ కేసీఆర్ పక్కనే ఉండి అధికారాన్ని అనుభవించిన ఈటల తన ఆస్తుల పెంపుదలకు యత్నించారని జగన్ విమర్శించారు. అందులో భాగంగా పేదల భూములను అక్రమంగా ఆక్రమించారన్నారు. తెలంగాణలో ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తామని ప్రకటిస్తూ తన ఆస్తుల రక్షణ కోసమే బీజేపీలో చేరారని జగన్ తన లేఖలో మండిపడ్డారు. ఈటల బీజేపీలో చేరడాన్ని  తెలంగాణ ప్రజలు, ప్రజాస్వామిక వాదులు వ్యతిరేకిస్తున్నారన్నారు. మావోయిస్టులు కూడా తనకు మద్దతు ఇస్తారని ఈటల చెప్పుకోవడం పచ్చి మోసం అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈటల రాజేందర్ బీజేపీలో చేరడాన్ని తప్పుపడుతూ మావోయిస్టుులు విడుదల చేసిన లేఖ సంచలనంగా మారింది. ఈటల అనుచరుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వామపక్ష భావజాలం ఉన్న ఈటలకు మొదటి నుంచి ఉద్యమ సంఘాలే మద్దతుగా నిలిచాయి. ప్రజా సంఘాలు అండగా నిలిచాయి. ఈటలను కేసీఆర్ మంత్రివర్గం నుంచి తొలగించినప్పుడు కూడా ఉద్యమకారులు, ప్రజా సంఘాలే ఆయనకు మద్దతుగా కేసీఆర్ ప పై విరుచుకుపడ్డాయి. అయితే ఈటల బీజేపీలో చేరడంతో... ఈ సంఘాలన్నిఆయనకు దూరం అయ్యాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. 

చెక్కపెట్టెలో బాలుడు.. 

రామాయణంలో సీత భూమిలో దొరికిందని చెప్పుకున్నాం.. మొన్నటికి మొన్న గంగా నదిలో కరోనా శవాలు దొరికాయని వార్తలు విన్నాం.. తాజాగా గంగా నదిలో  ఓ చక్క పెట్టె కొట్టుకు వచ్చింది. నదిలో కొట్టుకొస్తున్న ఓ పెట్టెను కూడా ఒడ్డుకు చేరిన స్థానికులు దాన్ని తెరిచి చూసి షాక్ అయ్యారు. ఆ పెట్టెలో ఓ ఎర్రని వస్త్రం మీద ఓ చంటిబిడ్డతో పాటు కనకదుర్గ అమ్మవారి ఫోటో కూడా ఉండటం చూసి అంతా అశ్చర్యపోయారు.  మణిరత్నం దళపతి  సినిమాలో చిన్నపుడు రజనీ కాంత్ నదిలో గడ్డిమీద వచ్చినట్లు ఘాజీపూర్‌లో సదర్ కొత్వాలి ప్రాంతంలోని దాద్రి ఘాట్ వద్ద గంగానదిలో చంటిబిడ్డ ఏడుపులు వినిపించాయి. ఆ సౌండ్ వినగానే  ఆ నదిలో పడవ నడిపే వ్యక్తి ఆశ్చర్యపోయాడు. దీంతో పరిశీలించి చూడగా..నదిలో కొట్టుకు వస్తున్న చెక్కపెట్టెనుంచే చంటిబిడ్డ ఏడుపులు వినిపించాయి. దీంతో ఆ చెక్క పెట్టను పట్టుకున్నాడు. తెరిచి చూస్తే అందులో ఆడ బిడ్డ ఉంది. బిడ్డ వయసు 21 రోజులు ఉంటుంది. ఆమెతో పాటు అమ్మవారి పఠాన్ని కూడా పెట్టి ఉంది. పెట్టెలో ఓ పేపర్‌లో జాతకం ప్రకారం..ఆ బిడ్డకు 'గంగ' అని పేరు పెట్టినట్లుగా రాసి ఉంది. దీంతో ఆ పడవ నడిపే వ్యక్తి ఆ బిడ్డను తన ఇంటికి తీసుకెళ్లాడు. బిడ్డను తనకే గంగమ్మే ఇచ్చింది. ఇది నా అదృష్టం అని మురిసిపోయాడు. ఈ బిడ్డను తాను పెంచుకుంటానని చెప్పాడు. అయితే ఈ విషయం స్థానికులు పోలీసులకు తెలియజేయటంతో పోలీసులు ఆ పాపను స్వాధీనం చేసుకున్నారు. బిడ్డను పెంచుకోవడం కుదరదన్నారు. దీనిపై దర్యాప్తు చేయాలన్నారు. బిడ్డను ఆశాజ్యోతి కేర్ సెంటర్ కు తరలించారు. గంగానదిలో పెట్టెలో ఓ చంటిబిడ్డ కొట్టుకొచ్చిందనే వార్త స్థానికంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ మధ్య కాలంలో మనుషుల్లో మానవత్వం కరువైయింది. నవమాసాలు మోసి కన్న పిల్లలను కూడా గాలికి వదిలేస్తున్నారు. పసికందులను పట్టించుకోవడం లేదు. రోజు రోజుకి ఇలాంటి వార్తలు బాగా పెరుగుతున్నాయి. కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నారు.    

మహా కూటమిలో మరో ముసలం! ఉద్దవ్ ఊస్టింగేనా..? 

మహారాష్ట్రలో మూడు పార్టీల కూటమి, మహా వికాస్ అఘాడి ప్రభుత్వం, నిండా ఐదేళ్ళు అధికారంలో కొనసాగుతుందా?ఈ ప్రశ్న ఇప్పటిది కాదు, 2019లో అనూహ్య పరిణామాల మధ్య  కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కలిసి, శివసేన  నేత ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన, క్షణం నుంచి రాజకీయ వర్గాల్లో ఈ చర్చ సాగుతూనే వుంది. అప్పట్లోనే మహా అయితే ఆరు నెలలు, అంతకు మించి ఏమ్వీఏ అధికారంలో కొనసాగడం అయ్యే పనికాదాని కొందరు రాజకీయ పండితులు జోస్యం కూడా చెప్పారు. ఇక, బీజేపీ అయితే, అంతర్గత వైరుధ్యాలతో, ఏమ్వీఏ పేకమేడ ఎప్పుడైనా కూలి పోతుందని, ఎన్నో ఆశలు పెట్టుకుంది. బట్, అయితే, మూడు పార్టీల మధ్య ఎన్ని వైరుధ్యాలున్నా, అధికారం ఫెవికాల్’ లా పనిచేసింది. ఆరు నెలలు అనుకున్న ప్రభుత్వం రెండేళ్ళు పూర్తి చేసుకుంది.  అయితే ఇప్పుడు మళ్ళీ మహా కూటమిలో మరో సంక్షోభం తలెత్తింది. మూడు పార్టీలు మూడు దారుల్లో, అడుగులు వేస్తున్నాయి. నిజానిజాలు ఎలా ఉన్నా,మహా కూటమిలో ముసలం పుట్టిందన్నవార్త ముంబై నుంచి ఢిల్లీ దాకా వినవస్తోంది.ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కలవడం, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’తో ఎన్నికల వ్యూహహకర్త భేటీ కావడంతో, రాజకీయ సమీకరణలు మారుతున్నాయన్న ఊహగానాలు మొదలయ్యాయి.  ఇప్పడు మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే, మరో బాంబు  పేల్చారు. మరో మూడేళ్ళలో 2024లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించారు. అంతే కాదు, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని, పార్టీ అంగీకరిస్తే  తానే కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్ధిని అని కూడా పటోలే ప్రకటించుకున్నారు.  అలాగే,త్వరలో జరిగే  స్థానిక సంస్థల  ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు. దీంతో ముడు పార్టీలు, మూడు దారుల్లో పోతున్నాయా? ఎవరి దారి వారు చూసుకుంటున్నారా, అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. నిజానికి,  కాంగ్రెస్ పార్టీకి చెందిన హోంమంత్రి అనీల్ దేశ్ ముఖ్,  అవినీతి ఆరోపణల నేపధ్యంలో రాజీనామా చేసినప్పటి నుంచి, కాంగ్రెస్ పార్టీ గుర్రుగానే వుంది.ముంబై మాజీ పోలీస్ కమిషనర్ ఆయనపై చేసిన అవినీతి ఆరోపణల నేపధ్యంలో, హై కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడంతో  ఏప్రిల్ లో దేశ్ ముఖ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కూటమిలో తమకు సముచిత గౌరవం దక్కడం లేదని ఆపార్టీ నాయకులు బహిరంగంగానే అవేదన, అగ్రహం వ్యక్త పరిచారు.  జాతీయ  స్థాయిలో వేగంగా మారుతున్నట్లు కనిపిస్తున్న మార్పుల నేపధ్యంలో, శివసేన, మాజీ మిత్రపక్షం బీజేపీతో మళ్ళీ చేతులు కలిపేందుకు, అలాగే ఎన్సీపీ, ప్రశాంత్ కిషోర్, ‘మిషన్ 2024’ ప్లాన్’లో భాగంగా ఏర్పాటు చేస్తున్నప్రాంతీయ పార్టీల జాతీయ కూటమిలో ‘కీ’ రోల్ ప్లే చేసేందుకు సిద్దమవుతున్నాయి.ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ అనివార్యంగా ఒంటరిగా పోటీచేయాలనే నిర్ణయానికి వచ్జిందని ,పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఏమ్వీఏలో ఎన్ని లుకలుకలు ఉన్నా, ప్రస్తుతానికి  ఉద్ధవ్ థాకరే ప్రభుత్వానికి వచ్చిన ముప్పు లేదని, ఎన్సీపీ భరోసా ఇస్తోంది. ఏమ్వీఏ ప్రభుత్వం ఐదేళ్ళు అధికారంలో ఉంటుంది,అయితే, 2024 లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేయాలా, లేదా అనే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, పార్టీ అధికార ప్రతినిధి, నవాబ్ మాలిక్ స్పష్తం చేశారు.  అలాగే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందని చేసిన ప్రకటనను కూడా మాలిక్ సమర్ధించారు. ప్రతి పార్టీ తమ కార్యకర్తలలో మనోధైర్యం నింపేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాయి. రాజకీయాల్లో ఉన్న వారు పదవులు ఆశించడం కూడా సహజమే. అలాగే. పటోలేముఖ్యమంత్రి కావాలనుకోవడం కూడా తప్పులేదని అంటున్నారు. అయితే, జాతీయ స్థాయిలో అనూహ్యంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే, ఒక్క మహారాష్ట్రలోనే కాదు, ఎక్కడైనా, ఎప్పుడైనా రాజకీయాలు  ఏదైనా జరగ వచ్చును అన్నట్లుగానే విచిత్ర పోకడలు పోతున్నాయి.    

