ప్లస్‌.. మైనస్ అయితే?.. జూనియ‌ర్‌పై బాల‌య్య డైలాగ్‌కి అర్థ‌మేంటి?

బ‌ర్త్‌డే రోజు నంద‌మూరి బాల‌కృష్ణ చేసిన న‌ర్మ‌గ‌ర్బ వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా సంచ‌ల‌నంగా మారాయి. జూనియ‌ర్ ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీపై బాల‌య్య బాబు చేసిన కామెంట్స్‌ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌. అందులోనూ ఆ డైలాగ్స్‌.. బాల‌య్య స్టైల్‌లో అర్థం అయీ, అవ‌న‌ట్టు.. క్లారిటీ ఇచ్చీ, ఇవ్వ‌న‌ట్టు.. ఉండ‌టంతో మ‌రింత‌ క‌న్ఫ్యూజ‌న్ క్రియేట్ చేస్తున్నాయి. డోంట్ ట్ర‌బుల్ ద ట్ర‌బుల్‌.. ఇఫ్ యు ట్ర‌బుల్స్ ద ట్ర‌బుల్‌.. ట్ర‌బుల్ ట్ర‌బుల్స్ యు... ఐయామ్ నాట్ ద ట్ర‌బుల్‌.. అన్న రేంజ్‌లో ఉంది బాల‌కృష్ణ.. జూనియ‌ర్ ఎన్టీఆర్‌పై వ‌దిలిన డైలాగ్‌.   బాల‌య్య‌కు అబ‌ద్దం ఆడ‌టం అస్స‌లు తెలీదు. ఉన్న‌ది ఉన్న‌ట్టు.. కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు మాట్లాడుతారు. ఆయ‌న స్టేట్ ఫార్వ‌ర్డ్ గానే మాట్లాడుతారు కానీ, జ‌నానికే ఆయ‌న ఏం మాట్లాడారే, ఆయ‌న మాట‌ల మ‌ర్మ‌మేంటో అంత ఈజీగా అర్థం కాదు. అదే బాల‌య్య బాబు స్పెషాలిటీ. సినిమా ఫంక్ష‌న్ల‌లో సినిమాల గురించో, తెలుగు సాహిత్యం, గొప్ప‌దనం, ఆ రోజుల్లో, నాన్న‌గారు గురించో అయితే ఓకే. అంత‌గా అర్థం కాక‌పోయినా ప్ర‌జ‌లు పెద్ద‌గా ప‌ట్టించుకునేవారు కాదు. కానీ, బాల‌కృష్ణ త‌న పుట్టిన రోజున‌.. జూనియ‌ర్ ఎన్టీఆర్ రాజ‌కీయ ప్ర‌వేశంపై చెప్పిన అభిప్రాయంపై ఇప్పుడు తెలుగునాట పోస్ట్‌మార్టం అవుతోంది. ఏ ఇద్ద‌రు క‌లిసినా.. బాల‌య్య డైలాగ్‌కు మీనింగ్ ఏంటా? అని తెగ చ‌ర్చించుకుంటున్నారు. ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వస్తారా? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ బాల‌కృష్ణ ఏమ‌న్నారంటే...  ‘‘ఎవరి ఆలోచనలు వారివి. ఎవరి ఇష్టాయిష్టాలు వాళ్లవి. ఎన్టీఆర్‌ రాజకీయాల్లో వస్తారా? లేదా? అనే దాని గురించి నేను పెద్దగా ఆలోచించడం లేదు’ అని సమాధానం ఇచ్చారు. ఈ ఆన్స‌ర్ క్లారిటీగానే ఉంది. ఇందులో ఎలాంటి క‌న్ఫ్యూజ‌నూ లేదు. అంతా జూనియ‌ర్ ఇష్టం.. త‌న‌కేమీ సంబంధం లేద‌న్న‌ట్టు స‌మాధానం చెప్పారు బాల‌కృష్ణ‌. ఆ త‌ర్వాతే అస‌లైన ఆన్స‌ర్ వ‌చ్చింది ఆయ‌న నోటి నుంచి. అదేంటంటే.... ఎన్టీఆర్‌ రాజకీయాల్లో వస్తే టీడీపీకి ప్లస్‌ అవుతుందని మీరు అనుకుంటున్నారా? అని అడగ్గా.. బాలకృష్ణ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా నవ్వి ఊరుకున్నారు. కొన్నిక్ష‌ణాల త‌ర్వాత స్పందిస్తూ.... ‘ఒకవేళ ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్లస్‌ అయి మైనస్‌ అయితే’ అంటూ ఎదురు ప్రశ్నించారు. ఈ చిన్న పాయింటే ఇప్పుడు నంద‌మూరి అభిమానుల‌ను పిచ్చెక్కిస్తోంది. మా బాల‌య్య బాబు అస‌లేమ‌న్నారంటూ? ఫ్యాన్స్ ప‌రేషాన్ అవుతున్నారు. బాల‌కృష్ణ మాట‌ల మ‌ర్మ‌మేంటంటూ మేధోమ‌ధ‌నం జ‌రుగుతోంది. ప్ల‌స్ అయి మైన‌స్ అయితే? చిన్న స్టేట్‌మెంట్ అయినా.. ఇందులో నుంచి ఎంతో అర్థాన్ని, ప‌ర‌మార్థాన్ని బ‌య‌ట‌కు తీస్తున్నారు. విత్తు నుంచి మ‌హావృక్షం పుట్టుకొచ్చిన‌ట్టు.. ఈ డైలాగ్ నుంచి జూనియ‌ర్ రాజ‌కీయ భ‌విష్య‌త్ ముఖ‌చిత్రాన్ని ఆవిష్క‌రిస్తున్నారు. ప్ల‌స్ అయి మైన‌స్ అయితే? అంటే.. ముందు ప్ల‌స్ అయి.. ఆ త‌ర్వాత మైన‌స్ అయితే.. ఎలా అనేదే బాల‌కృష్ణ ప్ర‌శ్న‌. అనుమాన‌మూ కూడా. ఈ డైలాగ్‌ను జూనియ‌ర్ గ‌త పొలిటిక‌ల్ యాక్టివిటీతో కంపేర్ చేసి కాస్త క్లారిటీ తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.  2009 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున దాదాపు నెల పాటు విస్తృతంగా ప్ర‌చారం చేశారు జూనియ‌ర్ ఎన్టీఆర్‌. పెద్ద ఎన్టీఆర్‌లానే ఖాకీ డ్రెస్ వేసుకొని.. చైతన్య‌ర‌థంపై ప్ర‌చారాన్ని హోరెత్తించారు. ఎన్టీఆర్ అడుగుపెట్టిన ప్ర‌తీచోటా జ‌న ప్ర‌భంజ‌న‌మే. ఆక‌ట్టుకునే ప్ర‌సంగం.. తూటాల్లాంటి వాగ్ధాటితో.. తెలుగు త‌మ్ముళ్ల‌లో ఫుల్ జోష్ తీసుకొచ్చాడు ఈ బుడ్డోడు. ఆ నెల రోజులూ జూనియ‌ర్ క్యాంపెయిన్‌తో పార్టీకి బాగా లాభం జ‌రిగింది. అదంతా ప్ల‌స్‌.  క‌ట్ చేస్తే.. ఫ‌లితాలు వ‌చ్చాక టీడీపీ ప‌రాభ‌వం పాలైంది. 2009 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీ ఓడిపోయింది. ప్ర‌త్యేకించి జూనియ‌ర్ ఎన్టీఆర్ ఏయే నియోజ‌క‌వ‌ర్గాల్లో అయితే ప్ర‌చారం నిర్వ‌హించారో.. ఆయా చోట్ల టీడీపీ సిట్టింగ్ స్థానాల‌ను కూడా కోల్పోయింది. ఎన్టీఆర్ ప్ర‌భావం అస‌లేమాత్రం క‌నిపించ‌లేదు అక్క‌డ‌. అందుకే, అది పార్టీకి బిగ్ మైన‌స్‌.  సో.. ప్ర‌చారం అనే ప్ల‌స్‌.. ఓట‌మి అనే మైన‌స్‌.. ఆ రెండిటినీ క‌లిపి.. గ‌తాన్ని భ‌విష్య‌త్తుకు అప్లై చేసి..  ‘ఒకవేళ ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్లస్‌ అయి మైనస్‌ అయితే’ అంటూ బాల‌కృష్ణ వ‌దిలిన‌ పొలిటిక‌ల్ ఈక్వేష‌న్‌ను సాల్వ్ చేస్తున్నారు పొలిటిక‌ల్ ఎక్స్‌ప‌ర్ట్స్‌. ఆయ‌న మాట‌ల‌కు అర్థాలే వేర‌ని.. ఆ అర్థం ఇదేనంటూ ఓ అవ‌గాహ‌న‌కు వ‌చ్చేస్తున్నారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ ఎంట్రీతో ప్ర‌చారం మేర‌కు ప్ర‌యోజ‌నం క‌లిగినా.. బుడ్డోడికి టీడీపీని గెలిపించేంత స‌త్తా లేద‌నే అనుమానం బాల‌య్య వ్య‌క్తం చేశార‌ని అంటున్నారు. జ‌గ‌న్‌రెడ్డిని ఢీ కొట్ట‌గ‌ల‌ స‌త్తా, స‌త్తువా.. త‌న బావ చంద్ర‌బాబు, త‌న అల్లుడు లోకేశ్‌ల‌కే ఉంద‌ని భావిస్తున్నారు కాబోలు బాల‌య్య బాబు. ఒక‌వేళ టీడీపీకి అంత‌లా అవ‌స‌ర‌మైతే.. న‌ట‌సింహం.. పొలిటిక‌ల్‌ లెజెండ్.. ప్ర‌జ‌ల్లో అఖండ అద‌ర‌ణ ఉన్న.. బాల‌కృష్ణ అనే నేను.. పార్టీకి అండ‌గా ఉండ‌నే ఉన్నానుగా అనేది బాల‌య్య మాట‌ల మ‌ర్మ‌మ‌ని విశ్లేషిస్తున్నారు. మొత్తానికి అలా.. బర్త్‌డే రోజున బాల‌య్య వ‌దిలిన డైలాగ్‌పై.. క‌న్ఫ్యూజ‌న్‌లో కాస్త‌ క్లారిటీ.. క్లారిటీలో కాస్త‌ కన్ఫ్యూజ‌న్.... ఎంతైనా బాల‌య్యా మ‌జాకా.

చెల్లి పై అన్న దారుణం.. రోకలి బండతో అన్నను చంపిన చెల్లి.. 

