కరోనా రోగిపై.. నలుగురు డాక్టర్స్.. 

డాక్టర్ ప్రాణం పొయ్యాలి.. ప్రాణాన్ని నిలబెట్టాలి..సంఘసేవ చెయ్యాలి.. సమాజంలో ఆదర్శనంగా ఉండాలి.. ధనిక పేద తేడా లేకుండా వైద్యం అందించాలి.. ఎందుకంటే తెల్ల కోట్ వేసుకునే వాళ్లకు మాత్రమే కలిపించింది.. ఈ సమాజం.. ఎందుకంటే డాక్టర్ వృత్తి చాలా పవిత్రమైనది.. కొంత మంది  డాక్టర్స్ ని చూస్తే కాలుమొక్కలనిపిస్తుంది.. ఇంకొంత మంది డాక్టర్స్ ని చూస్తే అదే కాలుపట్టి కిందికి గుంజాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ తెల్ల కోట్ వృత్తి చాలా స్వేచ్ఛమైనది.. కానీ కొంత మంది డాక్టర్స్ ఈ పవిత్రమైన వృత్తిని అపవిత్రం చేస్తున్నారు.. కొందరు ప్రజల ప్రాణాలతో అడ్డుకుంటే.. మరికొందరు ప్రజల ప్రాణాలు నిలబెడుతున్నారు.. ఇంకొందరు అదే పేషంట్ల తో తమ కామ వాంఛ తీర్చుకుంటున్నారు..    మనకు కనిపెంచే వాళ్ళు అమ్మానాన్నలు  ప్రధమ దేవులు అయితే.. అమ్మనాన్నలు ఇచ్చిన జన్మను ఒక గాడిలో పెట్టేది అనిపించని ఆ దేవుడు.. ఆ  దేవుడి తర్వాత దేవుడిలా కొలిచేది డాక్టర్ నే. ఎందుకంటే చావుబతుకులతో ఉన్న వాళ్లకు పునర్జన్మ ఇవ్వగలిగిన వాడు ఒక డాక్టర్ మాత్రమే.. ఈ విషయం అందరికి తెలుసు.. ఈ విషయాన్ని అందరూ ఒప్పుకుని తీరాల్సిందే.. ఈ కరోనా సమయంలో వారే ప్రజలకు దేవుళ్లు. కానీ అలాంటి వైద్యులే కామంతో కళ్ళుమూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు. కనికరం లేకుండా కనీసం విజ్ఞతలేకుండా ప్రవర్తించాడు. వైద్యం కోసం వచ్చిన మహిళా రోగులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. తాజాగా వైద్యం కోసం వచ్చిన ఓ కరోనా రోగిని ఒక్కరు కాదు ఇద్దరు కాదు నలుగురు వైద్యులు దారుణంగా అత్యాచారం చేసి ఆమె మరణానికి కారణమయ్యారు. కరోనాతో బాధపడుతున్నదన్న కనికరం కూడా లేకుండా యువతిపై లైంగిక వాంఛ తీర్చుకున్నారు.  పూర్తి వివరాలలోకి వెళితే.. 20 ఏళ్ల యువతి చికిత్స నిమిత్తం ప్రయాగ్‌ రాజ్‌లోని స్వరూప్‌ రాణి నెహ్రు ఆసుపత్రి లో చేరింది. అక్కడ ఓ నలుగురు డాక్టర్లు ఆమెను చికిత్స పేరుతో తాకుతూ లైంగిక వేధింపులకు గురిచేశారు. దీంతో ఆమె వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిపై వ్యూహాన్ని తిప్పికోట్టింది.. అయినా వాళ్ళు పట్టించుకోలేదు.. పట్టించుకోని ఆ డాక్టర్లు జూన్ 2 అర్ధరాత్రి ప్లాన్ వేశారు. , వాళ్ళ పథకం ప్రకారం ఆమెపై అత్యచారం చేసి వారి లైంగిక వాంఛ తీర్చుకున్నారు. ఆ తర్వాత ఆమె చనిపోయింది. ఇక ఏ ఈ విషయాన్ని బాధితురాలు ఆమె సోదరుడికి చెప్పగా  జూన్‌ 3న బాధితురాలి సోదరుడు ఫిర్యాదు ఇవ్వగా… యువతి చనిపోయిన తర్వాత ప్రయాగ్‌రాజ్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అయితే ఈ విషయంలో  ప్రాథమిక విచారణ జరిపినందున ఎఫ్‌ఐఆర్‌కు దాఖలు చేయడంలో ఆలస్యం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఇక మరో పక్క తమ ఆసుపత్రిలో ఇలాంటి ఘటన జరిగినట్టు ఆనవాళ్లు లేవని, ఆ నలుగురు డాక్టర్లు ఎవరో కూడా తెలియదని ఆసుపత్రి యాజమాన్యం తెలపడం గమనార్హం. ఇక ఈ ఘటనపై విచారణ ముమ్మురం చేయాలనీ పోలీస్ ఉన్నతాధికారులు పోలీసులకు ఆదేశించారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో ఆలస్యంగా వెలుగుచూసింది. 

ఈటలతో బీజేపీ నయా గేమ్? ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేనట్టే? 

మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై రాజీనామాపై సస్పెన్స్ కొనసాగుతోంది. టీఆర్ఎస్ పార్టీతో పాటు కారు సింబల్ పై గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఈటల ప్రకటించి వారం రోజులైంది. అయినా ఇంకా ఆయన రాజీనామా చేయలేదు. స్పీకర్ అపాయింట్ మెంట్ కూడా కోరలేదు. గులాబీ పార్టీకి గుడ్ బై చెపుతూ ఈటల మాట్లాడిన మాటలతో.. ఆ రోజే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని భావించారు. కాని అది జరగలేదు. తర్వాత మంచి రోజుల కోసం చూస్తున్నారు.. సోమవారం రాజనామా చేస్తారనే ప్రచారం జరిగింది. వారం గడిచినా రాజీనామా ఊసే ఎత్తడం లేదు రాజేందర్. రాజీనామాపై క్లారిటీ ఇవ్వని మాజీ మంత్రి.. నియోజకవర్గంలో మాత్రం పర్యటిస్తున్నారు. తన మద్దతుదారులతో కలిసి బల ప్రదర్శన చేస్తున్నారు. తనకు అండగా ఉండాలని ఒకరకంగా ప్రజలను వేడుకుంటున్నారు.  ఈటల రాజేందర్ వ్యవహారం ఇప్పుడు చర్చగా మారింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించి వారమైనా.. ఇంకా ఎందుకు రిజైన్ చేయలేదు... రాజీనామా చేయకుండానే నియోజకవర్గంలో ఎందుకు పర్యటిస్తున్నారన్నది అంతబట్టకుండా ఉంది. అదే సమయంలో ఈటల బీజేపీలో ఎప్పుడు చేరుతారన్నదానిపైనా స్పష్టత లేదు. ఈటల విషయంలో ఇంత గందరగోళానికి కారణం బీజేపీ హైకమాండే అని తెలుస్తోంది. కమలం పెద్దల డైరెక్షన్ లోనే రాజేందర్ నడుస్తున్నారని, అక్కడి నుంచి సిగ్నల్స్ వచ్చాకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. బీజేపీలో ఎప్పుడు చేరాలి, కేసీఆర్ టార్గెట్ గా ఎలా ముందుకు వెళ్లాలన్నది కూడా నడ్డా టీమ్ డైరెక్ట్ చేయనుందని చెబుతున్నారు.  ఈటల విషయంలో బీజేపీ పక్కా వ్యూహం ప్రకారమే వెళుతున్నట్లు తెలుస్తోంది. ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఆయన పదవి లేకుండానే ఉండాల్సి వస్తోంది. కొవిడ్ కారణంగా ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం సీఈసీకి లేదని తెలుస్తోంది. సెకండ్ వేవ్ ఉధృతికి ఐదు రాష్ట్రాల ఎన్నికలే కారణమనే ఆరోపణలు ఉన్నాయి. కొవిడ్ థర్ట్ వేవ్ వస్తుందన్న హెచ్చరికలు ఉన్న కారణంగా ఇకపై నిర్వహించే ఎన్నికలపై సీఈసీ తొందరపడకూడదని భావిస్తుందని తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో జరగాల్సి ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా వాయిదా వేసింది. దీంతో ఈటల రాజీనామా చేసినా.. ఖచ్చితంగా 6 నెలల లోపు ఉప ఎన్నిక జరుగుతుందన్న గ్యారంటీ లేదు. వాయిదా వేసుకుంటూ పోతే మరింత కాలం రాజేందర్ పదవి లేకుండానే ఉండాల్సి వస్తోంది. అందుకే రాజీనామాపై తొందర వద్దని బీజేపీ హైకమాండ్ సూచించిందని చెబుతున్నారు. సీఈసీ నుంచి వచ్చే సమాచారం ఆధారంగా బీజేపీ పెద్దలు ఇచ్చే సూచనల ప్రకారమే ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై రాజేందర్ నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు . రాజీనామాపై ఈటల ఆలస్యం చేయడానికి మరో కారణం కూడా ఉందంటున్నారు. ఎన్నికల వ్యూహాల్లో దిట్టగా పేరున్న గులాబీ బాస్ ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా ఉప ఎన్నికల్లో ఆయన ప్లాన్స్ ఎవరికి అందకుండా ఉంటాయి. రాజీనామాకు ముందే నియోజకవర్గంలో తిరిగి జనాల నాడీ తెలుసుకోవాలని ఈటల భావిస్తున్నారట. అందుకే ఆయన గ్రామాలు తిరుగుతున్నారని చెబుతున్నారు. అవసరమైతే నియోజకవర్గంలో పాదయాత్ర చేయాలని రాజేందర్ ప్లాన్ చేస్తున్నారట. ఎమ్మెల్యేగానే జనాల్లోకి వెళ్లి .. వాళ్ల సమస్యలు తెలుసుకుని... ప్రభుత్వాన్ని నిలదీసే యోచనలో ఈటల ఉన్నారంటున్నారు. అందుకే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా.. ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై రాజేందర్ న్యాయ సలహా తీసుకుంటున్నారని చెబుతున్నారు . ఇదంతా బీజేపీ పెద్దల కనుసన్నల్లోనే జరుగుతుందని అంటున్నారు. మరోవైపు రాజేందర్, బీజేపీ వ్యూహాలకు కౌంటర్ ప్లాన్స్ టీఆర్ఎస్ రెడీ చేస్తుందని తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేయకపోతే.. స్పీకర్ కు ఫిర్యాదు చేసి అనర్హత వేటు వేయించే ఆలోచనలో గులాబీ లీడర్లు ఉన్నారంటున్నారు. ఇది జరిగిగా తమకు లాభమే అన్న అంచనాల్లో ఈటల వర్గీయులు, బీజేపీ నేతలు ఉన్నారు. ఎమ్మెల్యే పదవిపై వేటు వేస్తే... ఈటలకు జనాల్లో మరింత సానుభూతి పెరుగుతుందని లెక్క కడుతున్నారు. మొత్తంగా రాజీనామాపై ఆలస్యం చేయడం ద్వారా టీఆర్ఎస్ అన్ని విధాలా చెక్ పెట్టేలా రాజేందర్ తో పాటు బీజేపీ నేతలు కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. 

బీజేపీలో చేరితే చచ్చిపోయినట్టే! సీనియర్ నేత సంచలనం..

దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. గతంలో ఎప్పుడు లేనంతగా నరేంద్ర మోడీ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. అదే సమయంలో ఈ పరిస్థితులను క్యాష్ చేసుకోవాల్సిన  ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కూడా పుంజుకోవడం లేదు. సరికదా ఇప్పటికే బలహీనంగా ఉన్న హస్తం పార్టీ మరింత బలహీనమవుతోంది. ఆ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా కీలక నేతలు బయటికి వెళుతున్నారు. తాజాగా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జతిన్ ప్రసాద బీజేపీలో చేరారు.  కాంగ్రెస్ లో అసమ్మతి టీమ్ గా ముద్రపడిన జీ-23 గ్రూపులో జితిన్ ప్రసాద కూడా ఉన్నారు. ఇప్పుడు జితిన్ కమలానికి జై  కొట్టడంతో జీ23లోని మిగితా నేతలు కూడా ఎవరి దారి వారి చూసుకుంటారనే చర్చ జరుగుతోంది. మెజార్టీ నేతలు బీజేపీలో చేరవచ్చన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఆ నేపథ్యంలో కాంగ్రెస్ అసమ్మతి టీమ్ లో కీలక నేతగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో సంస్కరణలు చేయాల్సిన తరుణం వచ్చిందని, తాము చెప్పే మాటలను నాయకత్వం ఇకనైనా వినాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పార్టీలోని సమస్యలను ఇంకా పరిష్కరించలేదని చెప్పారు. వాటిని పరిష్కరించనంతవరకూ.. వాటి గురించి ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. పార్టీ నాయకత్వం విఫలమైతే పార్టీ నేతలందరూ విఫలమైనట్టేనని కపిల్ సిబల్ అన్నారు.  తాము అక్కర్లేదు వెళ్లిపొమ్మని పార్టీ చెప్తే.. వెళ్లిపోతామని తేల్చిచెప్పారు కపిల్ సిబల్. అయితే తాను బీజేపీలో మాత్రం చేరేది లేదని ఆయన స్పష్టం చేశారు. తాను పుట్టినప్పటి నుంచి బీజేపీకి వ్యతిరేకమని.. తాను బీజేపీలో చేరడమంటే తాను చచ్చిపోయినట్టే లెక్క అని అన్నారు. బీజేపీలో జితిన్ ప్రసాద చేరికపై ఘాటుగా స్పందించారు. అది 'ప్రసాద రామ' రాజకీయాలని అన్నారు. సిద్ధాంతాలను పక్కనబెట్టి కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీని వీడారని మండిపడ్డారు. పార్టీ ఏం చేసింది? ఏం చేయలేదు? అన్నది తనకు అనవసరమని సిబల్ అన్నారు. ప్రస్తుత రాజకీయాలకు ఓ సిద్ధాంతమంటూ లేకుండాపోయిందన్నారు. పార్టీని వీడడంలో జితిన్ కు కారణాలుండి ఉండొచ్చన్నారు. ఆయన పార్టీని వీడినందుకు విమర్శలు చేయాల్సిన అవసరం లేదని, కానీ, పార్టీని వీడేందుకు ఆయన చెప్పిన కారణాలనే విమర్శించాలన్నారు కపిల్ సిబల్.   

