వికారాబాద్ లీడర్ ఇంట్లో రేవ్ పార్టీ.. 

ఈ మధ్య రేవ్ పార్టీలతో నాగరాలే కాదు  పట్టణాలు కూడా చెలరేగిపోతున్నాయి. అంతకు ముందు హైదరాబాద్ లో.. మొన్న కడ్తాల్ లో తాజాగా వికారాబాద్ జిల్లాలో.  లోకల్ లీడర్ మనవరాలి బర్త్ డే పార్టీకి ఘనంగా ఏర్పాట్లు చేశాడు. ఈ వేడుకలకు జనం భారీగా వచ్చారు. అంతేకాకుండా అర్థరాత్రి వరకు డీజేలు పెట్టి హిజ్రాలతో డాన్సులు కూడా చేశారు. ఇప్పుడు ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.   అసలే కరోనా టైం..మనుషులను భయబ్రాంతులకు గురిచేస్తుంది. మనుషులను ఆర్థికంగా కృంగదీస్తుంది..ఈ టైములో లేనోడు లేక ఏడిస్తే ఉన్నోడు తిన్నది అరగక చిందులేస్తున్నాడు. కొంత మంది కరోనా నిబంధనలు పట్టడం లేదు. కేసులు విపరీతంగా నమోదు అవుతున్నా.. జనం మాత్రం ఏ భయం లేకుండా పార్టీలు, ఫంక్షన్లు ఘనంగా చేసుకుంటున్నారు. కరోనా నిబంధనల్ని పట్టించుకోకుండా బర్త్ డే పార్టీలు, రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో ఓ నాయకుడు తన ఇంట్లో ఘనంగా బర్త్ డే పార్టీ నిర్వహించాడు. ఈ పార్టీకి భారీగా అతిథుల్ని పిలవడమే కాకుండా హిజ్రాాలతో అసభ్యకర డాన్సులు కూడా వేయించాడు. దోమ మండలం దిర్సంపల్లిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హిజ్రాలతో అర్ధరాత్రి సమయంలో మందు వేస్తూ చిందులు వేస్తూ రికార్డింగ్ డాన్స్లు చేయడమే కాదు దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈనెల 11వ తేదీన దిర్సింపల్లికి చెందిన పిల్లి మొగులయ్య అనే లోకల్ లీడర్ తన మనవరాలి పుట్టినరోజు వేడుకలు నిర్వహించాడు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లోనే ఘనంగా ఏర్పాట్లు చేశాడు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి డీజేతో హంగామా సృష్టించారు. అంతేకాకుండా ఈ పుట్టినరోజు వేడుకల్లో హిజ్రాలతో అశ్లీల నృత్యాలు చేస్తూ ఎంజాయ్ చేశారు. అయితే ఈ ఫంక్షన్ కి వచ్చిన దోమ మండలం పోలీసులు కూడా వచ్చారు. వారంతా భోజనం చేసి చూసి చూడనట్టు వెళ్ళిపోయారు. అయితే ఈ పుట్టినరోజు వేడుకల్లో హిజ్రాలు చేసిన అశ్లీల నృత్యాలు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టడంతో విషయం మొత్తం బయటకు వచ్చింది. దీంతో నెటిజన్లు పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శల వర్షం కురిపిస్తున్నారు.మొత్తానికి ఈ ప్రపంచం ఎటువైపు పోతుందో అర్థం కర్దవం లేదు.. చాలా మంది ఈ కోవిద్ టైం లో ప్రభుత్వ నిబంధనలను పాటించడం లేదు.. ఫైన్లు వేసిన, కేసులు పెట్టిన, చివరికి పోలీసుకు లాఠీకి పని చెప్పిన ప్రజలు మాత్రం  పెద్దగా పట్టించుకోవడం లేదు.. చాలా వరకు ఎంజాయ్ చేయడానికే ప్రాముఖ్యత ఇస్తున్నారు.. కరోనా వస్తే ఉంటామో , పోతామో అనే అనుమానం మొదలైనయినట్లు ప్రజల్లో.. ప్రజలు గురించి కాసేపు పక్కన పెడితే రాజకీయ నాయకుల ఇలాంటి సంఘ విద్రోహ పనులు చెయ్యడం ఎంత వరకు సమంజసం అంటూ  ప్రజలు ఇలా ఉంటే ప్రభుత్వాలు ఇంత కంటే దారుణంగా ఉన్నాయి స్థానికులు మాట్లాడుకుంటున్నారు..  

ఈట‌ల వెడ్స్ బీజేపీ.. ఎవ‌రికెవ‌రు? ఎవ‌రి లెక్కేంటి?

ప్ర‌త్యేక విమానం వేసుకొని.. మందీమార్బ‌లాన్ని వెంటేసుకొని.. అట్ట‌హాసంగా హ‌స్తిన పోతే.. అక్క‌డ అంతంత మాత్ర‌మే ప్రాధాన్యం ద‌క్కిందంటున్నారు ఈట‌ల ఎపిసోడ్ చూసిన వాళ్లంతా. కాషాయ కండువా అయితే మెడ‌లో వేసుకున్నారు కానీ, ఆయ‌న ముఖంలో వెలుగే లేదంటూ సెటైర్లు వేస్తున్నారు. అమిత్‌షాతో కండువా క‌ప్పించుకోవాల‌ని క‌ల‌లు కంటే.. క‌నీసం బాబుమోహ‌న్ అంత‌టి స్థాయి గౌర‌వం కూడా త‌న‌కు ద‌క్క‌లేదంటూ.. ఉసూరుమంటూ ఢిల్లీ నుంచి తిరిగొచ్చార‌ట ఈట‌ల‌. తెలంగాణలో కేసీఆర్ త‌ర్వాత కేసీఆర్ అంత‌టోడు.. ఢిల్లీకి వెళ్లి.. బీజేపీలో చేరి.. గుంపులో గోవింద‌లా మారిపోయార‌ని అంటున్నారు. తాజా ప‌రిణామంతో ఎవ‌రు ఎవ‌రికి అవ‌స‌రం? ఎవ‌రితో ఎవ‌రికి లాభం? అనే చ‌ర్చ మ‌రోసారి తెర‌మీద‌కు వ‌స్తోంది.   బీజేపీలో ఎంత‌టి వారైనా పార్టీ ముందు దిగ‌దుడుపే. ఒక్క మోదీ, అమిత్‌షాల‌కు మాత్రం మిన‌హాయింపు అనుకోండి. బీజేపీ సైద్దాంతిక ప‌ర‌మైన పార్టీ. నేత‌ల‌కంటే పార్టీ సిద్దాంతాల‌కే అధిక ప్రాధాన్యం ఇస్తుంది. నాయ‌కుల‌కే పార్టీ బ‌లంగా మారుతుంది. క్షేత్ర స్థాయిలో చాప‌కింద నీరులా వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌బెట్టే ఆర్ఎస్ఎస్.. బీజేపీకి వెన్నుముక‌. చిన్న‌ప్పుడే ఖాకీ నిక్క‌రు తొడిగించి.. చేతిలో క‌ర్ర పెట్టి.. హిందుత్వాన్ని గుండెల నిండా నూరుపోసే వ్య‌వ‌స్థ దాని సొంతం. అందుకే, చేతిలో అధికారం ఉన్నా, లేక‌పోయినా.. నిఖార్సైన క‌మ‌ల‌నాథులు పార్టీ వెంటే నిలుస్తారు. ప్రాణం పోయినా పార్టీని వీడ‌రు. అదే బీజేపీ బ‌లం, బ‌ల‌గం.  అయితే, మారుతున్న కాలానికి త‌గ్గ‌ట్టు.. బీజేపీలోనూ కొత్త నీరు వ‌చ్చి చేరుతోంది. రాత్రికి రాత్రే జంపింగ్ జ‌పాంగ్‌లు వ‌చ్చి ప‌డుతున్నారు. గోపీలంతా బీజేపీ వైపే దూకుతున్నారు. సిద్ధాంతాలు తొక్కా తోలు ఏమీ అక్క‌ర‌లేదు. అవ‌స‌రం ఉంటే చాలు. పార్టీ కండువా క‌ప్పేస్తున్నారు. ఎన్నిక‌ల్లో టికెట్ ఇచ్చేస్తున్నారు. ఇదీ ఈ మ‌ధ్య బీజేపీ అవ‌లంభిస్తున్న పొలిటిక‌ల్‌ స్ట్రాట‌జీ. అందుకే, నామినేష‌న్ల‌కు ఆఖ‌రి నిమిషం వ‌ర‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌దు బీజేపీ. ఎందుకంటే, తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల ఆ పార్టీకి అభ్య‌ర్థులే ఉండ‌రు కాబ‌ట్టి. ఆ చివ‌రి గ‌డియ వ‌ర‌కూ వేరే పార్టీ నుంచి కాస్తో కూస్తో పేరున్న నాయ‌కులెవ‌రైనా రాక‌పోతారా? అంటూ ఎదురు చూస్తుంటారు. అందుకే, ప‌క్క పార్టీలో సీట్లు రాని నేత‌లంద‌రికీ, వేరే పార్టీలో ప్రాభ‌వం ద‌క్కని అసంతృప్తులంద‌రికీ బీజేపీనే రాజ‌కీయ వేదిక అవుతోంది. ఎంత కాద‌న్నా.. కొంత‌కాలంగా ఇదే జ‌రుగుతోంది. ఈట‌ల విష‌యంలోనూ అదే జ‌రిగింద‌ని అంటున్నారు.     నా డీఎన్ఏ క‌మ్యూనిజం అని చెప్పుకునే ఈట‌ల‌.. బీజేపీలో చేర‌డం ఆయ‌న అవ‌స‌రమే త‌ప్ప మ‌రొక‌టి కాద‌నేది వాస్త‌వం. కేసీఆర్‌పై పోరాడాలంటే బీజేపీ అయితేనే బెట‌ర్ అనే భావ‌నతో మాత్ర‌మే కాషాయ కండువా కప్పుకుని ఉండి ఉంటారు కానీ.. ఆ పార్టీ సిద్దాంతాలో, నాయ‌క‌త్వ‌మో న‌చ్చి మాత్రం కాక‌పోవ‌చ్చు. కాంగ్రెస్‌లో చేరే అవ‌కాశం ఉన్నా.. మునిగే నావ‌ను ఎక్కేంత అమాయ‌కుడేమీ కాదు ఈట‌ల రాజేంద‌ర్‌. బీజేపీలో చేర‌డం ఈట‌ల‌కు ఎంతో అవ‌స‌రం.. మ‌రి, ఈట‌ల‌తో బీజేపీకి ఎంత అవ‌స‌రం..? ఇదే ఇంట్రెస్టింగ్ క్వ‌శ్చ‌న్‌.  ఢిల్లీలో జ‌రిగిన ప‌రిణామం చూస్తే క్లారిటీ వ‌చ్చేస్తుంది బీజేపీ ఈట‌ల‌కు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో చెప్ప‌డానికి. ముర‌ళీధ‌ర్‌రావు, కిష‌న్‌రెడ్డి, బండి సంజ‌య్‌, డీకే అరుణ‌, ర‌ఘునంద‌న్‌రావు, వివేక్‌.. ఇలా వాళ్ల‌లో ఒక‌డు ఈట‌ల‌. ఇంకా స్ప‌ష్టంగా చెప్పాలంటే వీళ్లంద‌రి త‌ర్వాతే ఈట‌ల‌.. అనే సంకేతాన్ని ధర్మేంద్ర ప్ర‌ధాన్ ద్వారా ఇచ్చేసింది బీజేపీ. మోదీ, అమిత్‌షాలు కాక‌పోయినా.. జేపీ న‌డ్డా అయినా ఈట‌ల‌కు కండువా క‌ప్పితే బాగుండేది అంటున్నారు. కావాల‌నే న‌డ్డా రాలేద‌ని.. పార్టీకంటే ఎవ‌రూ గొప్ప‌కాద‌ని.. ఈట‌ల కోసం తాము వెంప‌ర్లాడ‌లేద‌నే.. మెసేజ్ ఇచ్చేందుకే పార్టీ జాతీయ అధ్య‌క్షులు స్వ‌యానా ఈట‌ల జాయినింగ్ కార్య‌క్ర‌మానికి రాలేద‌ని చెబుతున్నారు. ఆ ప‌రిణామానికి ఈట‌ల‌తో పాటు ఆయ‌న వెంట వెళ్లిన అనుచ‌రులూ కంగు తిన్నార‌ట‌. ఇక ఆ దృశ్యాల‌ను టీవీల్లో చేసిన ఈట‌ల అభిమానులు అప్ప‌టి నుంచి తెగ ఇదై పోతున్నారు. ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ అవుతాయాయేం.. అంటూ తెగ మ‌ద‌న ప‌డుతున్నార‌ట‌.  ఈట‌ల బీజేపీలోకి వెళ్లాల్సింది కాద‌నే మొద‌టి నుంచి అన్ని వ‌ర్గాల నుంచీ వినిపిస్తోంది. కోదండ‌రాం, విశ్వేశ్వ‌ర‌రెడ్డిలాంటి వాళ్లు సైతం ఇదే అభిప్రాయం చెప్పారు. ఈట‌ల వ‌ర్గీయులు సైతం అవ‌స‌ర‌మైతే ఇండిపెండెంట్‌గా పోటీ చేయాల‌ని కోరారు. స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలో దిగితే.. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు త‌మ‌కే ఉంటుంద‌ని భావించారు. ఇండిపెండెంట్ అయితే తామూ మ‌ద్ద‌తిచ్చేందుకు ఆలోచిస్తామ‌ని కాంగ్రెస్ నుంచి కూడా హామీ ల‌భించింది. కానీ, మోసేవాడికే తెలుస్తుంది కావ‌డి బ‌రువు అన్న‌ట్టు.. కేసీఆర్‌ను తాను సింగిల్‌గా ఢీకొట్ట‌లేన‌నే సంగ‌తి ఆయ‌న అనుచ‌రుడైన ఈట‌ల‌కు బహు బాగా తెలుసు. ఇక‌, కాంగ్రెస్ కుమ్ములాట‌ల విష‌యం తెలిసిందే. రేవంత్‌రెడ్డినే నెగ‌ల‌నీయ‌ని ప‌రిస్థితి హ‌స్తం పార్టీది. అందుకే, అన్నీ ఆలోచించే.. అవ‌స‌రం మేర‌కే.. బీజేపీలో చేరారు ఈట‌ల రాజేంద‌ర్ అంటారు. ఈట‌ల కాషాయ కండువా క‌ప్పుకోవ‌డంతో ప‌లు వ‌ర్గాలు ఆయ‌న‌కు దూరం అవ‌క త‌ప్ప‌దు. ఆత్మ‌గౌర‌వ పోరాటం అనే డైలాగ్ ఇక‌పై అంత‌గా ప‌ని చేయ‌క‌పోవ‌చ్చు. హిందుత్వ పార్టీగా ముద్ర ఉన్న బీజేపీలో చేరి.. సోష‌లిజం, క‌మ్యూనిజం, బీసీయిజం.. అంటూ నీతులు చెబితే జ‌నాలు న‌మ్మ‌క‌పోవ‌చ్చు. ఇలా కొంత న‌ష్టం ఉన్నా.. కేంద్రం అండ అనే లాభం ముందు వీట‌న్నిటికీ కాంప్ర‌మైజ్ అయిన‌ట్టున్నారు ఈట‌ల‌. ఇక‌, ఈట‌ల చేరిక‌తో బీజేపీకి.. రాజేంద‌ర్‌కు వ‌చ్చేంత లాభం రాక‌పోవ‌చ్చు. ఒక సీటో, నాలుగు ఓట్లో ఎక్కువ వ‌స్తాయి కానీ, ఈట‌ల‌కు తెలంగాణ‌లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేంత స‌త్తా లేద‌ని కాషాయం పెద్ద‌ల‌కు తెలుసు. డీకే అరుణలాంటి వాళ్లు కాంగ్రెస్‌లో సెల‌బ్రెటీ స్టేట‌స్‌లో ఉండ‌గానే.. బీజేపీప‌ట్ల ఆక‌ర్షితులై పార్టీలో చేరారు. అందుకే, అమిత్‌షానే స్వ‌యంగా ఆమెను పార్టీలోకి ఆహ్వానించి కండువా క‌ప్పారు. అదే, ఈట‌ల మాత్రం కేసీఆర్ మెడ‌బ‌ట్టి బ‌య‌ట‌కు గెంటేశాక‌.. త‌న అవ‌స‌రం మేర‌కే బీజేపీలో చేరుతున్నార‌నే సంగ‌తి వాళ్ల‌కు తెలియంది కాదు. అందుకే, మోదీ, అమిత్‌షా, న‌డ్డాలు కాకుండా.. ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌తో ప‌ని కానిచ్చేశారు. ప్ర‌స్తుతానికి ఈట‌ల ముఖం వెల‌వెల‌పోయినా.. ముందుముందు కాషాయ వ‌ర్ణంలో అస‌లు రంగులు బ‌య‌ట‌ప‌డ‌క మాన‌వు. వెయిట్ అండ్ సీ....  