ఒకడు పరాయి అమ్మాయి తన అనుమతి లేకుండా తాకడం నేరం.. అదే ఒక ఇంట్లో వాళ్ళు .. ఒక్క తల్లి కడుపునా పుట్టిన వాళ్ళు, ఒకే రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు.. ఒకే తల్లి పాలు తాగిన వాళ్ళు.. పెద్దయ్యాక మందు తాగి ముందు వెనక చూడకుండా సొంత వాళ్లపై అత్యాచారానికి పాల్పడితే.. దాని ఏం అనాలి.. వాడు ఏ జాతికి చెందిన మనిషి అనాలి.. సొంత చెల్లి మీద అత్యాచారం ఎవరు చేస్తారు భయ్యా.. వేరే ఎక్కడైనా చెయ్యొచ్చు కానీ, మన తెలుగు రాష్ట్రాల్లో చేస్తారా అని మీరు అనుకోవచ్చు.. ఈ సంఘటన జరిగింది మన అది ఎక్కడో తెలుసుకోవాలనుకున్నారా..? అయితే ఇంకెందుకు ఆలస్యం..  అది తెలంగాణ రాష్ట్రము కరీంనగర్ జిల్లా. విద్యానగర్‌కు చెందిన ఓ వ్యక్తి ఫుల్‌గా తాగాడు.. తూలుతు ఇంటికి వచ్చాడు. తాగిన మత్తులో ఇంటికి రాగానే ఎదురుగా తన చెల్లి కనిపించింది. ఇక అంటే వాడికి కామం ముంచుకొచ్చింది.. వావివరసలు మరిచి.. చెల్లెల్ని వంచించాలని ఆమె మీదికి విరుచుకుపడ్డాడు.. చెల్లితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఎంత వద్దని చెప్పిన వినలేదు ఆ దుర్మార్గుడు. ఈ క్రమంలోనే తనను తాను కాపాడుకునేందుకు దగ్గరిలో ఉన్న రోకలిబండను అన్న మీదకు విసిరేసింది ఆ చెల్లెలు.. దీంతో అతను  అక్కడికక్కడే కూలిపోయాడు..మృతి చెందాడు. అయితే మద్యానికి బానిసైన అన్న తనను రోజు వేధించడం వలనే తాను ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులకు తెలిపింది. కాగా స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్తకు సంబంధిచిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తగినంత మాత్రానా తల్లి పెళ్ళాం అయితదా.. పెళ్ళాం తల్లి అయితదా.. చెల్లెలిపై అత్యాచారం చేయాలనుకోవడం అమ్మను ఆలిగా చేసుకోవడం లాంటిదే.. ఈ దారుణానికి పాల్పడ్డ అన్నపై చెల్లెలు సరైన నిర్ణయమే తీసుకుందని స్థానికులు మాట్లాడుకుంటున్నారు.. 

14న ఈటల ముహుర్తం.. 13న కేసీఆర్ మంత్రాంగం!

మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరికకు ముహుర్తం ఖరారైంది. ఈనెల 14న జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు. బీజేపీలో చేరిన తర్వాతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు రాజేందర్. బీజేపీలో చేరడం ఖాయం కావడంతో ఈటల టార్గెట్ గా దూకుడు పెంచారు గులాబీ బాస్. హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఈటలకు కౌంటర్ గా ఈనె 13న సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ , బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు కరీంనగర్ జిల్లా నేతలతో జరగనున్న ఈ సమావేశంలోహుజూరాబాద్ పైనే కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది.  ఈటల లాగా పార్టీలో మరెవ్వరూ ధిక్కార స్వరం వినిపించే సాహసం చేయకుండా చూసేందుకు ఆయనను ఓడించాలని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం గట్టి పట్టుదలతో ఉందని చెబుతున్నారు. అభ్యర్థి ఎవరన్న విషయాన్ని పక్కనపెట్టి నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలు మాదిరిగానే హుజూరాబాద్‌లో కూడా ఇప్పటి నుంచే ప్రచారం ప్రారంభించి ఈటలను అన్ని వైపులా ముట్టడించాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఇందుకోసం మండలానికో మంత్రిని, ఒక్కో ఎమ్మెల్యేను, ఇతర ముఖ్యనాయకులను ఇన్‌చార్జీలుగా నియమించింది. మరికొద్ది రోజుల్లో మండలానికి మరో ఎమ్మెల్యేను కూడా కేటాయించనున్నట్లు సమాచారం. అన్ని కులాలకు చెందిన మంత్రులను కూడా రంగంలోకి దింపాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితి,  ఈటల మద్దతుగా నిలుస్తున్నవారి వివరాలతో నివేదికలను సిద్ధం చేస్తున్నారట. హుజూరాబాద్‌ అర్బన్‌, రూరల్‌ ప్రాంతాలకు మంత్రి గంగుల కమలాకర్‌, ఎమ్మెల్యే సతీష్‌బాబు.. జమ్మికుంట మండలానికి మంత్రి కొప్పుల ఈశ్వర్‌, శాసనసభ్యుడు ఆర్‌ రమేశ్‌.. వీణవంక మండలానికి శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు.. ఇల్లందకుంట మండలానికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను ఇన్‌చార్జీలుగా నియమించారు. కమలాపూర్‌ మండల బాధ్యతలను మంత్రి దయాకర్‌రావు, శాసనసభ్యుడు చల్లా ధర్మారెడ్డికి అప్పగించారు. మంత్రులు హరీష్‌రావు, గంగుల కమలాకర్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ పూర్తి సమన్వయ బాధ్యతలను నిర్వర్తిస్తారు. ప్రస్తుతం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు ఈటల రాజేందర్. మంగళ, బుధవారాల్లో కమలాపూర్‌, ఇల్లందకుంట మండలాల్లో ఆయన తిరిగారు. ఈ సందర్భంగా ఈటలకు ఎలాంటి మద్దతు వచ్చింది, జనాల స్పందన ఎలా ఉందన్న విషయాలపైనా టీఆర్ఎస్ అధిష్టానం ఆరా తీసిందని తెలుస్తోంది. ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన తర్వాత నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, జనాల్లో ఏదైనా మార్పు వస్తుందా, ప్రభుత్వ పథకాలపై స్పందన ఎలా ఉంది అన్న అంశాలతో పాటు.. అభ్యర్థి విషయంలోనూ గులాబీ బాస్ ఫోకస్ చేశారని చెబుతున్నారు. మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి కుటుంబం త్వరలో టీఆర్ఎస్ లో చేరనుందని తెలుస్తోంది. బీజేపీకి చెందిన మరికొందరు నేతలను కూడా కారెక్కించేలా పావులు కదుపుతున్నారని సమాచారం. 

ఏపీ సీఐడీ సునీల్ కు గండం! ఆ వీడియోల్లో ఏముంది..?

ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్.. ఈ పేరు కొన్ని రోజులుగా మార్మోగుతోంది. ఢిల్లీ స్థాయిలోనూ వినిపిస్తోంది. ఆయనేదో గొప్ప పని చేసినందుకు కాదు... నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు కేసులో ఆయన వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఆయనపై ఎంపీ రఘురామ కేంద్రానికి, ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సునీల్ కుమార్ పేరు మీడియాలో ప్రముఖంగా వస్తోంది. జాతీయ మీడియాలోనూ ఆయనపై కథనాలు వస్తున్నాయి. రఘురామ రాజు ఫిర్యాదుతో ఆయన పోస్టింగ్ ఊస్టింగ్ కావచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది.  తాజాగా ఏపీ సీఐడీ సునీల్ కుమార్ కు సంబంధించి మరో సంచలన అంశం వెలుగులోనికి వచ్చింది. ఆయన పదవి ప్రమాదంలో పడిందని తెలుస్తోంది. అయితే ఎంపీ రఘురామ కేసు విషయంలో కాదు.. ఆయన రిజర్వేషన్ అంశంలో తాజా పరిణామం కీలకంగా మారింది. సునీల్ కుమార్ రిజర్వేషన్ ద్వారా తన ఉద్యోగానికి ఎన్నికయ్యారు. అయితే, భారత రాజ్యాంగం ప్రకారం… క్రిస్టియన్ మతం స్వీకరించిన వారికి రిజర్వేషన్లతో వచ్చిన ఉద్యోగాలు పోతాయి. ఈ విషయంలో కఠినంగా ఉండాలని ఇటీవలే కోర్టులు కూడా తీర్పులిచ్చాయి.  మతం మారితే ఉద్యోగం కోల్పోతారంటూ ఇటీవల వచ్చిన మద్రాస్ హైకోర్టు తీర్పుతో.. సునీల్ కుమార్ పై లీగల్ రైట్స్ అడ్వైజరీ కన్వీనర్ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం పొందిన సునీల్ కుమార్ క్రిస్టియన్ మతంలోకి మారారని కాబట్టి ఆయన్ను పదవి నుంచి తొలగించాలని ఫిర్యాదులో కోరారు.  ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సునీల్ కుమార్ తాను క్రిస్టియన్ అని గతంలో చాలా సార్లు ఓపెన్ గానే చెప్పుకున్నారు. దీంతో ఆయన పదవికి గండం ఖాయమని అంటున్నారు.  మరోవైపు తనపై ఫిర్యాదు విషయం తెలిసిన వెంటనే సునీల్ కుమార్ అప్రమత్తమయ్యారని తెలుస్తోంది. గతంలో ఆయన చేసిన క్రిస్టియన్ ప్రసంగాల వీడియోలు ఇంటర్నెట్ నుంచి మాయం అయ్యాయి. అయితే ఆయన తొలగించిన వీడియోలను ఆల్రెడీ డౌన్ లోడ్ చేసి కేంద్ర హోంశాఖకు ఇచ్చిన ఫిర్యాదుతో జత చేశారు. ఇంకా కొన్నిచోట్ల సునీల్ కుమార్ వీడియోలు లభ్యం అవుతున్నాయి. బ్రిటీష్ వారిని పొగుడుతూ, క్రిస్టియన్ మతం గొప్పదని చెప్పే వీడియోలు ఫిర్యాదుదారుల దగ్గర ఉన్నాయని తెలుస్తోంది. ఆ కేసులో సంచలనం జరగబోతుందనే ప్రచారం జరుగుతోంది.

ప్రేమ, పెళ్లి.. పెళ్లి రోజున  పెళ్ళాం బలి.. 

ప్రేమించడం.. పెళ్లి చేసుకోవడం.. ప్రేమించిన వాళ్ళకోసం ప్రాణం ఉన్నంత వరకు బతకడం..అవసరం అయితే అదే ప్రేమించిన వాళ్ళకోసం త్యాగం చెయ్యడం.. ఒకప్పటి మాట.. మరి ఇప్పుడు ఉన్నచాలా మంది ప్రేమికులలో కనిపించే విషయం..ప్రేమించామా..? వాడుకున్నామా..? వదిలేశామా..? అలాగే ఏదో  పొరపాటున ప్రేమించాను.. ఇంత జరుగుతదనుకోలేదు. నాకు ఇష్టం లేకున్నా అందరూ కలిసి బలవంతంగా తనను ఇచ్చి పెళ్లి చేశారు.. అందుకే పెళ్లి అయ్యాక ఎలా విడిపోవాలని ఇంకొందరు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి మరో అబ్బాయి ప్రేమలో ఉండడం.. ఆ అబ్బాయి ఇంకో అమ్మాయితో సంబంధం ఉండడం.. నేటి ప్రేమికుల తీరు.. నిజాయితీగా ప్రేమించే వాళ్ళు ఉంతా కాలం ఈ మోసాలు జరుగుతూనే ఉంటాయి.. సరే విషయం లోకి వెళ్దాం..  అది కృష్ణా జిల్లా.   విస్సన్నపేట మండలం. చండ్రుపట్ల తండా పంచాయతీ కొర్ర తండా గ్రామం.. ఈ గ్రామానికి  చెందిన కొర్ర దుర్గారావు, ఇదే గ్రామానికి చెందిన లక్ష్మి (24) ని ప్రేమించాడు.. ప్రేమించిన అందరూ పెళ్లి చేసుకోరు.. అలా అని ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు జీవితాంతం కలిసి ఉంటారన్న నమ్మకం లేదు నేటి సమాజంలో.. అది అలా ఉంచితే వీళ్ళ ప్రేమను పెద్దలు అంగీకరించారు.. పెద్దల  అనుమతితో గతేడాది పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి జరిగింది.. కొన్నీ కొన్నే పెళ్ళిలో గొడవలు జరుగుతాయి.. పెళ్ళిలో  కొద్దిరోజులకే అల్లాంటి గొడవలు  దంపతుల మధ్య జరగడం మొదలయ్యాయి..ఆ ప్రేమ జంట మధ్య అభిప్రాయభేదాలు రావటంతో తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం దుర్గారావు, లక్ష్మి పెళ్లిరోజు వేడుక జరుపుకున్నారు. అదేరోజు రాత్రి వారిద్దరి మధ్య మరోసారి వివాదం తలెత్తి ఘర్షణకు దారి తీసింది. దీంతో విచక్షణ కోల్పోయిన దుర్గారావు తీవ్రంగా కొట్టడంతో లక్ష్మి అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయింది. దీంతో కంగారుపడిన దుర్గారావు నేరుగా విస్సన్నపేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పి లొంగిపోయాడు. దీంతో పోలీసులు అతడిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరువూరు ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. భార్య చనిపోయిన తర్వాత భర్త నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. దీంతో పోలీసులు అతడిపై హత్య కేసు నమోదు చేశారు.  

