మమత కోసం అధీర్’కు ఉద్వాసన

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ, కథ కంచికి చేరింది. వామపక్ష కూటమితో కలిసి పోటీచేసినా హస్తం పార్టీకి ఒక్క సీటూ దక్కలేదు.అఫ్కోర్స్, కమ్యూనిస్టులు కూడా ఖాతా తెరవలేదనుకోండి. అది వేరే విషయం. ఇక ప్రస్తుతానికి వస్తే, కాంగ్రెస్ పార్టీ  బెంగాల్లో పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు మమతా బెనర్జీ శరణు వేడేందుకు సిద్దమైనట్లు సమాచరం. నిజానికి, అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే, కాంగ్రెస్ అధిష్టానం, దీదీతో పొత్తుకు సిద్దమైంది..ట. బీహార్’లో ఆర్జేడీతో చేతులు కలిపి అన్నో ఇన్నో సీట్లు గెలిచి రాష్ట్రంలో ఉనికిని కాపాడుకున్నవిధంగా బెంగాల్లో కూడా తృణమూల్’తో పొత్తు పెట్టుకుని, ఉన్నామని అనిపించుకుందామన్నఆలోచన చేసిందట. అయితే దీదీతో పొత్తును, పీసీసీ అధ్యక్షుడు, లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేతగా, డబుల్ రోల్ ప్లే చేస్తున్న అధీర్ రంజన్ పడనీయ లేదు.అంతే కాదు, మమతా దీదీతో ఆయనకు ఏవో పాత తగవులు ఉన్నాయి.అలాగే, తృణమూల్ ప్రభుత్వంపై అధీర్ తరుచుగా విమర్శలు చేస్తుంటారు. బెంగాల్ ఎన్నికల సమయంలోనూ తృణమూల్‌పై అధీర్ తీవ్రమైన విమర్శలే చేశారు. ఈ నేపధ్యంలో భవిష్యత్తులో బీజేపీని నిలువరించడానికి మమత సహకారం తీసుకోవాలని బావిస్తున్న సోనియా గాంధీకి, అధీర్ రంజన్, అడ్డుగా మారారు. అందుకే, మమతతో స్నేహం కోసం అధీర్ రంజన్ చౌదరిని, లోక్ సభలో కాంగ్రెస్ పక్షనేత పోస్ట్ నుంచి తప్పించాలని సోనియా గాంధీ నిర్ణయించుకున్నారు. అధీర్ స్థానంలో ఎవర్ని నియమిస్తారన్నది ఇదమిత్థంగా తెలియడం లేదు. శశి థరూర్, మనీశ్ తీవారి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.    అదలా ఉంటే, బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి  మరో ఎదురు దెబ్బ తగిలింది.  మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనయుడు అభిజిత్ ముఖర్జీ సోమవారంనాడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కోల్‌కతాలోని టీఎంసీ కార్యాలయంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ అయిన అభిజిత్ టీఎంసీలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, టీఎంసీ సభ్యుడిగా ఆ పార్టీలో చేరినట్టు తెలిపారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి టీఎంసీలో చేరానని అన్నారు. కాంగ్రెస్‌లో తనకు ఎలాంటి హోదా ఇవ్వనందున టీఎంసీలో చేరానని, తనకు టీఎంసీ  ఏ పదవి ఇచ్చినా ఒక సైనికుడిలా బాధ్యతతో పనిచేస్తానని చెప్పారు. బెంగాల్‌లో బీజేపీ ప్రవేశాన్ని అడ్డుకున్న వారి నాయకత్వంలో పనిచేయడం ఒక విశేషాధికారంగా తాను భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ''ఇటీవల చోటుచేసుకున్న బీజేపీ మతతత్వ ప్రభంజనాన్ని మమతా బెనర్జీ ఎలా అదుపు చేయగలిగారో, అదే విధంగా భవిష్యత్తులోనూ అందరి సహకారంతో యావద్దేశంలోనూ మతతత్వ వేవ్‌ను ఆమె నియంత్రించగలరని నేను నమ్ముతున్నాను'' అని అభిజిత్ ముఖర్జీ అన్నారు.

12 మంది ఎమ్మెల్యేలపై వేటు.. రాజ‌కీయంగా దిమ్మ తిరిగే షాక్‌..

