వాక్సిన్ వేసుకుంటే.. జరం ఎందుకు వస్తుంది..
posted on Jun 12, 2021 @ 4:33PM
వ్యాక్సిన్ అంటే చాలా మందికి భయం.. ఇంకొంత మందికి హ వ్యాక్సిన్ వేసుకున్న కరోనా వస్తుంది అప్పుడు వ్యాక్సిన్ ఎందుకు వేసుకోవాలి అని.. ఇంకొంత మంది వ్యాక్సిన్ వేసుకుంటే వారం రోజులు జ్వరం వస్తుంది.. వొళ్ళు నొప్పులు ఉంటాయి..కరోనా కు వ్యాక్సిన్ వచ్చి దాదాపు అటు ఇటుగా సంవత్సరం అయిన.. వ్యాక్సిన్ పై ప్రజలకు ఇంకా నమ్మకం లేదు..
కరోనా ఆ మాట వింటే చాలు ఒళ్ళు గుగ్గులు పెడుతుంది. కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాక కొంత మందికి జ్వరం వస్తుంది. మరికొంత మందికి ఒళ్ల నొప్పులు.. లేదా ఆయాసం.. లేదా తీవ్రమైన తలనొప్పి.. ఆయాసం పెరగడం వంటి లక్షణాలు వస్తున్నాయి. మరికొంత మందిలో అసలు ఇలాంటి మార్పులు కనిపించలేదని చెబుతుంటారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఏదైనా అనారోగ్యం వస్తే లేదా ఏమీ రాకుండా సాధారణంగా ఉండిపోవడంపై ప్రపంచ వ్యాప్తంగా వైద్య నిపుణులు ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నారు. అనివేశిస్తున్నారు. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. భౌగోళికంగా వివిధ దేశాల్లో తీవ్రమైన చలి (మంచు కురిసే ప్రాంతాలు),తీవ్రమైన ఎండ (ఎడారి), సముద్ర తీర ప్రాంతాలు, నదీ తీర ప్రాంతాల్లో ఆయా వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా పరిస్థితిని బట్టి వ్యాక్సిన శరీరంలో ఎలా పనిచేస్తున్నదో తెలుసుకుంటున్నారు. వాటిపై నిరంతరం అధ్యయనం మొదలు పెట్టారు. వ్యాక్సిన్ మార్కెట్లోకి రిలీజ్ కంటే ముందే క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినా.. చాలా తక్కువ సంఖ్యలోనే జరిగాయి. తాజాగా ఇప్పుడు వ్యాక్సినేషన్ ప్రక్రియ కోట్లకు చేరుకున్న నేపధ్యంలో వైద్య నిపుణులు కచ్చితమైన సమాచారం కోసం అధ్యయనం కొనసాగిస్తున్నారు. ఆయా దేశాల్లో పరిస్థితుల ఆధారంగా శరీరంలోవ్యాక్సిన్ తెచ్చే మార్పులను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్నారు.
వ్యాక్సిన్ తీసుకున్నక శరీరంలో ఏం జరుగుతుందంటే..?
కరోనా వ్యాక్సన్ వేసుకున్నాక మనిషి శరీరంలో దాని ప్రభావం ఎంత మేరకు ఉందనేది తెలుసుకునేందుకు అధ్యయనాలు జరుపుతున్నారు. శరీరం రోగ నిరోధక వ్యవస్థ రెండు విధాలుగా పనిచేస్తుంది. ఒకటి సహజసిద్ధంగా స్పందించేది.. రెండోది మందులు, టీకాలు తదితర వాటి ఉత్ప్రేరకంతో పనిచేసేవి. అందుకే వ్యాక్సిన్ వేసుకున్నాక తెల్ల రక్త కణాలు వ్యాక్సిన్ తో కలసిపోయి ప్రక్రియను చేపడతాయి. దీని వల్ల వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఒళ్ల నొప్పులు, జ్వరం.. అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ ర్యాపిడ్ రెస్పాన్స్ ప్రక్రియ వయసును బట్టి క్షీణిస్తుంది. యువత చాలా బలంగా ఉంటారు కాబట్టి ఈ ప్రక్రియ వేగంగా జరిగిపోతుంది. అలాగే వృద్ధుల్లో యువతకు భిన్నంగా నిదానంగా పనిచేస్తుంది కాబట్టి వీరికి లక్షణాలు కాస్త ఎక్కువగా ఉంటుంది. వీరికే వ్యాక్సిన్ ఉత్తేజం అవసరం అవుతుంది. యాంటీ బాడీలను ఉత్పత్తి చేసేందుకే వ్యాక్సిన్ ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు తెల్లడించారు. మహిళలు వ్యాక్సిన్ వేసుకున్నాక గడ్డలు కట్టిందని వారు అంటున్నారు. అవి క్యాన్సర్ గడ్డలేమోనని అనుమానిస్తుంటారు. ఇలాంటి అనుమానాలు తలెత్తకూడదంటే మహిలలు రొమ్ము క్యాన్సర్ నిర్దారణకు మామో గ్రామ్ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. తాజా అధ్యయనాల ప్రకారం జ్వరం.. తలనొప్పి.. ఒళ్ల నొప్పులు రావడం సాధారణమే అని.. శరీర దృఢత్వాన్ని బట్టి ఇవి రెండు మూడ్రోజులు లేదా 15 రోజుల వరకు ఉండే ఛాన్స్ ఉందని తేలింది. ఇంతకు మించి ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించి జబ్బులను నిర్ధారించుకుని తగిన చికిత్స చేయించుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ అపోహలకు దూరంగా అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకుంటే ఇమ్యూనిటీ స్థాయి తెలిసిపోతుందని.. తక్కువగా ఉంటే వెంటనే పెంచుకోవాల్సిన అవసరం సూచిస్తుందని చెబుతున్నారు.