కర్ణాటక సీఎం యడ్యూరప్ప అవుట్? 

ప్రజాగ్రహంతో బీజేపీ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. పార్టీలో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్న కమలం అధిష్టానం.. తమ పార్టీ ముఖ్యమంత్రులను కూడా మార్చబోతుందనే ప్రచారం జరుగుతోంది. ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటకకు సంబంధించి కీలక పరిణామాలు జరగబోతున్నాయని కొంత కాలంగా చర్చ జరుగుతోంది. పార్టీ ప్రక్షాళనలో భాగంగా మొదటగా కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు గండం ఖాయమని అంటున్నారు. ముఖ్యమంత్రిగా యడియూరప్పను మార్చాల్సిందేనంటూ పట్టుబడుతున్న క్రణాటక నేతల ఒత్తిడికి అధిష్ఠానం తలొగ్గినట్టు తెలుస్తోంది. వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని యడ్డీని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ అత్యున్నత వర్గాలు ధ్రువీకరించాయి. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ అరుణ్‌సింగ్ ఈ నెల 17, 18 తేదీల్లో ఆయన బెంగళూరుకు రానుండడం ఇందుకు బలాన్నిస్తోంది. నాయకత్వ మార్పునకు కసరత్తు కోసమే అరుణ్ సింగ్ వస్తున్నారనే  వార్తలొస్తున్నాయి.నాయకత్వ మార్పుపై పార్టీ నేతలు ఎవరూ బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయవద్దని అరుణ్ సింగ్ సూచించారు. అయితే నాయకత్వ మార్పులపై వస్తున్న వార్తలను ఆయన కొట్టిపడేస్తున్నారు. గురువారం  ఢిల్లీలో మాట్లాడిన అరుణ్‌సింగ్.. యడ్డీపై ప్రశంసలు కురిపించారు. ఆయన ఉత్తమంగా పాలిస్తున్నారని ప్రశంసించారు. సీఎం పనితీరుపై బీజేపీ అధినాయకత్వం సంతృప్తిగా ఉందని, నాయకత్వ మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. బెంగళూరు వెళ్లి అసంతృప్త నేతలను కలిసి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. యడ్యూరప్ప కర్ణాటక లో సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రి. ఇప్పటికి ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టారు. మూడుసార్లు ప్రతిపక్షనేతగా వ్యవహరించారు. ఎనిమిది సార్లుగా ఓటమి లేకుండా అసెంబ్లీకి ఎన్నికవుతూ వస్తున్నారు. అయితే ఇటీవల యడ్యూరప్ప ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం బీజేపీ ఎమ్మెల్యేకు నచ్చలేదు. దీంతో కొందరు సభ్యులు ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని రాజకీయవర్గాలు చెప్తున్నాయి.దాదాపు 4 0మంది ఎమ్మెల్యేలు సీఎం యడ్యూరప్పకు వ్యతిరేకంగా కూటమి కట్టినట్లు తెలుస్తోంది. ఢిల్లీకి కూడా వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకకు ఫిర్యాదు చేశారు.   ఇటీవల యడ్యూరప్ప ప్రభుత్వం బళ్లారిలో జేఎస్డబ్ల్యూ స్టీల్ ఫ్యాక్టరీకి దాదాపు నాలుగు వేల ఎకరాల భూమిని కేటాయించింది. అది మెజారిటీ బీజేపీ ఎమ్మెల్యేలకు రుచించలేదు. జనతాదళ్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ ప్రతిపాదన రూపుదిద్దుకుంది. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ దీన్ని వ్యతిరేకించింది. అదే బీజేపీ ఇప్పుడు పవర్ లోకి రాగానే ఈ భూ పందారం చేయడాన్ని కొందరు శాసనసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయంలో నలుగురు పార్టీ ఎమ్మెల్యేలు నిరసన తెలియజేస్తూ సీఎంకు నేరుగానే లేఖ రాశారు. ఇది బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకమని, పార్టీకి చెడ్డపేరు వస్తుందని వారంతా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినా యడ్యూరప్ప స్పందించలేదు.ముఖ్యమంత్రి పార్టీ ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదని కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదన్న అసంతృప్తి మరికొందరిలో ఉంది. ఈ కోవకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు నలభై మంది వరకు ఉన్నారని తెలుస్తోంది.

మర్రికి మళ్లీ మొండిచేయి! ఏపీలో నలుగురు ఎమ్మెల్సీలు ఖరారు..

ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ కోటాలో ఖాళీ అయిన నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు ప్రభుత్వం పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది, శుక్రవారం ఖాళీ కానున్న నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు అభ్యర్థులను ముఖ్యమంత్రి జగన్  దాదాపు ఖరారు చేశారని చెబుతున్నారు. అభ్యర్థుల పేర్లను ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు దస్త్రం పంపినట్లు తెలిసింది. శుక్ర లేదా శనివారం గవర్నర్‌ ఆ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం.  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత మోషేను రాజు , గుంటూరు జిల్లాకు చెందిన లేళ్ల అప్పిరెడ్డి, కడప జిల్లాకు చెందిన ఆర్వీ రమేశ్‌యాదవ్‌, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నేత తోట త్రిమూర్తులు ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్సీలుగా ఖరారైనట్లు ప్రచారం జరుగుతున్న నలుగురిలో ముగ్గురి పేర్లు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. మోషన్ రాజు, లేళ్ల అప్పిరెడ్డిలకు ఎమ్మెల్సీ ఇస్తారని జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది. గతంలో ఇస్తారని ఖచ్చితంగా భావించినా అవకాశం రాలేదు. దీంతో ఈ ఇద్దరికి ఈసారి సీఎం అవకాశం కల్పించారని తెలుస్తోంది. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన తోట త్రిమూర్తులకు.. ఆయన పార్టీలో చేరినప్పుడే ఎమ్మెల్సీ హామీ ఇచ్చారని చెబుతున్నారు. జగన్ హామీ మేరకే ఆయనను మండలికి పంపిస్తున్నారని తెలుస్తోంది. కడప జిల్లా నుంచి వినిపిస్తున్న ఆర్వీ రమేష యాదవ్ పేరు మాత్రం ఎవరూ ఊహించనది. మైదుకూరు నియోజకవర్గానికి చెందిన రమేష్ యాదవ్... మున్సిపల్ చైర్మన్ సీటు ఆశించినా.. సామాజిక వర్గ సమీకరణలో మరొకరికి వెళ్లింది. దీంతో పార్టీ కోసం మొదటి నుంచి పని చేస్తున్న రమేష్ కు ఎమ్మెల్సీ ఇస్తున్నారని అంటున్నారు. ఎమ్మెల్సీ సీట్ల భర్తీతో మరోసారి గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత మర్రి రాజశేఖర్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఆయనకు మరోసారి నిరాశే ఎదురైంది.  వైసీపీలో మొదటి నుంచి పని చేస్తున్నారు మర్రి రాజశేఖర్. గుంటూరు జిల్లాలో పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అయితే జగన్ ఆదేశాలతో తన సీటును మరొకరికి వదలుకున్నారు మర్రి రాజశేఖర్‌. దీంతో వైసీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేస్తానని చిలకలూరిపేట ఎన్నికల ప్రచార సమయంలో జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో అక్కడ మంత్రి పత్తిపాటి పుల్లారావుపై వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన విడదల రజనీ గెలుపు కోసం మర్రి పని చేశారు. దీంతో మర్రి రాజశేఖర్‌కు కేబినెట్ బెర్త్ ఖాయమని అంతా అనుకున్నారు.కాని ఇంతవరకు మర్రిని ఎమ్మెల్సీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్సీ భర్తీ వచ్చిన ప్రతిసారి రాజశేఖర్ పేరు తెరపైకి రావడం.. ఆయనకు నిరాశ ఎదురుకావడం కామన్ గా మారింది. మర్రి రాజశేఖర్ కులమే ఆయనకు ఎమ్మెల్సీ రాకుండా అడ్డుపడుతుందనే చర్చ జరుగుతోంది. కమ్మ కులానికి చెందడం వల్లే మర్రికి మళ్లీ మళ్లీ వైసీపీలో అవమానం జరుగుతుందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. 

బైక్ పై ముగ్గురు మూర్ఖుల విన్యాసం..