స్పీక‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇంత‌కు ముందెప్పుడూ లేనంత షాకింగ్ డెసిష‌న్‌. ఒక‌రు, ఇద్ద‌రు కాదు.. ఏకంగా 12 మంది ఎమ్మెల్యేల‌పై వేటు.. ఒక రోజు, రెండు రోజులు కాదు.. ఏకంగా ఏడాది పాటు బ‌హిష్క‌ర‌ణ‌.. ఇదేమీ మామూలు న్యూస్ కాదు.. అందుకే ఈ బ్రేకింగ్ న్యూస్‌ పొలిటిక‌ల్‌గా షేక్ చేస్తోంది. మ‌హారాష్ట్ర‌ రాజ‌కీయాల్లో ఈ నిర్ణ‌యం ఇప్పుడు దుమారం రేపుతోంది. బీజేపీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతోంది.   మహారాష్ట్ర తాత్కాలిక‌ స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వేశారు. ఆ 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తాత్కాలిక స్పీకర్‌ను దూషించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో సస్పెండ్ చేస్తూ తాత్కాలిక స్పీకర్ నిర్ణయం తీసుకోవ‌డం మ‌రాఠా పాలిటిక్స్‌ను షేక్ చేస్తోంది. స్పీక‌ర్ నిర్ణ‌యంపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎపిసోడ్‌తో మ‌హారాష్ట్ర పాలిటిక్స్ కీల‌క టర్న్ తీసుకున్న‌ట్టైంది.  రెండు రోజులుగా మ‌హారాష్ట్ర‌లో నాట‌కీయ ప‌రిణామాలు జ‌రుగుతున్నాయి. బీజేపీ-శివసేన శత్రువులు కారంటూ మహరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆదివారం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ-కాంగ్రెస్‌-ఎన్సీపీ స‌ర్కారును ఎప్పుడెప్పుడు ప‌డ‌గొట్టాలా అని గోతికాడ న‌క్క‌లా కాచుకు కూర్చొన్న క‌మ‌ల‌నాథులు.. స‌రైన ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. గ‌తంలో శ‌ర‌ద్‌ప‌వార్ మేన‌ల్లుడితో పార్టీని చీల్చాల‌నే ఎత్తుగ‌డ ఘోరంగా తిప్పికొట్ట‌డంతో అప్ప‌టి నుంచి కాస్త జాగ్ర‌త్త‌గా ఉంటోంది. మహా అఘాడి కుట‌మిలో చిచ్చు పెట్టేందుకే అన్న‌ట్టు.. మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌విస్‌.. విభేదాలు ఉన్నంత మాత్రాన‌ బీజేపీ-శివ‌సేన‌లు శత్రువులు కాదంటూ కాక రేపార‌ని అంటున్నారు. రాజకీయాల్లో "అయితే", "కానీ" వంటి పదాలు ఉండవని.. పరిస్థితులను బట్టే నిర్ణయాలు ఉంటాయని.. బీజేపీ కలిసే శివసేన పోటీ చేసిందని.. ఎన్నికల ఫలితాల అనంతరం ఎన్‌సీపీ, కాంగ్రెస్‌తో చేతులు కలిపిందంటూ ఫ‌డ్న‌విస్ క‌న్ఫ్యూజ‌న్ క్రియేట్ చేసేలా కామెంట్స్ చేశారు. బీజేపీ నేత దేవేంద్ర‌ ఫ‌డ్న‌విస్ మాట‌ల‌పై శివ‌సేన ఎంపీ సంజయ్ రౌత్ మ‌రింత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బీజేపీ-శివ‌సేన‌ల మధ్య సంబంధాన్ని అమీర్‌ఖాన్‌-కిరణ్‌రావుల‌తో పోల్చారు. ఇటీవ‌లే ఈ బాలీవుడ్ జంట విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. వారిద్ద‌రి రిలేష‌న్‌తో పొల్చ‌డంతో.. ఇక బీజేపీ-శివ‌సేన‌ల మ‌ధ్య ఎలాంటి బంధం లేద‌న్న‌ట్టు సంజ‌య్ రౌత్ తేల్చి చెప్పేశారు.  