పోలీసులకు కిక్ సినిమా చూపించిన దొంగ. .

దొంగ దొంగ వచ్చాడే అన్ని దోసుకపోతాడే.. ముంబై లోనే మొనగాడే జంతర్ మంతర్ చేస్తాడే.. ఈ పాట వైన్ ఉంటారు.. అయితే  కొందరు దొగతనం చేస్తారు.. దాన్ని కొంతమంది వృత్తిగా చేస్తే.. ఇంకొంత మంది ప్రొఫెషన్ గా చేస్తారు.. ఒక చోట దొంగతనం జరిగిన తర్వాత పోలీసులు కామన్.. కానీ అదే దొంగ సవాలు పోలీసులకు సవాల్ చేస్తే అరుంధతి సినిమాలో అనుష్కలా నువ్వు నన్ను ఏం చెయ్యలేవురా అని ఛాలెంజ్ చేస్తూ పోలీసులకు దొరకకుండా దొంగతనం చేయడం ఒక ఆర్ట్.. ఇది చదివిన తర్వాత అయిన ఎలాంటివి ఉంటాయా భయ్యా అని అనుకుంటున్నారా.. ఒక వేళా ఉన్న ఇలాంటివి జరగడానికి సినిమాలో అవకాశం ఉంటుంది గానీ లైఫ్ ఇలాంటివి సాధ్యం కాదు అంటున్నారా.. ఈ వార్త అక్షరాలా  వాస్తవం.. ఆ వాస్తవం తెలియాలంటే ఈ వార్త చదవండి..  ఓపెన్ చేస్తే.. హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్‌లో ఈ ఏడాది జనవరిలో నిర్మాత మంజునాథ్‌ కారు మిస్ అయింది. ఆ క్రమంలో నమోదైన కేసులో… చోరీ చేసింది రాజస్థాన్‌కు చెందిన ఓ దొంగ తమిళ్ హీరో కార్తీక్ సినిమా ఖాకీ సినిమాను చూపించాడు.. ఆ దొంగ గుర్తించిన పోలీసులు అతన్ని పట్టుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే దొంగ పోలీస్ సినిమాలు అని చూపించాడు.. ఆ దొంగ హైదరాబాద్ పోలీసులకు చివరికి ఆ దొంగ ఊరుకు వెళ్లినా పట్టుకోలేక ఉట్టి చేతులతో తిరిగి వచ్చారు. అంతేకాదు.. పోలీసులకే ఏకంగా వీడియో కాల్‌ చేసి మరీ సవాల్‌ విసిరాడా దొంగ. నా ఫోటో తీసి పెట్టుకోండి.. గుర్తుంచుకోండి. అంతవరకే..మాత్రమే..  తాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు దొరకనని చెప్పడం పోలీసులకు షాక్‌ ఇచ్చినట్టు అయింది. రాజస్థాన్‌కు చెందిన ఈ గజదొంగ ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 56 కార్లను చోరీ చేశాడు. ఏ ఒక్క కేసులో కూడా అతన్ని పోలీసులు పట్టుకోలేదు. కేసును చేధించింది లేదన్నది వాడి ట్రాక్‌ రికార్డ్‌. ఆ దొంగ ఎప్పుడు ఎక్కడ ఉంటాడు. ఎలా చోరీ చేస్తాడన్నది ఎవరికీ తెలియదు. కానీ చోరీ సమయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటాడన్నది మాత్రం పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. ఆ దొంగను పట్టుకునేందుకు పోలీసులు రాజస్థాన్‌కు వెళ్లారు. ఊరు వివరాలు తెలుసుకుని కొన్ని రోజులు రిక్కీ నిర్వహించారు. అయినా దొంగ దొరకలేదు.. పైగా పోలీసులు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న సదరు దొంగనే.. నేరుగా పోలీసులకు ఫోన్‌ చేయడం పోలీసులకు దిమ్మ బొంగరం లా తిరిగినంత పనైంది. మీరు నా గురించి వెతికింది చాలు.. నా కోసం టైం వేస్టు చేసుకోకండి అన్నట్టుగా మాట్లాడి పోలీసులను ఖాళీగా తిరిగి హైదరాబాద్‌ వచ్చేలా చేశాడు. అయితే కారును పోగొట్టుకున్న నిర్మాత మంజునాథ్‌ మాత్రం.. కారు పోతే పోనీ కానీ.. అందులో విలువైన డాక్యుమెంట్లు ఉన్నాయి. వాటినైనా రికవరీ చేసి ఇచ్చేలా చూడండి అంటూ వేడుకుంటున్నాడు. స్థలాలకు సంబంధించిన కీలక పత్రాలు అందులో ఉన్నాయని చెబుతున్నాడు. ఓవైపు తెలివిమీరిన దొంగ.. మరోవైపు బాధితుడి ఆవేదనతో పోలీసులు నలిగిపోతున్నారు. నేరచేధనలో ముందున్న హైదరాబాద్‌ పోలీసులకు ఇప్పుడీ చోరీ వ్యవహారం పెద్ద ఛాలెంజింగ్‌గా మారింది. 

స్వామి భక్తి అన్ లిమిటెడ్..అందుకే ఇప్పుడు ట్రబుల్

బిగ్ బాస్ చూసి రమ్మంటే.. ఈ బాస్ కాల్చి వచ్చే రకం. అధినేత అంతరంగాన్ని బాగా అర్ధం చేసేసుకుని.. ఆయన మనసులోని కోరికలన్నీ తీర్చేస్తారు మన పోలీస్ బాస్.  ఆయన ఆదేశమిచ్చారంటే.. ఏ సెక్షన్ అడ్డొచ్చినా సరే..విసిరిపారేసి మరీ.. పాటించేస్తారు ఈయన. ఆయనే సీఐడీ డీజీ సునీల్ కుమార్. ఆయన గురించి ఏపీలో ఇప్పుడు ప్రతిపక్ష నేతలు ఇలాగే కామెంట్లు చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఐడీ చీఫ్ అయిన సునీల్ కుమార్.. రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. లేటెస్టుగా రికార్డులు బద్దలుగొట్టి.. చిక్కుల్లో పడిపోయారు.  నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు అయినా..అమరావతి కేసులైనా.. లేటెస్టుగా ఎంపీ రఘురామకృష్ణరాజు కేసు అయినా సరే.. కేసు ఏదైనా.. అది సెన్సేషనల్ కావాల్సిందే...మీడియాలో మార్మోగిపోవాల్సిందే. ఆయన మాట్లాడేది తక్కువే అయినా.. ఆయా కేసుల్లో ఆయన యాక్షన్ మాట్లాడేది మాత్రం చాలా ఎక్కువ. అందుకే చాలా తక్కువ టైములో డీజీపీని మించిన పాపులారిటీని సంపాదించారు ఈ సునీల్ కుమార్. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా ఉండగా స్థానిక ఎన్నికల్లో ఎక్కడెక్కడ హింస జరిగింది, అవకతవకలు జరిగింది వివరిస్తూ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు.  ముందు ఆ లేఖ నిమ్మగడ్డ రాయలేదని సృష్టించారని వైసీపీ నేతలు మండిపడ్డారు. ఆ తర్వాత నిమ్మగడ్డ తానే రాశానని ఓపెన్ గా చెప్పాక... ఆ లేఖ రాసింది నిమ్మగడ్డ కాదని.. టీడీపీవారే రాసి..ఆయన పేరుతో పంపారని ఆరోపించారు. అంతేకాదు దీనిపై విచారణ జరపాలని ఎంపీ విజయసాయిరెడ్డి కంప్లయింట్ ఇవ్వడంతో.. సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ రంగంలోకి దిగారు. విచారణ మొదలెట్టారు. ఈసీ ఆఫీసులోని కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు అన్నీతిరగేశారు..ఏమీ దొరకలేదు. అయితే ఇక్కడే సునీల్ కొత్త రికార్డు సృష్టించారు.  విచారణ మధ్యలో ఉండగా... ఏమీ తేలకుండా.. మీడియాకు బ్రీఫ్ చేయడమనేది సీఐడీ, సీబీఐలు చేయవు. వారు కోర్టులో సమర్పించే నివేదికల ఆధారంగానే మీడియా రాసుకోవాలి.  అలాంటిది ఈయన ముందు ప్రభుత్వానికి అనుకూలంగా ఓ మీడియా చానెల్ ను.. ఆ తర్వాత మరి రెండు చానెళ్లను పిలిపించుకుని స్పెషల్ గా బ్రీపింగ్ ఇచ్చారు. లేఖ ఎక్కడి నుంచో ఇక్కడకు వచ్చిందని.. ఇక్కడ ప్రింట్ తీసి నిమ్మగడ్డ పంపించారని.. అయితే ఇంకా ఆధారాలు దొరకాలని మళ్లీ ముక్తాయింపు ఇచ్చారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చివరికి ఇప్పటివరకు ఏమీ తేల్చలేకపోయారు ఈ కేసులో. తర్వాత అమరావతిలో టీడీపీ నేతలు రైతులను బెదిరించి భూములు లాక్కున్నారని ఓ కేసు పెట్టారు. దీని కోసం కొందరు రైతులతో కంప్లయింట్ ఇప్పించారని చెప్పారు. అంతా మన సునీల్ కుమార్ గారి డైరెక్షన్ లోనే. చివరకు టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఇదంతా ఫేక్ కంప్లయింట్లని.. ఆయా రైతులతో మాట్లాడించారు. చివరకు కోర్టులో కూడా నిలబడలేదు సీఐడీ రిపోర్టులు. ఆ కేసు అలాగే ఉండిపోయింది. ఈ కేసులో ఏకంగా చంద్రబాబుకే నోటీసులిచ్చి.. విచారణకు పిలిపించాలని చూశారు.. కాని హైకోర్టు ఆదేశాలతో కుదరలేదు.  ఇక రఘురామకృష్ణరాజు కేసులోనూ అదే తంతు. కేసు పెట్టడమే సుమోటోగా పెట్టారు. అదే పెద్ద రికార్డు. పెట్టిన కేసు రాజద్రోహం... ఇది మరో రికార్డు. ఇంటరాగేషన్ లో సిట్టింగ్ ఎంపీని కొట్టారని ఆరోపణలు రావడం మరో రికార్డు.. ఇలా సునీల్ కుమార్ రికార్డుల మీద రికార్డులు సాధిస్తున్నారు.  అలాంటి సునీల్ పై ఇప్పుడు తాజాగా కంప్లయింట్ ఒకటి వచ్చింది. ఆయన రిజర్వేషన్ మీద ఉద్యోగం పొంది తర్వాత మతం మారారని.. మత ప్రచారం కోసం ఓ సంస్థను కూడా నడుపుతున్నారని .. ఆయనను తొలగించాలని కంప్లయింట్ చేశారు.  ఇప్పటికే రఘురామకృష్ణరాజు కేసులో.. సుప్రీంకోర్టు విచారణలో అన్ని విషయాలు తేలితే.. ముందుగా వేటు పడేది సునీల్ కుమార్ పైనే. అలా పరిమితికి మించి స్వామి భక్తిని ప్రదర్శించినందుకు ఇప్పుడు సునీల్ కుమార్ పీకల్లోతు చిక్కుల్లో పడిపోయారు.