‘‘రోడ్డుపై టైటానిక్ విన్యాసాలు.. ప‌ట్టుత‌ప్పితే మునిగిపోతాయి ప్రాణాలు’’ ఏంటి..?  సినిమా టైటిల్ ఇంత ల్యాగ్ ఉందనుకుంటున్నారా..? సినిమా టైటిల్ కదండీ  సైబ‌రాబాద్ పోలీసులు టైటిల్. ట్రాఫిక్ రూల్స్ ఏమాత్రము పాటించకుండా.. ఒక్క బైక్ మీద ముగ్గురు వెళుతూ.. బైక్ డ్రైవ్ చేసే వాడు ఎంతో  బిజీ పర్సన్ లాగ కటింగ్ ఈస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫిరెన్స్ మీటింగ్ ఉన్నట్లు ఫోన్ చేస్తున్నాడు.. బైక్ పై వాడి వెనక కూర్చున్నవాడు.. బైక్ ని డ్రైవ్ వాడికి ఫోన్ చూపిస్తుంటే వాడి బైక్ డ్రైవ్ చేస్తున్నాడు..  ఒక్క బైక్ ఒక్కటే..? కానీ మూర్ఖులు ముగ్గురు.. మూర్ఖులు అని ఎందుకు అంటున్నాను అంటే అర్జెంట్ అయితే ఎవరైనా బైక్ మీద ముగ్గురు వెళ్తారు.. బట్ వీళ్ళు  ముగ్గురు వెళ్లడం తప్పు.. డ్రైవ్ చేస్తున్నవాడు ఫోన్ చూడడం తప్పు.. అన్నింటికీ మించి హెల్మెట్ కూడా లేకపోవడం మరో తప్పు ఇలా తప్పులు చేసి చివరికి వాళ్ళు  చస్తే చివరికి ఆ తిప్పలు వాళ్ళ అమ్మానాన్నలు పాడుతారు.. సరే ఇంతకీ జరిగిందో తెలుసుకుందాం..  సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు యువ‌కులు ఓ బైక్‌పై వెళుతున్నారు. వాళ్లు చేసిన విన్యాసం ఏంటో తెలుసా? మ‌ధ్యలో కూర్చున్న వ్యక్తి త‌న రెండు చేతుల‌ను డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని చుట్టేసి మొబైల్ ఫోన్ ప‌ట్టుకున్నాడు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఆ ఫోన్‌లో చూస్తున్నాడు. పైగా వాళ్లకి కరోనా టైం లో మాస్కులు ఉన్నా సరిగ్గా పెట్టుకోలేదు. హెల్మెట్ కూడా లేదు. దీంతో అక్కడే ఉన్న ఓ ట్రాఫిక్ పోలీసు స‌ద‌రు యువ‌కుల విన్యాసాన్ని ఫోటో తీసేశారు. రోడ్డుపై ట్రాఫిక్ నిబంధనలు మీరితే ఫైన్లు ఏ స్థాయిలో పడతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంగకాలం ఎండలాగే హైదరాబాద్ ట్రాఫిక్ చలాన్లు మండి పోతాయి.  అయినా చాలా మంది యువత ముఖ్యంగా హెల్మెట్ లేకుండా, త్రిబుల్ రైడింగ్ చేస్తూ, అందులోను ర్యాష్‌గా బండి నడుపుతూ దొరికిపోతుంటారు. ఒక వేళా టైం బాగుంది పోలీసుల నుండి తప్పించుకోవచ్చేమో గానీ హైదరాబాద్ పోలీస్  కెమెరాలు తప్పించుకోరు.. తాజాగా వీరి ఫొటోస్ ని సైబ‌రాబాద్ పోలీసులు ట్వీట్ చేశారు. ఆ ట్విట్ కి పెట్టిన టైటిల్ మన ఫస్ట్ లైన్ లో చెప్పుకున్న మాటలు. ఇది ఇలా ఉండగా తప్పు చేసిన వాడికి శిక్షపడాలి కదా..అందుకు వాళ్లకు ఎలాంటి శిక్ష పడిందో తెలుసా..  రోడ్డుపై టైటానిక్ విన్యాసాలు.. ప‌ట్టుత‌ప్పితే మునిగిపోతాయి ప్రాణాలు’’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దాని వాళ్ళ వాళ్ళ ఇంట్లో తెలిసే ప్రాబ్లెమ్ ఉంది. ఇంట్లో తెలిస్తే ఇంకా అంటే పటాస్ సినిమాలో స్టూడెంట్స్ ధర్నా చేస్తుంటే వాళ్ళ మదర్ వచ్చి చితక్కొట్టినట్లు కొడుతారు..ఇక ఈ యువ‌కులు చేసిన ఈ తప్పునకు విలువ ఎంత పడిందో తెలుసా? ఏకంగా రూ.3600. ఈ ముగ్గురు ఈ ఒకే విన్యాసంతో ఏకకాలంలో ఆరు ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించారు. బైక్ వెన‌కాల కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధ‌రించని కార‌ణంగా రూ.100, సెల్‌ఫోన్ డ్రైవింగ్‌కు రూ.1,000, బ‌హిరంగ ప్రదేశాల్లో మాస్కు స‌రిగ్గా ధ‌రించ‌నందుకు రూ.1000, డ్రైవ‌ర్ హెల్మెట్ ధ‌రించ‌ని కార‌ణంగా రూ.200, వెనుక చూసేందుకు సైడ్ మిర్రర్స్ లేని కారణంగా మరో రూ.100, ట్రిపుల్ రైడింగ్‌కు రూ.1200 ఇలా మొత్తం జరిమానా విలువ రూ.3,600కు చేరింది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  

వచ్చే నెల విశాఖ నుంచే జగన్ పాలన? మరి హైకోర్టు ఊరుకుంటుందా?

విశాఖ నుంచి పాలన ఖాయమేనా? ఆ విషయం మాట్లాడటానికే జగన్ ఢిల్లీ వెళ్లారా? లేదంటే మంత్రి బొత్స సత్యనారాయణ ఆ రేంజ్ లో ప్రకటన ఎలా చేస్తారు? ఇవే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాలను వేధిస్తున్నాయి. రాజధాని తరలింపుకు లీగల్ అడ్డంకులున్నాయి కాబట్టి..క్యాంప్ ఆఫీసు నుంచే జగన్ పాలన చేస్తారన్న వ్యూహం అమల్లోకి వచ్చేస్తున్నట్లే ఉంది. ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పినట్లే..ఆయన ఒత్తిడితో విశాఖ నుంచి పాలన అనే అంకం మొదలవుతుందనే టాక్ వినపడుతోంది. కొన్ని విడి విడిగా వచ్చినవాటిని కలిపి చూస్తే అలాగే అనిపిస్తోంది. జూన్ 3న ట్విట్టర్ లో ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖ నుంచి పాలన అంటూ తన ఫోటోతో పోస్ట్ పెట్టారు. అందులో ఇంకేమీ రాయలేదు. గత వారంలోనే మంత్రి బొత్స సత్యనారాయణ మూడు రాజధానుల ప్రక్రియ ఆగే సమస్యే లేదన్నారు. నేడు వైసీపీకి మద్దతుగా ఓపెన్ గా రాస్తున్న ఓ వెబ్ పోర్టల్ లో జూలై 21 నుంచి విశాఖలోనే పాలన అంటూ స్టోరీ వచ్చింది. మధ్యాహ్నానికి మంత్రి బొత్స సత్యనారాయణ కోవిడ్ పరిస్ధితులు చక్కబడగానే విశాఖ నుంచే పాలన మొదలవుతుందని...జగన్ విశాఖ క్యాంప్ ఆఫీసు నుంచే పరిపాలన చేస్తారని చెప్పారు. రాత్రికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన జగన్ .. అదే విషయం చెప్పినట్లు తెలుస్తోంది. జగన్ కు చాలా విషయాల్లో గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న బిజెపి.. ఈ విషయంలోనూ ఓకె చెప్పినట్లు సమాచారం. ఇవన్నీ చూస్తుంటే.. వచ్చే నెలలో ఖాయంగా విశాఖ నుంచే జగన్ పాలన చేస్తారని బలంగా అనిపిస్తోంది. మరి హైకోర్టు ఊరుకుంటుందా? అమరావతి రైతులు మరో పిటిషన్ వేస్తారా? మళ్లీ హైకోర్టు స్టే ఆర్డర్ ఇస్తుందా?ఇవన్నీ ప్రశ్నలే.. సమాధానాలు తర్వాతే వస్తాయి. గతంలోనూ ఇలాగే దొడ్డిదారిన విశాఖకు రాజధాని తరలించాలనుకున్న వైసీపీ ప్రయత్నాలు న్యాయస్థానం ఆదేశాలతో ఆగిపోయాయి.  అసలు మూడు రాజధానులు ప్రకటించిననాటి నుంచి రాష్ట్రంలో అనిశ్చితి నెలకొంది. అప్పటికే ఆగిన అభివృద్ధి ..ఇక ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు.  ఇప్పటికే మంగళగిరి, తాడేపల్లి కలిపి అమరావతి కార్పొరేషన్ గా మార్చిన ప్రభుత్వం..అదే చూపించి.. కృష్ణా,గుంటూరు జిల్లా వాసులకు గుడ్ బై చెప్పేసి విశాఖకు వెళ్లిపోబోతుందా? ఎందుకంటే విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో ఎక్కడా వైసీపీకి ఎదురు లేకుండా ఫలితాలు వచ్చాయి. కాబట్టి ప్రజల మద్దతు తమకే ఉందని వారు చెప్పుకుంటున్నారు. ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ రెండు జిల్లాల్లోనూ వైసీపీకే అధిక స్థానాలు వచ్చాయి. అధికార బలం, అక్రమాలు ఇవన్నీ ఇప్పుడు ఎవరూ పట్టించుకునే పరిస్ధితిలో లేరు. వీటన్నిటికన్నా.. కేంద్రంలోని తమ రహస్య స్నేహితుడు కమలనాథుడు ఇచ్చే సిగ్నలే జగన్మోహన్ రెడ్డికి ముఖ్యం. ఇప్పటికి వారు కన్విన్స్ అయి ఉంటే.. వారు ఓకె చెప్పిఉంటే..ఇక జగన్ విశాఖ పయనం ఎవరూ ఆపలేరు..ఒక్క న్యాయస్థానాలు తప్ప.

10 రోజుల్లో 700 కి.మీ నడక.. వెంకటేష్ ను చూసి చలించిన సోనుసూద్

10 రోజులు.. 7 వందల కిలోమీటర్లు.. నడక.. కాళ్లకు చెప్పులు కూడా లేకుండానే నడక.. అవును ఓ యువకుడు హైదరాబాద్ నుంచి ముంబై వరకు నడుచుకుంటూ వెళ్లాడు. తాను అభిమానిస్తున్న ఓ వ్యక్తిని కలుసుకోవడానికి ఈ సాహసం చూశాడు. మండు టెండలు, భారీ వర్షాన్ని లెక్క చేయకుండా ఒంటరిగానే తన పయనం సాగించాడు. 10 రోజుల పాటు అలుపెరగకుండా నడిచి.. చివరికి తాను అనుకున్నది సాధించాడు.  కొవిడ్ కల్లోల సమయంలో కష్టాల్లో ఉన్నవారికి నేనున్నాంటూ సాయం చేస్తూ రియల్ హీరోగా నిలిచిన సోనుసూద్ ను కలిసేందుకు వికారాబాద్ నుంచి ముంబైకి పాదయాత్రగా వెళ్లిన వెంకటేష్.. 10 రోజుల నడక తర్వాత తన అభిమాన హీరోను కలిశాడు. తన కోసం 7 వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిన వెంకటేష్ ను అప్యాయంగా ఆహ్వానించారు సోనుసూద్. అభిమాని తో ఫోటో దిగి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చెప్పులు లేకుండా 700 కిలోమీటర్లు నడిచి వచ్చిన తన అభిమానిని చూసి చలించిపోయారు సోనూసూద్. దయచేసి ఎవ్వరూ ఇలాంటి పనులు చేయొద్దు అని కోరారు.  సినిమాల్లో విలన్‌గా కనిపించే సోను సూద్.. నిజజీవితంలో మాత్రం రియల్ హీరో. గత ఏడాది లాక్‌డౌన్ మొదలయినప్పటి నుంచి ఎంతో మందికి సాయం చేశారు. వలస కార్మికులను సొంత డబ్బులతో ఇంటికి పంపించారు. కష్టాల్లో ఉన్న పేదలకు కడుపు నింపుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ లో ఎంతో మందికి ఆక్సిజన్ పంపి ఊపిరి అందిస్తున్నారు. సోనూ సూద్ ఫౌండేషన్‌తో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్లీజ్ హెల్ప్ అని ఒక్క ట్వీట్ చేస్తే చాలు.. వెంటనే స్పందించి ఆదుకుంటున్నారు. అందుకే సోను సూద్‌కు దేశవ్యాప్తంగా జనాలు ఫిదా అయ్యారు. రియల్ హీరో అంటూ కీర్తిస్తున్నారు. ఆయన సాయం పొందినవారైతే దేవుడిగా కొలుస్తున్నారు. వికారాబాద్‌కు చెందిన  వెంకటేష్ కూడా సోనును దైవంగా భావించాడు. తను దేవుడిని నేరుగా కలవాలని ఎవరూ చేయని సాహసం చేశాడు. వికారాబాద్ జిల్లా దోమ మండలం దోర్నాలపల్లికి చెందిన వెంకటేష్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అతడి తండ్రి ఆటోను నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కరోనా లాక్‌డౌన్‌తో స్కూళ్లు, కాలేజీలు మూతపడడంతో వెంకటేష్ హైదరాబాద్‌కు వెళ్లి ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. వచ్చిన డబ్బుతో కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఐతే లాక్‌డౌన్‌లో సోను సూద్ చేస్తున్న సామాజిక కార్యక్రమాలు చూసి... ఆయనకు అభిమానిగా మారిపోయాడు వెంకటేష్. రోజు రోజుకు అభిమానం పెరిగిపోయింది. సినిమా నటుడిలా కాకుండా ప్రత్యక్ష దైవంగా చూశాడు. ఈ క్రమంలోనే ఆయన్ను ఎలాగైనా కలవాలని అనుకున్నాడు. లాక్‌డౌన్ ప్రజా రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో.. కాలి నడకన ముంబైకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. జూన్ 1న హైదరాబాద్ నుంచి ముంబైకి నడక ప్రారంభించాడు వెంకటేష్. 700 కిలోమీటర్లు నడిచాడు. వెంకటేష్ పాదయాత్ర గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న సోనూసూద్.. అతడికి ఫోన్ చేశారు. నడుచుకుంటూ ముంబైకి రావొద్దు.. తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని సూచించారు. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత తానే కలుస్తానని చెప్పినట్లు వెంకటేశ్  చెప్పారు. సోనుసూదే ఫోన్ చేయడంతో వెంకటేష్ సంతోషాన్ని పట్టలేకపోయాడు. కానీ తన పాదయాత్రను ఆపలేదు. భక్తుల వద్దకు దేవుళ్లు రాకూడదు.. దేవుడి వద్దకే భక్తులు వెళ్లాలని వెంకటేష్ చెప్పాడు. సోనూసూద్‌ను కలవాలన్న మొండి పట్టుతో కాలి నడకన ముందుకు కొనసాగించాడు. చివరకు 10 రోజుల్లోనే తన అభిమాన హీరోను కలిశాడు. 