కొత్త‌గా గ్రీన్ ఫంగస్.. మ‌రో డేంజ‌ర్ బెల్‌.. హెలికాప్ట‌ర్‌లో పేషెంట్ తరలింపు..

బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్.. ఉన్న‌వి చాల‌వ‌న్న‌ట్టు.. కొత్త‌గా గ్రీన్ ఫంగ‌స్ ద‌డ‌పుట్టిస్తోంది. క‌రోనా కారణంగా పాత రోగాలు కొత్తగా విజృంభిస్తున్నాయి. కొవిడ్ నుంచి కోలుకున్న పేషెంట్స్‌ను బ్లాక్ ఫంగ‌స్ తీవ్రంగా వేధిస్తోంది. దేశ‌వ్యాప్తంగా వేల సంఖ్య‌లో బ్లాక్ ఫంగ‌స్ కేసులు న‌మోద‌వుతూ బెంబేలెత్తిస్తోంది. ముక్కు, గొంతు, త‌ల‌.. ఇలా శ‌రీర భాగాల‌ను తీవ్రంగా డ్యామేజ్ చేస్తోంది. బ్లాక్ ఫంగ‌స్‌కు పోటీగా అక్క‌డ‌క్క‌డా వైట్‌, ఎల్లో ఫంగ‌స్‌లు కూడా విజృంభిస్తూ క‌ల‌వ‌రానికి గురి చేస్తున్నాయి. ఇవి చికిత్స‌కూ లొంగ‌కుండా.. మొండిజ‌బ్బులుగా మారి.. ప్రాణాలు తోడేస్తున్నాయి.  బ్లాక్‌, వైట్‌, ఎల్లో ఫంగ‌స్ కేసులే ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నం చూస్తూ వ‌స్తున్నాం. లేటెస్ట్‌గా.. ఇండియాలో తొలిసారిగా గ్రీన్ ఫంగ‌స్ కేసు న‌మోద‌వ‌డం ఆందోళ‌న‌క‌రంగా మారింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో ఈ ఫంగస్ వెలుగుచూసింది. కరోనా నుంచి కోలుకున్న ఓ వ్యక్తిలో గ్రీన్‌ ఫంగస్‌ను గుర్తించారు వైద్యులు. దీంతో ఆ పేషెంట్‌ని హుటాహుటిన ఇండోర్ నుంచి ముంబైకి.. ఎయిర్ అంబులెన్సులో తరలించారు. ఇండోర్‌లోని శ్రీ అరబిందో ఇస్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి ఛాతీ వ్యాధుల విభాగంలో ఈ వ్యాధి బ‌య‌ట‌ప‌డింది. తొలుత బాధితుడికి బ్లాక్ ఫంగస్ సోకిందని డాక్ట‌ర్లు అనుమానించారు. ఆ తర్వాత పరీక్షలు నిర్వహించగా.. సైనస్, లంగ్స్, బ్లడ్‌లో గ్రీన్ ఫంగస్ డెవ‌ల‌ప్‌ చెందినట్టు గుర్తించారు. ఇండోర్ ఆసుప‌త్రిలో గ్రీన్ ఫంగ‌స్‌కు చికిత్స అందుబాటులో లేక‌పోవ‌డంతో ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైలోని హిందుజా ఆసుపత్రికి తరలించారు.  గ్రీన్ ఫంగ‌స్ బాధితుడు ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నాడు, కొద్ది రోజుల త‌ర్వాత‌ ముక్కు నుంచి రక్తం కారడం, జ్వరం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. బరువు తగ్గి, చాలా బలహీనంగా మారాడు. ఇవ‌న్నీ గ్రీన్ ఫంగ‌స్ ల‌క్ష‌ణాలుగా భావిస్తున్నారు. దీనిపై మ‌రింత‌ రీసెర్చ్ జరగాల్సి ఉందంటున్నారు వైద్యులు.   

రెండు ఏళ్ళ బాలుడికి.. 24 /7 పోలీస్ సెక్యూరిటీ.. ఎందుకో తెలుసా..?

ఇంటి గుట్టు, అల వైకుంఠపురంలో సినిమాలోలాగా.. స్టోరీ మరో చోట రిపీట్ అయింది. కానీ ఇక్కడ సినిమాలో లాగ పిల్లలు మార్చలేదు. ఎత్తుకెళ్లారు. గాంధీనగర్‌లోని అదలాజ్‌ ప్రాంతంలోని మురికివాడలో చెత్త ఏరుకుంటూ జీవనం సాగించే దంపతులకు ఏప్రిల్‌ నెలలో మగబిడ్డ జన్మించాడు. అయితే సడెన్ గా హాస్పిటల్లో ఉన్న పిల్లవాడు కనిపించకుండా పోయాడు.. ఆ బాలుడి వయసు రెండు నెలలు మాత్రమే, ఆ బాబు పుట్టిన  రెండురోజులకే ఆసుపత్రి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఇక అంతే  పోలీసులు రంగంలోకి దిగారు. అప్పుడు వాళ్ళ ముందు ఉన్న ప్రశ్నలు ఆ పిల్లవాడిని ఎవరు తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్లారు. పార్సనల్ రివెంజ్ కోసం చేశారా లేక, లేదంటే  కిడ్నాప్‌ చేసి పసిపిల్లలను అమ్మడానికి ఎత్తుకెళ్లారా అనేది.. కట్ చేస్తే  ఆస్పత్రిలోని సీసీ టీవి దృశ్యాల ఆధారంగా వారిని పట్టుకున్నారు.  పిల్లలు లేని ఒక జంట బాలుణ్ని కిడ్నాప్‌ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే రెండు సార్లు కిడ్నాప్‌ అయిన బాలుడికి ఇక మీదట ఎలాంటి అపాయం జరగకుండా చూసుకుంటామని పోలీసులు ఆ దంపతులకు హామీ ఇచ్చారు. రెండు వారాల్లో నిందితులను పట్టుకుని ఈ చిన్నోడిని రక్షించి  తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ బుడతడు ఈ నెల 5 తేదీన మరోసారి కిడ్నాప్‌కు గురి అయ్యాడు.  మళ్ళీ  పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. కేవలం నాలుగు రోజుల్లో కిడ్నాప్‌ను ఛేదించి వీడిని రక్షించారు. పలుసార్లు ఆ బాలుడు కిడ్నప్ అవ్వడంతో చివరికి పోలీసులు చేసేది ఏమి లేక గుడిసె చుట్టు భారీ భద్రత.. 24×7 రక్షణ.. కంటికి రెప్పలా కాపాడుతున్న పోలీసు అధికారులు.. ఇది ఓ పొలిటికల్ లీడర్ బందువు ఇళ్లు కాదు.. అలా అని ఓ నాయకుడి విలవైన ఆస్తి కూడా కాదు. గత కొద్ది రోజులుగా ఇక్కడ పెద్ద స్థాయిలో ప్రొటెక్షన్ పెట్టారు పోలీసులు. చీమ చిటుక్కుమన్నా పోలీసులు అలర్ట్ అవుతున్నారు. ఇది ఎక్కడో కాదు గుజరాత్‌‌లోని గాంధీనగర్ లో జరిగింది. 

పెళ్లి కూతురు జంప్..తల్లిదండ్రులకు తలవంపు..