మ‌రోవైపు.. సంజ‌య్ రౌత్ వ్యాఖ్య‌ల‌పై మ‌రో ర‌క‌మైన విశ్లేష‌ణ కూడా చేస్తున్నారు. మహారాష్ట్రలోని అధికార మహా అఘాడి సర్కార్‌లో విభేదాలు వచ్చాయని.. శివసేనకు బీజేపీ దగ్గరవుతోందని ఊహాగానాలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో రౌత్ తాజా వ్యాఖ్యలు చేశారు. ''మేమేమీ ఇండియా, పాకిస్థాన్ కాదు. అమీర్ ఖాన్, కిరణ్ రావులను చూడండి. మా సంబంధం అలాంటిదే. ఎవరి రాజకీయ మార్గాలు వారివి. కానీ మిత్రత్వం ఎప్పటిలాగే ఉంటుంది'' అని శివ‌సేన ఎంపీ సంజ‌య్‌ రౌత్ చెప్పడం రెండు ర‌కాల అర్థాల‌ను ధ్వ‌నిస్తోంది.  ఇలా, రాజ‌కీయంగా శివ‌సేన‌-బీజేపీల మ‌ధ్య ఏదో జ‌రుగుతోంద‌నే చ‌ర్చ పీక్స్‌కు చేరిన స‌మ‌యాన‌.. తాజాగా మ‌హారాష్ట్ర అసెంబ్లీలో తాత్కాలిక స్పీక‌ర్‌గా ఉన్న ఎన్సీపీకి చెందిన న‌ర్హ‌రి సీతారం.. ఏకంగా 12 మంది బీజేపీ ఎమ్మెల్యేల‌ను ఏడాది పాటు స‌స్పెండ్ చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. బీజేపీ స‌భ్యుల‌పై వేటు.. ఆ పార్టీని శివ‌సేనకు ద‌గ్గ‌ర కాకుండా రెచ్చ‌గొట్ట‌డానికా? లేక‌, మా కూట‌మి అంతా ఒక్క‌టేన‌ని బీజేపీకి స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వ‌డానికా? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.   

ఇక్క‌డ కుస్తీ.. అక్క‌డ దోస్తీ.. ఎవ‌రికి లాభం? ఇంకెవ‌రికి న‌ష్టం?

హైదరాబాద్‌లో బీజీపీ, ఎంఐఎం పార్టీలు ఉప్పు, నిప్పు. ఒకరి మీద ఒకరు కత్తులు దూస్తూనే ఉంటారు. నిప్పులు చెరుగుతూనే ఉంటారు. బీజేపీని ఓడించడమే ఏకైక లక్ష్యం అన్నట్లుగా ఎంఐఎం.. పుట్టిందే ఎంఐఎంను ఓడించేందుకు అన్నట్లుగా బీజేపీ పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తాయి. అయితే, అవే పార్టీలు యూపీలో లోపాయికారీ ఒప్పందానికి వచ్చాయి. వివరాలలోకి వెళితే .. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయం వేడెక్కుతోంది. నిజానికి, యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఎనిమిది, తొమ్మిది నెలల సమయముంది. అయినా, కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతో  మొదలైన విపక్షాల విమర్శలు ఎన్నికల టర్న్ తీసుకుని కాక పుట్టిస్తున్నాయి. నిజానికి అధికార బీజీపీ కొవిడ్ కష్టాల్లో నిండా మునిగి కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ ఇంటాబయట సమస్యలతో సతమతమవుతున్నారు. ఒకవిధంగాచూస్తే, బీజేపీ ఓడించేందుకు కరోనా సువర్ణ అవకాశం కల్పించింది. అయితే చిత్రంగా ప్రభుత్వాన్ని, అధికార బీజేపీని ఎండగట్టేందుకు బదులు ప్రతిపక్ష సమాజ వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ), కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు టన్నుల కొద్దీ విమర్శలు కుమ్మరించుకుంటున్నారు. ఒక విధంగా బీజేపీని మళ్ళీ గెలిపించే బాధ్యతను విపక్షాలు తీసుకున్నట్లుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారంటే, పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చును.  