విదేశీ టీకాల కంటే కొవాగ్జిన్ ప్రియం? ఎందుకో తెలుసా.. 

రష్యాలో తయారైన స్పుత్నిక్-వి టీకా ధర ఇండియాలో రూ. 1145. యూకే చెందిన ఆక్స్ ఫర్జ్ డెవలప్ చేసిన ఫార్నూలాతో పుణెలోని సీరమ్ ఇన్సిట్యూట్ లో తయారవుతున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర మన దగ్గర రూ. 780. అమెరికాలో తయారైన ఫైజర్ టీకా కూడా మన దేశంలో  వెయ్యి రూపాల లోపే ఉండవచ్చని తెలుస్తోంది. ఇక పూర్తిగా దేశీయ తయారీ, హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా ధర మాత్రం జీఎస్టీ కలిపి రూ. 1,140. అంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా టీకాల్లో దేశీయ తయారీ కొవాగ్జిన్ ధరే ఎక్కువ.  కొవాగ్జిన్ ధర ఒక్కో డోసు ధర  విదేశీ టీకా అయిన కొవిషీల్డ్‌, ఫైజర్ కంటే ధర కంటే ఇది దాదాపు రెండింతలు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఎక్కువ ధర కలిగిన టీకాల్లో ఇది మూడోది. నిజానికి దేశీయంగా  తయారైన కొవాగ్జిన్ ధర క్కువ ఉండాలి.. కానీ, అంత ఎక్కువ ఎందుకు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. కొవాగ్జిన్ ధర.. విదేశీ టీకాల కంటే ఎక్కువగా ఉండటానికి బలమైన కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.  కొవాగ్జిన్ తయారీ కొవిషీల్డ్, స్పుత్నిక్ టెక్నాలజీతో పోలిస్తే  పూర్తిగా భిన్నమైనది. ఇందులో ఉపయోగింతే సాంకేతికత మిగతా వాటితో పోలిస్తే ఖరీదైనది. కొవాగ్జిన్ తయారీలో అచేతన వైరస్‌ను ఉపయోగిస్తున్నారు. దీని కోసం వందల లీటర్ల సీరంను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. బీఎస్‌ఎల్‌ ల్యాబ్‌లో వైరస్‌ను అత్యంత జాగ్రత్తగా సీరంలో వృద్ధి చేయాల్సి ఉంటుంది. తిరిగి దాన్ని అచేతన స్థితికి తీసుకెళ్లాలి’’ అని ‘సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యూలార్‌ బయాలజీ’ సలహాదారు రాకేశ్‌ మిశ్రా వివరించారు.ఫైజర్, మోడెర్నా టీకాలు ఎంఆర్ఏ వ్యాక్సిన్లు. వీటి తయారీలో కొవిడ్‌కు కారణమయ్యే లైవ్ వైరస్‌ను ఉపయోగించరు. దీనికి బదులుగా వైరస్ ఉపరితలంపై కనిపించే ‘స్పైక్ ప్రొటీన్’ హాని చేయని భాగాన్ని ఉయోగిస్తారు. ఇది రోగ నిరోధక శక్తి ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది.  వైరస్‌లో ఏదైనా వేరియంట్ వచ్చినప్పుడు ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు ప్రభావం చూపలేకపోతే.. ఎంఆర్ఎన్ఏ సాంకేతికతను కొత్త వేరియంట్‌కు అనుగుణంగా త్వరగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇదే పనిచేయాలంటే మాత్రం కొవాగ్జిన్ టెక్నాలజీకి తడిసిమోపెడవుతుంది. కొవాగ్జిన్ వ్యాక్సిన్ తయారీలో నిష్క్రియం చేసిన వైరస్ ఆధారంగా తయారవుతుంది. కొత్త వేరియంట్‌కు అనుగుణంగా తిరిగి మరో వ్యాక్సిన్ తయారు చేయాలంటే సుదీర్ఘమైన సమయం పడుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల ధరలు కొవాగ్జిన్‌తో పోలిస్తే చాలా తక్కువని, అవన్నీ గతేడాదే రూపుదిద్దుకున్నాయి.  ఇక వ్యాక్సిన్ తయారీ ధరల పలు విషయాలపై ఆధారపడి ఉంటుంది. కొవిషీల్డ్, స్పుత్నిక్-వి టీకాల ధరల్లో వ్యత్యాసానికి వాణిజ్యపరమైన కారణాలు ఉండొచ్చని మిశ్రా అన్నారు. టెక్నాలజీ పరంగా, ఎంఆర్ఎన్ఏ టీకాల తయారీ చాలా సులభమే కాకుండా చవకమైనవని, వీటి తయారీకి విస్తృత సౌకర్యాలు అవసరం లేదని మిశ్రా వివరించారు. ముఖ్యంగా ముడి సరుకులు, ప్యాకేజింగ్, ప్లాంట్ ఆపరేషన్, నిర్వహణ, ఖర్చులు, లైసెన్స్ కోసం చేసిన ఖర్చు, ఉత్పత్తికి అయ్యే ఖర్చు, క్లినికల్ ట్రయల్స్ వంటి వాటిపై వ్యాక్సిన్ ధర ఆధారపడి ఉంటుంది. వ్యాక్సిన్ తయారీకి అయిన ఖర్చుకు మూడింతలుగా దాని ధరను నిర్ణయిస్తారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే, వ్యాక్సిన్ ఎలా ఉపయోగించాలన్న దానిపై ఆరోగ్య కార్యకర్తలకు అవగాహన కల్పించడానికి మరో 30 శాతం ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్లు, పన్నులు, స్టాకిస్టులు, రిటైల్ కెమిస్టుల వాటా తదితరలు కూడా ఇందులో ఉంటాయి.  నిపుణులు చెబుతున్న దాని ప్రకారం భారత్‌లో టీకా తయారీదారులకు ఒక్క డోసులో మూడు నుంచి నాలుగు రూపాయలు మాత్రమే లభిస్తుంది. ప్రొడక్ట్ అభివృద్ధి, తయారీలో ఉన్న వారికి మాత్రం డోసుకు రూ.10 మిగులుతుంది. అయితే తయారీదారులు పెరిగి, ఉత్పత్తి సామర్థ్యం పెరిగితే అప్పుడు టీకా ధరలు దిగి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.  

పథకాలకు ఫ్యామిలీ కాదు మహనీయుల పేర్లు కావాలి! 

ఆంధ్రప్రదేశ్ లో పాలనంతా రివర్స్ గా సాగుతుందనే విమర్శలు వస్తున్నాయి. జగన్ అధికారంలోకి రాగానే.. రివర్స్ టెండరింగ్ మొదలుపెట్టారు. ఆయన ఏ సమయంలో అది ప్రారంభించారో తెలియదు కాని.. తర్వాత పాలనంతా రివర్స్ గానే సాగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. దేశమంతా ఒకలా ఉంటే.. ఏపీలో మరోలా ఉంటోంది. దేశంలోని మిగితా రాష్ట్రాల్లో ప్రభుత్వ పథకాలకు స్వాతంత్ర సమర యోధులు. మహనీయులు, త్యాగమూర్తుల పేర్లు పెడుతుంటే.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం జగనన్న కుటుంబ సభ్యుల జపం నడుస్తోంది. గత ప్రభుత్వం ప్రారంభించిన పథకాలకు కూడా పేరు మార్చి.. వైఎస్సార్ కుటుంబం పేర్లు పెట్టారు.  ప్రస్తుతం ఏపీలో అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలకు జగనన్న తోడు, జగనన్న కాలనీలు, వైయస్ఆర్ కాపు నేస్తం, వైయస్ఆర్ కాపరి బంధం, వైయస్ఆర్ పశు నేస్త పరిహారం, వైయస్ ఆర్ చేయూత, వైయస్ ఆర్ మత్స్యకార భరోసా, వైయస్ ఆర్ ఆరోగ్య శ్రీ, జగనన్న గోరు ముద్ద, వైయస్ఆర్ పెన్షన్ కానుక, వైయస్ ఆర్ కంటి వెలుగు, వైయస్ఆర్ ఇబిసి నేస్తం, వైయస్ఆర్ సున్నా వడ్డి, వైయస్ఆర్ వాహన మిత్ర, వైయస్ఆర్ పెళ్ళి కానుక, వైయస్ఆర్ లా నేస్తం, వైయస్ఆర్ అమ్మ ఒడి, వైయస్ఆర్ రైతు భరోసా, వైయస్ఆర్ నేతన్న హస్తం, వైయస్ఆర్ భీమా అనే పేర్లు ఉన్నాయి. జగన్ సర్కార్ తీరుపై జనాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదేం పద్దతి అంటూ మండిపడుతున్నారు కొందరు.  ప్రభుత్వ పథకాలకు స్వాతంత్ర్య సమర యోధులు, మహనీయులు, త్యాగ పురుషుల పేర్లు పెట్టాలని సీఎం జగన్మోహన్ రెడ్డికి.. కాపు ఉద్యమ నేత, సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వేల్పూరి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన సామాజిక ఉద్యమ యోధులు మహాత్మా జ్యోతీరావు ఫూలే, సావిత్రీబాయి ఫూలే, బి.ఆర్.అంబేద్కర్, మహాత్మా గాంధీ, ఉక్కు మనిషి సర్థార్‌ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, సుభాష్ చంద్ర బోస్, బిర్సా ముండా, ఛత్రపతి శివాజీ, శ్రీ కృష్ణ దేవ రాయలు, బాబూ జగజ్జీవన్ రామ్, కాన్షీరామ్,  రాష్ట్రంలో మచ్చ లేని మహనీయులైన దామోదరం సంజీవయ్య, పొట్టి శ్రీరాములు, ప్రకాశం పంతులు, పోతులూరి వీర బ్రహ్మంద్ర స్వామి, సర్థార్‌ గౌతు లచ్చన్న, తరిమెల నాగిరెడ్డి, కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి, పుల్లరి ఉద్యమ వీరుడు కన్నెగంటి హనుమంతు, మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు, డొక్కా సీతమ్మ, పుచ్చలపల్లి సుందరయ్య, మహాకవి గుర్రం జాషువా, ప్రగడ కోటయ్య కఠారి సత్యనారాయణ యాదవ్, జాతీయ జెండా రూప శిల్పి పింగళి వెంకయ్య, సంత్ సేవాలాల్ నాయక్, బుర్ర కథ నాజరు తదితరుల పేర్లు పెట్టాలని సూచించారు. మహనీయుల త్యాగాలు గుర్తు రావాలని, యువతకు మార్గదర్శకాలు త్యాగ పురుషులేనని అన్నారు. ప్రభుత్వ పథకాలకు సీఎం కుటుంబ పేర్లు పెట్టడం తగదని,  సొంత డబ్బు తో పెట్టే పథకాలకు ఈ పేర్లు పెట్టుకోవాలని వేల్పూరి ప్రభుత్వానికి తెలిపారు.  వెంటనే జగన్ వైయస్ఆర్ పేర్లు తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పథకాలు ప్రజల ఆస్థి అని, అన్ని వర్గాల ప్రజలని అనుమానించడం తగదన్నారు. అన్ని కులాల, మతాలలో ఎందరో త్యాగధనులు ఉన్నారని గుర్తు చేశారు. అనేక అవినీతి ఆరోపణలు, సి బి ఐ, ఈడీ కేసులలో ముద్దాయిగా ఉండి, బెయిల్ పై ఉన్న వారి పేర్లు పెడితే యువత చెడు మార్గంలో పయనిస్తారని సీఎంను హెచ్చరించారు. 350 పథకాలలో ఒక్క పథకానికి కూడా  ప్రధాని మోడీ తన పేరు పెట్టుకోలేదని  సిఎం జగన్ కు గుర్తు చేశారు వేల్పూరి శ్రీనివాసరావు. 