హస్తినలో రఘురామకృష్ణరాజు, జగన్ ఫైట్ 

ఎంపీ లేదు గింపీ లేదు..రాజ్యం మనది.. రాజ్యాంగం మనమే.. అంటూ చెలరేగిపోయారు. ఇప్పుడా ఎంపీ గడపగడపకు తిరుగుతూ వీరి వ్యవహారం గురించి పూసగుచ్చినట్లు చెప్పుకొస్తున్నాడు. హస్తినలో ఇప్పుడు తెలుగు రాజకీయం మార్మోగుతుంది. రఘురామరాజు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్నట్లు పార్లమెంట్ సమావేశాలకు ముందు నుంచే వేడి పుట్టింది. ఈ ఎపిసోడ్ పై పార్లమెంట్ లో లేవనెత్తుతామని .. ఈ దెబ్బకు దేశవ్యాప్తంగా అయ్యగారి ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని రాజుగారి వర్గం చెబుతుంటే... రఘురామకృష్ణరాజు టీవీ ప్రసంగాలన్నీ స్పీకర్ కు సమర్పించి వివరిస్తామని.. ఈసారి సస్పెన్షన్ వేటు ఖాయమని వైసీపీ వర్గం చెబుతోంది. ఈ ఇరు వర్గాల పోటాపోటీ లాబీయింగ్ తో హస్తిన పెద్దలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. విజయసాయిరెడ్డితో మొదలైని విబేధాలు రఘురామకృష్ణరాజు ప్రభుత్వ నిర్ణయాలను నేరుగా నిలదీసేదాకా పోవడంతో.. వైరం ముదిరి పాకాన పడింది. స్వయంగా పార్టీ ఎంపీయే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఏకరువు పెట్టడం.. పైగా ఇసుక, ఇళ్ల స్ధలాల కొనుగోలు వంటి వాటిలో జరిగిన అవినీతిని ఉధాహరణలతో సహా బయటపెట్టడం ఇవన్నీ..జగన్ శిబిరంలో కాక పుట్టించాయి. నేరుగా జగన్మోహన్ రెడ్డినే పేరు పెట్టి నిలదీయటం మొదలెట్టడంతో.. ఇక ఆపకపోతే తప్పదనుకున్నారో ఏమో..రూల్ లేదు.. చట్టం లేదు.. వేసుకోచ్చేయండి అని సినిమా ఫక్కీలో..హైదరాబాద్ ఇంట్లో ఉన్న ఎంపీని..గుంటూరుకు ఎత్తుకొచ్చేశారు సీఐడీ అధికారులు. ఇక ఆ తర్వాత జరిగిన ప్రహసనాలన్నీ అందరికీ తెలిసిందే. తనను కొట్టారని ఎంపీ ఆరోపించడం..కాదని వైసీపీ వర్గాలు వాదించటం.. చివరకు ఆర్మీ ఆస్పత్రి దెబ్బలున్నాయని సుప్రీంకోర్టుకు చెప్పడం..బెయిల్ రావడం అన్నీజరిగిపోయాయి. బెయిల్ వచ్చిన దగ్గర నుంచి రఘురామకృష్ణరాజు ఒకే పని పెట్టుకున్నారు. కేంద్రంలోని పెద్దలకు, సహచర ఎంపీలకు..ముఖ్యమైన పదవుల్లో ఉన్నవారికి ఈ ఎపిసోడ్ మొత్తం వివరించడం...ఏపీ ప్రభుత్వం డైరెక్షన్ లో ఏపీ సీఐడీ ఏ రేంజ్ లో కథ నడిపించిందీ చెప్పుకురావడంతో.. వారందరూ స్పందిస్తున్నారు. ఏ ఎంపీ స్పందిస్తున్నారు.. ఏమన్నారో కూడా రఘురామకృష్ణరాజు క్యాంప్ మీడియాకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తోంది. దీంతో అక్కడ ఏం జరగబోతుందో కొందరు ఊహించగలుగుతున్నారు. ఒక సిట్టింగ్ ఎంపీని ఈ విధంగా చేయడం దారుణమనే అభిప్రాయం అయితే అందరి నుంచి వస్తోంది. ఈ విషయాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామని ఆయా ఎంపీలు ఓపెన్ గానే చెప్పారు. దీంతో డిఫెన్స్ లో పడ్డ జగన్మోహన్ రెడ్డి శిబిరం.. ఆ పరిస్ధితిని ఎదుర్కోవటానికి ప్రిపేర్ అవుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే స్పీకర్ కు రఘురామకృష్ణరాజు ప్రసంగాలన్నీ చూపించి.. ఏ విధంగా పార్టీకి, ప్రభుత్వానికి ద్రోహం చేసింది వివరిస్తారట. ఇప్పటికే ఎంపీని సస్పెండ్ చేయాలని వైసీపీ స్పీకర్ కు విన్నవించింది. ఇప్పుడు తాజా పరిణామాలను కూడా వివరించి సస్పెన్షన్ కు పట్టుబడతారట. అమిత్ షా తో భేటీలో ఇదే విషయంపై కీలక చర్చ జరగనున్నదని వైసీపీ శిబిరం చెబుతోంది. మరి రఘురామకృష్ణరాజుపై సానుభూతి వర్కవుట్ అవుతుందా... సిట్టింగ్ ఎంపీని పోలీసులు ఇలా రూల్స్ తొక్కేసి మరీ ఇబ్బందిపెట్టడం హైలెట్ అవుతుందా... లేక జగన్ మంత్రాంగం ఫలిస్తుందో కొన్ని రోజుల్లోనే తెలిసిపోనున్నది.

థర్డ్ వేవ్ భయం వద్దు.. పిల్లల కోసం ఇవేగో జాగ్రత్తలు..

దేశంలో కల్లోలం స్పష్టించిన కొవిడ్ సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం దేశంలో రోజువారీ కేసులు లక్షకు లోపే నమోదవుతున్నాయి. సెకండ్ వేవ్ ఉధృతి తగ్గిందని ఊపీరి పీల్చుకుంటున్న జనాలకు ఇప్పుడు మరో వార్త కలవరపెడుతోంది. త్వరలోనే కొవిడ్ థర్డ్ వేవ్ రాబోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మొదటి వేవ్ కంటే రెండో వేవ్ తీవ్రత ఎక్కువగా కనిపించింది. సెకండ్ వేవ్ లో మరణాలు ఉహించని స్థాయిలో నమోదయ్యాయి. ఆక్సిజన్ కొరతతో రోగులు పిట్టల్లా రాలిపోయారు. అయితే రాబోయే థర్డ్ వేవ్.. సెకండ్ వేవ్ తో పోల్చితే మరింత ప్రమాదకరంగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మూడోదశలో పిల్లలకు ఎక్కువగా వైరస్ కు ప్రభావితం అవుతారని చెబుతున్నారు. ఇదే ఇప్పుడు ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. తాము కంటికి రెప్పలా కాపాడుకుంటున్న పిల్లలకు వైరస్ సోకితే ఎలా  అన్న ఆందోళన తల్లిదండ్రులకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలో పిల్లలకు కోవిడ్ చికిత్సకు సంబంధించి కేంద్రం కీలక మార్గదర్శకాలు జారీచేసింది. చిన్న పిల్లలు కరోనా బారిన పడితే ఎలాంటి చికిత్సలు అందించాలనే విషయమై ఆరోగ్య శాఖ పరిధిలోని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (DGHS)వీటిని రూపొందించింది. పిల్లలకు ఎలాంటి టెస్టులు చేయాలని, చికిత్సలో ఏం వాడాలి.. ఎలాంటి జాగ్రత్తలో తీసుకోవాలని అన్నది పొందుపరిచింది.  పిల్లల కోసం కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలు...  1. కరోణా లక్షణాలు స్పల్పంగా ఉన్న 18 ఏళ్లలోపు పిల్లల ఊపిరితిత్తుల్లో వైరల్ లోడ్ తెలుసునేందుకు హై రిజల్యూషన్‌ సి.టి.స్కాన్‌ను అంతగా వినియోగించాల్సిన పనిలేదు. అవసరం లేకున్నా HRCTCతీయకూడదు. హేతుబద్ధంగా ఉపయోగించాలి.  2.  స్వల్ప లక్షణాలు మాత్రమే ఉండి.. జ్వర, దగ్గు ఉంటే పారాసిటమాల్ మాత్రలు ఇవ్వాలి. కాస్త పెద్ద వయసున్న పిల్లలు గోరువచ్చని సెలైన్ ద్రావణాన్ని పుక్కిలించాలి.  3. కరోనా లక్షణాలు తక్కువగా ఉన్నప్పుడు.. యాంటీ మైక్రోబయల్స్‌ మందులు ఉపయోగించకూడదు. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు పిల్లలను ఆసుపత్రిలో చేర్పించాల్సిన పనిలేదు. ఒకవేళ చేర్పిస్తే వారికి ఇన్‌ఫెక్షన్‌ సోకే ప్రమాదం ఉంటుంది.  4. కరోనా చికిత్సలో అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను పిల్లలకు అస్సలు ఇవ్వకూడదు. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నవారు, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నవారికి మాత్రమే స్టెరాయిడ్స్‌ ఇవ్వాలి.  5. వ్యాధి తీవ్రత మధ్యస్థ స్థాయిలో ఉన్నప్పుడు తక్షణమే ఆక్సిజన్‌ థెరఫీ ప్రారంభించాలి. ఇన్‌హేలర్‌ వంటివి వినియోగించకూడదు. రక్తం గడ్డకట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.  6. పిల్లలు ప్రమాదకర పరిస్థితులు ఉన్నప్పుడు డీజీహెచ్ఎస్ సూచనల ప్రకారం.. ట్రీట్‌‌మెంట్ ఇవ్వాలి. బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ ఉంటే యాంటీ మైక్రోబయల్స్ వాడాల్సి ఉంటుంది. 

దేవాలయ భూములు దేవుడివే ...మద్రాస్ హైకోర్టు తీర్పు 

రాజుల సొమ్ము రాళ్ళ పాలు... ఇది ఒకప్పటి సామెత,  దేవుడి సొమ్ములు దయ్యాల పాలు, ఇది నేటి వాస్తవం. ఒక రాష్ట్రమని కాదు, ఒక ప్రభుత్వం అని కాదు, దేవుని ఆస్తులు, దేవుని భూములు  అన్యాక్రాంతం కానీ రాష్ట్రం దేశంలో లేనే లేదు. భక్తులు దేవునికి భక్తితో సమర్పించుకున్న భూములు, ఇతర ఆస్తులు, దైవ కార్యానికి ఉపయోగించాలే కాని, మరెందుకు ఉపయోగించరాదు. అయితే, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజోపయోగ కార్యక్రమాల పేరున, దేవుని భూములను వినియోగించుకోవడం మాత్రమే కాదు, ఏకంగా అమ్మేస్తున్నాయి. ఇది, ధర్మ విరుద్ధం. చట్ట విరుద్ధం.ఇదే విషయాన్ని, మద్రాస్ హై కోర్టు మరో మారు స్పష్టం చేసింది. దేవాలయాల భూములు ఎప్పటికీ దేవాలయాల భూములే, దేవాలయ భూములుగానే ఉంటాయి. ప్రజోపయోగం పేరున దేవాలయాల భూములు  తీసుకోవడం, కుదరదు, అది చట్ట రీత్యా నేరం  అని మద్రాస్ హై కోర్టు, బుధవారం స్పష్టమైన తీర్పును ఇచ్చింది.  ఈ తీర్పుకే కాదు ఈ కేసుకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే, ఒక  పత్రికలో ప్రచురించిన లేఖ ఆధారంగా న్యాయస్థానం సుమోటోగ కేసును విచారణకు స్వీకరింఛి. సంచలన తీర్పును ఇచ్చింది . వివరాల్లోకి  వెళితే...2015లో జనవరి 8వ తేదీన, ‘ది హిందూ’ దినపత్రికలో, ‘ది సైలెంట్ బరియల్’ మకుటంతో వచ్చిన లేఖ ఆధారంగా  మద్రాస్ హై కోర్టు అప్పటి ప్రధాన న్యాయయముర్తి( ప్రస్తుత సుప్రీం కోర్టు న్యాయమూర్తి) జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ సుమోటోగా విచారణ చేపట్టారు. ఆతర్వాత మరొకొందరు ప్రజా ప్రయోజ వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ క్రమంలో తీగ లాగితే డొంకంత కదిలింది అన్నట్లు నోరులేని దేవుని భూములను భోచేసిన భూబకాసురులు, రాజకీయ భోక్తల భాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తం వ్యవాహారం పై ఇంచుమించిగా ఏడు సంవత్సరాలు విచారణ జరిపిన న్యాయస్థానం, బుధవారం తీర్పునిచ్చింది.   తమిళనాడులో ఉన్నన్ని  పురాతన దేవాలయాలు, బహుశా దేశంలో మరే రాష్ట్రంలో ఉండవు, కావచ్చును.  అలాగే, తమిళనాట గల దేవాలయాల ఆస్తులు కూడా చాలా చాలా ఎక్కువ రాజులు, సంస్థానాదీశులు వందలు కాదు, వేల ఎకరాల్లో భూములను దేవాలయాలకు సమర్పించుకున్నారు. అప్పటికి ఎన్ని వేల ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయో ఏమో కానీ, 1984-85 నాటికి ప్రభుత్వ  రికార్డుల ప్రకారమే రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాలకు కలిపి  5.25 లక్షల ఎకరాల భూములున్నాయి. గడచిన పాతిక ముప్పై ఏళ్లలో, అవి కుదించుకు పోయాయి. 2019-20 సంవత్సరానికి 4.78 లక్షల ఎకరాలకు తరగి పోయాయి. ఇలా ఎలా జరిగిందని, మద్రాస్  హై కోర్టు తమిళ నాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆరాష్ట్ర దేవాదాయ శాఖను వివరణ కోరింది. ఈ సందర్భంగా  నాయస్థానం  “రాష్ట్ర ప్రభుత్వం కానీ, హిందూ మత ధర్మదాయ దేవాదాయ (హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్) శాఖ కానీ, దాతల అభిమతానికి విరుద్ధంగా దేవాలయాల భూములను  విక్రయించరాదు. అన్యులకు ఇవ్వరాదు” అని స్పష్టం  చేసింది. అలాగే, పురాతన దేవాలయాలు, పురాతన కట్టడాలాను పరిరక్షించవలసిన అవసరాన్ని నొక్కి చెపుతూ, జస్టిస్ ఆర్. మహదేవన్,జస్టిస్ పీడీ  ఆదికేశవులు ధర్మాసనం, 224 తీర్పులో, 75మార్గదర్శకాలను నిర్దేశించింది.  అంతే కాదు పురాతన దేవాలయాలు ప్రకృతి వైపరీత్యాల వలన ద్వంసం కావడం లేదని,   పురాతన దేవాలయాల పాలిట సంరక్షకులే బక్షకులుగా మారి మింగేస్తున్నారు అనే అర్థం వచ్చే విధంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎంతో విలువైన మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశ్వాసం లేని సంరక్షకుల వల్లనే, పురాతన దేవాలయాలు విద్వంసానికి గురుతున్నాయని, సర్కార్ స్వాములకు గట్టిగా వాతలు పెట్టింది. రాష్ట్రంలో యునెస్కో వారసత్వ సంపదగా, వారసత్వ ప్రదేశాలుగా గుర్తించిన రెండు వేల సంవత్సరాల పైబడిన చరిత్ర గల పురాతన దేవాలయాలు కూడా  శిధిలావస్థకు చేరుకుంటున్నాయని, రాష్ట్రంలోని ఆలాయాల నుంచి వస్తున్న ఆదాయం ఎమౌతోందని, ప్రభుత్వ యంత్రాగాన్ని, ఎండోమెంట్స్ అధికారాలను ధర్మాసనం ప్రశ్నించింది.ధర్మాగ్రహం వ్యక్త పరిచింది, అన్యాక్రాంతమైన దేవాలయ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు, అలాగే, కౌలు బకాయిల వసూలుకు తక్షణ చర్యలు తీసుకోవాలని, ఆరు వారాల్లో అన్ని వివరాలను కోర్టు ముందు ఉంచాలని  న్యాయస్థానమ ఆదేశించింది. అలాగే  న్యాయస్థానం దేవాలయ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను ఎనిమిది వారల గడువు ఇచ్చి కూల్చి వేయలని, దేవాలయాల భూముల వివాదాల పరిష్కారానికి ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని, ఆదేశించింది.   ఇలా దేవాలయ భూముల పరిరక్షణకు తీసుకోవల్సిన చర్యలను ఆదేశాల రూపంలో జారీ చేసింది. అయితే, ఈ ఆదేశాలు ఎంత వరకు అమలవుతాయి, అనేది ఆదేవునికే ఎరుక.  ఇది ఒక్క తమిళనాడు రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన సమస్య,కాదు, పొరుగున ఉన్న ఆంధ్ర ప్రదేశ్’లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్యమత విశ్వాసాలకు ప్రాధాన్యత పెరగడంతో పాటుగా హిందూ దేవాలయాల విధ్వసం మహాజోరుగా సాగుతోంది. అనేక ప్రధాన దేవాలయాలలో విగ్రహాల విధ్వసం, దేవుని రధాల దహనం  వంటి దుష్క్రుత్యాలు అనేకం జరిగాయి. అలాగే, దేశం మొత్తంలో తిరుమల వెంకటేశ్వరునికి భక్తులు ఇచ్చిన వేల ఎకరాల భూములను, ఇతర స్థిరాస్తులను, టీటీడీ చైర్మన్ బాబాయిని   అడ్డుపెట్టుకుని విక్రయించేందుకు పెద్ద స్కెచ్చే గీసింది. అయితే, అప్పట్లో తెలుగు దేశం, ఇతర ప్రతిపక్ష పార్టీలు, వివిధ హిందూ, ధర్మ, ధార్మిక,సమస్థలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో జగన్ రెడ్డి  ప్రభుత్వం తాత్కాలికంగా విక్రయ ప్రణాళికను వాయిదా వేసింది. హిందూ సమాజం ఏమాత్రం ఏమర పాటు ప్రదర్శించినా  ... తమిళనాడును తలదన్నే రీతిలో ఎపీలోనూ దేవాలయాల భూములు మాయమై పోతాయని  ... హిందూ ధార్మిక సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