బీఎస్పీ అధినాయకురాలు మాయావతి ఆదివారం, కాంగ్రెస్ పార్టీ అంటేనే, ‘వంచన’ మోసం అంటూ మండిపడ్డారు. ఉత్తర ప్రదేశ్’లో ప్రాణవాయువు అందక కొట్టుకుంటున్న కాంగ్రెస్ పార్టీ, పాత వాసనలు వదులుకోలేదని వంచనకు మోసాని పాల్పడుతూనే ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేరులోని ‘సి’ అక్షరం, “కన్నింగ్” (వంచన)కు ప్రతిరూపంగా నిలుస్తుందని మాయావతి అన్నారు. అయితే, మాయావతి తమంతట తాముగా ఆ ఆరోపణ చేయలేదు. బీఎస్పీ అధికార బీజేపీతో లోపాయికారి, రహస్య ఒప్పందం కుదుర్చుకుందని, కాంగ్రెస్ చేసిన ఆరోపణకు సమాధానంగా ఆమె కాంగ్రెస్ వంచనకు మారు పేరని అన్నారు. మరో వంక రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిది, అశోక్ సింగ్, రాష్ట్రంలోని ప్రతి ఓటరు, బీఎస్పీ, బీజేపీ అధికార ప్రతినిధి అనుకుంతున్నారని ఈ నిజాన్ని మాయావతి అంగీకరించక తప్పదని అన్నారు. బీఎస్పీలోని బీ’ బహుజనులు:ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు ప్రతీక అని అంటూ మాయావతి ఈ వర్గాల ప్రజల్ అండతోనే  రేపటి ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని అన్నారు.  అలాగే, 2017 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్’తో 2019 లోక్ సభ ఎన్నికల్లో బీఎస్పీతో పుట్టు పెట్టుకున్న ఎస్పీ, ఈసారి వ్యూహాన్ని మార్చి,  పెద్ద పార్టీలను పక్క పెట్టి, నిర్దిష్ట ఓటు బ్యాంక్ ఉన్న చిన్న చిన్న పార్టీలతో కూటమి కట్టే ప్రయత్నాలు సాగిస్తోంది.అయితే. ఎస్పీ ప్రయత్నాలను మాయావతి హేళన చేశారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీలలు ఎస్పీతో వద్దనుకోవడం వల్లనే ఆ పార్టీ దిక్కులేక చిన్నా చితక పార్టీలతో కూటమి కట్టే ప్రయత్నాలు చేస్తోందని ఆమె ఎద్దేవా చేశారు. ఇదలా ఉంటే, ఏఐఎమ్‌ఐఎమ్‌ నేత మన హైదరాబాద్ ఎంపీ, అసదుద్దీన్‌ ఒవైసీ యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌’కు సవాల్ విసిరారు. నెక్స్ట్ ఇయర్ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి రాకుండా  అడ్డుకుంటానని ఒవైసీ ఛాలెంజ్ విసిరారు. ఓమ్‌ ప్రకాశ్‌ రాజ్‌భర్‌ నేతృత్వంలోని సుహెల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ(ఎస్‌బీఎస్‌పీ)తో పాటుగా మరో 9 చిన్న పార్టీలతో కలసి ‘భాగీదారీ సంకల్ప్‌ మోర్చా’ రాష్ట్రంలోని అన్ని స్థానాల్లోనూ ఈ కూటమి అభ్యర్థులు పోటీ చేస్తారని ఒవైసీ ప్రకటించారు. ఈ సందర్భంగానే ఒవైసీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్’కు సవాల్   విసిరారు.  అంతకంటే కావలసిందేముందని యోగీ ఓకే అన్నారు. ఒవైసీ సవాలును స్వీకరిస్తున్నానని ఆదివారం వెల్లడించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు. రాష్ట్రంలో 300 పైగా అసెంబ్లీ స్థానాలను కమలదళం కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిజమే, విపక్షాలలో ఇదే అనైక్యత  ఎన్నికల వరకు ఇలాగేకొనాసాగితే, ఆదిత్యనాథ్ మళ్ళీ ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్య పోనవసరం లేదని రాజకీయ విశ్లేషకులు కూడా  అంటున్నారు.  