నేటి తరం పిల్లలు చాలా స్పీడ్ ఉన్నారు. అన్నిట్లోనూ ముందు ఉన్నారు. బైక్ తోలడంలోనూ ముందు ఉన్నారు..ప్రాణాలు పోడోట్టుకోవడంలో ముందు ఉన్నారు. ప్రేమించడంలో ఉండు ఉన్నారు.. పెళ్లి చేసుకోవడం లోను ముందు ఉన్నారు. చంపడంలో ఉండు ఉన్నారు చనిపోవడంతో ముందు ఉన్నారు. చివరికి అమ్మానాన్నలను బాధపెట్టడంలో ముందు ఉన్నారు. తాజాగా ఓ యువతి పెళ్ళికి ముందు తన తల్లి దండ్రులకు షాక్ ఇచ్చింది.. కూతురు చేసిన పనికి ఆ తల్లిదండ్రులకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు.. ఆవేదన పాడడం తప్పా.. ఇంతో తెలుసుకుందామా..?  అది చిత్తూరు జిల్లా. చంద్రగిరి మండలం. మిట్టపాళ్యం గ్రామం. ఈ గ్రామానికి  చెందిన యువతికి ఆమె తల్లిదండ్రులు పెళ్లి ఫిక్స్ చేశారు. మరి ఆ పెళ్లి ఇష్టం లేదో.. లేక ఆ అమ్మాయి ఇంకెవర్ని అయినా లవ్ చేస్తుందో. ఆ విషయం చెప్పితే ఇంట్లో వాలు ఒప్పుకోరనుకుందో.. లేదంటే ఇంకా చదువుకోవాలనుకుంటే తొందరగా పెళ్లి చేస్తున్నారనుకుందో ఏమో గానీ, ఇంకో రెండు రోజుల్లో నిశ్చితార్ధం. ఈమె తల్లి దండ్రులు పెళ్లి పనుల్లో మునిగారు. కానీ పెళ్లి కూతురు కనిపించడం లేదు.. తల్లిదండ్రులు కంగారు పడ్డారు. కూతురి కోసం అంత వెతికారు కనిపించలేదు. ఆ పెళ్లి కూతురు ఎక్కడికి పోయి ఉంటుంది.. అసలు ఏం జరిగుంటుంది. అని తెలుసుకోవాలనుకుంతున్నారా? మీరే చూడండి.. మీకే తెలుస్తుంది.  మిట్టపాళ్యం గ్రామానికి చెందిన ఎస్‌.శేఖర్‌రెడ్డి కూతురు తిరుపతిలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో బీ.కాం మొదటి సంవత్సరం చదువుతోంది. ఈమెకు ఇటీవల కుటుంబ పెద్దలు పెళ్లి సంబంధం ఫిక్స్ చేసి ఈ నెల 17న నిశ్చితార్థం చేయాలని నిర్ణయించారు. తల్లిదండ్రులకు దిమ్మతిరిగే షాకిచ్చింది.  ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ యువతి ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి పరారైంది. ఇంట్లో దాచిన రూ. 4 లక్షల నగదు, 10తులాల బంగారు ఆభరణాలతో పరారైంది. మంగళవారం ఉదయం కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడ్డారు.  ఇళ్లంతా వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీనికితోడు బీరువాలోని నగదు, బంగారం కనిపించకుండా పోవడంతో కూతురే వాటిని తీసుకుని వెళ్లిపోయి ఉండొచ్చని నిర్ధారణకు వచ్చారు. దీంతో వారు చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే యువతి పెళ్లి ఇష్టం లేక పారిపోయిందా.. లేక ప్రేమ వ్యవహారమేదైనా ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

పిట్ట‌కు షాక్‌.. మోదీ మార్క్ పాలి..ట్రిక్స్‌!

కుక్క‌ను చంపాలంటే దానిపై పిచ్చిద‌నే ముద్ర వేయాలి. విమ‌ర్శ‌కుల నోళ్లు నొక్కాలంటే వాళ్లపై దేశ‌ద్రోహులు, అర్బ‌న్ న‌క్స‌ల్స్ అనే ముద్ర వేయాలి. మ‌రి, సోష‌ల్ మీడియా నోళ్లు నొక్కాలంటే..? కొత్త ఐటీ రూల్స్ తీసుకురావాలి. అచ్చం ఇలానే చేసింది కేంద్రం. త‌న‌కు వ్య‌తిరేకంగా పోస్టులు పెరుగుతుండ‌టం.. హాష్‌ట్యాగ్‌లు వెల్లువెత్తుతుండ‌టంతో.. పిట్ట గొంతు నొక్కే నిబంధ‌న‌లు తీసుకొచ్చింది. రిజైన్ మోదీ, అమిత్‌షా మిస్సింగ్‌లలాంటి హాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్ కావ‌డం.. కంగ‌నా ర‌నౌత్‌లాంటి స‌పోర్ట‌ర్స్ అకౌంట్లు ర‌ద్దు అవ‌డం.. దేశ‌వ్యాప్తంగా మోదీ వైఫ‌ల్యాలపై కామెంట్లు హోరెత్తుతుండ‌టంతో.. కొర‌డా కాస్త గ‌ట్టిగానే ఝ‌లిపిస్తోంది. అస‌లే, అస‌లైన‌ ప్రజాస్వామ్య దేశ‌మైన అమెరికాకు చెందిన సంస్థ కావ‌డం, ట్రంప్‌లాంటి మొండిఘ‌టాన్నే ఎదిరించిన చ‌రిత్ర ఉండ‌టంతో.. ట్విట‌ర్ చివ‌రాఖ‌రి వ‌ర‌కూ కేంద్రంతో గట్టిగానే ఫైట్ చేసింది. కానీ, రాజ్యం ప‌వ‌ర్ ముందు.. ట్విట‌ర్ స్టామినా స‌రిపోలేదు. కోర్టుకు వెళ్లినా.. ఇంకా కేసు తేల‌క‌పోవ‌డం.. ఈలోగా కేంద్రం మ‌రింత ఉచ్చు బిగించ‌డంతో.. పాపం పిట్ట‌.. విల‌విల్లాడుతోంది.  తాజాగా, ట్విట‌ర్‌కు మ‌రో ఝ‌ల‌క్ ఇచ్చింది కేంద్రం. భార‌త‌ ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన ఇన్మర్మేషన్ టెక్నాలజీ నిబంధనలను పాటించకపోవడంతో ట్విటర్‌కు చట్టపరమైన రక్షణను తొలగించింది. ఇకపై ట్విట‌ర్‌.. తటస్థ, మధ్యవర్తిత్వ వేదిక కాదని, ఇది డిజిటల్ న్యూస్ పబ్లిషర్‌గా ఉంటుందని తెలిపింది. దీంతో యూజర్ల అభ్యంతరకర పోస్టులకు ఇకపై ట్విటర్‌ కూడా క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సామాజిక మాధ్యమాల్లో డిజిటల్‌ కంటెంట్‌పై నియంత్రణకు గానూ కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలు మే 26 నుంచి అమల్లోకి వచ్చాయి. వినియోగదారుల సంఖ్య 50 లక్షలు దాటిన సామాజిక మాధ్యమాలు ఓ ఫిర్యాదుల అధికారిని, నోడల్‌ అధికారిని, అనుసంధానకర్తగా మరో ప్రధాన అధికారిని నియమించుకోవాల్సి ఉంటుంది. ఈ ముగ్గురూ భారత్‌లో నివసిస్తూ ఉండాలి. అయితే ఇతర సోషల్‌మీడియా సంస్థలు ఈ నిబంధనలు పాటించినప్పటికీ ట్విటర్‌ మాత్రం ఈ రూల్స్‌ను పాటించలేదని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై జూన్‌ మెదటివారంలోనే తుది నోటీసులు జారీ చేసింది. తాజాగా, ట్విటర్‌ లీగల్ ఇండెమ్నిటీని ర‌ద్దు చేసింది కేంద్రం. తటస్థ, మధ్యవర్తిత్వ వేదిక హోదాను కోల్పోవడం వల్ల అభ్యంతరకరమైన కంటెంట్‌ పోస్ట్ అయితే, దానికి పోస్ట్ చేసిన వారితో పాటు ట్విటర్ కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది.  అయితే, ఇంట్రెస్టింగ్ విష‌యం ఏంటంటే.. ఇలా హోదా ర‌ద్దు అయిందో లేదో.. అలా యూపీలో ట్విట‌ర్‌పై కేసు న‌మోదు కావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. జూన్‌ 5న ముస్లిం వ్యక్తిపై దాడి చేసిన ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఘాజియాబాద్‌ పోలీసులు కొందరు జర్నలిస్టులతో పాటు ట్విటర్‌పైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అభ్యంతరకర, ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని సామాజిక మాధ్యమం నుంచి తొలగించనందుకు గానూ ట్విటర్‌పై ఈ కేసు నమోదవ‌డం.. ట్విట‌ర్‌ను వార్నింగ్ ఇచ్చేందుకేనా అనే అనుమానం వ్య‌క్త‌మ‌వుతోంది.   అయితే భారత్‌లో అధికారులను నియమించినట్లు ట్విటర్‌ వెల్లడించింది. ట్వీట్ల పరంగా తమకు వచ్చే ఫిర్యాదుల పరిశీలనకు సంధానకర్తగా ఓ అధికారిని నియమించినట్లు తెలిపింది. ఈ వివరాలను ఐటీ మంత్రిత్వశాఖకు త్వరలో తెలియజేస్తామని తెలిపింది. అంత‌లోనే ‘మధ్యవర్తి హోదా’ ర‌ద్దు చేస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకోవ‌డంతో.. పిట్ట‌.. కుయ్యో మొర్రో అంటోంది. మోదీనా మ‌జాకా....

ఖ‌త‌ర్నాక్ లేడీ.. 22సార్లు కెమెరాల‌కు చిక్కి...