పక్క ప్లాన్.. 27 కిలోల బంగారు చోరీ..  

ఓ పక్క కరోనా, మరోవైపు బ్లాక్ ఫంగస్, ఇంకో వైపు ఎండ  ప్రజలతో చెడుగుడు ఆడుతున్నాయి. సూర్యుడు ప్రచండ వేడితో ప్రజలపై తన ప్రతాపం చూపిస్తున్నాడు. మధ్యాహ్నం సంగతి దేవుడికి తెలుసు.. ఆ విషయం పక్కన పెడితే రాత్రి అయిన కొంచం చల్లగాలి రావడం లేదు. పల్లెటూరు అయితే కొంచమైనా చల్లగాలి వస్తుంది. చెట్లు ఉంటాయి కాబట్టి. అదే పట్నం లో అంయితే రాత్రి పగలు తేడాలేకుండా సెగలు కక్కుతోంది. ఫ్యాన్ లు, పంకలు ఏది తిరిగిన వేడి గాలే వస్తోంది. దీంతో కొన్ని చోట్ల భరించలేని ఉక్కపోతతో జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆ వేడి గాలులను.. ఉక్క పోతను భరించలేక. కాసేపు హ్యాపీగా నిద్ర పోదామని ఆరుబయటకు వచ్చి పడుకుంటే ఊహించని ఘటన జరిగింది. గాలికోసం ఇంటి ఆవరణలో పడుకుంటే.. ఇల్లు లూటీ అయింది. అలా నిద్ర పట్టిందో లేదో.. ఇలా ఇంట్లో బంగారాన్ని దోచుకెళ్లారు దుండగులు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒకేరోజు.. రెండు ఇళ్లలో దొంగలు పడి.. విలువైన బంగారం దోచుకెళ్లారు. ఇంటికి తాళం వేయలేదు.. బీరువాకు తాళం వేయలేదు. కరోనా, కర్ఫ్యూ, ఈ సమయంలో దొంగలేం చేస్తారని ఆదమరిచారు. ఇల్లు గుల్ల చేసుకున్నారు. అది విశాఖ. తాజాగా అర్ధరాత్రి జరిగిన దొంగతనాల తీరు పోలీసులు చెప్పిన పూర్తి వివరాల ప్రకారం ఇలా ఉంది. అక్కయ్యపాలెంలోని నగరం నడిబొడ్డున జగన్నాధపురం కాలనీలో ఇంట్లో చోరీ జరిగింది. అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ సంఘటనలో 27 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఇంటి తలుపులు బార్లా తెరుచుకుని బీరువా తాళాలు కూడా అందుబాటులో ఉండే విధంగా ఉంచడంతో దొంగల పని చాలా సులువైంది. దర్జాగా ఇంటి ముందరి గేట్ నుంచే ఇంట్లోకి ప్రవేశించారు. అక్కడే బీరువాతాళాలు ఉండటంతో బీరువా తెరిచారు. 27 కిలోల బంగారు ఆభరణాలు, మూడు లక్షల నగదును ఎత్తుకుపోయారు. ఇదంతా లోకల్ గ్యాంగ్ పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుడు ఆయిల్ వ్యాపారం చేసుకునే కంచిపాటీ శ్రీనివాసరావు. కర్ఫ్యూ సమయంలో అందరూ ఇళ్లలోనే ఉంటున్నా.. ఈ తరహా ఘటన జరగడం విస్మయానికి గురిచేసింది. నిత్యం రాత్రి వేళల్లో తలుపులు బార్లా తెరుచుకుని పడుకున్న వారినే ఈ గ్యాంగ్ టార్గెట్ చేస్తోందని పోలీసులు అనుమానిస్తున్నారు. రెక్కీ చేసి మరి అర్ధరాత్రి ఈ చోరీకి పాల్పడినట్లు ప్రాధమికంగా నిర్థారణకు వచ్చారు పోలీసులు. వేలిముద్రల నిపుణులు దొంగలకు చెందిన ఆధారాల సేకరణ చేపట్టారు. విశాఖ ఈస్ట్ జోన్ క్రైమ్ సిఐ సింహాద్రి నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహారాణి పేటలో కూడా ఈ తరహా చోరీయే జరిగింది. రాత్రి ఇంటి తలుపులు వేయకుండా బయట పడుకున్నారు. దీంతో దొంగలు ఈ ఇంట్లో 16 తులాలు బంగారు ఆభరణాలు దోచుకొన్నారు. బీరువా తాళాలు కూడా అందుబాటులో ఉండటం గమనార్హం. ఈ రెండిళ్లలో ఒకే తరహాలో చోరీ చేసింది ఒకే గ్యాంగ్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పక్కాగా రెక్కి నిర్వహించి.. ఇళ్లలో పరిస్థితి బాగా గమనించే ఇవి చేసినట్టు అనుమానిస్తున్నారు. గ్యాంగ్ రెండు గ్రూపులుగా విడిపోయి చోరీకి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. మహారాణి పేట సిఐ సోమ శేఖర్ దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి పనిలో ఒకడు ఉంటే.. పెళ్ళాం పని మీద ఒకడు ఉన్నటు.. ఈ ఎండాకాలం, అందులోను కరోనా అందరూ ఇంట్లో  ఉన్నపుడే ఇలా చేశాడంటే ఆ దొంగ ఎంత చెలాకీ నో తెలుస్తుంది.. అందరూ జెర్ర భద్రం హలో అనే లోపు దొంగలు బులో అంటున్నారు.. 

మహా నేత.. తరగని చరిత్ర! రైతు బాంధవుడు ఎన్జీ రంగా.. 