కాంగ్రెస్ జాతీయ పార్టీ కాదా? రాహుల్ లోకల్ లీడరేనా? 

కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాదా?.. కాదనే అంటున్నారు, ఆ పార్టీతో మూడు తరాల అనుబంధం ఉన్న, కేంద్ర మాజీ మంత్రి, జితిన్‌ ప్రసాద. అంతే కాదు తాజాగా బీజేపీ తీర్ధం పుచ్చుకున్న ఆయన, దేశంలో ఒక్క బీజేపీ మినహా మిగిలిన జాతీయ పార్టీలకు, జాతీయ పార్టీలకు ఉండవలసిన లక్షణాలు లేనే లేవని అన్నారు.అలా ఆయన దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని, ఒకే ఇక్క ముక్కలో తేల్చేశారు. నిజానికి, కొత్తగా కమలం గూటికి చేరిన జితిన్ ప్రసాద చేసిన ఈ వ్యాఖ్య సంపూర్ణ సత్యం కాకపోయినా, అందులో కొంత నిజముంది. కొంత అతిశయోక్తి ఉంది.  కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవ స్థితిని కోల్పోయింది. ఇది నిజం. అయినా ప్రజల్లో కాంగ్రెస్ ఇంకా సజీవంగానే  ఉంది, ఓట్లు, సీట్లు లెక్కలు అటూ ఇటూ అయితే కావచ్చును, వరస ఓటములతో  ప్రస్తుతం ప్రతికూల పరిస్థితిని ఎదుర్కుంటున్నది కూడా నిజం కావచ్చును. అయినా, కేవలం 52 సీట్లు మాత్రమే గెలుచుకున్న 2019 లోక్ సభ ఎన్నికల్లోనూ, కాంగ్రెస్ పార్టీకి 21 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి.అదే, యూపీఏ రెండవసారి అధికారంలోకి వచ్చిన 2009 లోక్ సభ ఎన్నికలలో అద్వానీ నాయకత్వంలో పోటీ చేసిన బీజేపీకి  18 శాతం ఓట్లు  మాత్రమే వచ్చాయి. అంతమాత్రం చేత బీజేపే జాతీయ పార్టీ కాకుండా పోయిందా, ఐదేళ్ల తర్వాత అదే బీజేపీ మోడీ నాయకత్వంలో  అధికారంలోకి రాలేదా? సొంతంగా 282 సీట్లు గెలుచుకుని 30 ఏళ్ల చరిత్రను తిరగ రాయలేదా? రాజకీయాలలో ఓడలు బండ్లు , బండ్లు ఓడలు అవుతాయి. అది సహజం. అంత మాత్రాన అదే శాశ్వతం అనుకోలేము. అనుకోరాదు. కాబట్టి కాంగ్రెస్ పరిస్థితిని, డౌన్ బట్ నాట్ అవుట్’ అనే అనుకోవచ్చును.  అయితే ఒకటి మాత్రం నిజం, కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నడూ ఎరగని, నాయకత్వ సమస్యను ఎదుర్కుంటోంది.. కాంగ్రెస్ పార్టీని వరసగా రెండు సార్లు అధికారంలో నిలబెట్టిన సోనియా గాంధీ, వయసు, వయసుతో పాటు వచ్చిన  ఆరోగ్య సమస్యల కారణంగా పార్టీ వ్యవహారాల్లో క్రియాశీల పాత్రను పోషించేలేక పోతున్నారు. ఇక రాహుల్ గాంధీ విషయం అయితే వేరే చెప్పనే అక్కరలేదు. నిజానికి రాహుల్ గాంధీ పార్టీకి మోయరాని భారంగా మారారు అన్న మాట పార్టీ వర్గాల్లోనే వినవస్తోంది. అలాగే  ఆయనే ఉంటే, అన్నట్లుగా ఆయనే సక్రమంగా, సరైన  రీతిలో నాయకత్వ లక్షణాలను అలవారచుకుంటే, ఇప్పుడు జితిన్ ప్రసాదనే కాదు, సంవత్సరం క్రితం కాంగ్రెస్’ను వీడి కమల దళంలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా కూడా కాంగ్రెస్’ను వదిలే వారు కాదు. మధ్య ప్రదేశ్’లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిలబడేది. సింధియా, జితిన్ ప్రసాద, సచిన్ పైలట్  ముగ్గురూ రాహుల్ గాంధీ ప్రియ మిత్రులు. అందులో ఇద్దరు ఆయనతో విసిగి పోయి, తమ దారి తాము చుకున్నారు. నిజానికి, ఏ పార్టీలో అయినా ఎమ్మల్యే ఆ క్రింది స్థాయి రాజకీయ నాయకులు కూడా తమ అనుచరుల బాగోగులు చుసుకుంటారు. అంతే కానీ, ఇటు పార్టీని, అటు అనుచరులను గాలికి వదిలేసి, ట్విట్టర్ రాజకీయాలు చేయరు. అయినా, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుదు మాత్రం ట్వీట్లతోనే రాజకీయం చేస్తున్నారు.  ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జితిన్‌ ప్రసాద బుధవారం బీజేపీలో చేరడం, ఉత్తర పదేశ్’లో అసలే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి, మరింత చికాకులు తెచ్చి పెడుతుంది. మొన్నటి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే సున్నాకు చేరుకుందో, అదే విధంగా  రేపటి యూపీ ఎన్నికల్లోనూ  కాంగ్రెస్ ప్రస్తుతమున్న ఏడు సీట్లు కూడా కోల్పోయినా, ఆశ్చర్య పోనవసరం లేదంటున్నారు. ముఖ్యంగా, పన్నెండు శాతం  ఉన్న బ్రాహ్మణ ఓటు చేజారినట్లేనని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు . జితిన్‌ ప్రసాద గత ఏడాది బ్రాహ్మణ చేతనా మంచ్‌ ఆరంభించడం వెనుక బీజేపీ పెద్దల ఆశీస్సులున్నాయని కూడా అంటారు. కాంగ్రెస్‌ నుంచి వలసవచ్చిన రీటా బహుగుణ జోషి సహా యోగి మంత్రివర్గంలో అరడజనుమంది బ్రాహ్మణులే ఉన్నా, పార్టీ పదవుల్లోనూ వారి సంఖ్య బాగానే ఉన్నా, ఆ సామాజికవర్గంపై జితేంద్ర ప్రసాద కుటుంబానికి ఉన్న పట్టు, గుర్తింపు బీజేపీకి రాజకీయంగా ఉపకరిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.  ఇక రాహుల్ గాంధీ పార్టీ బరువును తమ భుజస్కందాల పైకి ఎత్తు కోవడమో ... లేక రాహుల్ గాంధీ భారాన్ని కాంగ్రెస్ పార్టీ దించుకోవడమో, రెండింటిలో ఎదో ఒకటి జరగనిదే, కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకోలేదని కాంగ్రెస్ నాయకులే నిర్ణయానికి వచ్చారు.అందుకే, ప్రసాద సహా 21 మంది సీనియర్ నాయకులు . నాయకత్వ సమస్య పరిష్కరించాలని సంవత్సరంగా పట్టు పడుతున్నారు. అయినా, ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. అందుకే,  నిన్న సింధియా, ఈరోజు జతిన్ ప్రసాద, రేపు రాజేష్ పైలట్ .. ఆ నెక్స్ట్ డే..ఇంకొకరు ఇలా ఒకరొకరు  పార్టీని వదిలి పోతూనే ఉనతారు. అయితే, రాహుల్ బరువు ఎత్తుకోవడమో, పార్టీ రాహుల్ భారాన్ని తగ్గించుకోవడమో..రెంటిలో   ఏదీ జరిగే సూచనలు అయితే కనిపించడం లేదు.  

పదేళ్ల లవ్ మిస్టరీ.. ఓ మంచి సినిమాలాంటి కథ..