అస్లీ హైద‌రాబాదీ.. టీనేజ్ గర్ల్‌.. ఫుల్ యాక్టివ్‌.. పేరెంట్స్ పొజిష‌న్ ఓకే.. కూతురు అడ‌గ్గానే బండి కొనిచ్చారు.. జిల్ జిల్ జిగా అంటూ.. ఆ లేడీ.. ర‌య్ ర‌య్ మంటూ బండిపై చ‌క్క‌ర్లు కొట్టేది. ఉండేది నిజాంపేట‌లోనైనా.. ఆ చుట్టుప‌క్క‌ల ఏ ఏరియాలో చూసినా ఆమే క‌నిపించేది.. ఇలా ఏళ్లుగా బండిపై తిరుగుతూ తిరుగుతూ.. బైక్ రైడింగ్ ఫుల్ ప‌ర్‌ఫెక్ట్ అయిపోయింది.. లోక‌ల్‌లో గ‌ల్లీల‌న్నీ తెలిసిపోయాయి.. అస‌లే ఫ్రెండ్స్ ఎక్కువాయే.. ఎవ‌రు ఫోన్ చేసినా.. ఇంట్లో ఏ ప‌ని ఉన్నా.. బండేసి బ‌య‌ట‌కి రావ‌డ‌మే.. రోడ్డు మీద రిమ్ జిమ్.. రిమ్ జిమ్ అంటూ తిర‌గ‌డ‌మే.... క‌ట్ చేస్తే.. వ‌న్ ఫైన్ డే.. ఆ బండిని ట్రాఫిక్ పోలీసులు ఆపారు.. ఇన్నేళ్లుగా బండి న‌డుపుతున్నా.. ఆమెను పోలీసులు ఆప‌డం అదే ఫ‌స్ట్ టైమ్‌.. నా ఏరియాలో న‌న్నే ఆపుతారా? అన్న‌ట్టు చూసింది వాళ్ల‌వైపు. స్పీడ్ పెంచి ఎక్కేప్ అయిదామ‌నీ ట్రై చేసింది.. కానీ ట్రాఫిక్ పోలీసులు ఊరుకుంటారా? ఎంత మందిని చూసుంటారు వారు.. ఎంత మందిని ప‌ట్టుకుని ఉంటారు.. సో, పోలీసుల నుంచి త‌ప్పించుకోవ‌డం ఆమె వ‌ల్ల కాలేదు.. బండి ప‌క్క‌న పెట్ట‌మ‌న్నారు కాప్స్.. బండి సైడ్‌లో పార్క్ చేసింది ఆ యువ‌తి... పోలీసుల ద‌గ్గ‌ర ఉన్న ట్యాబ్‌లో ఆ యువ‌తి బండి నెంబ‌ర్ ఎంట‌ర్ చేశారు.. అంతే షాక్‌.. ఆ ట్యాబ్‌ను ఆమెకు కూడా చూపించారు.. ఆమె కూడా షాక్‌.. ఇంత‌కీ, అంత‌మంది షాక్ తిన్న విష‌యం ఏంటంటే.. ఆమె బండి నెంబ‌ర్ మీద‌.. ఆమె ఫోటోల‌తో స‌హా.. ఏకంగా 22 చ‌లాన్లు ఉన్నాయి.. ఒక‌టా, రెండా.. ఓ యువ‌తి 22 సార్లు రూల్స్‌ బ్రేక్ చేయ‌డం చూసి ట్రాఫిక్ పోలీసులే అవాక్క‌య్యారు.. ఖ‌త‌ర్నాక్ కేండిడేట్‌గా ఉందే అంటూ ఆశ్చ‌ర్య‌పోయారు.. సెల్‌ఫోన్ మాట్లాడుతూ, ఒంటి చేత్తో బండి న‌డుపుతున్న ఫోటో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ ఫోటో చూసి.. వారెవా, సింగిల్ హ్యాండ్‌తో య‌మ స్పీడ్‌గా భ‌లే న‌డుపుతుందే బండి అనిపించ‌క మాన‌దు.. ఎంతైనా హైద‌రాబాద్ అమ్మాయా మ‌జాకా... సోల్‌ఫోన్ డ్రైవింగ్‌, హెల్మెట్ లేకుండా రైడింగ్‌.. ఇలా మొత్తం 22 చ‌లాన్లు.. 9,070 రూపాయ‌ల ఫైన్‌..  వామ్మో ఈ కేసు మ‌హా ముదురు అనుకున్నారు కూక‌ట్‌ప‌ల్లి పోలీసులు. వెంట‌నే బండి స్టేష‌న్లో పెట్టి.. ఆ యువ‌తి పేరెంట్స్‌ను పిలిపించారు. వాళ్ల‌ కూతురు బండి య‌వ్వారంపై కౌన్సెలింగ్ ఇచ్చారు. 9,070 ఫైన్ క‌ట్టించుకొని.. వార్నింగ్ ఇచ్చి పంపించారు. పేరెంట్స్ సైతం చాలా ప్రాక్టిక‌ల్‌గా ఉన్న‌ట్టున్నారు.. తిరిగితే తిరుగు కానీ.. ట్రాఫిక్ పోలీసుల కంట ప‌డ‌కుండా త‌ప్పించుకు తిరుగు అంటూ కూతురుకు స‌ల‌హా ఇచ్చారు. ఎందుకైనా మంచిది.. ఏ సందులోనో ట్రాఫికోళ్లు కాపు కాసి ఫోటోలు తీసి ఫైన్లు వేస్తారు.. ఈసారి నుంచి హెల్మెట్ త‌ప్ప‌కుండా పెట్టుకో.. జుట్టు క‌రాబు ఐత‌ద‌ని మానేయ‌కంటూ కూతుర్ని కాస్త మంద‌లించారు.. 9వేలు ఫైన్ కట్టాల్సి వ‌చ్చింద‌నే బాధే కానీ, ట్రాఫిక్ రూల్స్‌, హెల్మెట్ లాంటి వేమీ వాళ్ల త‌ల‌కు ఎక్కిన‌ట్టు అనిపించ‌లేదు.. ఎంతైనా హైద‌రాబాదీస్ క‌దా... అలానే ఉంటారు మ‌రి.....  

ఏపీకి ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ గుడ్ బై! జగన్ సర్కార్ పై విశాఖ వాసుల ఫైర్..

మూడు నిర్ణయాల... ఆరు కేసులు.. తొమ్మిది కొట్టివేతలు... అన్నట్లుగా సాగుతోంది ఏపీ పాలన. జగన్ రెడ్డి పాలనలో అంతా రివర్స్ గా ఉందనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ అనాలోచిత, అడ్డగోలు నిర్ణయాలతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. గత రెండేండ్లలో ఏపీకి కొత్తగా ప్రాజెక్టులు రాలేవు. వ్యాపారవేత్తలు పెట్టుబడులకు ముందుకు రావడం లేదు. వైసీపీ నేతల తీరుతో గతంలో కంపెనీలు పెట్టిన వారు.. ఏపీ నుంచి పరారవుతున్నారు. తాజాగా మరో ప్రతిష్టాత్మక కంపెనీ ఏపీకి గుడ్ బై చెప్పేసింది.  జగన్ రెడ్డి సర్కార్ విధానాలతో విసిగిపోయి... ఫార్చ్యూన్‌-500 కంపెనీల్లో ఒకటైన ‘ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ ఏపీకి బైబై చెప్పేసింది. విశాఖపట్నంలో తమ కార్యాలయాన్ని నిర్మించేందుకు ముందుకొచ్చి గత ప్రభుత్వ హయాంలో ఒప్పందం కూడా చేసుకుంది ‘ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ . ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో విశాఖపట్నానికి వచ్చేది లేదని ప్రకటించింది. ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌  సంస్థ విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గోల చేసింది వైసీపీ. అధికారంలోకి వచ్చాకా కూడా అలాగే వ్యవహరించింది.  ప్రపంచంలోని 500 గొప్ప కంపెనీల్లో ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ ఒకటి. అందుకే అప్పటి సీఎం చంద్రబాబు... ఆ సంస్థను ఏపీకి తీసుకొచ్చేందుకు శ్రమించారు.  ప్రత్యేక చొరవ తీసుకుని ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌తో మాట్లాడి విశాఖకు వచ్చేందుకు ఒప్పించారు. సంస్థ సీఈవో జెన్నీ జాన్సన్‌ స్వయంగా వచ్చి... విశాఖపట్నంలో కార్యాలయం నిర్మాణానికి ఒప్పందం చేసుకున్నారు. భూమిపూజ కూడా చేశారు. హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్‌ రాక ఎంత కీలకమో... నవ్యాంధ్రలో విశాఖకు ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ అంత ముఖ్యమని అప్పట్లో భావించారు. మరిన్ని ఐటీ, ఇతర అనుబంధ కంపెనీల రాకకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని ఆశించారు. ఈ సంస్థకు విశాఖలోని మధురవాడ ఐటీ హిల్స్‌పై దీనికి స్థలం కేటాయించారు. అయితే ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ రాకపై అప్పట్లో విపక్షంలో ఉన్న వైసీపీ అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. ఎంతో విలువైన 40 ఎకరాల భూమి ఎందుకిచ్చారని నిలదీసింది. ఆ తర్వాత వైసీపీయే అధికారంలోకి వచ్చింది. జగన్‌ సీఎం అయిన రెండు నెలల్లోనే ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ సీఈవో రాష్ట్రానికి వచ్చి ప్రభుత్వంతో మాట్లాడారు. ‘40 ఎకరాలు ఇవ్వం, పాతిక ఎకరాలే ఇస్తాం! గత ప్రభుత్వం కేటాయించిన ట్లుగా రూ.32 లక్షలకు కేటాయించం. ఎకరాకు 64 లక్షలు ఇవ్వాలి’ అంటూ కొత్త ప్రభుత్వం కొత్త లెక్కలు చెప్పింది. దీంతో  ప్రభుత్వ పెద్దల వైఖరి ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌కు నచ్చలేదని సమాచారం.  ఆ తర్వాత ఆ రు కంపెనీ ప్రాముఖ్యతను గుర్తించారో ఏమో, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారికి లేఖ వెళ్లింది. ‘మా రాష్ట్రానికి రండి. విశాఖలో మీ క్యాంపస్‌ పెట్టండి’ అని అందులో ఆహ్వానించారు. అయితే, సదరు కంపెనీ ఆంధ్రప్రదేశ్‌కు రాకూడదనే నిర్ణయం తీసుకుంది. విశాఖలో క్యాంపస్‌ ఏర్పాటు ప్రతిపాదనను ఉపసంహరించుకుంటూ తాజాగా ఆ కంపెనీ టౌన్‌హాల్‌ సమావేశంలో ప్రకటించినట్లు తెలిసింది.