ఏపీ రాజకీయాల్లో ఈటల ఎఫెక్ట్! ఎంపీ రఘురామ ఏం చేయబోతున్నారు? 

తెలంగాణ రాజకీయాలన్ని కొన్ని రోజులుగా ఈటల రాజేందర్ చుట్టే తిరుగుతున్నాయి. మంత్రివర్గం నుంచి ఈటలను కేసీఆర్ బర్తరఫ్ చేసినప్పటి నుంచి రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నారు. ఎన్నో సమీకరణలు తెరపైకి వచ్చాయి. చివరికి కమలం పార్టీలో చేరారు ఈటల రాజేందర్. కేసీఆర్ పై ప్రతీకారం తీర్చుకుంటానని ప్రకటనలు చేస్తున్నారు. తెలంగాణ రాజకీయాలను కాక రేపిన ఈటల రాజేందర్ వ్యవహారం.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈటల అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది.  టీఆర్ఎస్ తో విభేదించి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ అంశాన్ని ముడిపెడుతూ.. తమకు కొరకరాని కొయ్యగా మారిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజును వైసీపీ టార్గెట్ చేస్తోంది. ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అంశాన్ని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు వర్తింపజేస్తూ వైసీపీ ఎంపీ మార్గాని భరత్ రామ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రఘురామకృష్ణరాజుకు పౌరుషం ఉంటే ఈటల రాజేందర్ లాగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళితే డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు.ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు ఖాయమని మార్గాని భరత్ స్పష్టం చేశారు. అనర్హత వేటుకు సంబంధించి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఇప్పటికే రిమైండర్ నోటీసు ఇచ్చామని తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామకృష్ణరాజుపై ఆర్టికల్-10 ప్రకారం తప్పనిసరిగా వేటు పడుతుందని అన్నారు. వైసీపీ ఎంపీ వ్యాఖ్యలకు కౌంటరిస్తున్నారు ఎంపీ రఘురామ రాజు అనుచరులు. ఈటల రాజేందర్ కు కేసీఆరే ముందు బర్తరఫ్ చేశారని చెబుతున్నారు. పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నరని ఆరోపిస్తున్న వైసీపీ... రఘురామ రాజును పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే... పార్టీకి వ్యతిరేకంగా ఉన్నట్లు కాదంటున్నారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా రఘురామ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయించలేరని స్పష్టం చేస్తున్నారు. 

గ్ర‌హ‌ణం వీడుతోంది.. పాపం పండుతోంది.. జ‌గ‌న్‌రెడ్డీ జాగ్ర‌త్త‌!

తప్పుది తాత్కాలికంగా పైచేయి కావొచ్చు. కానీ, ఒప్పు ఎప్ప‌టికీ నిలుస్తుంది. కాలం అన్నిటికీ ప‌రిష్కారం చూపుతుంది. సీఎం జ‌గ‌న్‌రెడ్డి విష‌యంలోనూ ఇదే జ‌రుగుతోంద‌ని అంటున్నారు. అంద‌లం ఎక్క‌గానే అరాచ‌కాల‌కు తెగ‌బ‌డ్డార‌ని ప్ర‌తిప‌క్షాలు గ‌గ్గోలుపెట్టాయి. అవ‌న్నీ పెడ‌చెవిన పెట్టి.. క‌క్ష్య సాధింపు చ‌ర్య‌లకే ప్రాధాన్యం ఇచ్చారు. మొద‌ట్లో తాత్కాలిక విజ‌యం సాధించారు.. క్ర‌మ‌క్ర‌మంగా ప‌రాజ‌యాల‌కు, ప‌రాభ‌వాల‌కు అల‌వాటు ప‌డుతున్నారు.. అయినా, సీఎం జ‌గ‌న్‌రెడ్డిలో టెంప‌ర్‌మెంట్ ఏమాత్రం త‌గ్గ‌డం లేద‌నే విమ‌ర్శ ఇప్ప‌టికీ ఉంది.. హైకోర్టు నుంచి వ‌రుస మొట్టికాయ‌లు ప‌డుతున్నా.. ర‌ఘురామరాజు నుంచి గ‌జ‌ప‌తిరాజు వ‌ర‌కు.. క‌డిగిన ముత్యంలా మెరుస్తున్నా.. జ‌గ‌న్‌రెడ్డికి ప‌ట్టిన గ్ర‌హ‌ణం ఇంకా వీడ‌టం లేద‌ని మండిప‌డుతున్నాయి విప‌క్షాలు. పాపం పండే రోజులు ద‌గ్గ‌ర‌లోనే ఉన్నాయ‌ని హెచ్చ‌రిస్తున్నాయి... అధికారంలోకి రాగానే అమ‌రావ‌తిని అట‌కెక్కించేశారు. రాజ‌ధానిని మూడు ముక్క‌లు చేశారు. ఏ ముక్కనూ చ‌క్క‌గా చెక్క‌లేదు. ఇదేమి మూడుముక్క‌లాట అంటూ హైకోర్టు మొట్టికాయ వేయ‌డంతో.. త‌ల‌బొప్పిక‌ట్టి.. తెర‌వెనుక ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. రెండు రాజ‌ధానుల‌కు అన్యాయం చేసి.. ఖ‌రీదైన విశాఖ‌ను మాత్రం నెత్తిన‌పెట్టుకుంటున్నారు. ఆక్ర‌మ‌ణ‌ల పేరుతో టీడీపీ ఆస్తుల ధ్వంస ర‌చ‌న య‌ధేచ్చ‌గా చేస్తున్నారు. విజ‌యన‌గ‌రంలోనూ మొద‌ట్లో ఇలానే రెచ్చిపోయారు. మాన్సాస్ ట్ర‌స్ట్ ఛైర్మ‌న్ అశోక్‌గ‌జ‌ప‌తిరాజును టీడీపీ నాయ‌కుడ‌నే ఒకే ఒక్క కార‌ణంతో.. వంశ‌పారంప‌ర్యంగా వ‌స్తున్న హోదా నుంచి త‌ప్పించేశారు. అప్ప‌టి వ‌ర‌కూ సోదిలో కూడా లేని సంచ‌యిత‌ను ఎక్క‌డి నుంచో తీసుకొచ్చి.. ఇక్క‌డి కుర్చీలో కూర్చోబెట్టి.. పైడిత‌ల్లి సాక్షిగా రాజ‌కీయ పావులు క‌దిపారు. ఇక మేడ‌మ్ గారు చేసిన ఓవ‌రాక్ష‌న్ అంతా ఇంతా కాదంటారు స్థానికులు. సిరిమానోత్స‌వం జాత‌ర‌లో అశోక్ కుటుంబాన్ని అవ‌మానించి పైశాచిక ఆనందం పొందారంటారు. అయితే, కోర్టు తీర్పు రూపంలో వారి ఆనందం ఆవిరైంది. లేటైనా లేటెస్ట్‌గా.. అశోకుడికి న్యాయం జ‌రిగింది. జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు తీసుకొచ్చిన జీవోను కోర్టు కొట్టేసింది. అశోకుడికే మ‌ళ్లీ ప‌ట్టం క‌ట్టింది న్యాయ‌స్థానం. సంచ‌యిత హ‌యాంలో మాన్సాస్ ట్ర‌స్ట్‌లోనూ, సింహాచ‌లం దేవ‌స్థానం వ్య‌వ‌హారాల్లోనూ అనేక దారుణాలు జ‌రిగాయ‌నేది అశోక్‌గ‌జ‌ప‌తిరాజు ఆరోప‌ణ‌.  అదే రోజు.. జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారుకు మ‌రో ఎదురుదెబ్బ కూడా త‌గిలింది. సంగం డెయిరీ ఆస్తుల స్వాధీనానికి చెక్ పెట్టింది అదే హైకోర్టు. సంగం డెయిరీ స్వాధీనంపై ప్రభుత్వం జారీ చేసిన జీవో చెల్లదని తెలిపింది. సంగం డెయిరీ కార్యకలాపాలను డైరెక్టర్లు నిర్వహించుకోవచ్చని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇలా సంగం.. మ‌ళ్లీ ధూళిపాళ్ల ఆధ్వ‌ర్యంలోకి వ‌చ్చింది. ఆయ‌న్ను అరెస్ట్ చేసి.. జైలుకు త‌ర‌లించి.. సంగంను క‌బ్జా చేయాల‌నే ప్ర‌య‌త్నంలో జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు తాత్కాలికంగా పైచేయి సాధించినా.. కోర్టులు ఉన్నంత వ‌ర‌కూ ఎప్ప‌టికీ న్యాయానిదే అంతిమ‌విజ‌యం అని మ‌రోసారి రుజువైంది.  ఇక‌, రాజ‌ద్రోహం కేసు. జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారుకు ఫేవ‌రేట్ సెక్ష‌న్‌. జ‌డ్జి రామ‌కృష్ణ‌ను ఇదే కేసులో జైల్లో తోసేశారు. త‌న వ‌ర్గానికి స‌మ‌క‌రించ‌లేద‌నే క‌క్ష్య‌తోనే.. మంత్రి పెద్దిరెడ్డి ప్రోద్భ‌లంతోనే ఆయ‌న్ను అలా కేసులో ఇరికించార‌ని అంటారు. జైల్లో ఆయ‌న హ‌త్య‌కూ కుట్ర చేశార‌ని రామ‌కృష్ణ కుమారుడు ఫిర్యాదు కూడా చేశారు. కొన్ని వారాలు జైల్లో బంధించగ‌లిగినా.. తాజాగా ఆయ‌న‌ బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చి స్వేచ్ఛా వాయువు పీలుస్తున్నారు.  ఇక‌, ఎంపీ ర‌ఘురామపై రాజ‌ద్రోహం కేసు గురించి అంద‌రికీ తెలిసిందే. ప‌ర్మినెంట్‌గా ర‌ఘురామ‌ను జైల్లో క్లోజ్ చేద్దామ‌ని రాజ్యం భ‌విస్తే.. జ‌గ‌మొండి రాజు గారు.. ర‌య్‌మంటూ రెక్క‌లు తొడుక్కొని.. ఢిల్లీకి ఎగిరిపోయారు. పార్ల‌మెంట్ సాక్షిగా జ‌గ‌న్‌రెడ్డి ప‌రువు బ‌జారుకు ఈడుస్తున్నారు. యావ‌త్ దేశం ముందు దోషిగా నిల‌బెడుతున్నారు.  ఇలా.. ఒక‌టా రెండా చెప్పుకుంటూ పోతే.. అలిసిపోయేదాక‌. ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ఎపిసోడ్‌లో ఎంత అబాసుపాలు కావాలో అంత‌కంటే ఎక్కువే ప‌రువు పోగొట్టుకున్నారు జ‌గ‌న్‌రెడ్డి. ఇక క‌మ్మ కులం పేరుతో ఆయ‌న చేసిన‌, చేస్తున్న రాజ‌కీయ రాద్దాంతాన్ని జ‌నం అస‌హ్యించుకుంటున్నారు. టీడీపీ నేత‌ల‌పై కేసులు, కుట్ర‌లు, కూల్చివేత‌లు.. రెండేళ్లుగా ఇదే ప‌ని. అభివృద్ధి మాటే లేదు.. ప్ర‌త్యేక హోదా ఊసే లేదు.. విశాఖ ఉక్కుపై చేత‌గాని త‌నం.. అమ‌రావ‌తిపై చేతులెత్తేసిన వైనం.. ఇసుక నుంచి మ‌ద్యం వ‌ర‌కూ అంతా దోపిడీనే. సంక్షేమం చిరిగిన చొక్కానే. ఇలా జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌పై అనేక విమ‌ర్శ‌లు, అంత‌కుమించి ఆరోప‌ణ‌లు. ఇప్పుడిప్పుడే గ్ర‌హ‌ణం వీడుతోందని.. జ‌గ‌న్‌రెడ్డి అరాచ‌క‌పాల‌న‌పై ప్ర‌జ‌లకు క్లారిటీ వ‌స్తోందని అంటున్నారు. రెండేళ్లు మీ వ్య‌క్తిగ‌త అజెండాకే ప్రాధాన్యం ఇచ్చారు.. కోర్టు తీర్పులు, మొట్టికాయ‌ల‌తోనైనా వాస్త‌వంలోకి వ‌స్తే బాగుంటుంద‌ని హిత‌వు ప‌లుకుతున్నారు. మార్పు మంచిదేన‌ని గుర్తించమంటున్నారు..  అతి అరాచ‌క‌వాది బాగుప‌డిన‌ట్టు చ‌రిత్ర‌లోనే లేదంటున్నారు విజ్ఞులు. మ‌రి, మంచిమాట‌లు జ‌గ‌న్‌రెడ్డి చెవికి సోకుతాయా..?