కాగా, ఉత్తర ప్రదేశ్’లో గత 15 ఏళ్ల ఎన్నికల చరిత్రను చూస్తే, 2014,2019లోక్ సభ ఎన్నికలలో, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటు షేర్ పెరిగిందని, ఎన్నికల విశ్లేషకులు పెర్కొంటున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికలలో 40 శాతం ఓట్లు సాధించిన బీజేపీ 2019 నాటికి 50 శాతానికి పెంచుకుంది. ఎస్పీ, బీఎస్పీలు కలిసి పోటీచేసినా, ఆ రెండు పార్టీల వోట్ షేర్ 22 శాతం దాటలేదు. ఇక రేపటి ఎన్నికలలో పంచముఖ పోటీ అనివార్యంగా కనిపిస్తున్న నేపధ్యంలో యూపీ పీఠం మళ్ళీ యోగీదే అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.   ఇదలా ఉంటే, యూపీ ఎన్నికల బరిలోకి ఎంఐఎం ఎంట్రీ ఇవ్వడం యూపీలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్ పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చకు తెరతీసింది. బీజేపీతో అసలు సిసలు లోపాయికారీ ఒప్పందం ఉన్నది ఎంఐఎంకే అని, ఒవైసీ , అధిత్యనాథ్’కు సవాలు చేసింది కూడా ఆయన్ని గెలిపించడం కోసమే అని స్థానిక రాజకీయ వర్గాల్లో వినవస్తోంది. బీజేపీ, ఎంఐఎం పార్టీల తీరు  హైదరాబాద్’లో కుస్తీ యూపీలో దోస్తీ అన్నట్లుగా ఉందని అంటున్నారు. ముస్లిం ఓట్లను చీల్చి పరోక్షంగా  బీజేపీని గెలిపించెందుకే ఒవైసీ యూపీ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారని, నిజానికి బీజేపీ, ఎంఐఎం పార్టీల మధ్య ఈ ఒప్పందం ఒక్క యూపీకే పరిమితం కాదని కూడా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఏదైనా విపక్షాల అనైక్యత అధికార పార్టీకి మేలు చేస్తుంది, అది యూపీలోనే కాదు, ఏపీ, తెలంగాణాలలో అయినా అంతే..

వీరి వీరి గుమ్మ‌డిపండు.. వీరి పేరేంటి?

రెడ్ క‌ల‌ర్ టీ ష‌ర్ట్‌.. బ్లాక్ ప్యాంట్‌.. త‌ల‌కు హెల్మెట్ పెట్టుకొని.. సండే మార్నింగ్‌ సైకిల్‌పై వెళ్తున్న అత‌న్ని చూసి మొద‌ట అక్క‌డి వారు లైట్ తీసుకున్నారు. ఎవ‌రో సైకిలిస్ట్ అనుకొని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. అయితే, అంత‌లోనే ఆయ‌న వెనుక వ‌స్తున్న మందీమార్బ‌లాన్ని చూసి.. ఈయ‌న ఎవ‌రై ఉంటార‌బ్బా అని కాస్త జాగ్ర‌త్త‌గా అబ్జ‌ర్వ్ చేశారు. ఫోక‌స్ చేశాక ఆయ‌నెవ‌రో తెలిసి అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. వెంట‌నే ప‌రుగెత్తుకు వెళ్లి సెల్ఫీలు దిగారు. సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తే.. నిమిషాల వ్య‌వ‌ధిలోనే వంద‌లాది లైకులు, కామెంట్లు, ఎమోజీలు. మీరు ఆయ‌న‌తో ఎలా సెల్ఫీ దిగారు?  