కన్న కూతురికి నిప్పు.. ఎందుకో తెలుసా? 

నవమాసాలు మోశారు. జన్మనిచ్చారు. పెంచి పెద్దగా చేశారు. చివరికి అదే కూతురి ప్రాణం తీశారు. ప్రేమకి మారు పేరు అమ్మనాన్న అని అంటారు అదే ప్రేమకు కూతురు ఇంకొకరితో పంచుకుంటే తట్టుకోలేకపోయారు. ఒక్క సారిగా ఆకలి తీర్చని పరువు గురించి ఆలోచించారు. డబ్బులు ఇస్తేగాని ఓటు వేయని సమాజంలో, తన ఇంటి గురించి పట్టించుకోవడం ఎప్పుడో మానేసి పక్కోడి ఇంటి పై కన్ను వేసే ఈ సమాజంలో లో బతుకుతూ కూడా చివరికి కన్నా కూతురు ఆమె ప్రేమ బరువై ఆ ఆ తల్లిదండ్రులు  కన్నా కూతుర్నే కడతేర్చారు.   అది కడప జిల్లా.  రాయచోటి. ప్రేమ వ్యవహారం ఓ యువతి ప్రాణాల మీదికి తెచ్చింది. ఓ యువకుడిని ప్రేమించిందన్న కోపంతో పాటు  తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఒక యువతిపై కుటుంబసభ్యులే పెట్రోల్‌ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి పాల్పడ్డారు. రాయచోటి సీఐ జి.రాజు కథనం మేరకు. సదరు యువతి స్థానికంగా ఓ యువకుడిని ప్రేమించింది. ఈ వ్యవహారం ఇష్టం లేని కుటుంబసభ్యులు ఆమెకు మరో సంబంధం చూసి పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వచ్చిన సంబంధాలన్నీ ఆమె చెడగొడుతోంది. దీంతో కొద్దిరోజులుగా కుటుంబసభ్యులతో ఆమెకు గొడవ జరుగుతోంది. ఈ క్రమంలోనే మంగళవారం మరోసారి కుటుంబ సభ్యులు పెళ్లి విషయంపై బలవంతం చేయగా ఆమె నిరాకరించింది. తాను ప్రేమించిన వాడిని తప్ప వేరెవరినీ పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పేసింది. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు, సోదరుడు ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. యువతి కేకలు వేయడంతో ఆమె అక్క, స్థానికులు వచ్చి మంటలు ఆర్పివేశారు. తీవ్రంగా గాయపడిన ఆమెను కడప రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అమ్మానాన్నలు అంతే పిల్లల బలాన్ని ఇష్టపడమే కాదు. పిల్లల బలహీనతలను కూడా ఇష్టపడాలి. కష్టాల్లోనూ తోడు ఉండాలి.. ప్రేమించిన వాడికి పెళ్లి చేస్తే ఆ తర్వాతే మేము చూసుకుంటాం కదా మా జీవితం ఏంటో అని పిల్లలు అనుకుంటారు.. పెళ్లి చేసిన తర్వాత ఆ అబ్బాయి మనసు మరి మా అమ్మాయిని వదిలేస్తే అప్పుడు మా అమ్మాయి జీవితం నాశనం అవుతాడని తల్లిదండ్రులు ఆలోచిస్తారు. ఇద్దరి ఆలోచనలో తప్పులేదు. 

వివేకా కుటుంబ సభ్యులకు బెదిరింపులు? భద్రత కల్పించాలన్న సునీతా రెడ్డి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. హత్య కేసుపై విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులు... గత వారం రోజులుగా పులివెందులలోనే ఉన్నారు. పలువురిని ప్రశ్నించారు. అనుమానాస్పదంగా ఉన్న కాన్వాయ్ పై సీబీఐ ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది. సీబీఐ విచారణ సాగుతున్న సమయంలోనే వైఎస్ వివేకా కూతురు సునీతా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది.  తన తండ్రి హత్య కేసులో నిందితులు ఎవరో తేల్చాలని పోరాడుతున్న తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ ఆరోపించారు వైఎస్ సునీతా రెడ్డి. తాజాగా ఆమె కడప జిల్లా ఎస్పీని కలిశారు. పులివెందులలో తనకు భద్రత కల్పించాలని  కోరారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ముప్పు ఉందని భావిస్తున్నామని పోలీసులకు తెలిపారు. తన ఇంటి వద్ద భద్రత ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. సీబీఐ కేసు దర్యాప్తు నేపథ్యంలో ఆమె ఈ వినతి చేశారు. సునీతా ఎస్పీని కలిసి భద్రత కోరడంతో.. సొంత కుటుంబ సభ్యులకు భద్రత లేకుంటే ఏపీ లో పరిస్థితి ఏంటో జగనే చెప్పాలనే వాదన వస్తోంది.  2019 మార్చి 15న వివేకాను పులివెందులలోని ఆయన నివాసంలోనే కిరాతకంగా హత్య చేశారు. సీఎంగా ఉన్న వ్యక్తి బాబాయ్ హత్య కేసులో నిందితులు ఎవరో ఏండ్లు గడుస్తున్నా తేలకపోవడం మిస్టరీగా మారింది. వైఎస్ జగన్ ఎన్నికలకు ముందు వైఎస్ వివేకా కేసును సీబీఐకి అప్పగించాలని కోరి, ఎన్నికల అనంతరం సీబీఐకి ఇవ్వద్దు అని పిటిషను ఉపసంహరించుకోవడంతో అసలు ఈ హత్యపై అప్పటి నుంచి ప్రజలకు అనుమానాలు బలపడ్డాయి. ఆ తర్వాత కూతురు సీబీఐకి ఇవ్వాలని కోరడం, అనుమానితుల పేర్లు బయటపెట్టడం సంచలనమైంది. తన తండ్రి హత్యపై  న్యాయం కావాలని, హంతకులను త్వరగా పట్టుకోవాలని వివేకా కూతరు డాక్టరు సునీత పోరాడుతున్నారు.  

ఇక పై చికెన్, మటన్ లకు..  క్యూలు అవసరం లేదు.. 

తెలంగాణ లో ముక్క సుక్క చాలా ప్రాధాన్యత ఇస్తారు. పాదుగొచ్చిన, పబ్బం వొచ్చిన.. పుట్టున, సచ్చినా. పురుడుపోసిన, పెళ్లి జరిగిన, రథం చేసిన ఏం చేసిన ముక్క లేనిదే ముద్దాదిగడనే చెప్పాలి. ఇది ఇలా ఉంటే ఆదివారం వస్తే చాలు చికెన్, మటన్ కోసం దుకాణాల ముందు జనం చిరంజీవి సినిమా టికెట్ కోసం క్యూ కట్టినట్లు క్యూ కడుతారు. మాములు టైములో అయితే ఒక కానీ కరోనా టైం లో కూడా మటన్ చికెన్  దుకాణానికాణాల ముందు క్యూ లు తగ్గడం లేదు. సోషల్ డిస్టెన్స్ లేదు ఈ మధ్య విజయవాడలో కరోనా నిబంధనలు పాటించకుండా ఈ దుకాలనాల ముందు ప్రజలు గుంపులు గుంపులుగా ఉన్నారని మటన్, చికెన్ షాపులు క్లోజ్ చేశారు. అయితే తెలంగాణాలో తాజాగా  మటన్ షాప్ ముందు చికెన్ షాప్ ముందు క్యూ కట్టాల్సిన అవసరంలేదని తెలిచేసింది.. మరి ఎలా అనుకుంటున్నారా..? కంగారు ఎందుకు క్లారిటీ కింది ప్యారాలో ఉంది చదవండి.  ఇక ఆది,మంగళ, బుధ వారాల్లో ఆ షాపుల ముందు భారీ క్యూలైన్లు ఉండదు. ఆ క్యూ లో నిలబడి మన టైం వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ సమస్య నుంచి గ్రేటర్ ప్రజలకు విముక్తి కలుగనుంది. ఇక మాంసం కూడా మీ ఇంటి వద్దకే వస్తోంది. నగరంలో మినీ స్లాటర్‌హౌజ్‌ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. నగరంలో ​​మినీ స్లాటర్‌హౌజ్‌ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇవి పూర్తిస్థాయిలో ఏర్పాటు అయితే ఇక మాంసం దుకాణాల ముందు పడిగాపులు పడాల్సిన అవసరం లేదు. మన ఇంటి వద్దకే మాంసం కూడా వచ్చేస్తోంది. బోడుప్పల్‌ చెంగిచర్లలోని జాతీయ మాంస పరిశోధనా సంస్థ (ఎన్‌ఆర్‌సీఎం) శాస్త్రవేత్తలు మినీ స్లాటర్ హౌజ్‌ల ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. మంగళవారం చెంగిచర్లలోని ఎన్‌ఆర్‌సీఎంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో శాస్త్రవేత్తలు డాక్టర్‌ రామకృష్ణ, డాక్టర్‌ గిరీష్‌పాటిల్‌ వివరాలు వెల్లడించారు. మినీ స్లాటర్ హౌజ్‌లో తక్కువ వ్యవధిలోనే 10 వరకు గొర్రెలు, మేకలను వధించొచ్చు. అంతేకాకుండా జంతు వధ ద్వారా వచ్చే వ్యర్థాలను గోబర్‌గ్యాస్‌గా ఉపయోగించుకొనేందుకు వీలుగా ఓ కంటైనర్‌ను పొందుపర్చారు. సుమారు రూ.10 లక్షల వరకు ఖర్చయ్యే వీటి ఏర్పాటుకు నాబార్డు నుంచి రుణ సదుపాయం కల్పించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్‌కు ప్రతిపాదనలు పంపినట్లు వారు పేర్కొన్నారు.  ఇప్పటికే ఉప్పు దగ్గరి నుండి పడుకునే బెడ్ వరకు అన్ని ఆన్లైన్ లో దొరుకుతున్నాయి. ఇంకా మందు ఒక్కటి ఆన్లైన్ లో దొరికితే సరిపోతుంది.. ఆ కొంచం కూడా బయటికి రాకుండా.. తిని ఇంట్లోనే పడుకొని ఎంచక్కా పొట్టలు పెంచుకుని లేని పోనీ రోగాలు తెచ్చుకుని మళ్ళీ దావఖానాలకు పరిగెత్తాలి.. అదే మనకు కావాల్సిందే.. చివరికి అదే జరిగేది..  