రాజధానులా.. రఘురామా.. గవర్నర్ హస్తినకెందుకు?

కేంద్రం నుంచి ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ కు పిలుపు వచ్చింది.  కేంద్ర మంత్రివర్గ విస్తరణపై కసరత్తు జరుగుతున్న వేళ.. ఈ పిలుపు రావడంతో.. కాస్త ఆసక్తికరంగా మారింది. మూడు రకాల కారణాలు ప్రచారంలోకి వచ్చాయి. ఒకటి జగన్, అమిత్ షాల మధ్య  మూడు రాజధానుల అంశంపై చర్చ జరిగిందని.. దానిపైనేనని ఒక వర్గం.. అది కాదు రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ మీద మాట్లాడటానికే పిలిచారని ఇంకో వర్గం చెప్పుకుంటుంది. గతంలో నరసింహన్ రెండు రాష్ట్రాల గవర్నర్ గా ఉండగా పదేపదే పిలుపులు వచ్చేవి. ఏపీ,తెలంగాణ రాష్ట్రాల పంచాయతీ తెలుసుకోవడానికి పిలిచేవారు. ఇక రెండు రాష్ట్రాలకు చెరో గవర్నర్ వచ్చాక..ఢిల్లీ పిలుపులు ఆగిపోయాయి. పైగా ఏపీ,తెలంగాణ మధ్య ఒక నదీజలాల గొడవ తప్ప ఇంకో గొడవేమీ మిగల్లేదు. రాజకీయంగా ఇద్దరు సీఎంలు ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటున్నారు కూడా. సో గవర్నర్ కి పెద్దగా రిపోర్టులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోయింది. పైగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా ఓపెన్ గానే... అది కూడా ఢిల్లీవారికి కబురు పంపాకే చేస్తున్నారన్న ప్రచారం ఉంది. ఈ విషయాన్ని రాష్ట్ర బిజెపి నేతలు ఒప్పుకోకపోయినా.. కేంద్ర బిజెపి నేతలు ఖండించనూ లేదు. సో బిజెపివారు రహస్యంగా సమాచారం సేకరించాల్సిన అవసరం అంతకన్నా లేదు. మరెందుకు పిలిచినట్లు గవర్నర్ గారిని? మొన్ననే ఎమ్మెల్సీ ఫైలు ఆపారు.. మళ్లీ లేటెస్టుగా అప్రూవ్ చేసేశారు గవర్నర్. ఆ పని కూడా అయిపోయింది. ఇంకెందుకు పిలిచినట్లు? ఎక్కువమంది అభిప్రాయపడేది మాత్రం మూడు రాజధానుల వ్యవహారమేనని. ఎందుకంటే అమిత్ షాతో సంప్రదింపుల్లో మూడు రాజదానుల ఏర్పాటుపై చర్చించినట్లు వైసీపీ అధికారికంగానే ప్రకటించింది. మరోవైపు ఆ పార్టీ నేతలు, మంత్రులు అతి త్వరలో విశాఖ నుంచే పాలన ఉండబోతున్నట్లు చెబుతున్నారు. దీంతో ఆ విషయంపైనే గవర్నర్ ను పిలిచి ఉంటారని.. నిబంధనల ప్రకారం ఆ ప్రక్రియ అంతా గవర్నర్ చేతుల మీదుగా జరగాల్సి  ఉంటుంది కాబట్టి..ఆయనతో చర్చించడానికే పిలిచారని చెప్పుకుంటున్నారు. కాని హైకోర్టులో కేసులు విచారణలో ఉండగా..అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేరని..కాబట్టి దాని గురించి అయి ఉండదనే వాదన కూడా వినపడుతోంది. ఇక రఘరామకృష్ణరాజు ఎపిసోడ్ నడుస్తోంది. సీఐడీ అధికారులు హింసించారనే ఆరోపణలు చేయడం..తర్వాత సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి గాయాలున్నాయని నిర్ధారించడం..తర్వాత నర్సాపురం ఎంపీ స్పీకర్, ఇతర ముఖ్యులందరికీ లేఖలు రాశారు. ప్రివిలేజ్ మోషన్ కు సైతం రఘురామ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వైసీపీ సైతం రఘురామను సస్పెండ్ చేయాలని పట్టుబడుతోంది. అమిత్ షాతో సమావేశంలో ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో నిర్ణయం తీసుకునేందుకు గవర్నర్ ను పిలిచారని అంటున్నారు. అయితే గియితే ఏం జరిగిందనేదానిపై గవర్నర్ ని అడిగే అవకాశం ఉంది తప్ప..నిర్ణయాల కోసమైతే అవసరం లేదని అధికారులు అనుకుంటున్నారు.

మహిళా ఎస్ఐ ఆత్మహత్య యత్నం.. ఎందుకో తెలుసా? 

ప్రేమించడం అనేది సహజంగా అందరికి ఉండే లక్షణం. ప్రేమించడం నేరం ఏమి కాదు.. అలా అని వీళ్ళు మాత్రమే ప్రేమించుకోవాలి అని ప్రేమలో ఎలాంటి రూల్స్ లేవు. అందరి ప్రేమలు బయట పడ్డట్లే తాజాగా ఒక లేడీ పోలీస్ ప్రేమ బయటపడింది.. ఆ తర్వాత ఆమె సూసైడ్ చేసుకుంది. ఇది ఇలా ఉంటే  పోలీసులు ప్రజలకు ప్రాబ్లమ్స్ వస్తే దైర్యం చెప్పే వాళ్ళు.  ఒక మహిళా ఎస్ఐ. ఖాకీ వేసుకుని నీతికోసం పని చెయ్యాల్సిన ఆమె.. చివరికి ప్రేమ ముసుగులో పడి ప్రాణాలు తీసుకుంది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందామా.. వాళ్ళు ఇద్దరు డ్యూటీ చేయాల్సిన పోలీసులు. ఒకరినొకరు ప్రేమించుకున్నారు.. సరే ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ఈమె బోరు కొట్టిందో..లేదంటే ఏం జరిగిందో తెలీదుగానీ.. అతను వేరే అమ్మాయిని చేసుకున్నాడు. ఇక అంతే అప్పటివరకు జంటగా ఉన్న వాళ్ళు విడిపోయారు.. లేడీ ఎస్ఐ మనస్తాపం చెందింది.. బాధలో బంధీ అయింది. ప్రియుడు తనతో గడిపిన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంది. ఉండలేకపోయింది. ఈనెల 12వ తేదీ రాత్రి 11.30 గంటల ప్రాంతంలో అయోధ్యనగర్‌లోని తన ఇంట్లో ఆత్మహత్యకు యత్నించింది. తాను చనిపోతున్నానంటూ సీసీఎస్‌లో పనిచేసే ఓ ఎస్ఐకు సమాచారం ఇచ్చింది. దీంతో ఆయన వెంటనే సత్యనారాయపురం సీఐ బాలమురళీకృష్ణకు చెప్పి ఆమె ఇంటికి చేరుకున్నాడు. ఇంటి తలుపులు పగలకొట్టి లోపలికి వెళ్లి చూడగా ఆమె కింద పడిపోయి ఉంది. పక్కన గోళ్ల రంగు, శానిటైజర్‌ సీసాలు ఉండటంతో వాటిని తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని నిర్ధారించుకున్నారు. ఆమెను వెంటనే సింగ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించి అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. పీఎస్సై ఆత్మహత్యాయత్నానికి ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. ఆత్మహత్యకు యత్నించిన మహిళా పీఎస్సైపై వారం రోజుల క్రితం మాచవరం పోలీసులకు ఫిర్యాదు అందిందని తెలుస్తోంది. తన భర్తకు రాత్రి సమయంలో ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయని, వాట్సాప్‌‌లో వందలకొద్దీ మెసేజ్‌లు చేస్తూ ఇబ్బంది పెడుతోందటూ సీసీఎస్‌లో పనిచేస్తున్న ఎస్ఐ భార్య మాచవరం పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. దీనిపై ఓ వైపు పోలీసులు విచారణ చేస్తుండగా మహిళా పీఎస్సై ఆత్మహత్యకు యత్నించడం, దీనికి కారణం ప్రేమ వ్యవహారమేనన్న వదంతులు పోలీసు వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ చేసి, మహిళా పీఎస్సైతో పాటుగా సీసీఎస్‌ ఎస్ఐపైనా శాఖాపరమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అంత చదివిన ఎస్ఐ కి లవ్ పోతే ఇంకో లవ్ ఉంటుంది.. ప్రాణం పొతే ఇంకో ప్రాణం ఉండదు అని తెలుసుకోలేకపోయినట్లు ఉన్నారు.. అయినా ఒక అమాన్యుడు ఆత్మహత్య చేసుకుంటే విరిచారణ జరపాల్సిన పోలీసులు ఇలా ప్రాణాలు తీసుకోవడం ఏంటి ? అది ఏ డ్యూటీలో ఐతే ఇంకా బాగుండేది. ప్రేమ కోసం మరి ఇంకో అమ్మాయి భర్త ఒక ఎస్ఐ చనిపోవడం ఎందటి స్థానికులు విస్తుపోయారు..  