మీకంత ఛాన్స్ ఎలా వ‌చ్చిందంటూ వ్యూయ‌ర్స్ అంతా గ‌గ్గోలు. ఇంత‌కీ ఆయ‌నెవ‌రు? ఈ ఫోటోలో ఉన్నదెవ‌రు? సెల‌బ్రెటీ కాదు.. సినిమా స్టార్‌లా కూడా లేరు.. ఇంకెవ‌రై ఉంటారబ్బా? ఇంత‌కీ మ‌నోడేనా..? తెలుగువాడు కాకున్నా.. మ‌నంద‌రికీ తెలిసి వాడే. ఈ ఫోటోలో ఉన్న సైకిలిస్ట్ మ‌రెవ‌రో కాదు.. త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్‌. అవును, స్టాలినే. ఇదిప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్‌గా మారింది. ముఖ్య‌మంత్రి అయ్యాక స్టాలిన్ ఫిజిక‌ల్ ఫిట్‌నెస్‌పై మ‌రింత ఫోక‌స్ పెంచారు. డైలీ మార్నింగ్ యోగా, వ్యాయామం చేస్తున్నారు. సండేస్‌లో ఇలా సైక్లింగ్ కూడా చేస్తుంటారు. క్రమం తప్పకుండా ఆదివారాల్లో ఈసీఆర్‌ రోడ్డులో సైక్లింగ్ చేస్తూ క‌నిపిస్తుంటారు స్టాలిన్‌.  మ‌న ముఖ్య‌మంత్రిలా కాకుండా.. సీఎంగా బాధ్యత‌లు చేపట్టిన త‌ర్వాత‌.. కరోనా నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు స్టాలిన్‌. ఆయ‌నే స్వ‌యంగా క‌రోనా జాగ్ర‌త్త‌లు చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. జిల్లాల ప‌ర్య‌ట‌న నిర్వ‌హిస్తూ.. కొవిడ్ క‌ట్ట‌డిని స్వ‌యంగా ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఇక‌, మ‌న ముఖ్య‌మంత్రీ ఉన్నారు.. రాష్ట్రంలో క‌రోనా కల్లోలం సృష్టిస్తుంటే.. ఒక్క‌సారైనా ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చారా? క‌రోనా చ‌ర్య‌ల‌పై క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీల‌న జ‌రిపారా? ఆసుప‌త్రిలో బెడ్స్‌, మందుల కొర‌త వేధించినా ఏనాడైనా ప‌ట్టించుకున్నారా? త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ మ‌న ముఖ్య‌మంత్రిలా అలా కాదు. అన్నీ తానై ప‌ర్య‌వేక్షిస్తున్నారు.   బిజీ షెడ్యూల్ కార‌ణంగా రెండు నెలల గ్యాప్ త‌ర్వాత‌.. ఈ సండే ఇలా.. ఈసీఆర్‌ రోడ్డులోని కోవలం నుంచి మహాబలిపురం దాకా సైక్లింగ్ చేశారు సీఎం స్టాలిన్‌. ఆ మార్గంలో సైక్లింగ్‌  చేసే యువకులతో స్టాలిన్ చిట్‌చాట్ చేస్తూ ముందుకు  సాగారు. దారిలో ప్రజలను సీఎం పలుకరించారు. సీఎం అలా రోడ్డుపై సైకిల్ తొక్కుకుంటూ వెళుతుంటే ప్రజలు ఆశ్చర్యంగా చూశారు. మహాబలిపురం చేరుకున్న తర్వాత అక్కడి టీ షాపులో టీ తాగారు. అక్కడే కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. స్టాలిన్‌ సైకిల్‌ నడిపిన మార్గం పొడవునా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సైక్లింగ్ చేస్తున్న సీఎం స్టాలిన్‌తో కొంద‌రు సెల్ఫీలు దిగ‌గా.. ఆ ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. సీఎం అంటే ఇలా ప్ర‌జ‌ల‌తో క‌లిసిపోవాలంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. మ‌న ముఖ్య‌మంత్రీ ఉన్నారు ఎందుకు..? రాజ‌కోట వ‌ద‌లి బ‌య‌ట‌కు వ‌స్తేగా..? జ‌నాల‌ను అప్పుడ‌ప్పుడైనా పల‌క‌రిస్తేగా..? స్టాలిన్‌ను చూసైనా కాస్త మారండి సీఎం గారు....

థియేట‌ర్స్‌కు గ్రీన్ సిగ్న‌ల్‌.. మ‌రిన్ని ఆంక్ష‌లు స‌డ‌లింపు..