పంచ కట్టిన ప్రతివాడు మహా నేతలు గా రైతు నాయకులు గా చెలామణి అయ్యి పోతున్న ఈ కాలం లో ఈ తరం వారు మర్చిపోతున్న  నిజమైన రైతు బాంధవుడు, రైతు నాయకుడు ఆచార్య NG రంగా. చెప్పుకుంటే తరగని చరిత్ర ఆయనది. స్వాతంత్ర ఉద్యమంలో, రైతు పోరాటంలో ఆయన కృషి మరువలేనిది. ఆచార్య ఎన్.జి.రంగాగా ప్రసిద్ధుడైన గోగినేని రంగనాయకులు భారత స్వాతంత్ర సమరయోధుడు, పార్లమెంటు సభ్యుడు, రైతు నాయకుడు. రైతాంగ విధానాలకు మద్దతునిచ్చిన ఈయనను భారత రైతాంగ ఉద్యమపితగా భావిస్తారు.  ఎన్జీ రంగా  1900, నవంబరు 7 న గుంటూరు జిల్లా నిడుబ్రోలులో గోగినేని నాగయ్య, అచ్చమాంబ దంపతులకు జన్మించాడు. నిడుబ్రోలులో ప్రాథమిక విద్యను ముగించుకొని, గుంటూరు ఆంధ్రా క్రిష్టియన్ కళాశాల నుండి పట్టభద్రుడైనాడు. 1926 లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఆర్ధిశాస్త్రములో బి.లిట్ పొంది భారతదేశానికి తిరిగివచ్చిన తర్వాత మద్రాసు లోని పచ్చయప్ప కళాశాలలో ఆర్థిక శాస్త్ర ఆచార్యునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. ఇతడు హేతువాది . 1920లో భారతీదేవితో రంగా వివాహం జరిగింది. నిడుబ్రోలులో రామనీడు పేరుతో రాజకీయ పాఠశాలను ఏర్పాటు చేసారు.1933లో రంగా స్ధాపించిన రాజకీయ విద్యాలయాన్ని మహాత్మాగాంధీ ప్రారంభించారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు , కొణిజేటి రోశయ్య  రంగా శిష్యులే . ఈ పాఠశాల స్మృతులకు సజీవ సాక్ష్యంగా నేటికి నిడుబ్రోలులో కొనసాగుతుంది. 1930 లో మహాత్మా గాంధీ పిలుపునకు స్పందించి, రంగా భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. 1933 లో రైతు కూలీ ఉద్యమానికి నేతృత్వము వహించాడు. మూడు సంవత్సరాల తర్వాత కిసాన్ కాంగ్రెసు పార్టీని స్థాపించాడు. రైతుకూలీల పరిస్థితిపై గాంధీతో చారిత్రాత్మక చర్చలు జరిపాడు. ఈ చర్చలలోని ముఖ్యాంశాలపై బాపు దీవెనలు అన్న పేరుతో రంగా ఒక పుస్తకాన్ని వెలువరించాడు.  రంగా, అంతర్జాతీయ వ్యవసాయ ఉత్పత్తిదారుల సమాఖ్య యొక్క వ్యవస్థాపకులలో ఒకడు. 1946 లో కోపెన్‌హేగెన్‌లో జరిగిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజెషన్ సదస్సులో, 1948 లో శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన అంతర్జాతీయ శ్రామిక సంస్థ సదస్సులోనూ, 1952 లో ఒట్టావాలో జరిగిన అంతర్జాతీయ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులోను, 1954 లో న్యూయార్కులో జరిగిన ఇంటర్నేషనల్ పెజెంట్ యూనియన్ లోనూ, 1955 లో టోక్యోలో జరిగిన ఆసియన్ కాంగ్రెస్ ఫర్ వరల్డ్ గవర్నమెంటులోను భారతదేశం తరఫున ప్రతినిధిగా పాల్గొన్నాడు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లో ఎకనామిక్స్ ఆఫ్ హండ్లూమ్స్ లో బి. లిట్ పట్టా తీసుకోవడానికి ముందే 1923 లో అప్పికట్ల లో రైతు మహా సభ, నిడుబ్రోలు లో రైతు కూలి మహా సభ నిర్వహించడంతో మొదలు అయ్యిన గోగినేని రంగనాయకులు ప్రస్థానం తర్వాత మరణించే వరకూ సుమారు 70 యేళ్లు రైతులకు రైతు సమస్యల పోరాటానికి అంకితం అయ్యింది. ఆక్స్ఫర్డ్ నుంచి 1926 లో వెనక్కి వచ్చాక మద్రాస్ రాష్ట్రం లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు గా పదవీ కి రాజీనామా చేసి ఖద్దరు, గాంధీ టోపీ ధరించి ఒక పక్క జాతీయ స్థాయి లో కాంగ్రెస్ తరపున స్వాతంత్ర్య పోరాటం లో పాల్గొంటునే, రైతు ఆందోళన ల లో పాలు పంచుకునే వారు.   పెద వడ్లమూడి, రేటూరు, అప్పాపురం ప్రాజెక్ట్ ల నిర్మాణానికి ఆయన చేసిన కృషి వల్ల 65 వేల ఏకరాలు సాగు లోకి వచ్చి ఆ రోజుల్లో నే రైతులకు 4 కోట్ల లాభంగా అంచనా వేయబడింది. అదే కాలం లో కాలిఫోర్నియా లో M.Sc చేసి వచ్చిన మాగంటి బాపినీడు గారి తో కలిసి 1929 లో ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘం స్థాపించారు. అదే ఏడాది మద్రాస్ రాష్ట్ర అటవీ పంచాయితీ సెక్రెటరీ గా అటవీ ప్రాంతం లో వున్న 1100 పంచాయితీలు కి గుర్తింపు రైతుల కి గుర్తింపు ఇప్పించారు. అదే సమయంలో ఒంగోలు కరువు బాధ నివారణ సంఘం స్థాపించి కరువు బాధితులకు సహాయ సహకారాలు, కనీస అవసరాల కల్పనకు కృషి చేశారు.  బౌద్ధ వాజ్మేయ బ్రహ్మ గా పేరు పొందిన దుగ్గిరాల బల రామ కృష్ణయ్య సహాయం తో కృష్ణా జిల్లా లో నే 300 గ్రామాల్లో రైతు సంఘాలు ఏర్పాటు చేశారు. 90 ఏళ్ల క్రితమే అన్న దాత ప్రాముఖ్యత పైన జై కిసాన్ నినాదానికి పూర్వమే " రైతు భజనావలి" అనే పాటల పుస్తకం వేసి పంచారు.  రంగా రాజకీయ జీవితము రంగా 1952 లో కాంగ్రెసు పార్టీ నుండి నిష్క్రమించి భారత కృషీకార్ లోక్ పార్టీ, ఆ తరువాత 1959 లో చక్రవర్తి రాజగోపాలాచారి కలిసి స్వతంత్ర పార్టీని స్థాపించాడు. రంగా స్వతంత్ర పార్టీ యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడై ఆ పదవిని ఒక దశాబ్దంపాటు నిర్వహించాడు. 1962 సార్వత్రిక ఎన్నికలలో పార్టీ 25 స్థానాలలో గెలిచి, బలమైన ప్రతిపక్షముగా రూపుదిద్దుకొన్నది. రైతులకు నష్టం కలిగించే రష్యా ముద్రగల సహకార వ్యవసాయాన్ని, దానిని ప్రవేశపెట్టిన నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ విధానాలను వ్యతిరేకించారు.1972లో రంగా తిరిగి కాంగ్రెసు (ఐ) లో చేరాడు.రెండవ లోక్ సభకు 1957లో తెనాలి నుంచి కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచారు. 1962లో చిత్తూరు ఎంపీగా స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా గెలిచారు. 1967లో  శ్రీకాకుళంలోక్ సభకు ఎన్నికయ్యారు. 1980, 1984, 1989లో గుంటూరు ఎంపీ కాంగ్రెస్ ఐ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. 1957-62 నుంచి 1989-1991 వరకు కొద్ది కాలం తప్పితే, నిరాఘాటంగా, పార్లమెంట్ లో రాజకీయప్రతినిధిగా సుధీర్గకాలము నిస్వార్దంగా సేవలనందించిన రంగా సుదీర్ఘ కాలం పార్లమెంట్‌ సభ్యునిగా రికార్డు సృష్టించి గిన్నీస్‌ బుక్‌లోకి ఎక్కారు. దేశ రాజకీయాల్లో  NG రంగ తనదైన ముద్ర వేశారు. సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ (ఇప్పటికీ బెంగాల్ లో వుందీ పార్టీ) కి పేరు పెట్టింది రంగానే. త్రిపుర కాంగ్రెస్ సభల్లో నెహ్రూ - గాంధీల ద్వయం నేతాజీని ఒంటరి చేసినప్పుడు.. నేతాజీకి బహిరంగం అండ నిలిచి అన్నీ తానై త్రిపుర కాంగ్రెస్ మహా సభలను నడిపించింది NGనే. 1940 లో రాంగఢ్ లో కాంగ్రెస్ కి, బ్రిటిష్ కి వ్యతిరేకం గా ఏర్పాటు చేసిన anti కాంప్రమైజ్ కాంగ్రెస్ ఏర్పాటు లో స్వామి సహజనంద, బోసు, రంగాలు కీలక పాత్ర పోషించారు. దానికి ముందే స్వామి సహజానందతో కలిసి లక్నో లో అఖిల భారత కిసాన్ మహా సభ ఏర్పాటు చేశారు NG రంగా.  1926లో అఖిల భారత వయోజన విద్యా కేంద్రం స్థాపించి 4 యేళ్లు తానే వైస్ చైర్మన్ గా నడిపి విద్యకి తాను ఇచ్చే ప్రాముఖ్యత ని తెలియ చేసారు. తన భార్య భారతి దేవికి ఉన్నత చదువులకు అవకాశం ఇచ్చి మహిళా విద్య ఎంత అవసరమో సుమారు 100  ఏళ్ల క్రితమే చేతల్లో తెలియ చెప్పారు రంగ.  రైతు , రైతు కూలీలకు , కళాకారులకు  ప్రత్యేక పాఠశాలలు పెట్టి గాంధీ తో వాటిని ప్రారంభించారు. కమ్యూనిస్ట్ లు, సోషలిస్ట్ లు, కాంగ్రెస్ నాయకులు అందరూ క్లాస్ లు చెప్పే వారు.  రంగాకి అత్యంత ఆప్త మిత్రులు ఎంతో మంది వున్నా చెప్పుకోవాల్సింది ప్రకాశం పంతులుతో వున్న మిత్రత్వం, గౌతు లచ్చన్న తో అను బంధం. ఒకటే ఆత్మ గా మెలిగారు గౌతు లచ్చన్న, NG రంగా. రాజ్యాంగ సభలో 1946 నుంచి వున్న NG రంగ నే బాబా సాహెబ్ అంబేద్కర్ ని రాజ్యాంగ సభ కు చైర్మన్ గా ప్రపోజ్ చేసిన విషయం.. మన రాష్ట్రం లో నే మామూలు వాళ్ళకే కాక దళిత ఉద్యమాలలో వున్న వారికి కూడా తెలియక పోవడం శోచనీయం. అలాగే 80 ల్ల క్రితమే ఉన్నవ లక్ష్మి నారాయణ "మాలపల్లి " తో పాటే NG రంగ కూడా "హరిజన నాయకుడు" అనే నవల రాశారు అన్న విషయం కూడా చరిత్రలో లేదు.  రైతాంగానికి వీరు చేసిన  విశిష్టసేవలకు తార్కాణంగా, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ను 'ఆచార్య యన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం'గా 1997 లో నామకరణ చేసారు.1991 లో భారత ప్రభుత్వం వీరికి  పద్మ విభూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించింది.ఆచార్య యన్.జి.రంగా గారి చిరస్మరణీయ సేవలకు గుర్తింపుగా భారతీయ తపాలాశాఖ వారు 2001 లోఒక ప్రత్యేక స్మారక తపాళాబిళ్ళను విడుదల చేశారు. రంగా రచనలు.. రైతు కూలీలకోసం ప్రత్యేకంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టిన మహామనీషి. రైతుకూలీలరాజ్యం స్థాపనకోసం మహాత్మునితో సుదీర్ఘచర్చలను జరపడమే కాక, సంభాషణలసారాన్ని, 'బాపూ ఆశీస్సులూ ' అని గ్రంధస్థం చేసిన వ్యక్తి.

ఢిల్లీకి ఏపీ సీఎం జగన్.. కేంద్రంతో కాళ్లబేరానికేనా? 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. హస్తిన పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు జగన్.  రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో భేటీ కానున్నారు. కేంద్ర జల్‌శక్తి మంత్రి షెకావత్‌, మరికొంత మంది కేంద్ర మంత్రులను జగన్‌ కలిసే అవకాశం ఉంది. తిరిగి 11వ తేదీ మధ్యాహ్నం రాష్ట్రానికి చేరుకోనున్నారు. నిజానికి సోమవారమే ఢిల్లీకి వెళ్లాల్సింది జగన్.  కానీ... కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో వాయిదా పడింది. దీంతో అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ లభించేలా వైసీపీ ఎంపీలు నేరుగా ఢిల్లీకి వెళ్లి ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది. పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఒక ఎంపీతోపాటు... మరికొందరు సోమవారం ఢిల్లీకి వెళ్లి లాబీయింగ్ చేశారని అంటున్నారు. కొవిడ్ వ్యాక్సిన్, పోల‌వ‌రం ప్రాజెక్టు బ‌కాయిల విడుద‌ల‌, కరోనా దృష్ట్యా రాష్ట్రానికి  కేంద్రం ఆర్థిక సాయం చేయాల‌ని మంత్రులను జగన్ కోరనున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.   జగన్‌ ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారీ ప్రధానితో భేటీ కాకపోయినా.. హోం మంత్రి అమిత్‌షాను తప్పకుండా కలుస్తున్నారు. ఆయన అపాయింట్‌మెంట్‌ దొరకకపోతే.. ఇతర మంత్రులను కలవకుండా తిరిగి వచ్చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు, కడప స్టీల్‌ ప్లాంటు, దుగరాజపట్నం పోర్టు, వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ తదితర అంశాలపై మంత్రులకు వినతిపత్రాలు సమర్పించారంటూ సీఎం కార్యాలయం వాట్సప్‌ సందేశాలను పంపిస్తోంది. కానీ సీఎం జగన్ మాత్రం వాటిపై మాట్లాడిన సందర్భం లేదు.  జగన్  బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ రాజు వేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఆయన ఢిల్లీ టూర్ పెట్టుకోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. జగన్ ఢిల్లీ పర్యటనపై రాజకీయ వర్గాల్లో మాత్రం మరో చర్చ జరుగుతోంది. సీబీఐ, సీఐడీ కేసుల ఇబ్బందుల నుంచి బ‌య‌ట‌ప‌డ‌ట‌మే జ‌గ‌న్ పర్యటన  ప‌ర‌మార్థం అని ప్ర‌చారం జ‌రుగుతోంది. రఘురాం విష‌యంలో జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు తీరుపై కేంద్రం చాలా సీరియ‌స్‌గా ఉంద‌ని తెలుస్తోంది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, ఎంపీ రఘురామ రాజు అరెస్ట్.. దాని తర్వాత జరిగిన పరిణామాలపై కేంద్రం కోపంగా ఉందని తెలుస్తోంది. ర‌ఘురామ ఘ‌ట‌నలో అస‌లేం జ‌రిగిందనే విష‌యంపై ఇప్ప‌టికే కేంద్ర‌హోంశాఖ వివ‌రాలు సేక‌రించిందని స‌మాచారం. ర‌ఘురామ  క‌స్ట‌డీలో టార్చ‌ర్ ఎపిసోడ్‌ను ఢిల్లీ స్థాయిలో న్యాయ‌, శాస‌న‌, రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల దృష్టికి తీసుకెళ్ల‌డం.. ఇలా సీబీఐ, సీఐడీ కేసుల‌తో జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌మాదంలో ఉన్నార‌ని అంటున్నారు. కరోనా వ్యాక్సినేషన్ అంశంలో పలువురు సీఎంలకు జగన్ లేఖ రాశారు. దీనిపైనా కేంద్రం గుర్రుగా ఉందంటున్నారు.  జగన్‌ బెయిలు రద్దు పిటిషన్‌లో సీబీఐ తన వైఖరి స్పష్టం చేయకుండా విషయాన్ని కోర్టుకే వదిలేయ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం.ఈ ఘటనతో జగన్ ను కేంద్ర సర్కార్ టార్గెట్ చేస్తుందనే చర్చ కూడా మొదలైంది. ఏపీపై స్పెషల్ ఫోకస్ చేసిన బీజేపీ హైకమాండ్.. తమిళనాడు తరహా రాజకీయానికి ప్లాన్ చేసిందంటున్నారు. జగన్ బెయిల్ రద్దై జైలుకు వెళితే.. ఏపీలో చక్రం తిప్పేలా అమిత్ షా టీమ్ పక్కాగా స్కెచ్ వేసిందంటున్నారు. జగన్ పై కేంద్రం తాజా వైఖరి చూస్తూంటే... ఆయనపై ఆట మొదలు పెట్టిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వస్తోంది.  

సొమ్ము ఒకడిది.. సోకు ఇంకొకడిది.. ఆనందయ్య మందు బ్లాక్ మార్కెట్ లోకి.. 