ఎన్డీఏలో చిరాగ్ చిచ్చు.. బీహార్ రాజకీయాల్లో అలజడి

బీహార్ రాజకీయాలు మరోమారు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. పతాక శీర్షికలకు చేరుకున్నాయి.  గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్డీఎ కూటమిలో రెండవ కుంపటి రాజేసిన, కేంద్ర మాజీ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ ఇప్పుడు అందుకు మూల్యం చెల్లిస్తున్నారు. పాశ్వాన్ మరణం తర్వాత ప్రాంతీయ, కుటుంబ పార్టీల ధర్మాన్ని పాటిస్తూ, ఆయన కుమారడు చిరాగ్ లోక్’జనశక్తి  (ఎల్ జీపీ) పార్టీ పగ్గాలు చేపట్టారు. అయితే, జాతీయ స్థాయిలో ఎన్డీఎలో  కొనసాగుతూనే,బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం, ద్విముఖ పంధాను ఎంచుకున్నారు. బీజేపీతో దోస్తీ కొనసాగించారు.ఆ పార్టీ పోటీచేసిన అన్ని స్థానాల్లో కమల దళానికి మద్దతు ఇచ్చారు.అదే సమయంలో, ఎన్డీఎ మరో కీలక భాగస్వామ్య పక్షం, ముఖ్యమంత్రి నితీష్ కుమార సారధ్యంలోని జేడీ(యు)ను దూరం పెట్టారు. జేడీ (యు)  అభ్యర్ధులు పోటీ చేసిన అన్ని స్థానాల్లో తమ పార్టీ అభ్యర్ధులను నిలిపారు. ఫలితంగా, రాష్ట్రంలో బీజేపీ 74 సీట్లతో  అతి పెద్ద పార్టీగా అవతరించింది. జేడీ(యు) 43 స్థానాల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. మరో వంక, ఆర్జేడీ సారధ్యంలోని మహా ఘటబంధన్ ‘కూడా 110 స్థానాలు గెలుచుకుంది.  అప్పటి నుంచి చిరాగ్ పాశ్వాన్, నితీష్ కుమార్ మధ్య దూరం మరింతగా పెరిగింది.ఇద్దరి మధ్య కుల మంటలు రగులుతూనే ఉన్నాయి. చిరాగ్’ ను దెబ్బతీసేందుకు నితీష్ ఈ చిన్న అవకాశాన్ని  వదులుకోలేదు.  ఒక విధంగా చెప్పాలంటే, బీజేపీ దయదక్షిన్యాల మీద ఆధారపడి ముఖ్యమంత్రిగ కొనసాగుతునందుకు, లోలోపల  అవమాన భారంగా కృంగి, రగిలి పోతున్న నితీష్ కుమార్, ‘అవమానమును సహింతునా’ టైపులో రగిలి పోయారు. వ్యూహాత్మకంగా పావులు కదిపారు. ఎల్జీపీలో దిగ్విజయంగా చీలిక తెచ్చారు. పార్టీ ఎంపీలు ఆరుగురిలో ఐదుగురు , తిరుగుబాటు బావుటా ఎగరేసారు. చిరాగ్ సొంత బాబాయి, పశుపతి కుమార్ పరాస్’ను తమ నాయకునిగా ఎన్నుకున్నారు. చిరాగ్’ను ఒంటరిని చేశారు. అంతే కాదు, ఆ ఐదుగురు ఇలా గీతదాటారో లేదో అలా, నితీష్ కుమార్ కీర్తనలు మొదలు పెట్టారు. నితీష్ కుమార్’ ను వికాస్ పురుష’ గా పేర్కొన్నారు. దీంతో, ఈ ఐదుగురు ఎంపీలు అడుగులు ఎటు పడుతున్నాయో చెప్పకనే చెప్పారు.  అప్పట్లో చిరాగ్ పాశ్వాన్, తీసుకున్న నిర్ణయాన్ని బీజీపీ ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా సమర్ధించింది. అయితే ఇపుడు ఎల్జీపీ చీలిక వచ్చిన నేపధ్యంలో బీజేపీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది అనేది, ఆసక్తికరంగా మారింది. కాగా చీలిక వర్గం నాయకుడు  పరాస్, పార్టీ కార్యకర్తలు, నాయకులు అంతా తమ వెంటే ఉన్నారని, చిరాగ్ పాశ్వాన్  తీసుకున్న నితీష్ కుమార్ వ్యతిరేక స్టాండ్’ను వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు. అయితే, ఆయన కూడా తమ వర్గం ఎన్డీఎ లో కొనసాగుతుందని స్పష్టంచేశారు. నిజానికి ఎల్జీపీలో వచ్చిన చీలిక వలన ఇప్పటి కిప్పుడు,రాష్ట్రంలో లేదా కేంద్రంలో తీవ్రపరిణామాలు చోటు చేసుకునే అవకాశం లేదు. అయితే, కేంద్రంలో మంత్రి పదవిని ఆశిస్తున్న చిరాగ్ పాశ్వాన్’కు ఆశాభంగం తప్పక పోవచ్చని రాజకీయ వర్గాలు బావిస్తున్నాయి. అదలా ఉంటే, ఎల్జీపీ చీలిక వలన, ఇంతకాలం ఒకవిధమైన ఆత్మన్యూనతా బావంతో,గిల్టీగా ఫీల్ అవుతున్న నితీష్ కుమార్’కు కొంత ఊరట అయితే దొరుకుతుంది. అలాగే, భవిష్యత్ రాజకీయ సమీకరణలకు కూడా మారే అవకాశం ఉందని అంటున్నారు. మరో వంక అడిగినన్ని బెర్తులు ఇవ్వలేదని,అలిగి కేంద్ర కేంద్ర మంత్రివర్గంలో చేరెందుకు నిరాకరించిన నితీష్ కుమార్,ఇప్పుడు  పెరిగిన  బార్గైనింగ్ పవర్’తో కేంద్ర మంత్రి వర్గంలో చేరే అవకాశం కూడా ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే, బీజేపీ, జేడీయు సంబంధాలు కూడా అనంతంత మాత్రంగానే ఉన్న నేపధ్యంలో ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో చూడవలసి ఉందని, పరిశీలకులు భావిస్తున్నారు.

రేవంత్‌రెడ్డికి పీకే ఎఫెక్ట్‌? పీసీసీ పోస్ట్ ఫ‌స‌క్‌! కేసీఆర్ స్కెచ్‌?

ఇక్క‌డ స్విచ్ వేస్తే.. అక్క‌డ లైట్ వెలిగిన‌ట్టు.. అక్క‌డ ప్ర‌శాంత్ కిశోర్ స్విచ్ ఆఫ్ చేస్తే.. ఇక్క‌డ రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ పోస్ట్ ఫ‌స‌క్ అంటోంది. రేపోమాపో రేవంత్‌కి పార్టీ ప‌గ్గాలు అప్ప‌గిస్తార‌ని అనుకుంటుండ‌గా.. పీకే ఎంట్రీతో రెడ్డి గారి క‌థ మ‌ళ్లీ మొద‌టికొచ్చింది. ప్ర‌శాంత్ కిశోర్‌కు, రేవంత్‌రెడ్డికి ఏం లింక్ అనే అనుమానం రాక‌మాన‌దు. బ‌ట‌ర్‌ఫ్లై ఎఫెక్ట్ అంటే అదే మ‌రి. వింటానికి కాస్త ఆశ్చ‌ర్యంగా ఉన్నా.. 10 జ‌న్‌ప‌థ్ నుంచి అందిన ప‌క్కా స‌మాచారం ఇది.  రేవంత్‌రెడ్డి. టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌. పేరు ఘ‌నంగానే ఉన్నా.. ప‌వ‌ర్ కాస్త త‌క్కువే. సెకండ్ ప్లేస్‌తో అడ్జ‌స్ట్ అయ్యే ర‌కం కాదాయ‌న‌. అందుకే నేనే నెంబ‌ర్‌వ‌న్ అంటూ నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్ కోసం తెగ ట్రై చేస్తున్నారు. పీసీసీ చీఫ్ ప‌ద‌వికి ఆయ‌న అన్నివిధాలా అర్హుడే. కాక‌పోతే, అది కాంగ్రెస్ పార్టీ కావ‌డ‌మే డిస్అడ్వాంటేజ్‌. క‌ప్ప‌ల సామెత మాదిరి ఉంటుంద‌క్క‌డ‌. ఒక‌రు ఒక‌డుగు ముందుకు వేస్తే.. నాలుగురు కాలు ప‌ట్టి వెన‌క్కి లాగుతుంటారు. రేవంత్‌రెడ్డికి పీసీసీ పీఠం ద‌క్క‌డంలోనూ అదే జ‌రుగుతోంద‌ని అంటున్నారు. రేవంత్‌రెడ్డికి పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించేందుకు అధిష్టానం కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉందంటూ వార్త‌లు. అయినా.. అదిగో ఇదిగో అంటూ కాల‌క్షేప‌మే కానీ.. రేవంత్‌రెడ్డికి మిఠాయి పొట్లం చేజిక్క‌డం లేదు. రేవంత్‌రెడ్డికి పీసీసీ ద‌క్క‌క‌పోవ‌డం వెనుక ఇన్నాళ్లూ ఇదే కార‌ణాలు వినిపించాయి. క‌నిపించాయి. కానీ, లేటెస్ట్‌గా.. రేపేమాపో ఇక ఫైన‌ల్ అవుతుంద‌ని అనుకుంటుండ‌గా.. మ‌రో చిక్కొచ్చి ప‌డింది. ఈసారి రేవంత్‌రెడ్డి పీఠానికి ప్ర‌శాంత్ కిశోర్ అడ్డుత‌గిలాడ‌ని తెలుస్తోంది.  అవును, ప్ర‌శాంత్ కిశోరే రేవంత్‌రెడ్డి పోస్టుకు ఎస‌రు పెట్టార‌ట‌. బీజేపీకి వ్య‌తిరేకంగా ఈమ‌ధ్య పీకే దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయ పున‌రేకీక‌ర‌ణ‌కు పావులు క‌దుపుతున్నారు. రాహుల్‌గాంధీని ప్ర‌ధాని చేయాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మి బ‌లోపేతానికి కృషి చేస్తున్నారు. ఇప్ప‌టికే శ‌ర‌ద్‌ప‌వార్‌తో అధికారిక‌ చ‌ర్చ‌లు ముగిశాయి. బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్‌ల‌తో పాటు ఏపీ సీఎం జ‌గ‌న్‌రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్‌ల‌తోనూ ర‌హ‌స్య మంత‌నాలు జ‌రిగిన‌ట్టు స‌మాచారం. ఈ మీటింగే రేవంత్‌రెడ్డి కొంప ముంచేందుకు కార‌ణ‌మైంద‌ని అంటున్నారు. రాహుల్‌గాంధీని పీఎం చేసేందుకు.. కాంగ్రెస్‌కు ప్రాంతీయ పార్టీల మ‌ద్ద‌తు కూడ‌గ‌డుతున్నారు ప్ర‌శాంత్‌కిశోర్‌. సీఎం జ‌గ‌న్‌రెడ్డి ఎలానూ పీకేకు క్లోజ్ కాబ‌ట్టి.. అక్క‌డ ఈజీగానే ప‌ని అయిపోయింది. ఇక తెలంగాణ‌లో కేసీఆర్‌కు బీజేపీ ప‌క్క‌లో బ‌ల్లెంలా మార‌డం ఆయ‌న్ను అస‌హ‌నానికి గురి చేస్తోంది. మాజీ మండ‌లి ఛైర్మ‌న్ స్వామిగౌడ్ నుంచి ఈట‌ల వ‌ర‌కు.. టీఆర్ఎస్ అసంతృప్తులంద‌రినీ కాషాయం పార్టీ అక్కున చేర్చుకుంటుండ‌టంతో కేసీఆర్ ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్నారు. అదే టైమ్‌లో పీకే నుంచి కాల్ రావ‌డంతో ప‌రిణామాలు వేగంగా మారిపోతున్నాయి.  భ‌విష్య‌త్‌లో రాహుల్‌ను ప్రధాని చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ స‌హ‌క‌రిస్తే.. ఆ మేర‌కు త‌మ నుంచి కూడా క్విడ్ ప్రోకో ఉంటుంద‌నేది.. పీకే తీసుకొచ్చిన ప్ర‌తిపాద‌న‌. గ‌తంలో ఓసారి యూపీఏతో క‌లిసి ప‌ని చేసి.. కేంద్ర మంత్రి ప‌ద‌వులు అనుభ‌వించిన చ‌రిత్ర‌ను గుర్తు చేశార‌ట‌. ఎంత‌కాద‌నుకున్నా.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌పై ఎక్క‌డో అభిమానం లేకపోలేదు. అటు.. మోదీని, బీజేపీని అస‌లేమాత్రం న‌మ్మే ప‌ని లేదు. ఇప్ప‌టికే కేసులు, జైలు అంటూ క‌మ‌ల‌నాథులు కేసీఆర్‌పై దూకుడు మీదున్నారు. ఇవ‌న్నీ బేరీజు వేసుకున్న గులాబీ బాస్‌.. భ‌విష్య‌త్‌లో కాంగ్రెస్‌కు స‌పోర్ట్ చేసేందుకు ఓకే అన్న‌ట్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. ఇక్క‌డే కేసీఆర్ ఓ కండిష‌న్ కూడా పెట్టార‌ట‌. అది.. రేవంత్‌రెడ్డిని ప‌క్క‌న‌పెట్టాల‌ని..... అవును, కేసీఆర్‌కు తెలంగాణ‌లో బ‌ద్ద‌శ‌త్రువు ఎవ‌రైనా ఉన్నారంటే అది ఒక్క రేవంత్‌రెడ్డి మాత్ర‌మే. త‌న‌ను జైల్లో పెట్టించినందుకు.. ఏనాటికైనా కేసీఆర్‌ను అదే జైల్లో కుక్కాల‌నేది రేవంత్‌రెడ్డి జీవితాశ‌యం అంటారు. అందుకే, రేవంత్‌రెడ్డి ఎంత ఎదిగితే.. కేసీఆర్‌కు అంత మైన‌స్‌. రేవంత్ పీసీసీ చీఫ్ అయితే.. ఇక నెక్ట్స్ స్టెప్ సీఎం కుర్సీనే. అందుకే, రేవంత్‌ను మొద‌ట్లోనే తుంచేలా.. కేసీఆర్ పీకే ముందు కండిష‌న్ పెట్టార‌ట‌. తాను కాంగ్రెస్‌కు స‌పోర్ట్ చేయాలంటే.. రేవంత్‌రెడ్డి ప్రాధాన్యం త‌గ్గించాలనేది కేసీఆర్ ష‌ర‌తు. అయితే, కాంగ్రెస్‌తో మాట్లాడి చెబుతానని ప్ర‌శాంత్ కిశోర్ అన్నార‌ట‌. ఆ త‌ర్వాత‌.. హ‌స్తం పార్టీ అధిష్టానం ముందుకు కేసీఆర్ ప్ర‌తిపాద‌న తీసుకొచ్చార‌ని తెలుస్తోంది.  వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌లు హోరాహోరీగా ఉండ‌టం ఖాయం. బీజేపీ వార్ వ‌న్‌సైడ్ మాత్రం కాదు. అదే టైమ్‌లో కాంగ్రెస్‌కు మంచి సీట్లు ఏమీ రాక‌పోవ‌చ్చు. అలాంటి క్రిటిక‌ల్ ప‌రిస్థితుల్లో ప్రాంతీయ పార్టీల మ‌ద్ద‌తే కీల‌కం. ప్ర‌తీ ఒక్క ఎంపీ సీటు ప్రాధాన్యం. ఆ లెక్క‌న‌.. టీఆర్ఎస్ మ‌ద్ద‌తు త‌ప్ప‌కుండా అవ‌స‌రం ప‌డుతుంద‌ని పీకే కాంగ్రెస్‌కు న‌చ్చ‌జెప్పార‌ట‌. గులాబీ స‌పోర్ట్ కావాలంటే.. రేవంత్‌రెడ్డిని ప్ర‌స్తుతానికి ప‌క్క‌న‌పెట్టాల‌ని సూచించార‌ట‌. ప్ర‌శాంత్ కిశోర్ ప్ర‌తిపాద‌న‌తో కాంగ్రెస్ హైక‌మాండ్ పున‌రాలోచ‌న‌లో ప‌డింద‌ట‌. అప్ప‌టికే టీపీసీసీ చీఫ్ ప‌ద‌వికి రేవంత్‌రెడ్డి పేరు ఖ‌రారైనా.. పీకే ఎంట్రీతో ఆయ‌న పేరు సైడ్‌వేస్‌లోకి వెళ్లిపోయింద‌ట‌. ఎలాగూ సీనియ‌ర్లంతా మూకుమ్మ‌డిగా రేవంత్‌ను వ్య‌తిరేకిస్తున్నారు. పార్టీలో చీలిక వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. అందుకే, ఒక్క రేవంత్‌రెడ్డి కోసం అన్ని స‌మ‌స్య‌లు ఎందుకు తెచ్చుకోవాల‌నే అభిప్రాయానికి వ‌చ్చేసింద‌ట అధిష్టానం. అటు భ‌విష్య‌త్‌లో కేసీఆర్‌తో ప్ర‌యోజ‌నాలు.. ఇటు వ‌ర్త‌మానంలో సీనియ‌ర్ల‌తో అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకొని.. ప్ర‌శాంత్ కిశోర్ సూచ‌న మేర‌కు పీసీసీ చీఫ్ జాబితా నుంచి రేవంత్‌రెడ్డి పేరు డిలీట్ చేశార‌ని అంటున్నారు. అందుకే ఇంత ఆల‌స్యం అవుతోంద‌ని.. మ‌ధ్యేమార్గంగా త్వ‌ర‌లోనే జీవ‌న్‌రెడ్డినో, శ్రీధ‌ర్‌బాబునో పీసీసీ అధ్య‌క్షుడుగా ప్ర‌క‌టిస్తార‌ని తెలుస్తోంది. చూశారా.. బ‌ట‌ర్‌ఫ్లై ఎఫెక్ట్ అంటే ఇదేనేమో. ఎక్క‌డ రేవంత్‌రెడ్డి.. ఎక్క‌డి ప్ర‌శాంత్ కిశోర్‌.. ఇంకెక్క‌డి కేసీఆర్‌.. ఎవ‌రో ప్ర‌ధాని కావ‌డానికి.. ఇంకెవ‌రి పీసీసీ ప‌ద‌వికో ఎస‌రు రావ‌డం ఆస‌క్తిగా లేదు.. అందుకే అంటారు రాజకీయాల్లో ఏదైనా సాధ్య‌మేన‌ని....