30 మంది ఎమ్మెల్యేలు జంప్? 

కొవిడ్ కల్లోలం కొనసాగుతుండగానే.. దేశంలో రాజకీయ వేడి కూడా అదే స్థాయిలో ఉంటోంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత... దేశ రాజకీయాల్లో ఊహించని మార్పులు జరుగుతున్నాయి. రాజకీయ నేతల వలసలు ఊపందుకున్నాయి. ఎవరూ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో కూడా తెలియని పరిస్థితి ఉంది. యూపీ కాంగ్రెస్ సీనియర్ నేత జితిన్ ప్రసాద కమలం గూటికి చేరడం సంచలనమైంది. తెలంగాణలోనూ కేసీఆర్ కేబినెట్ లో సీనియర్ అయిన ఈటల రాజేందర్ కాషాయ కండువా కప్పుకోవడం కీలకమైంది.  పశ్చిమ బెంగాల్ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికల ముందు తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీ లోకి జంప్ అయిన నాయకులు ఇప్పుడు తిరిగి టీఎంసీ తీర్థం తీసుకోవడానికి క్యూ కడుతున్నారు. మమతతో విభేదించి బీజేపీ లో చేరిన  సీనియర్ నేత  ముకుల్ రాయ్ ... తిరిగి సొంత గూటికి చేరారు. తాజాగా బెంగాల్ లో 30 మంది బీజేపీ ఎమ్మెల్యేలు టీఎంసీ వైపు చూస్తున్నారనే వార్తలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. 30 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, ఎప్పుడైనా వాళ్లు దీదీని కలిసే ఛాన్స్  ఉందని తృణమూల్ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీలో  ప్రతిపక్ష నాయకుడు శుభేందు అధికారి బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ జగదీప్ ధంఖర్‌ ను  కలిశారు. అయితే గవర్నర్ భేటీరి 24 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడంతో జంపింగ్ వార్తలకు బలం చేకూరుతోంది. గవర్నర్ సమావేశానికి హాజరుకాని ఎమ్మెల్యేలంతా తృణమూల్ లో చేరవచ్చనే చర్చ జరుగుతోంది.  బీజేపీ నుంచి వలసలు మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచే మొదలయ్యాయి. సుబేంగు నాయకత్వంలో పనిచేసేందుకు చాలా మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఇష్టపడటం లేదని తెలుస్తోంది.  పార్టీ ఎంపీ శంతనుడు ఠాకూర్, ముగ్గురు ఎమ్మెల్యేలు ఇటీవల బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఏర్పాటు చేసిన సమావేశంలో హాజరు కాలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే బెంగాల్‌లో సిఎఎ చట్టాన్ని అమలు చేయాలన్న బీజేపీ వైఖరిపై ఎంపి శాంతను ఠాకూర్ అసంతృప్తితో ఉన్నారు. వీరితో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు బిస్వాజిత్ దాస్, అశోక్ కీర్తానియా , సుబ్రతా ఠాకూర్ కూడా ఎంపి శాంతను ఠాకూర్ తో పాటు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపధ్యంలో వీళ్లు కూడా టీఎంసీ గూటికి చేరవచ్చనే ప్రచారం జరుగుతోంది.  గత ఏప్రిల్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్‌లోని 294 సీట్లలో 213 టీఎంసీ గెలిచింది. 77 స్థానాలను బీజేపీ దక్కించుకుంది. ఎన్నికలకు కొన్ని నెలల ముందు 50 మందికి పైగా తృణమూల్ నాయకులు బిజెపిలో చేరారు. అందులో 33 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడా నాయకులంతా సొంత గూటికి రావాలని కోరుకుంటున్నారని చెబుతున్నారు. దీంతో బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనాలు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.   

ఎస్ఈసీ సాహ్నీకి హైకోర్టు నోటీసులు.. జగన్ కు దెబ్బ మీద దెబ్బ..

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి రాహు కాలం వచ్చేసినట్లే కనిపిస్తోంది. రెండు రోజులుగా జగన్ రెడ్డికి సర్కార్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. సోమవారం ఒక్క రోజే రెండు కేసుల్లో ప్రభుత్వానికి షాక్ తగలగా.. మంగళవారం మరో కేసులోనూ దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.  ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‍పై ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వంతో పాటు, ఇతర ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.  మార్చి 31న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో నీలం సాహ్ని నియామకమయ్యారు. నీలం సాహ్మి ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏప్రిల్ 8న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి. అయితే ఆ ఎన్నికలను హైకోర్టు రద్దు చేసింది. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని సూచించింది. ఎస్ఈసీ వ్యవహారం జగన్  ప్రభుత్వానికి మొదటి నుంచి పెద్ద తలనొప్పిగా మారింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవిలో ఉన్నంత కాలం ఆయనతో వివాదమే నడిచింది. ఎన్నికల విషయంలో ఇరు పక్షాల మధ్య యుద్ధం తారా స్థాయికి చేరింది. ఏపీ ప్రభుత్వం ఎస్ఈసీపై వేటు వేస్తే.. ఆయన న్యాయపోరాటం చేసి మళ్లీ పదవి దక్కించుకున్నారు. ఆయన పదవిలోకి తిరిగి వచ్చిన తరువాత అనుకన్నట్టే ఎన్నికలు నిర్వహించారు. నిమ్మగడ్డ పదవీ కాలం ముగియడంతో ఏపీ ప్రభుత్వం  ఊరట పొందింది.  ఏరి కోరి నీలం సాహ్నికి ఏపీ ప్రభుత్వం కొత్త ఎస్ఈసీగా అవకాశం ఇచ్చింది.అయితే ఆమె నిర్వహించిన పరిషత్ ఎన్నికలు రద్దు కావడం సంచలనమైంది.  ఇక విజయనగరంలోని మాన్సాస్ ట్రస్ట్ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 72ను సోమవారం హైకోర్టు కొట్టేసింది. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా సంచయిత గజపతి  రాజు నియామకం చెల్లదని తీర్పిచ్చింది. అశోక్ గజపతి రాజును తిరిగిన చైర్మన్ గా నియమించాలని ఆదేశించింది. సంగం డెయిరీ కేసులోనూ ఏసీబీ వేసిన పిటిషన్ ను ఏసీబీ స్పెషల్ కోర్టు కొట్టివేసింది. 

ఏపీ సీఎం, మంత్రుల కోసం టీడీపీ సీనియర్ నేత పూజలు..