పసి పిల్లలు తాగే పాలు కల్తీ.. వంట నూనెలు కల్తీ.. వ్యవసాయ ఎరువులు కల్తీ.. తినే తిండి కల్తీ చేస్తున్నారు..  ఇందు గలదు అందు లేదని సందేహం కలదు ఎందెందు చూసిన అందందే గలదు కల్తీ అనవచ్చు . చివరికి డబ్బు మత్తులో పడి మనుషులు కూడా  కల్తీ అవుతున్నారు.. తాజాగా కరోనా కొంత ఉపశమనం ఇస్తుంది అని నమ్మిన ఆనందయ్య మందును కూడా కల్తీ చేశారు.. వివరాల్లోకి వెళ్తే..  ఆయుర్వేద మందుల తయారీకి ఆనందయ్య వినియోగించే వస్తువులు, ఆ మూలికల వివరాలు అందరికి తెలియడంతో వాటి ఆధారంగా ఎవరికి వారు మందులు తయారు చేసి పంచిపెడుతున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ కొందరు మాఫియా ఇక్కడ కూడా బిజినెస్ చేస్తున్నారు.. కరోనా మందు తయారు చేసి అమ్ముకొంటూ సొమ్ము చేసుకుంటున్నారు..కొందరు ఈ మందును ఉచితంగా పంపిణీ చేస్తుండా.. మరికొందరు వేల రూపాయలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. కృష్ణపట్నంలో మందు పంపిణీ చేస్తే వేలాదిగా తరలివచ్చే ప్రజలను కట్టడి చేయడం కష్టమవుతుందన్న ఉద్దేశంతో ఆనందయ్య మందును తామే అన్ని జిల్లాలో పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తామని అధికార యంత్రాంగం ప్రకటించినా అలాంటి ప్రయత్నాలు జరగడం లేదు.ఆనందయ్య ఎన్నో అడ్డంకులు ఎదురుకుని, చివరికి అరెస్ట్ అయి.. హైకోర్టు జోక్యం తో మళ్ళీ  మందు పంపిణీని ముందుకు తీసుకెళ్తుంటే.. ఒక వైపు ఆ పంపిణీకి అడ్డంకులు  ఎదురవుతుండగా.. మరోవైపు కొంత మంది చిల్లర గాళ్ళు.. కేటుగాళ్లు ఆనందయ్య ముందు ఫార్ములాని  సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు.  దీనితో ఆనందయ్య ముఖ్యమంత్రికి, గవర్నర్‌కు స్వయంగా లేఖలు రాసినా ఎలాంటి స్పందన రాలేదు. ఇక ఆనందయ్య గత ఐదు రోజులుగా తయారు చేసిన మందులను సర్వేపల్లి నియోజకవర్గంలో ఇంటింటా పంచారు. అయితే ఈ వ్యవహారంలోకి తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన  అధికార పార్టీ మరో ఎమ్మెల్యే రంగంలోకి దిగినట్లు చెపుతున్నారు. ఆయన నియోజకవర్గమంతా సరిపడా మందు తయారుచేసే వరకు ఆనందయ్యకు విశ్రాంతి దొరికే అవకాశం కనిపించడం లేదు. మందు తయారీకి హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులిచ్చి వారం రోజులు దాటుతున్నా.. నిజంగా మందు అవసరం ఉన్న యాక్టివ్‌ కేసులకు ఆ మందు అందడంలేదని స్పష్టమవుతోంది. దీని ఆసరాగా చేసుకుని అలాగే ఆనందయ్య పేరును అడ్డం పెట్టుకుని పలువురు మోసగాళ్లు బ్లాక్ మార్కెట్లోకి ప్రవేశించారు. మందుల తయారీకి ఏయే పదార్థాలు, మూలికలు వాడతారో, ఆనందయ్య మాట్లాడిన మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియడంతో కొంతమంది ‘ఆనందయ్య మందు’ తయారు చేయడం మొదలు పెట్టారు. అధికార పార్టీ నాయకులు ఆనందయ్య ద్వారా రహస్యంగా మందులు తయారు చేయించుకున్న సందర్భంగా క్యాటరింగ్‌ సిబ్బందిని సహాయకులుగా వినియోగించారు. మందు తయారీని ప్రత్యక్షంగా చూసిన వీరిలో కొందరు ఇప్పుడు దాన్ని వ్యాపారంగా మార్చుకున్నారు. సొంతంగా మందు తయారు చేసి, డబ్బాల్లో ప్యాక్‌ చేసి కావాల్సిన వారికి ఇస్తున్నారు. కొంతమంది ఉచితంగా పంచి పెడుతుండగా, మరి కొంతమంది రూ.వెయ్యి, రెండు వేలకు అమ్ముకొంటున్నారు. నెల్లూరు నగరంలోనే ఇలాంటి వారు పదుల సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. అయిన ఇప్పుడు సమాజం లో నడిచే విధానం అదే.. న్యాయాన్ని చెంపేసి అన్యాయాన్ని ఉరేగిస్తున్నారూ.. తెలు మంత్రం రానోడు.. పాము నోట్లో వేలు పెట్టడం అంటే ఇదేనేమో.. ఆయుర్వేదంలో కాసింత పరిజ్ఞానం ఉన్న పలువురు మండలాలను కేంద్రాలుగా చేసుకొని ఆనందయ్య మందు అంటూ సొంత మందును విక్రయించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ మందు తయారీలో వాడే పదార్థాలేవీ హానికరం కావు కాబట్టి, ఎలా చేసినా వాటిని తిన్నవారికి ఏమీ కాదన్న ధైర్యంతో కొంతమంది దొరికిన ఆకులు అలుములు వేసి లేహ్యాలు తయారు చేసి, అందులో కాసింత తేనె కలిపి చిన్న చిన్న ప్లాస్టిక్‌ డబ్బాల్లో వేసి జనాలకు ఇస్తున్నారు. ఇది నిజంగా ఆనందయ్య తయారు చేసిన మందుగానే భావించి చాలామంది మోసపోతున్నారు

ప్రధాని మోడీ గడ్డం గీసుకోండి! వంద రూపాయలు పంపిన చాయ్ వాలా

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నేతల్లో ఒకరు. సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నది మోడీకే. ట్విట్టర్ లో అమెరికా అధ్యక్షుడి కంటే మోడీనే పవర్ పుల్. దేశంలోని నరేంద్ర మోడీ.. నమో అంటే ఓ వైబ్రేషన్. కాని ఇప్పుడు సీన్ మారింది. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ దేశంలో స్పష్టించిన కల్లోలం తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్ భారీగా తగ్గిపోయింది. కరోనా కట్టడిలో విఫలమయ్యారంటూ అంతర్జాతీయంగానూ మోడీపై విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది.  దేశంలో గతంలో ఎప్పుడు లేనంతగా ప్రధాని మోడీపై జనాల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. ఆయనపై జనాల్లో ఎంత కోపంగా చెప్పే ఘటన మహారాష్ట్రలో జరిగింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ గడ్డం గీసుకోవాలంటూ వంద రూపాయలు పంపాడు ఓ టీస్టాల్ యజమాని. ప్రధాని గడ్డం పెంచుతూ పోతున్నారని, ఇకపై ఆయన ఏదైనా పెంచాలనుకుంటే అది దేశ ప్రజలకు ఉపయోగపడేది అయి ఉండాలంటూ  తన నిరసనను వ్యక్తం చేస్తూ ప్రధానికి లేఖ రాశాడు అనిల్ మోరే. కరోనా కారణంగా గతేడాది నుంచి అసంఘటిత రంగ కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా తన లేఖలో ప్రస్తావించారు.  బారామతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి ఎదురుగా టీస్టాల్ నిర్వహిస్తున్నాడు అనిల్ మోరే. ప్రధాని మోదీ గడ్డం పెంచడం మాని, ప్రజలకు వీలైనంత త్వరగా టీకాలు, వైద్య  సదుపాయాలు అందించేందుకు ప్రయత్నించాలని కోరాడు. లాక్‌డౌన్‌ల వల్ల ఎదుర్కొంటున్న కష్టాల నుంచి ప్రజలను బయటపడేయడంపై ప్రధాని దృష్టి సారించాలని ఆ లేఖలో సూచించారు. ప్రధాని మోడీ అంటే తనకు ఎంతో గౌరవమని పేర్కొన్న మోరే.. తాను దాచుకున్న డబ్బుల నుంచి వంద రూపాయలు పంపిస్తున్నానని, ఆ డబ్బులతో ఆయన గడ్డం గీయించుకోవాలని సూచించాడు. ప్రధానిని అవమానించడం, బాధపెట్టడం తన ఉద్దేశం కాదని, ఆయన ఈ దేశానికి అత్యున్నత నాయకుడని కూడా లేఖలో తెలిపాడు అనిల్ మోరే. కరోనా  కారణంగా దేశ ప్రజలు, పేదలు పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు  వివరించాడు.

ఈటలను బిజెపి తన వైపు ఎలా తిప్పుకుంది?

ఒకప్పుడు యుద్ధం చేయాలంటే కత్తికి కత్తి తగిలించి చావో రేవో తేల్చుకునేదాకా తలపడేవారు. బలం, బలగం తక్కువున్నాసరే వీరత్వంతో జయించాలని..లేదంటే వీరమరణం పొందాలని అనుకునేవారు. ఇప్పుడు రాజకీయాల్లో ఆ అవసరం లేకుండా పోయింది. కత్తితో పొడవనక్కర్లేదు.. రక్తపు చుక్క కారనక్కర్లేదు.. కాని విజయం సొంతం చేసుకోవచ్చు. మనకంటూ సైన్యం లేకపోయినా.. కొత్త సైన్యాన్నిశత్రువుల నుంచే దిగుమతి చేసుకోవచ్చు. వీటికి కావాల్సింది వ్యూహం.. అధికారం. కింది నుంచి పై దాకా ఇదే తంతు. కాకపోతే అందరి కంటే పైనున్నది ఇప్పుడు కమలనాథులు కాబట్టి.. వారిదే పై చేయి. బలం పెంచుకోవాలన్నా.. సైన్యాన్ని పెంచుకోవాలన్నా.. రిక్రూట్ మెంట్ కి కొత్త ఇంటర్వ్యూలు పెట్టి..ట్రయినింగులిచ్చి నానా హంగామా చేయనక్కర్లేదు. రాజకీయ మార్కెట్ లో రెడీమేడ్ సరుకుల్లా రెడీమేడ్ నేతలుంటారు. వారిని తమవైపు లాక్కుంటే చాలు. లాగాలంటే చేయి పట్టుకుని లాగనక్కర్లేదు... వారి వెనక నుంచి ఎవరన్నా తరిమితే.. ఇటొచ్చిపడేలా చేసుకుంటే చాలు.. పనైపోతుంది.  బిజెపి ఇదే వ్యూహాన్ని ఫాలో అయిపోతుంది. చేతిలో సీబీఐ, ఈడీ, ఇన్ కమ్ ట్యాక్స్...ఇంకా పరోక్షంగా కొన్ని బలమైన వ్యవస్ధలు చేతిలో ఉన్నాయి.అవన్నీ ఉంటే.. వాటి రికార్డుల్లోకి ఎక్కిన నేతలంతా చేతిలోకి వచ్చినట్లే మరి. అదే జరుగుతుందని ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నారు. మొన్నటికి మొన్న బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీని దెబ్బ తీయటానికి ఇదే ఫార్ములా అప్లయ్ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం వచ్చి కమలానికి జై కొట్టారు. ముకుల్ రాయ్ లాంటి నేత వచ్చి బిజెపి పంచన చేరారు. కారణం ఆయనో స్కామ్ లో ఇరుక్కోవటం.. మమతా బెనర్జీ టార్గెట్ చేయడం. ఈ రెండిటి నుంచి తప్పించుకోవాలన్నా, తలదాచుకోవాలన్నా బిజెపి నీడ బెటరనిపించేలా లాబీయింగ్ నడిపించారు.. సక్సెస్ అయ్యారు.అలా అనేకమందిని తెచ్చుకున్నారు. వారి పైన ఆ తర్వాత కేసులున్నాయి గాని..విచారణలు లేవు. అంతెందుకు మమతాబెనర్జీతో తలపడి నందిగ్రామ్ లో గెలిచిన సువేందు అధికారి కూడా సీబీఐ నోటీసులందుకున్నాకే బిజెపిలో చేరారు. ఇప్పుడు తెలంగాణలో ఈటల రాజేందర్ సంగతిలో అదే జరిగిందని చెబుతున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డితో మాట్లాడారు... రేవంత్ రెడ్డి చాలా అభిమానం చూపించారు.. కోదండరామ్ తో మంతనాలు జరిపారు.. ఇంతమందితో మాట్లాడి ఇటువైపు రాకుండా బిజెపివైపు వెళ్లిపోయారు. ఎందుకు అంటే? ఈ రాజేంద్రుడు గజేంద్రుడు లాంటి కేసీఆర్ ని ఢీకొట్టాలి.. మరోవైపు భూకబ్జా కేసుల్లో ఇరుక్కున్నాడు.. ఆ కేసుల నుంచి బయటపడాలి..కేసీఆర్ కురిపిస్తున్న నిప్పుల్లోంచి బయటపడాలంటే బిజెపియే బెటరని వివేక్ ద్వారా బ్రెయిన్ వాష్ కార్యక్రమం నడిపించారు.. అంతే. ఇంకా చాలా ఉదాహరణలున్నాయి. ఇప్పుడు అసోంలో బిజెపి తరపున సీఎం అయిన హిమంతా బిశ్వాస కూడా కొన్నాళ్ల క్రితం కాంగ్రెస్ లో ఉండగా శారదా కుంభకోణంలో సీబీఐ నోటీసులొచ్చాయి. ఆ తర్వాతే ఆయన భిజెపిలో చేరారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ నేత నారాయణ రాణే మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్నాక బిజెపిలో చేరారు..రాజ్యసభ ఎంపీ అయ్యారు. ఇక గ్లామర్ బాయ్ జ్యోతిరాదిత్య సింథియా సైతం ఓ ల్యాండ్ వ్యవహారంలో విచారణకు ఆదేశించాక.. కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి బిజెపి జెండా కప్పుకున్నారు.  ఇలా నేతలు తప్పులు చేయడం.. ఆ తర్వాత బిజెపి దగ్గరకు చేరదీయడం.. వారి తప్పులు అలాగే ఉంచి.. వారిని కంట్రోల్ లో పెట్టుకోవడం కామన్ అయిపోయింది. ఏపీలో సీబీఐ కేసుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి పరిస్ధితి కూడా అదే. నేతలు సైతం... సిద్ధాంతాలు, ప్రజాప్రయోజనాలు ఎప్పుడో వదిలేశారు. పదవులను వాడుకుని సంపాదించుకోవటం... సంపాదించుకున్న ఆస్తులను కాపాడుకోవటానికి అధికారపార్టీల వైపు వెళ్లిపోవడం.. అంతే. నీతి, నిజాయితీ, నైతికత అనే పదాలను వారి డిక్షనరీల్లోంచి శాశ్వతంగా తీసేశారు.

కేజీ మ్యాంగో 2 లక్షలు.. మామిడి చెట్ల‌తో కోటీశ్వ‌రులు..