ఈటలది గడీలను మించిన ప్యాలెస్!  

బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ టార్గెట్ గా వాయిస్ పెంచారు టీఆర్ఎస్ నేతలు. మూకుమ్మడిగా ఆయనపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా బీజేపీలో చేరిక సందర్భంగా ఢిల్లీలో జరిగిన పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకుంటూ ఈటలను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు గులాబీ లీడర్లు. కాషాయ కండువా కప్పుకున్న తొలి రోజే రాజేందర్ కు అవమానం జరిగిందంటూ విమర్శలు చేస్తున్నారు. ఈటల రాజేందర్ పై ఓ రేంజ్ లో ఫైరయ్యారు మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. ఈటల వామపక్ష భావజాలం ఎక్కడికి పోయిందంటూ మండిపడ్డారు.  బీజేపీలో చేరే ముందు రాజేందర్ కు కనీస గౌరవం దక్కలేదని... కనీసం నడ్డా సమక్షంలో చేర్చుకోలేదని కడియం శ్రీహరి అన్నారు. బీజేపీలో చేరిన రోజే ఈటెలకు దక్కిన పరాభవం చూస్తుంటే తనకు జాలి కలుగుతుందన్నారు. బీజేపీలో నచ్చిన సిద్ధాంతాలు, విధానాలేంటో ఈటల ప్రజలకు తెలపాలన్నారు కడియం. బీజేపీ విధానాలు నచ్చికాదు.. కేసులు నుండి తప్పించుకోవడానికే ఆయన పార్టీలో చేరారని తెలిపారు. బీజేపీ పాలనలో పేదల స్థితిగతులు మారాయా ..? అని కడియం ప్రశ్నించారు. బీజేపీ ప్రజలను నమ్ముకొని పరిపాలన చేయడంలేదని.. కేవలం కులమతాలను అడ్డు పెట్టుకొని రాజకీయ లబ్ధిపొందుతున్నారని విమర్శించారు. బలహీన వర్గాల పొట్టగొడుతున్న బీజేపీలో ఏం చూసి చేరావో ప్రజలకు వివరించాలని ఈటలను డిమాండ్ చేశారు రాజేందర్.  బీజేపీ లో  ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందో దేశ ప్రజలందరికి తెలుసున్నారు కడియం. ఈడీ దాడులతో గుత్తాదిపత్యం చేలాయిస్తుందన్నారు.  గడీలను మించిన  ప్యాలెస్, వేల కోట్ల విలువ కలిగిన భూ కబ్జాలు ఏ సోషలిస్టు భావాలని ప్రశ్నించారు. వేల కోట్లు వెచ్చించి వివాహాలు చేయడం ఏ ఫ్యూడల్ సిద్ధాంతమని ఈటలను నిలదీశారు కడియం. అసైన్డ్ భూములు, ఆలయ భూములు కొనుగోలు చేశానని చెబుతున్న రాజేందర్.. చట్ట వ్యతిరేకంగా కొనుగోలు చేసిన భూములు ఎందుకు ప్రభుత్వానికి అప్పగించడం లేదని అన్నారు. ఐదేళ్ల నుండి అభిప్రాయ భేదం ఉన్నా.. ఇంతకాలం ఆత్మవంచన చేసినట్లు కాదా అని ప్రశ్నించారు. సీఎం పనితీరు బాగాలేదని భావిస్తే ముందే రాజీనామా చేసి ఉంటే ప్రజలు విశ్వసించేవారన్నారు. కేవలం కేసులకు భయపడే బీజేపీలో ఈటెల చేరారన్నారు కడియం. బీజేపీ చాలా ప్రమాదకరమైన పార్టీ అని, జాతీని ముక్కలు చేసే దౌర్భాగ్యపు పార్టీ అని కడియం శ్రీహరి మండిపడ్డారు. వెస్ట్ బెంగాల్ లో మమత బెనర్జీని ఓడించడం కోసం తోడేళ్ళలా మూకుమ్మడి దాడి చేస్తే ప్రజలు షాక్ ఇచ్చారన్నారు. బెంగాల్  ప్రయోగం తెలంగాణలో చేయడానికి బీజేపీ కుట్రలు చేస్తుందని కడియం ఆరోపించారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణ లో బీజేపీ ఉనికిలేదన్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ కనుమరుగై పోయిందని.. మరో 20 ఏళ్ల వరకు ఏకైక బాహుబలి కేసీఆర్ ఒక్కరే అన్నారు కడియం శ్రీహరి.

అంతలోనే ఏమైంది..? కేసులు మాయమైపోయాయా?

ఆయన ఫైలు చూసి సంతకం పెట్టకుండా ఆపేశారు. క్రిమినల్ రికార్డు ఉన్నవారికి ఎమ్మెల్సీ పదవి ఎలా ఇస్తామని ప్రశ్నించారు. పెద్దాయన దగ్గరికి పూలు,పండ్లు పట్టుకుని జగనన్న, వదినమ్మ వెళ్లారు. గౌరవ మర్యాదలన్నీఅవగానే ఫైలుపై సంతకం పెట్టేశారు పెద్దాయన. జగన్ సార్ .. పెద్ద సార్ ని కలిసి కేసుల సెక్షన్లు మార్చి చెప్పాడా.. లేక కేసులు కొట్టేస్తున్నామని చెప్పాడా.. అసలు కేసులే లేవు సార్..అవన్నీ ఉత్తదే అని చెప్పాడా... ఏం చెబితే గవర్నర్ సార్ కన్విన్స్ అయిపోయి ఫైలు ఓకె చేసేశారు? లేక నిబంధనలపై అవగాహన లేక గవర్నర్ ఫైలు ఆపితే... ఆ రూల్స్ వివరించి సంతకం పెట్టించారా జగన్ గారు?  చిత్రంగా ఉంది కదా. నిజమే మరి. నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులకు తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి పేర్లను పంపితే..గవర్నర్ గారు అభ్యంతరం చెప్పారు. వారిద్దరిపై కేసులున్నాయని..నామినేటెడ్ ఎమ్మెల్సీలుగా ఎలా పంపుతామని ప్రశ్నించారని వార్తలొచ్చాయి. సంతకం పడి తిరిగి రావాల్సిన ఫైలు రాకపోవడంతో..సీఎంఓ వెంటనే అలర్ట్ అయింది. ముఖ్యమంత్రిగారికి విన్నవించింది..ఆ వెంటనే ఆయన గవర్నర్ అపాయింట్మెంట్ కోరడం.. ఇవ్వడం.. కలవడం... సంతకం పెట్టేయడం అన్నీఅయిపోయాయి.  ఎమ్మెల్సీ.. శాసనమండలి..అంటే పెద్దల సభ.  మేధావులు శాసనసభకు నేరుగా ఎన్నికయ్యేంతగా ప్రజా మద్దతు దొరకదు కాబట్టి..వారి సూచనలు,సలహాలు రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడతాయి కాబట్టి.. శాసనమండలి అని ఒకటి పెట్టి వాటిలోకి ఎమ్మెల్సీలుగా (శాసనమండలి సభ్యులుగా) వచ్చేందుకు ఏర్పాటు చేశారు రాజ్యాంగంలో.  కొందరిని గవర్నర్ కోటాలో నామినేట్ చేస్తారు..అలాగే కొందరిని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు..అలాగే కొందరిని గ్రాడ్యుయేట్స్,, ఇంకా టీచర్లు, ఇవన్నీ కాక.. స్థానిక సంస్థల సభ్యులు జిల్లాకొకరిని ఎన్నుకుంటారు. ఇలా రకరకాలుగా ఎన్నికై మండలికి వస్తారు. మొదట్లో ఆ మర్యాద బాగానే కొనసాగింది. పోను పోను..ఇది ఒక రాజకీయ షెల్టర్ గా మారింది. ఎమ్మెల్యేలుగా ఓడిపోయినవాళ్లను.. అప్పటికప్పుడు ఎన్నికలు లేకపోతే..ఎమ్మెల్సీ అవకాశం ఉంటే అందులో పంపడం.. వంటివి మొదలయ్యాయి. చివరికి పరిస్ధితి ఎక్కడికి వెళ్లిందంటే ఎమ్మెల్సీ పదవిని డబ్బులిచ్చి కొనుక్కునేదాకా వెళ్లిందనే ఆరోపణలు వచ్చాయి. పెద్దల సభ అనేది మర్చిపోయి రౌడీలను, కాంట్రాక్టర్లను, అవినీతి తిమింగలాలను ఎమ్మెల్సీలుగా పంపే కల్చర్ వచ్చేసింది. ఈ పరిస్ధితికి జనం కూడా అలవాటుపడిపోయారు. అయితే గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి ఫైళ్లను ఆపగానే...అందరూ ఆశ్చర్యపోయారు. పర్వాలేదు రబ్బర్ స్టాంపులా కాకుండా...గవర్నర్ మంచి పని చేశారు. క్రిమినల్ రికార్డు ఉన్నవారిని పెద్దల సభకు ఎలా పంపుతామనే ఆలోచన రావడమే గొప్ప విషయంగా అందరూ ఫీలయ్యారు. కాని జగన్ వెళ్లి కలవగానే సంతకం పెట్టేశారు. దీనిపై రకరకాల కామెంట్లు వస్తున్నాయి. జగన్ కేంద్రంలోని పెద్దలతో గవర్నర్ కు చెప్పించి ఉంటారని.. ఆ తర్వాతే వెళ్లి కలిసి ఉంటారనే టాక్ నడుస్తోంది. గవర్నర్ గా ఎన్ని అధికారాలున్నా..ఆ పదవి ఇప్పించిన కేంద్ర పెద్దలకు జీహూజూర్ అనడం ఆనవాయితీయే. గవర్నర్ గా ఉన్నప్పటికీ.. పూర్వాశ్రమంలో ఆర్ఎస్ఎస్, బిజెపి నేత విశ్వభూషణ్.  అలాంటి మనిషి బిజెపి పెద్దలు చెబితే వినకుండా ఉంటారా? అందుకే మొదట ఏ అధికారో చెబితే ఆగి ఉంటారు..తర్వాత ఢిల్లీ నుంచి ఫోన్ రాగానే అయితే ఓకె అని ఉంటారనే విమర్శలు వస్తున్నాయి. ఏమైనా..  సరైనకారణంతో ఫైలు ఆపేసి..ఏ కారణం లేకుండానే ఓకె చేసేస్తే... ఇలా రకరకాల అనుమానాలు వస్తుంటాయి మరి.  

కేటీఆర్ పేరుతో భూ కబ్జా! సిరిసిల్ల జిల్లాలో కలకలం..

తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో భారీగా భూ ఆక్రమణలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు వస్తుండగా.. తాజాగా కేటీఆర్ పేరుతోనే భూదందాకు పాల్పడిన ఘటన వెలుగు చూసింది. సిరిసిల్ల జిల్లా మున్సిపల్ విలీన గ్రామం రగుడులో మంత్రి కేటీఆర్ అనుచరుడినంటూ ఓ వ్యక్తి భూకబ్జా చేశారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుకున్నాయి.  రగుడుకు చెందిన బూర ఎల్లయ్యది నిరుపేద కుటుంబం. తనకున్న కాస్త భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే, ఎల్లయ్యకు 1178,1179,1179/31,1179/7, 1179/31/1,1180/8 గల సర్వే నెంబరులలో 59 గుంటల భూమి ఉంది. గత కొన్నేళ్లుగా రైతుబంధు, క్రాప్‌లోన్ తీసుకుంటూ తనకున్న భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రగుడు నుంచి వెంకటాపూర్ వరకు రెండో బైపాస్ రోడ్డు నిర్మాణం ప్రభుత్వం చేపట్టడంతో బైపాస్ రోడ్డు వెంబడి భూములకు మంచి గిరాకీ ఏర్పడింది. దాంతో రగుడు గ్రామానికి వెళ్ళే దారిలో ఎల్లయ్య భూమి ఉండటంతో ఆ భూమిపై అక్రమార్కుల కన్ను  పడింది.  ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ పేరు చెబుతూ... స్థానిక టీఆర్ఎస్ నేత ఒకరు తన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎల్లయ్య దంపతులు ఆరోపిస్తున్నారు. భూమి హక్కు దారులకు ప్రభుత్వం మంజూరు చేసిన పట్టా పాసు పుస్తకంతో పాటు రైతుబంధు వస్తున్నప్పటికీ.. ఆ భూమిలో వ్యవసాయం చేసుకునేందుకు సదరు టీఆర్ఎస్ నేత గత కొద్ది నెలలుగా అడ్డు పడుతున్నాడని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో భూమిని దున్నేందుకు భూ యజమాని వెళ్లగానే అక్కడికి వచ్చిన టీఆర్ఎస్ నేతలు అధికార బలంతో అడ్డుకుంటున్నారని వృద్ధ దంపతులు  కన్నీరుమున్నీయ్యారు. కేటీఆర్ పేరిట జరుగుతున్న భూదందాను మీడియా ద్వారా మంత్రికి వివరిస్తూ తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. తమ భూమిని కబ్జా చేయాలని చూడటంతో ఏం చేయాలో తెలియని వృద్ధ దంపతులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆయా సర్వేనెంబర్‌లో ఉన్న భూమి బుర్ర ఎల్లయ్య చెందినదేనని తాను ఆ భూమిలో వ్యవసాయం చేసుకోవచ్చని కోర్టు తీర్పునిచ్చింది. దాంతో అక్రమార్కులు ఎల్లయ్యకు సంబంధించిన భూమిలో సాగు చేయకుండా వ్యవసాయ యంత్రాల యాజమానులకు ఫోన్ చేసి బెదిరిస్తూ వ్యవసాయం చేయకుండా అడ్డుకుంటున్నాడు. దీంతో ఏం చేయాలో తెలియని దీనస్థితిలో వారు మీడియా ముందుకు వచ్చారు. తాను మంత్రి కేటీఆర్ అనుచరుడని.. కోర్టు, పోలీస్ స్టేషన్ల చుట్టూ మీరు ఎంత తిరిగినా ఏమీ చేయలేరని, అవసరమైతే మిమ్మల్ని చంపి అయినా మీ భూమిని లాక్కుంటనని అంటున్నాడని ఆ వృద్ధ దంపతులు మీడియా ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని వృద్ధ దంపతులు వేడుకుంటున్నారు. 

ద్రౌపది వ‌స్త్రాప‌హ‌ర‌ణం మించిన సీన్.. ఎక్కడో తెలుసా..? 

ఎవరైనా తప్పు చేస్తే.. మందలించాలి. ఆ తర్వాత కూడా మళ్ళీ తప్పు చేస్తే ఆ తప్పును సరి చేసుకోమని టైం ఇవ్వాలి.. ఆ తప్పు వల్ల కలిగే అనార్ధాలు వివరించాలి.. తప్పు చేస్తే వెంటనే దోషింది.. దూషించ కూడా ఆ తప్పుకు గల కాగణాలు ఏంటో తెలుసుకోవాలి.. మళ్ళీ ఆ తప్పును జరగకుండా చూసుకోవాలి.. తప్పు ఎప్పుడు ఎప్పుడు ముందు నడిపించేదిగా ఉండాలి కానీ అదే పనిగా తప్పుడు మార్గం లో నడిచేలా చేయకూడదు.. ఇంతకీ ఈ తప్పు గురించి ఎందుకు చెపుతున్నానో తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీరే తెలుసుకోండి..?  ఆమెకు  పెళ్లి అయింది. ఆరు నెలల కిందట భర్తను వదిలేసి వెళ్ళిపోయింది. ఇంటి నుంచి బయటకువెళ్లిపోయిన ఓ మహిళ తిరిగి వచ్చింది. వారం రోజుల కిందట ఆమె తిరిగిరాగా.. గ్రామంలోని యువకులు ఆమెపై దాడిచేశారు. ఇంతకీ ఏం జరిగింది..? ఎలా జరిగింది..? అని తెలుసుకోవాలంటే వార్తలో ముందుకు వెళ్ళండి.. భర్తను వదిలేసి వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో ఆ గ్రామంలోని యువకులు  ద్రౌపది వస్త్రాభరనాన్ని మించిన సీన్ క్రియేట్ చేశారు.. ఆ మహిళను ఇంట్లో నుండి  ఈడ్చుకొచ్చారు. విస్త్రను చేశారు. ఆ తర్వాత ఊరేగించారు. అక్కడితో ఆగక ఈ తతంగాన్ని మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ఆదివారం వెలుగులోకి రావడంతో పోలీసులు తక్షణమే స్పందించారు. ఈ సంఘటనకు ప్రత్యేక కారకులైన  11 మంది నిందితుల్లో ఆరుగుర్ని సోమవారం అరెస్ట్ చేశారు. ఈ ఘటన తర్వాత బాధితురాలు కనిపించకుండాపోయినా వీడియో బయటకు వచ్చేవరకూ ఎవ్వరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అనంతరం కేసు నమోదుచేసిన పోలీసులు.. బాధితురాలు అసోంలోని తన తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నట్టు గుర్తించారు. కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత భర్త సమక్షంలో ఫిర్యాదు చేసింది. మొత్తం 11 మంది నిందితుల పేర్లను చెప్పడంతో.. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. ఆరుగుర్ని అదుపులోకి తీసుకోగా.. పరారీలో ఉన్న మిగతావారి కోసం గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాప్ పంచాయతీ పెట్టి పెద్దలు వేసిన శిక్ష కాదని తెలిపారు. కానీ, కొంత మంది యువకులు ఆమెపై హఠాత్తుగా దాడిచేసి అవమానించారని పేర్కొన్నారు. ఈ ఘటనపై సామాజిక కార్యక్తలు తీవ్రంగా మండిపడుతున్నారు. అధికారులు దీనిపై మౌనంగా ఉండటంపై మండిపడుతున్నారు. మహిళకు జరిగిన దారుణాన్ని స్థానిక టీఎంసీ నేత ధిరేశ్ రాయ్ తీవ్రంగా ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. ఈ అమానవీయ ఘటన పశ్చిమ్ బెంగాల్‌లోని అలీపూర్దౌర్ జిల్లా కుమరగ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జూన్ 9న చోటుచేసుకుంది. ఎంత ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నంత మాత్రాన ఇలాంటి వికృతమైన పనులు చేస్తారా.. ? చెప్పి చూడాలి.. పెద్దవాళ్ళ సమక్షంలో మందలించాలి.. అప్పుడు కూడా వినకపోతే రెండు దెబ్బలు వెయ్యాలి.. అప్పుడు కూడా వినకపోతే ఆమె దారికి ఆమెను వదిలెయ్యాలి. ఎందుకంటే తప్పు చేస్తే ఆ తప్పు వెనక భర్త కూడా ఉండాలి.. అతని అసమర్ధ ఉంటేనే ఏ పెళ్లామైన తప్పు చేస్తుంది.. అని స్థానికులు అక్కడి పెద్దలు వుకుంటున్నారు..   

డెల్టా ప్లస్‌.. అంత‌కుమించి!.. కరోనాలో డేంజ‌ర‌స్‌ వేరియంట్‌..

ఉన్న వేరియంట్లు స‌రిపోన‌ట్టు.. క‌రోనా వైర‌స్ మారోసారి రూపాంత‌రం చెందింది. ఇప్ప‌టికే భార‌త్‌ను బెంబేలెత్తిస్తున్న డెల్టా వేరియంట్‌.. స‌రికొత్త‌గా డెల్టా ప్ల‌స్‌గా మారింది. డెల్టానే ఇంత డేంజ‌ర‌స్‌గా ఉంటే.. డెల్టా ప్ల‌స్ ఇంకెంత ఖ‌త‌ర్నాక్‌గా ఉంటుందో అంచ‌నా వేసుకోవ‌చ్చు. ఇప్ప‌టికే వైర‌స్‌పై ప్ర‌యోగిస్తున్న మెడిసిన్‌కు ఇది విరుగుడు త‌యారు చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఎంత ప‌వ‌ర్‌ఫుల్ మందును ప్ర‌యోగించినా.. వైర‌స్ వ్యాప్తి కొన‌సాగేలా ఇది రూపాంత‌రం చెందింద‌ని అంటున్నారు.  మోనోక్లోన‌ల్ యాంటీబాడీ కాక్‌టెయిల్ ట్రీట్‌మెంట్ గురించి వినే ఉంటారుగా. అప్ప‌ట్లో అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌కు క‌రోనా సోకితే ఈ మందుతోనే ట్రీట్‌మెంట్ చేశారు. ఇటీవ‌ల ఇండియాలో కూడా ఈ మెడిసిన్ అందుబాటులోకి వ‌చ్చింది. అయితే, ఆందోళ‌న‌క‌ర‌మైన విష‌యం ఏంటంటే.. దేశంలో ఇటీవలే ఆమోదం పొందిన మోనోక్లోనల్‌ యాంటీబాడీ కాక్‌టెయిల్‌ చికిత్స.. క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ అయిన డెల్టా ప్ల‌స్ మీద ప‌ని చేయ‌డం లేదు. ఒక్కో డోస్ 60వేలు ఖ‌రీదైన ఇంత‌టి ప‌వ‌ర్‌ఫుల్ మెడిసిన్‌నే డెల్టా ప్ల‌స్ వేరియంట్ ఎదుర్కొంటోందంటే.. ఇది ఎంత శ‌క్తివంత‌మైన వైర‌సో తెలుస్తోంది.  మోనోక్లోనల్‌ యాంటీబాడీలను ల్యాబ్‌లో కృత్రిమంగా తయారు చేస్తారు. వైరస్‌ నుంచి శరీరాన్ని రక్షించడానికి ఉత్పత్తయ్యే నేచుర‌ల్‌ యాంటీ బాడీలను ఇవి పోలి ఉంటాయి. కరోనా వైరస్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకొనేలా ఈ కాక్‌టెయిల్‌ను రూపొందించారు. మన శ‌రీరంలోని రోగనిరోధక స్పందన నుంచి తప్పించుకోవడానికి వైరస్‌లో ఉండే ఒక వ్యవస్థతో ఈ ఉత్పరివర్తనం జ‌రిగి ఉంటుంద‌ని సైంటిస్టులు అంచ‌నా వేస్తున్నారు.  కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌కు సంబంధించిన డెల్టా వేరియంట్‌ మరోసారి ఉత్పరివర్తన చెంది, ‘డెల్టా ప్లస్‌’ లేదా ఏవై.1 పేరుతో కొత్త రూపాన్ని సంతరించుకుంది. డెల్టా ప్ల‌స్.. వైర‌స్ వేరియంట్‌పై ప్రస్తుతానికి ఆందోళన అవసరం లేదని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. భారత్‌లో డెల్టా ప్ల‌స్‌ ఉనికి చాలా తక్కువగానే ఉందని తెలిపారు.  కరోనాలో బి.1.617.2 అనే రకం తొలుత భారత్‌లోనే వెలుగు చూసింది. అదే ‘డెల్టా’ వేరియంట్‌. దేశంలో ప్రస్తుత కొవిడ్ సెకండ్ వేవ్‌కు ఇదే ప్రధాన కారణం. ‘డెల్టా’లో కె417ఎన్‌ అనే ఉత్పరివర్తన కారణంగా కొత్త వేరియంట్‌ పుట్టుకొచ్చింది. దీన్ని బి.1.617.2.1 అని పిలుస్తున్నారు. వైరస్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌లో ఈ ఉత్పరివర్తన వచ్చిందని దిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జీనోమిక్స్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయాలజీ (ఐజీఐబీ) శాస్త్రవేత్త వినోద్‌ స్కారియా చెప్పారు. మానవ కణాల్లోకి ప్రవేశించడానికి ఈ ప్రొటీన్ వైరస్‌కు కీల‌కం.  ప్రపంచవ్యాప్తంగా 62 మంది కొవిడ్‌ బాధితుల నమూనాల్లో ‘డెల్టా ప్లస్‌’ వెలుగు చూసింది. గ‌త‌వారం భారత్‌లో ఏడు నమూనాల్లో ఇది కనిపించింది. ‘‘ప్రస్తుతం ఇది భారత్‌లో పెద్దగా కనిపించడంలేదు. ఐరోపా, ఆసియా, అమెరికాల్లో ఎక్కువగా వెలుగుచూసింది’’ అని ఐజీఐబీ వెల్ల‌డించింది. డెల్టా ప్లస్‌పై భయాలు అవ‌స‌రంలేద‌ని అంటూనే.. యాంటీబాడీ కాక్‌టెయిల్‌ను ఎదుర్కొనే సామర్థ్యం ఉండటం ఇబ్బందికరమేనని చెబుతున్నారు. కొత్త‌ వేరియంట్‌ ఉద్ధృతంగా వ్యాపిస్తుందని గానీ, తీవ్ర వ్యాధి కలిగిస్తుందని గానీ ఇంకా నిర్ధరించలేద‌న్నారు. ఇది మన రోగనిరోధక వ్యవస్థను తప్పించుకుంటుందా అనేది తేల్చేందుకు.. పూర్తిస్థాయిలో టీకా పొందిన వ్యక్తుల నుంచి ప్లాస్మాను సేకరించి, పరీక్షించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అప్ప‌టి వ‌ర‌కూ జాగ్ర‌త్తే మ‌న‌కు ర‌క్ష‌.  