క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ మామూలు ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. షాపులు, మాల్స్ య‌ధావిధిగా ఓపెన్ చేస్తున్నారు. వైన్స్ అయితే ఎప్పుడో షెట్ట‌ర్‌ తెరిచేశారు. ఇలా ఎన్ని ఓపెన్ అయినా.. సినిమా థియేట‌ర్లు ఎప్పుడెప్పుడు తెరుస్తారా అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ రోజు రానే వ‌చ్చేసింది. ఈ నెల 8 నుంచి 50శాతం పరిమితితో.. సీట్ల మ‌ధ్య ఖాళీ ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటూ.. సినిమా హాల్స్ తెరుచుకోవ‌చ్చ‌ని ఏపీ స‌ర్కారు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేసింది. ఈ న్యూస్‌ సినీ ల‌వ‌ర్స్‌కు పండ‌గే అయినా.. స‌రైన‌ కొత్త సినిమాల రిలీజ్‌లు ఇప్ప‌ట్లో లేక‌పోవ‌డం అభిమానుల ఉత్సాహంపై నీళ్లు చ‌ల్లుతోంది.  ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ సడలింపు సమయాల్లో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గోదావరి జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 7 వరకు సడలింపులు ఉంటాయని తెలిపింది. సాయంత్రం ఆరు గంటలకే షాపులు మూసేయాలని ఆదేశించింది. మిగతా జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు సడలింపులు ఉంటాయి. గోదావరి జిల్లాలు మినహా మిగతా చోట్ల రాత్రి 9 గంటలకే దుకాణాలు క్లోజ్ చేయాల్సి ఉంటుంది. వైద్యఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జ‌గ‌న్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.  ఉభయ గోదావరిలో పాజిటివిటీ రేటు 5 శాతం లోపు వచ్చే వరకు అక్కడ క‌ర్ఫ్యూ ఆంక్షలు కొనసాగనున్నాయి. కొత్త‌ సడలింపులు ఈ నెల 8 నుంచి అమల్లోకి రానున్నాయి. 50 శాతం పరిమితితో.. కొవిడ్ నిబంధ‌న‌ల మేర‌కు త‌గు చ‌ర్య‌ల‌తో.. రెస్టారెంట్లు, జిమ్‌లు, కల్యాణ మండపాలకు సైతం ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.   

ఏపీ మంత్రులు గాజులు తొడుక్కున్నారా..?

తెలంగాణ స‌ర్కారు అంత‌లా ఓవ‌రాక్ష‌న్ చేస్తున్నా.. ఏపీ ప్ర‌భుత్వం చేత‌గానట్టు చేతులెత్తేయ‌డంపై రాష్ట్ర వ్యాప్తంగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ మంత్రులు సీఎం జ‌గ‌న్‌ను, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్సార్‌నూ నోటికొచ్చిన‌ట్టు తిడుతున్నా.. ఏపీ మంత్రులు మౌనం వ‌హించ‌డం అనుమానాల‌కు తావిస్తోంది. బూతుల మంత్రిగా పాపుల‌ర్ అయిన కొడాలి నాని సైతం చాలా సుతిమెత్త‌గా మాట్లాడ‌టం ఆశ్చ‌ర్యం. అగ్రెసివ్ మినిస్ట‌ర్‌గా పేరున్న నీళ్ల మంత్రి అనిల్‌కుమార్ సైతం ఆ-ఊ అంటూ ఉత్తుత్తి మాట‌లు చెబుతుండ‌టం అనుమానాస్ప‌దం. ఇక సీఎం జ‌గ‌న్‌ను గ‌జ‌దొంగ అని తిడుతుంటే.. ఏపీ మంత్రుల‌కు రేషం రావ‌ట్లేదంటే త‌మ నేత గ‌జ‌దొంగేన‌ని వాళ్లు ప‌రోక్షంగా ఒప్పుకున్న‌ట్టేనా? అని కొంద‌రు నిల‌దీస్తున్నారు. అయితే, దివంగ‌త మ‌హానేత‌ను సైతం నీళ్ల‌దొంగ అంటున్నా వైసీపీ నాయ‌కులు నోరు మూసుకొని కూర్చోవ‌డం వారి చేత‌గానిత‌నానికి నిద‌ర్శ‌న‌మ‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితే, తాజాగా వైఎస్సార్‌ను అన్నేసి మాట‌లు అంటున్నా.. ఏపీ మంత్రులు సైలెంట్‌గా ఉండ‌టంపై ఒక‌ప్ప‌టి వైఎస్సార్ అనుచ‌రుడైన జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఫైర్ అయ్యారు.  