ఫ‌లాల‌లో రారాజు మామిడి పండ్లు. తెలుగువారికి బంగిన‌ప‌ల్లి అంటే భ‌లే ప‌సందు. మామిడిలో వంద‌ల ర‌కాలు ఉంటాయి. అందులో ఖ‌రీదైన‌వి.. అరుదైన‌వీ చాలానే ఉన్నాయ్. మ‌న ద‌గ్గ‌ర నాణ్య‌మైన మామిడి పండ్లు కిలో 50 రూపాయ‌లు ప‌లుకుతుంది. అదే మాల్స్‌లో ఆల్ఫోన్సో లాంటి రకాలైతే కేజీ 200ల‌కు పైనే ఉంటుంది. ఆ ధ‌ర చూసే.. అబ్బో అంత ఖ‌రీదా అనుకుంటాం. అలాంటిది ఇండియాలోని ఓ ర‌కం మామిడి పండ్ల కిలో ధ‌ర ఏకంగా 2 ల‌క్ష‌లు ప‌లికిందంటే న‌మ్ముతారా? కానీ, ఇది నిజం. ఆ మామిడి ధ‌ర.. అక్ష‌రాల రెండు ల‌క్ష‌ల రూపాయ‌లు. ఆ మ్యాంగో జ‌పాన్ బ్రీడ్‌. 'టాయో నో టామాగో'. జ‌పాన్ దేశంలో ఫుల్ పాపుల‌ర్‌. ప్ర‌పంచంలోకే అత్యంత తీపి క‌లిగిన మ్యాంగోగా పేరు. చూట్టానికి ఎరుపు రంగులో ఉండ‌టం వ‌ల‌న వీటిని.. 'ఎగ్స్ ఆఫ్ స‌న్‌'.. 'సూర్యుని గుడ్లు' అని అంటుంటారు.  జ‌పాన్‌తో పాటు వ‌ర‌ల్డ్ మార్కెట్‌లో ఈ ర‌కం మ్యాంగోస్‌కు మాంచి ధ‌ర ప‌లుకుతుంది.  అయితే.. జ‌పాన్ నుంచి దిగుమ‌తి చేసుకున్నారు కాబోలు అందుకే ఆ మామిడిపండ్ల‌కు అంత రేటు అనుకునేరు. కానే కాదు. అది జ‌పాన్ ర‌క‌మే అయినా.. దాన్ని పండించింది ఇండియాలోనే. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌లోని సంకల్ప్, రాణి పరిహార్ అనే క‌పుల్స్.. 'టాయో నో టామాగో' ర‌కం మామిడిని పండిస్తున్నారు. వారి చెట్ల‌కు కాసిన మామిడి పండ్లు కిలో ధ‌ర రికార్డు స్థాయిలో సుమారు 2 ల‌క్ష‌లు ప‌లుకుతోంది. ఆ ధ‌ర పెట్టి కొన‌డానికి వ్యాపారులు పోటీ ప‌డుతున్నార‌ట‌. ఒక్కో చెట్టుకు దాదాపు 20 పండ్లు కాస్తున్నాయి. ఈ లెక్క‌న‌.. ఒక్క చెట్టుంటే.. 40 ల‌క్ష‌ల ఆదాయం. అలాంటిది ఇక మామిడి తోటే ఉంటే..! కోటీశ్వ‌రులేగా....  

ఆ మంత్రికి పదవి మరో 6 నెలలా.. మూడేళ్లా..? అంతా ఆ స్వామి దయేనా.. 

వైసీపీ అధికారంలోకి వచ్చాక కొడాలి నాని తిట్లతో ఫేమస్ అయితే.. మలుపులు తిప్పడానికి స్క్రూ  పట్టుకుని వచ్చే బొత్స ఫేమస్ అయ్యారు. వీరందరి కన్నా ఓ రేంజ్ లో ఫేమస్ అయింది ఈయనే.  ఆ మంత్రి పేరు ఒక టైమ్ లో అయితే మార్మోగిపోయింది. ఇప్పుడు మరో ఆరు నెలల్లో జరగబోయే మంత్రివర్గ మార్పుల్లో పీకేయడానికి తయారైన లిస్టులో ఈయన పేరే ఫస్ట్ ఉందనే టాక్ వినపడుతోంది. కాని అదేం లేదని తమ సారుకి స్వరూపానంద స్వామి ఆశీస్సులున్నాయని మరో రెండున్నరేళ్లు కూడా కంటిన్యూ అవుతారని ఆయన వర్గం ధీమాగా ఉంది. ఈ రెండు రకాల టాక్ లతో కాస్త కన్ఫ్యూజింగ్ గానే ఉన్నా.. బాస్ కి ఏం జరిగినా అది హైలెట్ అవటం అయితే పక్కా. వెలంపల్లి శ్రీనివాస్.. దేవాదాయశాఖా మంత్రి. వివాదాలెక్కువ.. ఆరోపణలెక్కువ.. పని తక్కువ అని ప్రత్యర్ధులు అంటారు. ఆయన మనుషులేమో వయసు తక్కువ, అనుభవం తక్కువ..అయినా పవరెక్కువ, పెర్ ఫార్మెన్స్ ఎక్కువ అని చెప్పుకుంటారు. జూన్ 8కి మంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లయింది. ఈ సందర్భంగా ఆయన అభిమానులు పండగ చేసుకున్నారు. ఎందుకంటే ఇన్నాళ్లు ఉంటారని కూడా వారనుకోలేదని జోకులు వినపడ్డాయి..అది వేరే విషయం..మనకనవసరం. ఈయన నియోజకవర్గంలోనే కనకదుర్గ గుడి ఉంది. అందులోనే బోలెడన్ని స్కాములు జరిగాయి. ఈవో నియామకం దగ్గర నుంచి.. వెండి విగ్రహాలు మాయమవడం.. ఉద్యోగులు చేసిన అవినీతి.. కాంట్రాక్టుల్లో అవినీతి..ఆఖరికి ఉద్యోగుల నియామకంలోనూ లేటెస్టుగా అవినీతి.. ఇలా అవినీతికి అవకాశమున్నఎక్కడా వదిలిపెట్టలేదు. మంత్రిగారి ఏం చేస్తున్నారని కొందరు..అసలు మంత్రిగారి ఇన్వాల్వ్ మెంట్ ఉందని కొందరు ఆరోపించారు. అయినా మంత్రిగారు చలించలేదు. ఇక అంతర్వేదిలో రథం దగ్ధమైన విషయంలోనూ బాస్ సరిగా డీల్ చేయలేకపోయాడు.అటు బిజెపి, ఇటు జనసేన, మరోవైపు నుంచి టీడీపీ ఇంకోవైపు నుంచి టార్గెట్ చేయడంతో.. రెచ్చిపోయారు. చెలరేగిపోయి ఎదురుదాడికి దిగారు. చివరకు సీబీఐకి ఫైల్ పంపి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంది. నూతన రథం కూడా వచ్చేసింది. కాని ఇప్పటికీ ఆ రథాన్ని ఎవరు తగలబెట్టారో తెలియలేదు. తేలలేదు. రామతీర్ధం ఘటన అయితే మరీ ఘోరం. రాముడి తలనే నరికేశారు. వాళ్లెవరో ఇప్పటికీ అంతుచిక్కలేదు. దానిచుట్టూ రాజకీయం మాత్రం బ్రహ్మాండంగా నడిచింది. కొడాలి నాని తర్వాత నోరు పారేసుకోవడంలో ఎక్స్ పర్ట్ అని.. ఈ ఘటనలు జరిగినప్పుడు మాట్లాడిన మంత్రి వెల్లంపల్లిని చూస్తే అర్ధమైంది. వరుసగా అనేక చోట్ల విగ్రహాలపై దాడులు జరిగాయి. ఎవరు చేశారో ఇప్పటికీ తేల్చలేదు. ఇప్పటికీ ఎక్కడా దేవాలయాల్లో సరైన రక్షణ లేదు. పైగా వైసీపీ ఇన్ ఫ్లూయెన్స్ తో అన్యమతస్తులు చాలా దేవాలయాల్లో పెత్తనాలు చేస్తున్నారు. షాపులు, కాంట్రాక్టులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరూ వారి కనుసన్నల్లోనే ఉంటున్నారనే ఆరోపణలు తీవ్రంగా వస్తూనే ఉన్నాయి. ఇన్ని జరుగుతున్నా మంత్రి వెల్లంపల్లి మాత్రం నోరు మెదపరు. ఆయనకు రావాల్సింది ఆయనకు రాకపోతేనే ఫ్రస్టేషన్ వస్తుంది గాని..లేదంటే కూల్ గా ఉంటారని ఆయనపై ఆరోపణలు చేస్తుంటారు ప్రత్యర్ధులు.  ఇన్ని జరిగినా ఆయన సేఫ్ గా ఉన్నారంటే ...ఏం జరిగినా ఆయన స్వరూపానందస్వామి దగ్గరకు వెళ్లడం, సలహాలు తీసుకోవడం.. ఆయన డైరెక్షన్ లోనే పని చేయటమే..ఆయనకు శ్రీరామరక్ష లా అయిందని అంటుంటారు. ఆ స్వామి జన్మదినం రోజు ప్రతి గుడిలోనూ ప్రత్యేక పూజలు చేయమని సార్ వల్లే జీవో వెళ్లింది. మంత్రి నిర్వహించిన రివ్యూ సమావేశాన్ని వీడియో కాల్ ద్వారా స్వామిజీ గైడ్ చేశారంటే అర్ధం చేసుకోవచ్చు పరిస్ధితి ఎలా ఉందో. ఇక లోకల్ గా నియోజకవర్గంలో మంత్రి అనుచరులు ఇష్టారాజ్యం దోచుకుంటున్నారని మీడియా కథనాలు వచ్చాయి..వస్తున్నాయి..వస్తూనే ఉన్నాయి. ఇన్నిఉన్నా.. మంత్రి మళ్లీ కొనసాగుతారనే ధీమాలో భక్తులు ఉన్నారు. కాదు ఈసారి షఫిలింగ్ లో ఎగ్జిట్ ఖాయమనే అంచనాలు మాత్రం వస్తున్నాయి.

కేటీఆర్ పట్టాభిషేకం ఇక లేనట్లే.. 

ఒకటి రెండు సార్లు ముహూర్తం వరకు వెళ్ళిన మంత్రి కేటీఆర్ పట్టాభిషేకం ఇక ఇప్పట్లో లేనట్లేనా.. ఈ సారికి మంత్రి పదివితో సర్దుకు పోవలిసిందేనా అంటే  అవుననే సమాధానమే వస్తోంది. నిజానికి, 2018 లో ముఖ్యమంత్రి కేసీఅర్ ముందస్తు ఆసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయించినప్పటి నుంచి, కేటీఆర్ పట్టాభిషేకం వార్తల్లో నలుగుతూనే ఉంది. అందుకోసమే ముందస్తుకు వెళ్ళారని అప్పట్లోనే మీడియాలో పొలిటికల్ కథలు, కధనాల వంటా వార్పు జోరుగా సాగింది. ఇక 2019 లోక్ సభ ఎన్నికల ముందు అయితే కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి వెళ్ళడం ఖాయమని  అన్నారు. ప్రాంతీయ పార్టీల ఫ్రంట్’ ఏర్పడిపోయినట్లే ప్రచారం జరిగిపోయింది. అదే సమయంలో కేటీఆర్’ సైతం పట్టాభిషేకానికి రెడీ అయిపోయారు. అయితే, కారు పదహారు కల బోల్తా కొట్టడంతో కథ అడ్డం తిరిగింది. కేసీఆర్ ఢిల్లీ కలతో పాటుగా  కేటీఆర్’ సీఎం కల కూడా ... చెదిరిపోయింది. కట్ చేస్తే .. కేటీఆర్ కల అయితే చెదిరింది కానీ, కోరిక మాత్రం అలాగే వుంది.  కుటుంబ రాజకీయ సమీకరణలో వచ్చిన మార్పులతో కేసీఆర్ పై వత్తిడీ పెరిగింది. ఈ వత్తిడి కారణంగానే, కేసీఆర్, ఇంటి కంటే ఫామ్’ హౌస్ పదిలం అని, ఎక్కువగా అక్కడే ఉండి పోతున్నారని, ఫ్యామిలీలోని బయటి వర్గం ఉవాచ. ఇలా ఫ్యామిలీ పాలిటిక్స్’లో చోటు చేసుకుంటున్న ట్విస్టుల ఫలితంగానే మేనల్లుడు హరీష్ రావు మామకు దూరమయ్యారని, కుటుంబ వత్తిళ్లకు లొంగి ఆయన్ని కేసీఆర్’ దూరంగా ఉంచారని అంటారు. కారణం ఏదైనా కొంత కాలం పాటు కేసీఆర్ వద్ద  హరీష్ రావు ప్రాధాన్యత తగ్గింది అనేది మాత్రం నిజం. ఆయనకు ప్రగతి భవన్ గేట్లు  మూసుకున్నాయా, తెరుచుకున్నాయా, ఆయన కంటతడి మాత్రమే పెట్టుకున్నారా, కన్నీళ్లు కూడా కార్చారా,అనేది ఎలా ఉన్నా, ఇప్పుడు ఆయన ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, నిన్నమొన్నటి వరకు  ఆయనకు పార్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యత  తగ్గింది అనేది మాత్రం నిజం. అయినా, కేసీఆర్’ను అక్షరం అక్షరం చదివిన హరీష్ ఎప్పుడూ మామ గీసిన గీత దాటలేదు, చివరకు  ప్లానింగ్ తమ వద్ద ఉంచుకుని అంతగా ప్రాధాన్యత లేని ఫైనాన్స్ పోర్ట్’ఫోలియో ఇచ్చినా అదే మహా ప్రసాదంగా స్వీకరించి, సుమారు సంవత్సరానికి పైగా సిద్దిపేటకు పరిమితం అయ్యారు. అయితే, ఆయన, మౌనంగా ఉన్నా, వ్యూహం లేకుండా మాత్రం లేరు. సమయం కోసం ఎదురు చూస్తూ వచ్చారు.ఇదంతా అందరూ చూసిన చిత్రం.  ఇక విషయంలోకి వస్తే ప్రస్తుతం తెరాస పార్టీలో, ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యంగా ఈటల రాజేందర్ బర్తరఫ్’ తదనంతర పరిణామాలను గమనిస్తే, కేసీఆర్ వద్ద హరీష్ ప్రాధాన్యత మళ్ళీ పెరిగింది. ముఖ్యమంత్రి ఆసుపత్రుల సందర్శనలో ఆయన వెంట హరీష్ ఒక్కరే ఉన్నారు. అంతే కాదు,ఈటల బర్తరఫ్ తర్వాత, వైద్య ఆరోగ్య శాఖను తమ వద్దనే ఉంచుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఆశాఖ వ్యహరాలను చూసేందుకు ఏర్పాటు చేసిన డిఫ్యాక్టోకమిటీకి హరీష్’ ను చైర్మన్ గానియమించారు. ఈటల మంత్రిగా ఉన్నప్పుడే, మంత్రి కేటీఆర్ అధ్యక్షతన కొవిడ్ టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేశారు. అయినా, కేంద్ర మంత్రి హర్షవర్ధన్’ రాష్ట్ర మంత్రులతో కొవిడ్ పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్’లో హరీష్ రావు పాల్గొన్నారు. ఇక ఇప్పుడు తాజాగా కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల  నేపధ్యంలో అసుపత్రుల స్థితిగతులు, మెరుగైన మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియమకాలు అవసరమైన ఇతర ముదస్తు ఏర్పాట్లను  పర్యవేక్షించేందుకు క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు మంగళవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆరోగ్య సబ్ కమిటీకి ఆర్థిక మంత్రి హరీశ్ రావును ముఖ్యమంత్రి  అధ్యక్షునిగా  నియమించారు. మంత్రులు జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, వేముల ప్రశాంత రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, సత్యవతి రాథోడ్, శ్రీనివాస గౌడ్ సభ్యులగా ఉన్నారు.ఈ కమిటీ ఏమి చేస్తుంది ఏమిటీ అన్న విషయాన్ని పక్కన  పెడితే, ప్రభుత్వంలో హరీష్ కీలకంగా మారారు, మరో మారు, ఆయన ప్రధాన్యత పెరిగింది,అనేందుకు ఇది తాజా ఉదహరణగా పేర్కొన వచ్చును.   ప్రభుతంలోనే కాదు పార్టీలోనూ, ట్రబుల్ షూటర్’గా హరీష్ ప్రధాన్యత పెరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానం బాధ్యతలను ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావుకు అప్పగించారు. హరీష్ రావు పార్టీ అభ్యర్హ్ది సురభి వాణీ దేవిని గెలిపించి, ముఖ్యమంత్రి వద్ద మార్కులు కొట్టేశారు. ఇక ఇప్పుడు ఈటల రాజీనామా చేస్తే వచ్చే హుజురాబాద్ ఉప ఎన్నిక బాధ్యతను కూడా హరీష్ రావుకే అప్పగించారు. మాజీ ఎంపీ వినోద కుమార్, మంత్రి గంగులకు కూడా బాధ్యతలు అప్పగించినా భారం మాత్రం హరీష్  బుజాలపైనే ఉంచారని పార్టీలో వినిపిస్తోంది. ఈ విధంగా అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో  హరీష్  మళ్ళీ  కీలకంగా మారడంతో , కేటీఅర్ పట్టాభిషేకం ఇక ఇప్పట్లో లేనట్లేనని, అంటున్నారు.  ఎందుకంటే హరీష్ తను కేసీఆర్’కు మాత్రమే విధేయుడిగా ఉంటానని, ఆయన పార్టీ అధ్యక్షునిగా, ముఖ్యమంత్రిగా ఉన్నత వరకే విధేయత ఉంటుందని,ఆ పదవులలో మరొకరు (అనగా కేటీఆర్) వస్తే తదనంతర పరిణామాలకు తాను బాద్యుడిని కాదని, స్వయంగా మామకే చెప్పినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఆ బ్యాక్ డ్రాప్ లోనే కేటీఆర్ పట్టాభిషేకానికి అడ్డుతగులుతారనే, హరీష్ ను కొంత కాలం దూరంగా పెట్టారు. ఇప్పడు ఈటల ఉదంతంతో అనివార్యంగా హరీష్ అవసరం ఏర్పడింది. సో .. కేటీఆర్ పట్టాభిషేకం ఇక ఇప్పట్లో లేనట్లే అంటున్నారు. అదలా ఉంటే ఎంత వరకు నిజమో కానీ, ఈటల ఎపిసోడ్ కథ, స్క్రీన్ ప్లే, దర్సకత్వం అన్నీ ‘ఆయనే’  అని కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