ఈటల టీమ్ కు పెను ముప్పు.. పైలెట్ అప్రమత్తతతో అంతా సేఫ్..

బీజేపీలో చేరి హైదరాబాద్ తిరిగొస్తున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ బృందానికి పెను ప్రమాదం తప్పింది. రాజేందర్ తో పాటు ఆయన బృందం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రత్యేక విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. టేకాఫ్ సమయంలో రన్ వేపై ఉండ‌గా సాంకేతిక సమస్యను పైలెట్ గుర్తించారు.  గాల్లోకి  లేచే టైంలో అప్ర‌మ‌త్త‌మై పైలెట్ విమానాన్ని ఆపేశారు. పైలెట్ సమయానికి స్పందించడంతో విమానానికి పెను ప్రమాదం త‌ప్పింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సాంకేతిక సమస్య తలెత్తిన  విమానంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్,  ఎమ్మెల్యే రఘనందన్, మాజీ ఎంపీ వివేక్, ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమాతో పాటు మొత్తం 184 మంది ఉన్న‌ట్లు తెలుస్తోంది.సోమ‌వారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ధర్మంద్ర ప్రధాన్ సమక్షంలో ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. ఆయనతోపాటు మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌, మాజీ ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి, తుల ఉమ, అశ్వత్థామరెడ్డి, ఓయూ జేఏసీ నేత‌లు కాషాయ కండువా కప్పుకున్నారు. సోమవారం సాయంత్రం బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాను కూడా కలిసింది ఈటెల బృందం. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లనున్నారు ఈటల రాజేందర్. 

వణికిస్తున్న డెల్టా వేరియంట్.. టీకాతోనే జనాలకు సేఫ్.. 

దేశం అంతటా కరోనా విలయాన్ని సృష్టిస్తూనే వుంది. ఒక ప్రాంతంలో ఎక్కువ ఒక ప్రాంతంలో తక్కువ, అంతే, అదొక్కటే తేడా... అలాగే, తొలి విడతలో కొన్ని ప్రాంతాలలో ప్రళయాన్ని సృష్టిస్తే సెకండ్ వేవ్’లో ఇంకొన్ని రాష్ట్రాలను చుట్టేసింది. దేశంలో తొలి  కరోనా కేసు నమోదైంది కేరళ రాష్ట్రంలోనే, అయినా ఫస్ట్  వేవ్’  ఆ రాష్ట్రంలో అంతగా ప్రభావం చూపలేదు. కానీ సెకండ్ వేవ్ రాష్ట్రంపై విరుచుకు పడింది. మరణ మృదంగం వినిపించింది. జూన్ 13 తేదీ నాటికి కేరళలో 11,181 కొవిడ్ మరణాలు నమోదయ్యాయి.ఇందులో సగానికి సగం గడచిన 40 రోజుల్లోనే నమోదయ్యాయి.ఇవి కేవలం అధికారిక లెక్కలు మాత్రమే సుమండీ. కేరళలో మాత్రమే కాదు, మన తెలుగు రాష్ట్రాలు సహా చాలా వరకు రాష్ట్రాలు కరోనా కేసులు, కొవిడ్ మరణాల లెక్కలను తక్కువచేసి, తప్పుగా చూపించాయనే ఆరోపణలున్నాయి. నిజనికి ఇవి ఆరోపణలు కాదు నిజాలే.  తెలంగాణాలో  అయితే, వాస్తవ మరణాలకు ప్రకటిత అధికార లెక్కలకు పొంతనే లేదని అంటున్నారు. అంతే కాకుండా కరోనా చుట్టూ రాజకీయాలు వచ్చి చేరాయి. అందరూ కలిసి చేసిన తప్పుకు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ రాజకీయ లబ్ది కోసం ప్రయత్నిస్తున్నారు.దీంతో నిజం మరుగున పడిపోయింది. వాస్తవ లెక్కలు తప్పి పోయాయి. అందుకు కేరళ రాష్ట్రమే ప్రత్యక్ష ఉదాహరణ, ఇటీవల  జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆనవాయితీకి భిన్నంగా వరసగా రెండవసారి, వామపక్ష కూటమి అధికారంలోకి రావడానికి ఫస్ట్ వేవ్ కట్టడిలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వం విజయం సాధించడం కూడా ఒక కారణంగా అందరూ పేర్కొన్నారు. దేశం అంతటా కేరళ మోడల్ ఫాలో కావాలని లెఫ్టిస్టులు  దేశమంతా గొప్పగా ప్రచారం చేసుకున్నారు. అయితే  లెక్కలు తప్పుగా చూపారని రాష్ట్ర ప్రభుత్వ అధికారులే ఇప్పుడు అంగీకరిస్తున్నారు. అప్పుడు తక్కువ చూపడం వలన ఇప్పుడు ఎక్కువ మరణాలు కనిపిస్తున్నాయని అధికారులు అంటున్నారు.     కరోనా తొలి వేవ్ ప్రభావం రాష్ట్రంపై అంతగా లేదు. అందుకు రాష్ట్రంలో సెకండ్ వేవ్’లో అది కూడా గడచిన 40 రోజుల్లో నమోదైన మరణాలే నిదర్శనంగా అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో మొదటి ఇంతవరకు మొత్తం 11,181మరణాలు సంభవించాయి. ఇందులో మొదటి సగం, అంటే 5500 మరణాలు 371 రోజుల్లో నమోదయ్యాయి, కానీ సెకండ్ వేవ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ సంఖ్య రెట్టింపు కావడానికి కేవలం 40 రోజులు మాత్రమే పట్టింది. అంటే, తొలి వేవ్’కంటే సెకండ్వేవ్’లో రోజు వారీ మరణాల సంఖ్య ఇంచుమించిగా ఎనిమిది తొమ్మిది రెట్లు  పెరిగింది.   కేరళలో తొలి కొవిడ్ మరణం గత సంవత్సరం, 2020 మార్చి28 ఎర్నాకులంలో నమోదైంది. ఈ సంవత్సరం, 2021 మే నెలలో రాష్ట్రంలో 5500 మరణం రికార్డులకు ఎక్కింది.ఇక అక్కడి నించి, అంటే, మే 5 నుంచి మరణాల సంఖ్య రోజు రోజుకు పెర్గుతు వచ్చింది, మే18 నుంచి రోజుకు వంద మంది కొవిడ్ కాటులు బలయ్యారు. ఈ మధ్య కాలంలో నాలుగు సందర్భాలలో 200 సంఖ్యను దాటి మరణాలు సంభవించాయి. ఈ జూన్ 6అత్యధికంగా 226 మంది కొవిడ్’తో కన్ను మూశారు. ప్రస్తుతం దేశం అంతటా, కరోనా ప్రభావం తగ్గుతున్నా, కేరళలో మాత్రం ఉదృతి కొనసాగుతోంది.ఇప్పటికీ రోజు వందకు తగ్గకుండా మరణాలు సంభవిస్తున్నాయి. కేరళ సహా దేశం అంతటా కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందడానికి ఈసారి వచ్చింది, డెల్టా వేరియంట్ కావడం ఒక కారణం అయితే, కేరళలో సెకండ్ వేవ్ ఉదృతికి ఇతర కారణాలు కూడా ఉన్నాయని శాస్త్ర వేత్తలు అంటున్నారు.  డెల్టా వేరియంట్ వేగంగా విస్తరించడం వలన కరోనా  ఎక్కువ మందికి సోకింది. ఎక్కువమంది ఆసుపత్రి పాలయ్యారు. ఎక్కువ మంది మృత్యువాత పడ్డారు.కేరళతో సహా దేశంలో హాస్పిటల్ సదుపాయాలు చాలినంతగా మరొక కారణం, అయితే, అన్నిటినీ మించి 40 సంవత్సరాల లోపు వారికీ వాక్సిన్ లేక పోఅడం వలన వాక్సిన్ పొందిన వృద్ధుల కంటే యువకులు ఎక్కువగా కరోనా సోకింది. ఇలా కేరళలో అదే విధంగా దేశంలో కరోనా సెకండ్ వేవ్, తీవ్ర ప్రభావానికి వాక్సిన్ అందరికి అందుబాటులో లేకపోవడం అన్నిటికీ  మించిన మూల కారణంగా శాస్త్రవేత్తలు చెపుతున్నారు.  సో... ఇక ఇప్పటికైనా, వాక్సిన్ రాజకీయలు పక్కన పెట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వాక్సిన్ పై దృష్టిని కేంద్రీకరించడం అవసరం.

ప్రధాన న్యాయమూర్తి పర్యటన...  ‘ప్రత్యేకం’ 

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సీజేగా బాధ్యతలు చేపట్టాక, తొలిసారి,  తెలుగు రాష్ట్రాలకు వచ్చారు. ముందుగా  సతీ సమేతంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని  దర్శించుకున్న ప్రధాన న్యాయమూర్తి, అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న జస్టిస్ రమణకు గవర్నర్ తమిళిసై,, ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర హై  కోర్టు   ప్రధాన న్యాయమూర్తి,  జస్టిస్ హిమా కోహ్లీ రాష్ట్ర మంత్రులు, ఘన స్వాగతం పలికారు.  నిజానికి జస్టిస్ రమణకు హైదరాబాద్ కొత్తకాదు. హైదరాబాద్ నగరంతో ఆయనకు దశాబ్దాల అనుబంధం ఉంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఆయన అనేక హోదాలలో ఇక్కడనుంచే పని చేశారు. అలాగే, అనేక మార్లు  తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ఆయనకు, హైదరాబాద్, తిరుమల మాత్రమే కాదు, ఉభయ  తెలుగు రాష్ట్రాలలోని ప్రతి ప్రాంతం, ప్రతి క్షేత్రం ... ప్రతిది ఆయనకు సుపరిచితాలు ... ఈ నేల, ఈ గాలీ అన్నీ ఆయన ఉచ్వాస నిశ్వాసాలు. అలాగే, సర్వోన్నత నాయస్థానం ప్రధాన న్యాయమూర్తి స్థాయికి  జస్టిస్ ఎన్వీ రమణ చేరుకోవడం తెలుగువారిగా మనందరికీ గర్వకారణం.. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ పదవిని అలకరించిన రెండవ తెలుగు వెలుగు జస్టిస్ ఎన్వీ రమణ.  అంతటి అత్యున్నత పదవి స్వీకరించిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్ సందర్శించారు. అందుకే ఈ పర్యటన ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన హోదాకు మాత్రమే కాకుండా తెలుగువారికి అయన తెచ్చిన గౌరవానికి తగిన విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ నిబంధనలతో  పాటు  ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత మర్యాదలు పాటిస్తున్నారు. హైదరాబాద్ చేరుకున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు విమానశ్రయంలో హై కోర్టు ప్రధాన న్యామూర్తి, ఇతర అధికారులతో పాటుగా  మంత్రి కేటీఅర్   స్వాగతం పలికితే,  ముఖ్యమంత్రి కేసీఆర్, రాజ్ భవన్’లో స్వాగతం పలికారు.అలాగే, ప్రధాన న్యాయమూర్తి పాల్గొన్న అధికార కార్యక్రమాలు అన్నిటిలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ప్రత్యేకంగానూ,కలుసుకున్నారు.అలాగే, యాదాద్రి సందర్శనకు ఆహ్వానించారు. అందుకు  జస్టిస్‌ ఎన్వీ రమణ అంగీకరించారు. సీజేఐ జస్టిస్‌ రమణకు, ఆయన హోదాకు తగినట్టుగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు ఉండాలని సీఎం కేసీఆర్‌ యాదాద్రి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంత్రి జగదీశ్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌ రెడ్డి.. శనివారమే కొండపై ఏర్పాట్లు చేశారు.    ముఖ్యమంత్రి జస్టిస్ ఎన్వీ రమణ రాష్ట్ర పర్యటనకు ముఖ్యమంత్రి ఇస్తున్న ప్రాధాన్యత ప్రత్యేక శ్రద్ద విషయంలో రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రిని వెంటాడుతున్న పాస్ పోర్ట్, ఈఎస్ఐ కుంభకోణం వంటి పాత కేసులతో పాటుగా, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల అస్తులకు సంబంధించి వినవస్తున్న తాజా ఆరోపణల నేపధ్యంలో, ముఖ్యమంత్రి ప్రధాన న్యాయ మూర్తి పర్యటనకు ప్రత్యేక ప్రధాన్యత ఇస్తున్నారని రాజకీయ వర్గాలో చర్చ మొదలైంది.  గత కొంత కాలంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నాయకులు ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేయడంతో పాటుగా, ముఖ్యమంత్రి జైలుకు పోవడం ఖాయమని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ముఖ్యమంత్రి కుటుంబ అవినీతికి సంబంధించిన ఆధారాలను  సేకరిస్తున్నామని, బండి సంజయ్ ప్రతి సందర్భంలో పేర్కొంటున్నారు. మరో వంక కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి  కూడా, అటు కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పర్యటనలో ముఖ్యమంత్రి, అధికార పార్టీ నాయకులు  చూపుతున్న అతి ఉత్సాహన్ని చూడవలసి ఉంటుందని రాజకీయ వర్గాల్లో వినవస్తోంది. అయితే అందులో ఎంత నిజం వుందో, ఏమో కానీ, గతంలోనూ రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా  జస్టిస్ హిమా కోహ్లీ ప్రమాణ స్వీకారం  చేసిన సందర్భంగానూ ... ఇలాంటి వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలే వినిపించాయి.