ఒకటి కాదు రెండు కాదు పదేళ్లు. అక్షరాల పదేళ్ల  కిందట ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ యువతి.. తన ఇంటికి సమీపంలోని ఓ యువకుడి ఇంట్లోనే ఉన్నా ఎవ్వరికీ తెలియలేదు. కనీసం యువకుడి కుటుంబం కూడా గుర్తించకపోవడం విశేషం.   ఓపెన్ చేస్తే అది  కేరళ.  పాలక్కడ్‌ జిల్లా. ఆ జిల్లాలో ఓ విచిత్రమైన ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. అయిరూర్ గ్రామానికి చెందిన ఓ యువతి, ఆమె వయసు  18 సంవత్సరాలు. కారణం ఏంటో తెలియదు గానీ, 2010 ఫిబ్రవరిలో ఇంటి నుంచి పారిపోయింది. అయితే, గత పదేళ్లుగా ఆమె ఎక్కడుందో కుటుంబసభ్యులకు ఆచూకీ తెలియలేదు. సంకలో పిల్లని పెట్టుకుని ఊరంతా వెతికిట్లు అయింది వాళ్ళ పని. చివరికి ఓ  విచిత్రం ఏంటంటే ఆమె తన తల్లిదండ్రులుండే ఇంటికి సమీపంలో ఉన్న ఓ అబ్బాయి దగ్గరే ఉన్నా ఎవరూ గుర్తించలేకపోయారు. అంతేకాదు, యువతి ఆ ఇంటిలో ఉన్న విషయం అబ్బాయి ఇంట్లోవాళ్లకు కూడా తెలియకపోవడం మరో ట్విస్ట్. వాళ్ళు ఇద్దరు ప్రేమించుకున్నారు. గత పదేళ్లుగా తాళం వేసి ఉన్న ఓ గదిలో ఆమె తన ప్రియుడితో ఉంటోంది. ఆమె ప్రియుడే తన యోగక్షేమాలు చూసుకునేవాడని పోలీసులు తెలిపారు. ఆ గదికి వాష్ రూమ్ కూడా లేకపోవడంతో కాలకృత్యాలు తీర్చుకోడానికి ఎప్పుడు పడితే అప్పుడు పోకుండా ఒక నియమావళి పెట్టుకుని చుట్టూ పక్కల జనం అంత పడుకున్న తర్వాత ఓ కిటికీ నుంచి రాత్రిపూట ఆమె బయటకు వచ్చేది. పగలు ఆ కిటికీ కూడా మూసి ఉండేది. ఆమెకు ఆహారం, ఇతర సదుపాయాలన్నీ ప్రియుడే సమకూర్చేవాడు. ఒకటి రెండు కాదు ఏకంగా ఇలా పదేళ్లు మూడో వ్యక్తికి తెలియకుండా గుట్టుగా ఆ గదిలోనే ఉండిపోయింది. కట్ చేస్తే.. మూడు నెలల కిందట మార్చిలో ఆ యువకుడు అదృశ్యమైనట్టు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో  అసలు విషయం బయటపడింది. అద్యశ్యమైంది ఒకరు కాదు.. ఇద్దరిని.. ఆ ఇద్దరే ఈ ప్రేమికులని పోలీసుల విచారణలో బయటపడింది. నెమ్మర సమీపంలోని విథాన్‌స్సెరీ అనే ఓ గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్న ఆ ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం వారిని కోర్టులో హాజరుపరిచారు. తాము కలిసి జీవించాలని అనుకొంటున్నట్టు యువతి కోర్టుకు తెలపడంతో ప్రియుడితో వెళ్లేందుకు ఆమెను అనుమతించారు. చివరికి ఆమె నిర్ణయాన్ని కుటుంబసభ్యులు కూడా స్వాగతించారు. పదేళ్లపాటు ఎవ్వరి కంటపడకుండా ఆమెను కాపాడాడని పోలీసులు తెలిపారు. దీని వెనుక ఏదైనా మిస్టరీ ఉందా? అన్న ప్రశ్నకు ఓ సీనియర్ పోలీస్ అధికారి స్పందిస్తూ.. వారి బంధువుల నుంచి అన్ని వివరాలను సేకరించామని అన్నారు. కుటుంబసభ్యులు కూడా ఎలాంటి వివరాలు చెప్పలేదని తెలిపారు.  

పడుకున్న వ్యక్తి మాయం.. వరంగల్ లో హల్ చల్ .. 

చేతబడి ఈ మాట ఎక్కుగా వింటుంటాం.. చేతబడి అవాస్తవం అని కొందరు అంటే.. కాదు నిజమే నేను చూశాను మా ఇంట్లో వాళ్ళకి మా పక్కింటి వాళ్ళు చేతబడి చేయించారు. అని చెప్పడం ఎక్కడో ఒక దగ్గర,  ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు.. కొంత మంది అయితే దేవుడికి చేతబడి ముడివేస్తారు.. దేవుడు ఉన్నాడు అని నమ్మితే చేతబడి కూడా ఉందంటారు. మంచి ఉంటే చెడు కూడా ఉంటుందని మరికొందరు అంటారు.. ఇంతకీ అది వాస్తవమా..? అవాస్తమా తెలియాలి అంటే దాని నుండి మనం ఎఫెక్ట్ అయితేనో, లేదంటే మనవాళ్ళు ఎఫెక్ట్ అయితేనో దాని వెనక ఉన్న నిజాలు తెలుస్తాయి.. అయితే తాజాగా ఇలాంటి ఒక విషయం వరంగల్ లో కలకలం రేపుతోంది.. అదేంటో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఇంకెందుకు ఆలస్యం..  మంచంమీద పడుకున్న సతీశ్ ఉదయం లేచి చూసే సరికి మిస్ అవ్వడం ఏంటి..?  వీడికి ఏమైనా పిచ్చా పడుకునోడు ఎలా మిస్ అవుతాడు అని అనుకుంటున్నారా.. ? అది నిజమే కానీ  అతడు పడుకున్న మంచం పక్కన ముగ్గు వేసి ఉంది.. అది చాలదు నమ్మడానికి. అతను తప్పిలోలేదని అది నిజంగానే చేతబడి జరిగిందని గ్రామస్తులు అనుమానిస్తున్నారు.ఈ ఘటన వరంగల్ జిల్లాలోని  చెన్నారావుపేట మండలంలో గల ఉప్పరపల్లి గ్రామంలో ఈ చేతబడుల వ్యవహారం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. రాత్రికి రాత్రే ఓ యువకుడు మాయమయ్యాడు. అయితే గతంలో ఇదే తరహాలో ఒకరు అదృశ్యం అయ్యారు. ఇంతవరకు అదృశ్యం అయిన వ్యక్తి ఆచూకీ లభించలేదు.  గ్రామంలో రాత్రికి రాత్రే చీమల సతీష్ (28) అనే వ్యక్తి కనిపించకుండా పోయాడు. రాత్రి పడుకున్న సతీష్ తెల్లారేసరికి మాయమయ్యాడు. అయితే అతడు పడుకున్న మంచం పక్కకు చేతబడి చేసిన ఆనవాళ్లు గ్రామస్థులకు కనిపించాయి. సతీష్ పడుకున్న మంచం పక్కన మనిషి బొమ్మ, ముగ్గు గీశారు. అందులో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, మిరపకాయలు. బొగ్గు వేసి ఉంది. దీంతో సతీశ్ పై చేతబడి జరిగిందా ? అని గ్రామస్థులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ఇదే తరహాలో ఒక వ్యక్తి అదృశ్యం అయ్యాడని, అయితే ఇప్పటివరకు అతని ఆచూకీ లభించలేదని గ్రామస్తులు తెలిపారు. ఈ సంఘటనతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. ఈ ప్రపంచంలో అన్నీ ప్రశ్నలకు సమాధానం ఉంటుంది.. కాకపోతే ఆ ప్రశ్నలకు సమాధానం సైన్సులో దొరుకుతాయి.. ఇంకొన్ని సార్లు శాస్రం లో కూడా దొరుకుతాయి.. అలాగని కనిపించకుండా పోయిన వ్యక్తి నిజంగానే చేతబడిగావించాడా..? అంటే అది సరైన సమాధానం కాదు..  

వైసీపీలో ఆనందయ్య చిచ్చు.. మంత్రి, ఎంపీ మధ్య వార్ 

కృష్ణపట్నం ఆనందయ్య మందు మొదటి నుంచి వివాదాల్లోనే చిక్కుకుంది. ఏపీ ప్రభుత్వం మందు పంపిణి ఆపేయడం రచ్చగా మారింది. హైకోర్టు జోక్యంతో ఆనందయ్య మందు పంపిణికి లైన్ క్లియరైంది. ఇలా ఎన్నో వివాదాలు, అడ్డంకులను అధిగమించిన ఆనందయ్య మందు పంపిణి.. వైసీపీ నేతల తీరుతో గందరగోళం పడింది. చివరకు అధికార పార్టీ నేతల్లోనే చిచ్చు రేపుతోంది. మందు పంపిణి కోసం పోటీ పడుతున్న వైసీపీ నేతల మధ్య కోల్డ్ వార్ ముదురుతోంది.  ఆనందయ్య మందును సర్వేపల్లి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి డైరెక్షన్ లో పంపిణి చేస్తున్నారు. మందు కోసం సొంతంగా తన ఫోటోలతో కవర్లు తయారు చేయించారు కాకాని. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.అటు చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణి సాగుతోంది. ఆయన కూడా జగన్ తో పాటు తన ఫోటోలతో బాక్సులు తయారు చేయించాడు. దీంతో ఆనందయ్య మందుతో వైసీపీ నేతలు పబ్లిసిటీ చేసుకుంటున్నారని.. సొమ్మెకరిది సోకొకరిది అన్నట్లుగా అధికార పార్టీ నేతల తీరు ఉందనే విమర్శలు జోరుగా వస్తున్నాయి. ఈ వివాదాలు ఇలా ఉండగానే...  ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ కీల‌క నాయ‌కుల మ‌ధ్య ఆనంద‌య్య క‌రోనా మందు విష‌యంలో రచ్చ జరుగుతోంది.  ఒంగోలు ఎమ్మెల్యే క‌మ్ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు.. నువ్వా-నేనా అన్న‌ట్టుగా  పోటా పోటీగా మందును పంపిణీ చేస్తున్నారు.  రెడ్డి కావ‌డం గ‌మనార్హం. వీరిద్ద‌రి మ‌ధ్య మొదటి నుంచి స‌ఖ్య‌త‌ లేదు. మాగుంట వైసీపీలోకి రావ‌డాన్ని బాలినేని తీవ్రంగా వ్య‌తిరేకించారు. అయితే.. రాజ‌కీయ అవ‌స‌రాల నేప‌థ్యంలో జ‌గ‌న్‌.. మాగుంట‌ను పార్టీలోకి చేర్చుకుని ఏకంగా ఒంగోలు ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు. గ‌త ఎన్నిక‌ల్లో ఎంపీగా గెలిచినా.. జిల్లాలో మాగుంట పెద్ద‌గా దూకుడు చూపించ‌లేక పోతున్నారు. బాలినేని వల్లే మాగుంట జీరోగా మిగిలారనే చర్చ జిల్లాలో సాగుతోంది. తాజాగా ఒంగోలు పార్ల‌మెంటు ప‌రిధిలో ఆనందయ్య మందు విషయంలో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది.  త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాన్ని వినియోగించుకుని, దూకుడుగా ముందుకు సాగాల‌ని మాగుంట శ్రీనివాసులు రెడ్డి నిర్ణ‌యించుకున్నారు. అటు మంత్రి బాలినేని ఏర్పాట్లు చేసుకున్నారు. ఆనంద‌య్య మందు త‌యారై.. పంపిణీకి ఇద్దరు నేతలు ప్ర‌త్యేకంగా శిబిరాలు పెట్టుకుని మందు పంపిణీ ప్రారంబించారు. మాగుంట స్థానికంగా ఉన్న ఓ స్కూల్‌ను ఎంచుకుని శిబిరం ఏర్పాటు చేసి మందు పంపిణీ చేస్తుండగా.. బాలినేని ఏకంగా పార్టీ ఆఫీస్‌నే మందు పంపిణీకి కేంద్రంగా మార్చేశారు. ఆధార్ ఆధారంగా బాలినేని వ‌ర్గం మందును పంపిణీ చేస్తుంటే.. మాగుంట మాత్రం కార్పొరేట‌ర్ల నుంచి స్లిప్పులు తెచ్చిన వారికి మందును ఇస్తున్నారు.  నెల్లూరులో ఆనంద‌య్య మందు పంపిణీకి రెండు కేంద్రాలు ఏర్ప‌డి.. పార్టీ నేత‌లు రెండుగా చీలిపోయి పంపిణీని చేస్తుండ‌డంతో రాజ‌కీయంగా దుమారం రేగింది. నిజానికి మందు త‌యారీ, పంపిణీల విష‌యంలో రాజ‌కీయ జోక్యం వ‌ద్ద‌ని హైకోర్టు చెప్పినా.. ఇద్ద‌రు నేత‌లు మాత్రం ఇలా విడిపోయి మందును పంపిణీ చేయ‌డాన్ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ నేత‌లు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. దీనిపై కోర్టుకు కూడా వెళ్తామ‌ని అంటున్నారు.

ప్రియుడి కోసం కొడుకుతో కలిసి.. భర్తను చంపిన భార్య.. 