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య వార్ సాగుతోంది. ప్రతి విషయంలోనూ ఇరు వర్గాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటీవల కాలంలో రెండు పార్టీల మధ్య వార్ తారా స్థాయిలో జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఏపీ ముఖ్యమంత్రితో పాటు మంత్రుల కోసం ఓ టీడీపీ సీనియర్ నేత పూజలు చేశారు.. అవును మీరు చదివింది నిజమే... ఏపీ ముఖ్యమంత్రితో పాటు మంత్రుల కోసం కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు.. పైడి తల్లి అమ్మవారికి పూజలు చేశారు.  అయితే అశోక గజపతి రాజు పూజలు చేసింది వాళ్లకు మంచి ప్రసాదించాలని. సీఎం జగన్ తో సహా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు జ్ఞానం ప్రసాదించాలని.. అప్పుడే ప్రజలందరికీ మంచి జరుగుతుంది అంటూ పైడితల్లి అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు అశోక్ గజపతి రాజు.విజయనగరంలోని పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న ఆయన.. వైసీపీ నేతల గురించి మొక్కుకున్నారు. మాన్సాస్‌ ట్రస్టు, సింహాచలం దేవస్థానం ఛైర్‌పర్సన్‌గా సంచయిత నియామకం చెల్లదంటూ  సోమవారం హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అలాగే అశోక్ గజపతి రాజును తిరిగి చైర్మన్ గా నియమించాలని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పుపై సంతోషం వ్యక్తం చేసిన అశోక గజపతి రాజు.. ఆలయానికి వెళ్లి పైడి తల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.గత  రెండేళ్ల కాలంలో రాష్ట్రంలో ఎన్నో అలజడులు సృష్టించారని.. తనపై కక్ష గట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరించారని అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  సింహాచలం గోశాలలో గోవులను హింసించి చంపేయడం తీవ్రంగా కలచివేసిందన్నారు. మాన్సాస్‌ సంస్థను అనేక రకాలుగా నష్టపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రస్టు ఆధ్వర్యంలోని 105 ఆలయాల్లో ఏమేం జరిగాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు గజపతి రాజు.  గతంలో రామతీర్థం, పైడితల్లి అమ్మవారు దేవ స్థానం అనువంశక ధర్మకర్తగా ఉన్న అశోక్‌ గజపతిరాజును జగన్ప్ర భుత్వం తప్పించింది. రామతీర్థం కొండపైనున్న విగ్రహాల ధ్వంసం సందర్భంలో గొడవలను బూచిగా చూపి ఆయనపై వేటు వేసింది. ఆ జీఓను సవాల్‌ చేస్తూ అశోక్‌ గజపతిరాజు కోర్టుకు వెళ్లారు. కొద్ది నెలల్లోనే జీఓను కోర్టు కొట్టి వేసింది. తిరిగి అశోక్‌ గజపతిరాజునే అనువంశక ధర్మకర్తగా నియమించాలని ఆదేశించింది. ఇపుడు సింహాచల దేవస్థానం, మాన్సాస్‌ ట్రస్టు వంతు వచ్చింది. గతేడాది మార్చి5 ముందురోజు రాత్రి విడుదలైన జీఓను హైకోర్టు సోమవారం కొట్టివేసింది. అశోక్‌ గజపతిరాజునే చైర్మన్‌గా కొనసాగించాలని సూచించింది. 

జులైలో ఫిక్స్‌!.. ప‌రీక్ష‌ల‌కు ప‌రీక్షాస‌మ‌యం.. ప్రాణాల‌తో చెల‌గాటం!

మే.. జూన్‌.. జులై.. నెల‌లు అయితే వెన‌క్కి జ‌రుపుతున్నారు కానీ.. ప‌రీక్షల విష‌యంలో వెన‌క‌డుగు మాత్రం వేసేది లేదంటోంది జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు. ఎవ‌రెంత మొత్తుకున్నా.. ప్ర‌తిప‌క్షాలు గ‌గ్గోలు పెడుతున్నా.. విద్యార్థులు, త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చెందుతున్నా.. ప్రాణాల‌కే ప్ర‌మాదం పొంచి ఉన్నా.. ప‌రీక్ష‌ల విష‌యంలో త‌గ్గేదే లే అంటున్నారు. ఎట్టిప‌రిస్థితుల్లో జులై నెల‌లో ప‌ది, ఇంట‌ర్ ఎగ్జామ్స్ జ‌రిపి తీరుతామ‌ని ప్ర‌క‌టించేస్తున్నారు.  కేంద్రం ప్ర‌భుత్వం ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ర‌ద్దు చేసింది. తెలంగాణ సైతం క్యాన్సిల్ అనేసింది. అనేక రాష్ట్రాలు సైతం నో ఎగ్జామ్స్ స్టేట్‌మెంట్స్ ఇచ్చేశాయి. ఒక్క ఏపీ మాత్ర‌మే ఎగ్జామ్స్ విష‌యంలో మొండిప‌ట్టుద‌ల‌కు పోతోంది. నారా లోకేశ్ మీద కోప‌మో.. లేక విద్యార్థులంటే చిన్న‌చూపో.. కార‌ణం ఏదైనా కానీ, విద్యార్థుల భ‌విష్య‌త్తు కోస‌మే ప‌రీక్ష‌లు జ‌రిపి తీరుతామ‌ని ప్ర‌క‌టిస్తోంది. ఆ విద్యార్థులే త‌మ‌కు ఎగ్జామ్స్ వ‌ద్దు బాబోయ్ అంటున్నా.. పిల్ల‌ల భ‌విష్య‌త్ కాంక్షించే పేరెంట్స్ భ‌య‌ప‌డుతున్నా.. ఏపీ స‌ర్కారు మాత్రం ఎగ్జామ్స్ నిర్వ‌హించే నెల‌ల‌ను మారుస్తుందే కానీ, మ‌న‌సు మాత్రం మార్చుకోవ‌డం లేదు.  కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో జులైలో పరీక్షలు నిర్వహించాలని ఏపీ విద్యాశాఖ భావిస్తోంది. వచ్చేనెల మొదటి వారంలో ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. జులై చివరి వారంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందన్నారు. సీఎం జగన్‌తో చర్చించి పరీక్షల ఏర్పాట్లపై తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. విద్యార్థుల ప్రయోజనం కోసమే పరీక్షలు నిర్వహణ అని తెలిపారు.  ఇంటర్‌ పరీక్షలకు 10 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరవుతారు. పరీక్షల నిర్వహణకు 15 రోజుల ముందు షెడ్యూలు ప్రకటించాలి. ఈ నెల 20 వరకూ కర్ఫ్యూ ఉంది. ఆ తర్వాత వైద్యశాఖ అధికారుల సూచనలతో పరీక్షల సమయాన్ని ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జులైలో ఇంటర్‌ పరీక్షలు పూర్త చేసి.. ఆగస్టులో ఇంజినీరింగ్‌, ఫార్మసీ ఎంట్ర‌న్స్ ఎగ్జామ్స్ నిర్వ‌హించాల‌నే ఆలోచ‌న‌లో ఉంది ఏపీ స‌ర్కారు. మ‌రి, ఎగ్జామ్స్ సంద‌ర్బంగా విద్యార్థులు క‌రోనా బారిన ప‌డితే ఎవ‌రు బాధ్యులు అనే ప్ర‌శ్న‌కు మాత్రం ప్ర‌భుత్వం నుంచి స‌మాధానం లేదు.   

అంతా ర‌హ‌స్యం.. గ‌ప్‌చుప్‌గా అమ్మేస్తారా?

ఒకప్పుడు అంతా పార‌ద‌ర్శ‌కం అన్నారు. ఇప్పుడు అంతా ర‌హ‌స్యం అంటున్నారు. అంతా ఏపీ స‌ర్కారుకు చెప్పే చేస్తున్నామ‌న్నారు. కేంద్రానికి జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం స‌హ‌క‌రిస్తోంద‌ని తెలిపారు. ఆ అమ్మ‌కం వివ‌రాలు ఏంటో చెప్పాల‌ని అడిగితే మాత్రం హుష్‌.. గ‌ప్‌చుప్ అంటున్నారు. విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని అడ్డ‌గోలుగా అమ్మే య‌వ్వారం బ‌య‌ట‌పెట్టేందుకు స‌సేమిరా అంటూ మొండికేస్తున్నారు. తాజాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆర్టీఐ ద్వారా సమాచారం ఇచ్చేందుకు డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్-డిఐపీఏఎం నిరాకరించింది. ఆ వివ‌రాలు ఆర్థిక ర‌హ‌స్యాలంటూ ఆర్టీఐ అభ్య‌ర్థ‌న‌ను తిర‌ష్క‌రించింది. ఆర్టీఐ కార్యకర్త ఇనుగంటి రవికుమార్ అడిగిన సమాచారాన్ని ఇచ్చేది లేదని డిఐపీఏఎం స్పష్టం చేసింది. విశాఖ ఉక్కులో పెట్టుబడుల ఉపసంహరణ అంశం ఆర్ధిక రహస్యాల పరిధిలోకి వస్తుందని తెలిపింది. ఈ అంశంపై సీఎం జగన్ , ప్రతిపక్షనేత చంద్రబాబు రాసిన లేఖలపై సమాధానం ఇవ్వాలంటూ ప్రధాని కార్యాలయం ఆదేశించినా డిఐపీఏఎం పట్టించుకోలేదు. విశాఖ స్టీల్ ప్లాంటులో పెట్టుబడుల ఉప సంహరణ సమాచారం సెక్షన్ 8 (1) (ఏ) కింద గోప్యంగా ఉంచాలని డీఐపీఏఎం చెప్పింది.  న‌ష్టాల పేరుతో విశాఖ ఉక్కును అడ్డ‌గోలుగా అమ్ముకోవాల‌ని ఇప్ప‌టికే కేంద్రం నిర్ణ‌యించింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేసింది. పార్ల‌మెంట్‌లోనే ఆ మేర‌కు ప్ర‌క‌ట‌న చేసింది కేంద్రం. అయితే, ఆ ప్రైవేటీక‌ర‌ణ స‌మాచారం ఇచ్చేందుకు మాత్రం స‌సేమిరా అంటుండ‌టం ఆస‌క్తిక‌రం. అమ్మ‌కంలో గోల్‌మాల్ వ్య‌వ‌హారాలు ఏమీ లేక‌పోతే.. అంత దాప‌రికం ఎందుక‌నేది కార్మికుల ప్ర‌శ్న‌. అందుకే, ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా స‌మ్మెకు సిద్ధ‌మ‌వుతున్నారు స్టీల్ ప్లాంట్ సిబ్బంది. ఈ మేర‌కు యాజ‌మాన్యానికి స‌మ్మె నోటీసులు కూడా ఇచ్చారు. ఇప్ప‌టికే ఆందోళ‌న‌ల‌తో ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా పోరాటం ఉధృతం చేశారు. తాజా స‌మ్మె నోటీసుల‌తో ఉద్య‌మం మ‌రింత ఉర‌క‌లెత్త‌నుంది.   