జగన్ రెడ్డి జిల్లాలో కాల్పులు.. 

కడప జిల్లా పులివెందుల అక్కడ ప్రాణాలు తీయడం చాలా ఈజీ.. హైద్రాబాద్ లో మనం ఓ కాక హోటల్ కి వెళ్లి దోష తిన్నంత ఈజీ వాళ్లకు.. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లా. ఆయన ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. తన నియోజగవర్గంలో అలా జరగడం అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. అక్కడ ఎవరినైనా టార్గెట్ చేస్తే ప్రభుత్వం ప్రధకాలు ప్రవేశ పెట్టినట్లు విడతల వారీగా డోసు పెంచుతూపోతారు.. అప్పటికి వినకపోతే కథం చేస్తారు.. కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్న కడప పులివెందులలో ఒక్కసారిగా  కాల్పులు జరిగాయి. ఆ కాల్పులు స్థానికుల్లో కలకలం రేపాయి. ఆస్తి తగాదాలతో ఇద్దరు ప్రత్యర్ధులు ఒకరిపై ఒకరు హత్యాయత్నానికి పాల్పడ్డారు..మరి చివరికి ఏం జరిగిందో తెలుసుకుందామా..?    పులివెందుల మండ‌లం న‌ల్లపురెడ్డిప‌ల్లె గ్రామంలో శివప్రసాద్‌రెడ్డి అనే వ్యక్తి తన ప్రత్యర్థి పార్థసారధిరెడ్డి అనే వ్యక్తికి కొంతకాలంగా  రెండు కుటుంబాల మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శివప్రసాద్‌రెడ్డిని హత్య చేసేందుకు పార్థసారథిరెడ్డి తన కుమారులతో కలిసి ప్రయత్నించాడు. ప్రత్యర్థుల మూవ్మెంట్ ని పసిగట్టిన శివప్రసాద్‌రెడ్డి కొంతకాలంగా అప్రమత్తంగా ఉన్నాడు. తన లైసెన్డ్స్ గన్‌తో పార్థసారథిని కాల్చి చంపి ఆ తరువాత జరిగే పరిణామాలు గుర్తుచేసుకుని భయాందోళనకు గురైన అదే గన్ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు పరిశీలించారు. ఈ ఘటనకు ఆస్తి తగాదాలే కారణమని స్థానికులు చెబుతున్నా.. వేరే కారణమేదైనా ఉందా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.

కూతురికి  యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని చంపిన తండ్రి.. 

చిన్న పిల్లలు దేవుడితో సమానం అంటారు. చిన్న పిల్లలు అంటే ఇష్టపడి వారు ఎవరు ఉండరు. ఇక తల్లిదండ్రుల విషయానికి వస్తే పిల్లలే తమ సర్వసవంగా బతుకుతారు. కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వాళ్లకు ఏమైనా తట్టుకోరు. ఇది ఇలా ఉంచితే చాలా మంది జనం ఉన్న చోటు కూడా డ్రైవింగ్ ర్యాష్ గా చేస్తారు.. ఆ ర్యాష్ డ్రైవింగ్ ఎంతో మంది ప్రాణాలను బలికొంది..అలాంటి డ్రైవింగ్ వల్ల ఎలాంటి సంబంధం లేని  సామాన్యులు చాలా మంది పోయారు.. తాజాగా ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఓ కూతురికి దెబ్బలు తగిలాయి.. ఆ కూతురి దెబ్బలు తగలడానికి కారణం అయిన వాడికి చివరికి ఆ తండ్రి ఏంచేశాడో తెలుసా..? ఏం చేశాడో మీరే చూడండి.. తెలుసుకుంది అసలు ఏం జరిగిందో..  ఓపెన్ చేస్తే అది హైదరాబాద్ జగద్గిరిగుట్ట.  ఒక పాప రోడ్డు మీద ఆడుకుంటుంది. సడెన్ ఒక బైక్ వచ్చి ఆ పాపను గుద్దేసింది. ఆ పాపకు గాయాలు అయ్యాయి..దీంతో జావేద్ కు పాప తండ్రి శ్రీహరికి మధ్య మాటా మాటా పెరిగింది. ఇద్దరు కూడా రోడ్డు మీద ఘర్షణపడ్డారు. మధ్యాహ్నం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరినీ కూడా బస్తీవాసులు సర్దిచెప్పి పంపించి వేశారు. శ్రీహరి కి తన కూతురు దెబ్బలతో ఉండడం చూడలేకపోయాడు.. ఆవేశపడ్డాడు.. ఆలోచించాడు.. అందుకో ఓ పథకం వేశాడు.  ఆ పధకం ప్రకారమే సాయంత్రం సమయంలో మాట్లాడుకుందామని చెప్పి జావేద్ ఇంటి నుంచి శ్రీ హరి బయటకు తీసుకొచ్చాడు. అప్పటికి మనసులో కుచింతం పెట్టుకున్న శ్రీహరి.. కొద్ది దూరం వెళ్లిన తర్వాత పై జావేద్ పై కత్తితో శ్రీ హరి దాడి చేశారు. తన కూతురికి రోడ్డు ప్రమాదంలో గాయాలపాలు చేసినందుకు జావిద్ పై శ్రీహరి కసి పెంచుకున్నాడు. జావేద్ పై శ్రీహరి దాడి చేస్తున్న ఈ విషయాన్ని వెంటనే స్థానికులు గమనించారు. కత్తితో దాడి చేసి అక్కడి నుంచి శ్రీహరి పారిపోయాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న జావేద్ ను వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో జావేద్ మృతి చెందాడు. ఈ సంఘటనపై జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.  

కేసీఆర్‌ ఆస్తులే టార్గెట్‌! ఈట‌ల డైరెక్ట్ అటాక్‌?

ఈట‌ల రాజేంద‌ర్‌. ఈ పేరు విన‌గానే మ‌దిలో ఓ రూపం మెదులుతుంది. పిట్ట కొంచెం.. కూత ఘ‌నం టైప్ లీడ‌ర్‌. ఎప్పుడూ కేసీఆర్ ప‌క్క‌నే క‌నిపించే నాయ‌కుడు. మెడ‌లో గులాబీ కండువా. ఇదంతా గ‌తం. ఇక‌నుంచి టోట‌ల్ డిఫ‌రెంట్‌. అదే మ‌నిషి. అదే కంఠం. కానీ, వాయిస్‌లో వ‌ర్ష‌న్ ఛేంజ్ అయింది. మెడ‌లో కండువ రంగు మారిపోయింది. గులాబీ పోయి కాషాయం వ‌చ్చే డుం..డుం..డుం... ఢిల్లీలో జాతీయ పార్టీ కార్యాల‌యంలో కాషాయ కండువా క‌ప్పేసుకున్నారు ఈట‌ల రాజేంద‌ర్‌. ఇన్నాళ్లూ గులాబీ కండువ‌లో చూసి, చూసి.. ఒక్క‌సారిగా కాషాయ కండువాలో చూడాలంటే కాస్త కొత్త‌గా క‌నిపిస్తోంది. కానీ, త్వ‌ర‌గానే అల‌వాటు అయిపోతుంది లేండి అది వేరే విష‌యం. అయితే, ఇక్క‌డ మేట‌ర్ కండువా గురించి కాదు. బీజేపీ జెండా వెనుక ఉన్న‌ ఎజెండా గురించి. టీఆర్ఎస్‌లో ఉన్న‌న్నాళ్లూ ఈట‌ల నోటికి పెద్ద‌గా ప‌ని ప‌డ‌లేదు. విమ‌ర్శ‌లు, వ్యూహాలు వినిపించాల్సిన‌, ప‌న్నాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డ‌నే లేదు. ప్రెస్‌మీట్లు, మీడియా క‌వ‌రేజీల అవ‌స‌రం రాలేదు. ఇక‌పై.. సీన్ అమాంతం మారిపోనుంది. ఇక నోరు అరిగిపోయేదాకా.. నోటికి ప‌ని చెప్పాల్సిన ప‌ని ఉంటుంది. స్వ‌త‌హాగా ఉద్య‌మ నాయ‌కుడైన రాజేంద‌ర్‌.. ఇక త‌న ఈటెల్లాంటి మాట‌ల‌తో కేసీఆర్‌పై యుద్ధానికి సిద్ధం కావాల్సిందే.  కాషాయ కండువా క‌ప్పుకున్న రోజే.. గులాబీ బాస్‌పై ఈటెలు విసిరారు ఈట‌ల రాజేంద‌ర్‌. నీ ఆస్తులు.. నా ఆస్తులు.. లెక్క తేలుద్దాం రా.. అంటూ కేసీఆర్‌ను స‌వాల్ చేశారు. సిట్టింగ్ జ‌డ్జితో కానీ, సీబీఐతో కానీ.. ఎంక్వైరీకి సిద్ద‌మా అంటూ ఢిల్లీ బీజేపీ ఆఫీసు నుంచి గ‌ట్టిగానే తొడ‌గొట్టారు రాజేంద‌ర్‌. ఇది క‌దా కావాల్సింది.. అంటున్నారు క‌మ‌ల‌నాథులు. రాష్ట్రంలో ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేస్తున్నార‌ని.. ఆ డ‌బ్బంతా ఎక్క‌డి నుంచి వ‌స్తోంద‌ని కేసీఆర్‌ను నిల‌దీశారు ఈట‌ల‌. అబ్బా ఛా.. ఇన్నాళ్లూ మీరు ఆయ‌న వెంటే ఉన్నారుగా ఆ సొమ్మంతా ఎలా వ‌స్తుందో మీకు తెలీదా? ఆ కిటుకేంటో మీరే బ‌య‌ట‌పెట్టొచ్చుగా అంటూ ఈట‌ల‌పైనా సోష‌ల్ మీడియాలో సెటైర్లు ప‌డుతున్నాయి. రాజీ..కీయాల్లో ఇవ‌న్నీ కామ‌నే అనేది వేరే విష‌యం అనుకోండి... అయితే, ఈట‌ల బీజేపీలో చేరిన తొలిరోజే కేసీఆర్ ఆస్తుల‌ను టార్గెట్ చేయ‌డం ఇంట్రెస్టింగ్ పాయింట్‌. భూక‌బ్జా ముద్రేసి త‌న‌ను అవ‌మాన‌క‌రంగా గెంటేసిన గులాబీ బాస్‌ను.. అదే అవినీతి, అక్ర‌మాల ఎజెండాతో దెబ్బ కొట్టాల‌నేది రాజేంద‌ర్ రాజకీయ వ్యూహంలా క‌నిపిస్తోంది. అధికారంలో ఉన్న ఏ పార్టీకైనా ఆస్తులు అన‌కొండాలా పెరిగిపోతుంటాయి. అందుకే, టీఆర్ఎస్‌కు వంద‌ల కోట్లు విరాళాల రూపంలో వ‌చ్చి ప‌డ్డాయి. పార్టీ ఫండ్స్ అనే కాదు.. కేసీఆర్ అండ్ కో.. ప‌ర్స‌న‌ల్ అస్సెట్స్ కూడా కొండంత పోగ‌య్యాయ‌ని అంటారు. ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా.. ఆ కాసుల‌ గుట్ట నుంచి గుప్పెడు గుప్పెడు సొమ్ము బ‌య‌ట‌కు తీసి.. ఓట‌ర్ల‌కు గుప్పించి.. గెలుస్తున్నార‌నేది ఈట‌ల మాట‌ల‌కు అర్థం, ప‌ర‌మార్థం. అందుకే, కేసీఆర్‌ను రాజ‌కీయంగా ఓడించాలంటే.. ముందు ఆయ‌న కుంభ‌స్థ‌ల‌మైన ఆర్థిక మూలాల‌ను దెబ్బ‌కొడితే.. కొండంత కేసీఆర్ కుప్ప‌కూల‌డం ఖాయ‌మ‌నేది ఈట‌ల లెక్క‌లా క‌నిపిస్తోంది. అందుకే, కాషాయ కండువా క‌ప్పుకున్న వెంట‌నే.. ఈట‌ల నోటి నుంచి కేసీఆర్ ఆస్తులపై విచార‌ణ‌కు సిద్ధ‌మా? అనే డైలాగ్ దూసుకొచ్చింద‌ని చెబుతున్నారు.   పొడుగోడైన కేసీఆర్ నెత్తి కొట్టాలంటే.. పొట్టోడైన ఈట‌ల‌కు, పోశ‌మ్మ‌లాంటి బీజేపీ అండా, దండా అవ‌స‌ర‌మైంద‌ని అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీలో చేర‌డంతో.. ఇక ఈట‌ల‌కు వెయ్యి ఏనుగుల బ‌లం వ‌చ్చిన‌ట్టైంది. దొర లోటుపాట్లు, లొసుగులు, లోగుట్లు, లొల్లులు.. అన్నీ తెలిసిన రైట్ హ్యాండ్ లీడ‌ర్ కావ‌డంతో.. ఇక‌పై కేసీఆర్గూ డుపుఠానీల‌పై ఒక్కొక్క చిట్టా విప్పే ప‌నిలో ఉంటార‌ని తెలుస్తోంది. పెద్ద నోరున్న‌.. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు బండి సంజ‌య్ నుంచి సైతం ఫుల్ స‌పోర్ట్ ఉండ‌టంతో.. ఇక‌పై కేసీఆర్‌కు ద‌బిడి దిబిడే అంటున్నారు క‌మ‌ల‌నాథులు.