మగవాళ్లే కాదు ఆడవాళ్ళలో కూడా మానవత్వం మచ్చుకైనా కనిపించడంలేదు..మూడు ముళ్ళు.. ఏడు అడుగులు నడిచిన భర్తలను చంపడానికి కూడా నేటి తరం ఆడవాళ్లు వెనకాడడం లేదు.. పెళ్లి జరిగాక మరొకడితో అక్రమ సంబంధాలు నడపడం.. ఆ విషమై భర్తలు, భార్యలను మందలిస్తే .. అక్కడితో అన్ని సర్దిపెట్టుకోవాల్సిన భార్యలు భర్తలను చంపేస్తున్నారు.. ఒకటి కాదు రెండు కాదు ఇలాంటి కేసులు వందలు వేలుగా వెలుగులోకి వస్తున్నాయి.. ప్రియుడి మోజులో పడి ఒక భార్య తన కొడుకు మరియు ప్రియుడి సహాయముతో భర్తను చంపేసింది.. చివరికి ఆ భార్య, తన ప్రియుడు.. ఆమె కొడుకు ఏమయ్యారు అనేది మీరే చూడండి..    అతను ఒక ఎన్‌ఆర్‌ఐ పారిశ్రామికవేత్త భాస్క‌ర్ శెట్టి.  వయసు 52 సంవత్సరాలు. అతని భార్య పేరు రాజేశ్వరిశెట్టి. ఆమె వయసు 46 సంవత్సరాలు. ఆ ఇద్దరి దంపతులకు 23 సంవత్సరాలు కొడుకు ఉన్నాడు పేరు  నవనీత్‌శెట్టి   భాస్క‌ర్ శెట్టి వ్యాపార పనుల్లో బిజీ ఉండడంతో. రాజేశ్వరి తమ కుటుంబానికి తెలిసిన జోతిష్యుడు నిరంజన్‌భట్‌ తో అక్రమ సంబంధం కొనసాగించింది. ఆ ఆ విషయం భర్తకు తెలిసి ఆమెను మందలించాడు. అప్పటికే ప్రియుడి మోజులో ఉన్న అమ్మే తన కొడుకు భాస్కర్ శెట్టి పై లేనిపోనీ మాటలు చెప్పి కొడుకు ప్రియుడి సహాయంతో భర్తను హత్యచేసింది. ఆమెకు యావజీవ  కారాగార శిక్ష విధిస్తూ కర్ణాటకలోని ఉడిపి కోర్టు ఆదేశాలు జారీచేసింది. 2016లో జూలై 28న జరిగిన ఈ హత్య పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.  పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  సౌదీ అరేబియాలో వ్యాపారాలు చేసే భాస్కర్‌శెట్టికి ఉడుపిలో కూడా హోటళ్లు, లాడ్జ్‌లు, ఇతర ఆస్తులు ఉన్నాయి. భాస్కర్ శెట్టికి జ్యోతిష్కుడు నిరంజన్ భట్ వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలోనే నిరంజన్‌భట్‌కు భాస్కర్ శెట్టి భార్య రాజేశ్వరి శెట్టికి అక్రమ సంబంధం ఏర్పడింది. భర్త బిజినెస్ పనుల మీద బయటకు వెళ్లిన సమయంలో రాజేశ్వరి.. నిరంజన్‌భట్‌తో కలిసి రాసలీలలు కొనసాగించేంది. మరోవైపు రాజేశ్వరిని లోబరుచుకున్న నిరంజన్‌భట్.. ఆమెకి ఆనందం ఇవ్వడంతో పాటు.. అతను సంతోషాన్ని పొందడమే కాకుండా.. ఆమె వద్ద నుంచి భారీగా డబ్బులు కూడా మెల్లిగా వసూలు చేయసాగాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆమెను లూటీ చేస్తూ వచ్చాడు. ఈ విషయం తెలసుకున్న భాస్కర్ శెట్టి తన భార్య రాజేశ్వరిని మందలించాడు. ప్రియుడి బలం ఉన్న ఉన్న ఆమె. భర్త మాటలు చెవిన పెట్టలేదు.. ఎన్ని సార్లు చెప్పి చూసిన రాజేశ్వరి మాత్రం తన పద్దతి మార్చుకోలేదు. కొడుకు నవనీత్ శెట్టికి తన తండ్రి చెడ్డవాడని, అతనిపై లేనిపోని చాడీలు చెపుతూ కొడుకును నమ్మించింది. ఈ క్రమంలోనే భర్తను అడ్డుతొలగించుకోవడానికి ప్రియుడు నిరంజన్‌భట్‌తో కలిసి ప్లాన్ వేసింది. పధకం ప్రకారం ఇంద్రపల్లిలోని ఇంటిలో కొడుకు సాయంతో భర్తను అతికిరాతకంగా హత్య చేసింది. ఆ తర్వాత ప్రియుడు సాయంతో భర్త మృతదేహాన్ని యజ్ఞకుండంలో పెట్రోలు పోసి కాల్చివేశారు. ఇందుకు నిరంజన్ భట్ తండ్రి శ్రీనివాస్ భట్ కూడా సహకరించాడు. కట్ చేస్తే.. తన కొడుకు కనిపించడం లేదని.. కనీసం తన ఆచూకీ కూడా లభించడం లేదని భాస్కర్ శెట్టి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగం లోకి దిగారు విచారణ చేపట్టారు. రాజేశ్వరిపై అనుమానం రావడంతో.. పోలీసులు ఆ కోణంలో విచారణ జరిపారు. భాస్కర్ శెట్టి తల్లి కోడలిపై అనుమానం వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు లోతుగా దర్యాప్తు జరగగా రాజేశ్వరి శెట్టి తన భర్తను హతమార్చిన అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు రాజేశ్వరి, నవనీత్ శెట్టి, నిరంజన్‌భట్, శ్రీనివాస్ భట్‌, డ్రైవర్ రాఘవేంద్రలపై కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన జిల్లా సెషన్స్‌కోర్డు జడ్జి జేఎన్ సుబ్రమణ్య తీర్పునిచ్చారు. రాజేశ్వరి, నవనీత్ శెట్టి, నిరంజన్‌భట్‌లకు జీవతఖైదు విధించారు. డ్రైవర్‌ రాఘవేంద్రపై ఆధారాలు లేకపోవడంతో విముక్తున్ని చేశారు. ఈ కేసులో నాలుగో నిందితుడు విచారణ జరుగుతున్న సమయంలోనే అనారోగ్యంతో మృతిచెందాడు. ఇక, ఈ కేసులో ప్రధాన నిందితురాలైన రాజేశ్వరి బెయిల్‌పై బయట ఉండగా.. నవనీత్ శెట్టి, నిరంజన్‌భట్‌లు బెంగళూరు జైలులో ఉన్నారు.

కరోనా స్పైడర్లుగా జగనన్న పథకాలు! 

కొవిడ్ కట్టడికి ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులు వస్తున్నా లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. పాజిటివిటి రేటు ఐదు శాతం ఉన్న రాష్ట్రాలు కూడా ఏ మాత్రం ఛాన్స్ తీసుకోకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాయి. కాని కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. కొవిడ్ కట్టడి కోసమంటూ కర్ఫ్యూ అమలు చేస్తోంది జగన్ రెడ్డి సర్కార్. కాని అదే సమయంలో జనాలంతా రద్దీగా ఉండే అవకాశాలు కల్పిస్తోంది. ప్రభుత్వ పథకాల కోసం ఆధార్ కంపల్సరి చేయడంతో.. వాటి కోసం గుంపులు గుంపులుగా జనాలు ఆధార్ సెంటర్ల దగ్గర గుమి గూడుతున్నారు. దీంతో జగనన్న పథకాలే.. కొవిడ్ సూపర్ స్ప్రైడర్లుగా మారుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.  ఏపీలో జగనన్న ప్రభుత్వ పథకాలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలు అందాలంటే ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్, పేర్లు, పుట్టినతేది సరిచేసుకోవాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఆధార్ సెంటర్ దగ్గరకు జనాలు బారులుతీరారు. గత మూడు రోజులుగా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎవరూ సామాజిక దూరం పాటించడంలేదు. కొందరు మాస్కులు కూడా లేకుండానే లైన్లలో నిల్చుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో తోపులాటలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఒక వైపు కరోనా భయం, మరో వైపు పథకాలు ఎక్కడ రాకుండపోతాయోనన్న భయం ఏపీ జనాలను వెంటాడుతోంది. క్యూ లైన్లలో వృద్ధులు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. కోవిడ్ తీవ్రత తగ్గేవరకు ఈ నిబంధనలు తొలగిస్తే బాగుంటుందనే అభిప్రాయం ప్రజల నుంచి వస్తోంది. ఆధార్ సెంటర్ల దగ్గరే కాకుండా మీ సేవా కేంద్రాల్లోనూ తప్పులు సరి చేసుకునే అవకాశం ఇచ్చినా రద్దీ కొంత తగ్గే అవకాశం ఉందంటున్నారు. ఇలా గుంపులు గుంపులుగా జనాలు వస్తే.. మళ్లీ కొవిడ్ విజృంభించే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

అమ్మాయిలపై లైంగిక దాడులకు కారణం ఇదేనట!

మహిళల రక్షణ కోసం రాజ్యాంగంలో ఎన్నో చట్టాలు ఉన్నాయి. కొత్తగా మరింత కఠినమైన చట్టాలను తీసుకొచ్చారు పాలకులు. అమ్మాయిల భద్రత కోసమే ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నారు. అయినా దేశంలో మహిళలపై లైంగిక దాడులు ఆగడం లేదు. అత్యాచారాలకు సంబంధించిన ఘటనలు ప్రతి రాష్ట్రంలో .. ఇంకా చెప్పాలంటే మన దగ్గరలోనే నిత్యం వెలుగులోనికి వస్తున్నాయి. అయితే అమ్మాయిలపై లైగింక దాడులకు సంబంధించి మహిళల భద్రత చూడాల్సిన పదవిలో ఉన్న మహిళ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.  అమ్మాయిలు అతిగా ఫోన్లు వాడడం వల్లే అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలు మీనా కుమారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలీగఢ్ జిల్లాలో మహిళా ఫిర్యాదులపై విచారణల సందర్భంగా ..  ఫోన్ల వినియోగంపై మాట్లాడుతూ ఆమె ఈ కామెంట్ చేశారు.  అమ్మాయిలు ఫోన్లు వాడొద్దని అన్నారు. తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లులు.. తమ కూతుర్లను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. కూతుర్లు నిర్లక్ష్యంగా ఉంటున్నారంటే దానికి కారణం తల్లుల నిర్లక్ష్యమేనన్నారు ‘‘అమ్మాయిలకు అసలు ఫోన్లు ఇవ్వొద్దు. గంటలకొద్దీ అబ్బాయిలతో బాతాఖానీలు కొడుతున్నారు. ఆ తర్వాత వారితో కలిసి పారిపోతున్నారు. తల్లిదండ్రులు వారి ఫోన్లను చెక్ చేయకపోవడం వల్ల ఇలాంటి విషయాలు తెలియడం లేదు’’ అని ఆమె అన్నారు. మహిళలపై పెరుగుతున్న నేరాలపై సమాజం కూడా ప్రభావం చూపిస్తోందన్నారు. మీనా కుమారి వ్యాఖ్యలపై స్పందించిన కమిషన్ వైస్ చైర్ పర్సన్ అంజూ చౌదరి.. ఫోన్లను లాక్కున్నంత మాత్రాన మహిళలపై లైంగిక హింస ఆగదన్నారు.