షర్మిల బాణం గురి ఒకవైపు.. లక్ష్యం మరోవైపు

అన్నపై కోపంతో ఇక్కడకొచ్చారని చెబుతున్నారు. కాని అన్న స్నేహితులంతా ఇక్కడ చెల్లెమ్మకు ఫ్రెండ్స్. అన్న అనుమతి లేకుండానే వారొస్తున్నారా? అంటే ఏమో అంటున్నారు. కనుబొమ్మలెగరేస్తేనే కన్నెర్ర చేసే కల్వకుంట్లవారు ఈ చెల్లెమ్మ చేతులెగరేసినా.. ఏమీ అనటం లేదు. గజ్వేల్ కే వచ్చి సవాల్ విసురుతున్నా చాలా కూల్ గా ఉంటున్నారు. ఇందులో కిటుకు ఏంటో అర్ధం కావటం లేదు.  ఇంతకీ ఈ చెల్లెమ్మ ఎవరికి నష్టం చేస్తారు? ఎవరికి లాభం చేస్తారనే దానిపై ఇప్పటికే చాలా కథనాలు వచ్చాయి. కాని ఇప్పుడిప్పుడే కాస్త క్లారిటీ వస్తోంది. తెలంగాణలో షర్మిల పార్టీ వైఎస్సార్ తెలంగాణ పార్టీకి రంగం సిద్ధమైపోయింది. అన్నపై కోపంతో.. అలిగి మరీ తెలంగాణ వచ్చిందని ఓ మీడియా కథనాలు వండి వార్చింది. ఆ మీడియా చెప్పిందే షర్మిల వింటుందని.. అసలు అన్ని విషయాలు వారికి ఈవిడే చెప్పిందని గుసగుసలాడుకున్నారు. దానికి తగ్గట్టే మేడమ్ కు కవరేజ్ అదిరిపోయింది. కవరేజ్ కి తగ్గ ప్యాకేజిలు కూడా అందాయని చెప్పుకున్నారు. కాని వీరిని వారు వాడుకున్నారా..వారిని వీరు వాడుకున్నారా అనేదే కొన్నిరోజులైతే గాని క్లారిటీ రాదు. అన్న పేరు ఎత్తడం లేదు..ఎత్తితే మొహం సీరియస్ అవుతుంది..అమ్మ కూడా ఇటే వచ్చిందని చెప్పుకున్నారు. కాని అన్నతో టచ్ లో ఉన్న రిటైర్డ్ అధికారులు... దాదాపు రిటైర్ అయిన రాజకీయ నేతలు.. వైసీపీలో గతంలో కనిపించిన సెలెబ్రిటీలు ..వీళ్లే షర్మిల ఆస్థానంలో దర్శనమిచ్చారు. జగన్మోహన్ రెడ్డి కి ఇష్టం లేదని తెలిస్తే వారు అడుగుపెట్టేవారా.. ఆ సాహసం చేసేవారా అంటే లేదనే చెప్పాలి. తనకు ఇబ్బంది వస్తే జగన్ ఎవరినీ వదిలిపెట్టరనేది చరిత్ర చెబుతున్న సత్యం. కేసీఆర్ పై ఘాటుగా విమర్శలు కురిపిస్తున్నా సరే షర్మిలపై ఎలాంటి ఒత్తిడి కేసీఆర్ శిబిరం  నుంచి రావటం లేదు. కేసీఆర్ సహజధోరణికి ఇది విరుద్ధం. షర్మిల శిబిరం ఫోకస్ చేస్తున్న సామాజికవర్గాలు సైతం రెడ్డి, దళితులు.  ఈ రెండు వర్గాలు కాంగ్రెస్ ఓటు బ్యాంకులే. ఆ రెండు వర్గాలను, అలాగే కాంగ్రెస్ లో ఒకప్పుడు వెలుగు వెలిగిన నేతలనే దగ్గరికి తీయడం అంటే.. వారు కాంగ్రెస్ కే దెబ్బ వేయడానికి వ్యూహం నడుస్తుందనే టాక్ వినపడుతోంది. కాంగ్రెస్ కు దెబ్బపడి.. బిజెపితో సహా మూడు రకాలుగా ఓట్లు చీలితే బెనిఫిట్ కేసీఆర్ కే..ఆ బెనిఫిట్ షేరింగ్ ఎటూ జగన్ కూ ఉంటుంది.  కాకపోతే షర్మిలకు లాంగ్ స్ట్రాటజీ ఉందని చెబుతున్నారు. ఇప్పటికి ఎవరికో ఒకరికి ఉపయోగపడటమే అయినా..భవిష్యత్ లో బలమైన నాయకురాలిగా ఎదగాలని.. అన్న తర్వాత చెల్లే అనిపించుకోవాలనేదే లక్ష్యమని అంటున్నారు. కొత్త ట్విస్ట్ ఏంటంటే ప్రశాంత్ కిషోర్ కన్సల్టెన్సీ అనుకున్నా..అది కుదరకపోవడంతో.. ఇప్పుడు సుదీర్ఘకాలంగా ఓ ప్రముఖ చానల్ సీఈఓగా ఉంటున్న వ్యక్తి డైరెక్షన్ లో షర్మిల శిబిరం నడుస్తుందని తెలుస్తోంది.

ఆమె, భర్త ఫస్ట్ నైట్ ఒప్పుకున్నాడు .. ఎందుకో  తెలుసా..? 

మంచి కుటుంబం.  అబ్బాయి కూడా గుణవంతుడు. అంతకుమించి బాగా చదువుకున వాడు. త్వరలోనే విదేశాల్లో స్థిరపడడానికి ఫ్లయిట్ ఎక్కుతున్నాడు. మా అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అని అమ్మాయి తల్లిదండ్రులు తెగ మురిసిపోయారు. కూతురు కూడా అబ్బాయిని అతని పనిని ఇష్టపడటంతో భారీగా కట్నకానుకలు ఇచ్చి ఘనంగా వివాహం చేశారు. చివరికి అది పూజకు పనికిరాని పూవు అని తెలిసింది.. ఆ తర్వాత ఏముంది.. తల్లి దండ్రులు కూతురు లబోదిబోమని ఏడిచారు..  కట్ చేస్తే ఆ రోజు నైట్ శోభనం.. అందరూ కలిసి అమ్మాయిని ముస్తాబు చేశారు.. కొంత మంది పెద్దలు పెళ్లి కూతురికి టిప్స్ చెప్పారు.. అందరూ కలిసి సినిమాలో లాగ పాల గ్లాస్ చేతిలో పెట్టి రూమ్ లోకి పంపించారు.. ఇక అంటే అమ్మాయికి చెమటలు పట్టించాల్సిన పెళ్లి కొడుకు వణుకుతున్నారు.. అమ్మాయి దగ్గర అయింది.. అబ్బాయికి చెమటలు చిన్న పాటి కాలువల్లా పారుతుంది తన వంటి మీద.. దూరం దూరం వెళ్తున్నాడు.. ఏంటని ఆరా తీస్తే తను నపూసకుందని తెలిసింది. సంసారానికి పనికిరాని. పూజకు పనికిరాని పువ్వు అని తెలిస వధువు కంగుతింది. అయితే ఈ విషయం బయటపెట్టి తన పరువు తీయొద్దని భర్త వేడుకోవడంతో మిన్నకుండిపోయింది. మరుసటి రోజు వరుడి తల్లిదండ్రులు విజయవాడలో రిసెప్షన్‌ ఏర్పాటు చేయగా యువతి తరుపు బంధువులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా యువతి తన సమస్యను కుటుంబసభ్యులకు చెప్పి భోరుమంది. దీంతో వారు వధువును పుట్టింటికి తీసుకొచ్చేశారు. దీనిపై ఇరుపక్షాల పెద్దలు పలుమార్లు సంప్రదింపులు జరిపారు. భర్త తీరుతో పుట్టింట్లోనే ఉండిపోయిన ఆమెను అత్తింటివారు వేధించడం మొదలుపెట్టారు. దీంతో విసిగిపోయిన బాధితురాలు చివరికి పోలీసులను ఆశ్రయించింది.  అది  గుంటూరు జిల్లా.  తెనాలి సమీపంలోని పినపాడుకు చెందిన యువతి. ఆమె వయసు 20 సంవత్సరాలు. అయితే  విజయవాడ ఆటోనగర్‌కు చెందిన యువకుడితో ఈ ఏడాది ఏప్రిల్‌ 4వ తేదీన వివాహం జరిగింది. అతడు ప్రస్తుతం ప్రైవేటు కన్సల్టెన్సీలో వర్క్ చేస్తున్నాడు.. త్వరలోనే ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్తాడని, పెళ్లి చేసుకుని భార్యను కూడా అక్కడికి తీసుకెళ్తాడని తల్లిదండ్రులు చెప్పారు. వీసా, ఇతర పత్రాలన్నీ చూపించడంతో యువతి తల్లిదండ్రులు మంచి సంబంధం దొరరికిందని మురిసిపోయారు. వారు అడిగినట్లుగా రూ.10 లక్షల కట్నం, ఇతర లాంఛనాల కింద మరో రూ.10 లక్షలు ఖర్చు చేసి ఘనంగా వివాహం చేశారు. ఇటీవల విజయవాడలో పెద్దల సమక్షంలో పంచాయతీ జరగ్గా రిసెప్షన్‌ కోసం తాము రూ.8 లక్షలు ఖర్చు పెట్టామని, ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని యువకుడు, అతని తరఫు వారు డిమాండ్‌ చేశారు. అంతటితో ఆగకుండా వధువు, ఆమె కుటుంబసభ్యులపై దాడికి పాల్పడ్డారు. దీంతో యువతి భర్త, అత్తింటి వారిపై తెనాలి త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.