లేడీ గెటప్ లో... మహిళను చంపిన వ్యక్తి...

సినిమాలు కథకు అనుకూలంగా తమ భాషా, వేషధారణ మార్చుకుంటారు.. ఆ కథలో పాత్రను అద్భుతంగా పండిస్తారు.. ఇంకొంత మంది పొట్ట కూటికోసం రకరకాల వేశారు వేస్తారు.. కొంత మంది ఎదుటి వాళ్ళను నవ్వించడానికి వేషాలు వేస్తారు.. ఇలా ఈ సమాజం లో ఒక్కక్కరు ఎవరి వారి అవసరాలను బట్టి వారు ఆయా వేషాలు వేస్తారు. కానీ తాజాగా ఒక మగాడు ఒక మహిళను చపడానికి వేషం వేసుకున్నాడు.. అది ఏం వేషం అనుకుంటున్నారా..? అయితే ఏం జరిగిందో.. ఎలా జరిగిందో.. ఎందుకు జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా..? ఐతే మీరు చూడండి తెలుస్తుంది..                అతడి పేరు నేత్రం.. అతని ఇంటి పక్కన ఉన్న ఓ వితంతువు. ఇద్దరు పిల్లలు, చెల్లెలు ఉన్నారు. ఆమె పై ఇతను గత ఏడాది అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నేత్రమ్ ను అరెస్ట్ చేశారు. కొంతకాలం కిందటే అతడు బెయిల్ పై బయటికి వచ్చాడు. అప్పటి నుంచి కేసు ఉపసంహరించుకోవాలని బాధితురాలిపై ఒత్తిడి చేస్తున్నాడు. ఆమె అందుకు అంగీకరించకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఆమెను ఎలాగైనా అంతం చేయాలనుకున్నాడు. అందుకు సినిమా రేంజ్ లో ప్లాన్ వేశాడు.  గత రాత్రి ఎవరూ తనను గుర్తుపట్టకుండా ఉండేందుకు ఓ మహిళ వేషంలో బాధితురాలి ఇంటికి వెళ్లిన నేత్రమ్... నిద్రిస్తున్న ఆమెపై కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన ఆమె చెల్లెలిపైనా దాడి చేశాడు. అనంతరం అక్కడ్నించి పరారయ్యాడు. కత్తిపోట్లకు గురైన బాధితురాలు మరణించింది. పోలీసులు నేత్రమ్ కోసం తీవ్రంగా గాలించి, సోమవారం ఉదయం అతడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన సిరోహి జిల్లా జిల్లాలో చోటు చేసుకుంది. 

పెద్దిరెడ్డి పయనమెటు?  

ఎన్ని పార్టీలు మారినా, తెలుగు దేశం నేతగానే గుర్తుండిపోయే, ప్రస్తుత బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి తదుపరి పయనం ఎటు, అన్నది ఇప్పుడు, రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా హుజురాబాద్’ అసెంబ్లీ నియోజక వర్గంలో చర్చనీయాంశంగా మారింది.పెద్దిరెడ్డి ఎప్పటి నుంచో హుజురాబాద్ సీటు మీద కన్నేసి ఉంచారు. అయితే, అనూహ్య రాజకీయ పరిణామాల నేపధ్యంలో, ఆ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న  మాజీ మంత్రి ఈటల రాజేందర్, తెరాసకు, శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో, పెద్దిరెడ్డి రాజకీయ భవిష్యత్, ‘ఎదర బతుకంతా చిందరవందర’ అన్నట్లుగా మారింది.ఏమి చేయడమో పాలుపోక కావచ్చు. ఈటల బీజేపీ ఎంట్రీని పెద్దిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. జిల్లా నేతలను సంప్రదించకుండా, రాష్ట్ర నాయకత్వం, ఈటలను ఎలా పార్టీలో చేర్చుకుంటుందని గర్జించారు.అలాగే, భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కుంటున్న, మాజీ మంత్రిని పార్టీలోకి తీసుకుని ఎలాంటి సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారని పార్టీ పెద్దలను నిలదీసినంత పనిచేశారు. ఆ విధంగా  పెద్దిరెడ్డి ఆదిలోనే ఈటల ఎంట్రీని అడ్డుకునే గట్టి ప్రయత్నం చేశారు. అయితే, అయన ఆవేదన, ఆక్రందనలను పార్టీ అస్సలు పట్టించుకోలేదు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేదా ఇతర రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరూ, ఆయన వ్యాఖ్యలను పట్టించుకోలేదు. ఎవరూ రియాక్ట్ కాలేదు.  అదలా ఉంటే, ఇక అక్కడి నుంచి మౌనంగా ఉండిపోయిన పెద్దిరెడ్డి మళ్ళీ తెరమీదకు వస్తున్నారు. ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్లి కలువ పూల కాషాయ కండువా కప్పుకుని వచ్చిన నేపధ్యంలో, పెద్ది రెడ్డి బుధవారం హుజురాబాద్ వెళుతున్నారు. కార్యకర్తలతో సమావేసమవుతున్నారు. పార్టీ మారే ముందు సహజంగా నాయకులు వేసే మొదటి అడుగు, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం. కార్యకర్తల మనోభావాలను తెలుసు కోవడం... ఆ తర్వాత కార్యకర్తల బుజాల మీద తుపాకీ తమ మనోగతాన్ని బయట పెట్టడం ... ఆ తర్వాత కథ అందరికీ తెలిసింది. నిన్నగాక మొన్న ఈటల రాజేందర్ చేసిందీ ఇదే .. రేపు పెద్ది రెడ్డి .. మరో రావు చేసేది కూడా అదే.  ఈటల బీజేపీలో చేరడంతో, ఇక పెద్ది రెడ్డి హుజురాబాద్ మీద పెట్టుకున్న ఆశలను వదులుకోక తప్పదు. ఒక వేళ రేపటి  ఉపఎన్నికల్లో ఏ కారణం చేతనైనా ఈటల పోటీ చేయక పోయినా, వారి శ్రీమతి జమున రెడీగా ఉన్నారు. అంతే కాకుండా,బీజేపీలో చేరిన సందర్భంగా సోమవరం ఢిల్లీలో, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి  మీడియా సమావేశంలో మాట్లాడిన ఈటల, “ హుజురాబాద్’ ఉప ఎన్నికలో పోటీ చేస్తాం ... గెలుస్తాం” అని బల్ల గుద్దారు. సరే, గెలుస్తారా లేదా అన్నది పక్కన పెడితే, నియోజక వర్గాన్ని వదులుకునే ప్రశ్నే లేదన్న విషయం  అయితే ఈటల మరోమారు స్పష్టం చేశారు.  సో.. పెద్ది రెడ్డికి  హుజురాబాద్ బీజేపీ తలుపులు శాశ్వతంగా మూసుకుపోయాయి.. ఇక ప్రత్యాన్మాయం చూసుకోవడం ఒక్కటే, ఆయన ముందున్న మార్గం. తెరాసలో ‘నో వేకెన్సీ’ , కేసీఆర్ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణకు ఆహ్వానం పంపారు కానీ, పెద్ది రెడ్డిని పట్టించుకోలేదు. కాంగ్రెస్’లోనూ అదే పరిస్థితి. గత ఎన్నికల్లో ఈటల పై పోటీచేసిన కౌశిక్ రెడ్డి, ప్రస్తుతానికి అయితే పార్టీలోనే ఉన్నారు. అంతే కాదు, ఆయన పార్టీ  మారుతున్నట్లు,అధికార తెరాసలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు.  గత ఎన్నికల్లో స్ట్రెయిట్ ఫైట్ లో 60 వేలకు పైగా ఓట్లు తెచ్చుకున కౌశిక్ రెడ్డి, ఈసారి ముక్కోణపు పోటీలో విజయం సాధించే అవకాశలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు. ఈ పరిస్థితులలో ఆయన కారెక్కుతారా లేదా అనేది ఇప్పుడే తేలే విషయం కాదు. అప్పటివరకు అయితే, కాంగ్రెస్ పార్టీలో కూడా, ‘నో వేకెన్సీ’నే..పెద్ది రెడ్డి గతంలో ఆ పార్టీ ఈ పార్టీ తరిగి చివరకు సొంత గూటికి (టీడీపీ) చేరారు. మళ్ళీ మరో సారి .. ట్రస్ట్ భవన్ మెట్లు ఎక్కుతారా... లేక ఉన్న చోటనే ఉంది పోతారా .. ..లేక ...ఇంకా ... ఏదైనా నిర్ణయం తీసుకుంటారా, తెలియాలంటే మరి కొన్ని గంటలు అగవల్సిందే..