రాజశేఖర్‌రెడ్డి లాంటి పెద్ద మనిషిని బండ బూతులు తిడుతుంటే ఏం చేస్తున్నారని.. టీడీపీ నేత‌ల‌ను ఇష్టం వ‌చ్చిన‌ట్టు తిట్టే ఏపీ మంత్రులు ఇప్పుడు గాజులు తొడుక్కున్నారా? అని మండిప‌డ్డారు జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి. సీఎం జ‌గ‌న్ కామెంట్ల‌పైనా క‌స్సుమ‌న్నారు. హైదరాబాదులో సెటిలర్స్ ఎవరని నిలదీశారు. తమ పిల్లలు హైదరాబాద్‌లోనే పుట్టారని.. అక్కడే చదువుకున్నారని.. ఇక్కడ ప్రజలు త‌రుచూ హైదరాబాద్‌కి వెళ్తుంటార‌ని.. అలాంటి వాళ్లు సెటిల‌ర్స్ ఎలా అవుతార‌ని జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌ట్టారు.  ప‌నిలో ప‌నిగా.. తెలంగాణ మంత్రుల‌పైనా విరుచుకుప‌డ్డారు. తెలంగాణకు ద్రోహం చేశారని.. వైఎస్సార్‌ రాక్షసుడు అని తెలంగాణ మంత్రులు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు జేసీ. రాజశేఖర్ రెడ్డి లాంటి పెద్ద మనుషిని రాక్షసుడు అంటారా? అంటూ జేసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జ‌గ‌న్‌.. ఆఖ‌రికి త‌న తండ్రిని తిడుతున్నా.. ప‌డాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని ఆగ్ర‌హంతో పాటు అనుమాన‌మూ వ్య‌క్తం చేశారు జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి.   

‘కప్పట్రాళ్ల’ ఖైదీ మెడ‌లో పూల‌మాల‌.. మంత్రితో పాటే మ‌ర్యాద‌..

ఫ్యాక్ష‌న్ పేరు విన‌గానే వెంట‌నే గుర్తొచ్చేది రాయ‌ల‌సీమ‌. ఆ సీమ‌లోకే పేరుగాంచిన ఫ్యాక్ష‌నిస్ట్ క‌ప్ప‌ట్రాళ్ల గ్రామానికి చెందిన‌ వెంక‌ట‌ప్ప నాయుడు. ఒక‌ప్పుడు ఫ్యాక్ష‌నిస్టే అయినా.. ఆ త‌ర్వాత ప్ర‌శాంతత‌ కోరుకున్నారు. టీడీపీ నాయ‌కునిగా శాంతి కోసం ప్ర‌య‌త్నించారు. తాను మారినా.. త‌న ప్ర‌త్య‌ర్థులు మాత్రం మార‌లేదు. క‌ప్ప‌ట్రాళ్ల‌పై ప‌లుమార్లు హ‌త్యాప్ర‌య‌త్నం చేశారు. ఓ దాడిలో 18 క‌త్తి పోట్లు ప‌డినా.. బ‌తికి బ‌ట్ట‌క‌ట్టిన గ‌ట్టిపిండం క‌ప్ప‌ట్రాళ్ల వెంక‌ట‌ప్ప‌నాయుడు. అలాంటిది.. వైఎస్సార్ సీఎంగా ఉన్న హ‌యాంలో.. క‌ప్ప‌ట్రాళ్ల‌ను వెంటాడి.. వేటాడి.. దారుణంగా చంపేశారు ప్ర‌త్య‌ర్థులు. నిందితుల‌కు జీవిత ఖైదు ప‌డినా.. చ‌ట్టంలోని లొసుగులు సాకుగా చూపించి.. జైలు నుంచి బ‌య‌ట‌కొచ్చి.. వైసీపీ నేత‌ల‌తో చ‌ట్టాప‌ట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. తాజాగా, ఓ కార్య‌క్ర‌మంలో మంత్రి జ‌య‌రాంతో క‌లిసి రాచ‌మ‌ర్యాద‌లు అనుభ‌వించిన క‌ప్ప‌ట్రాళ్ల వెంక‌ట‌ప్ప నాయుడు హ‌త్య కేసులో ప్ర‌ధాన‌ హంత‌కుడు మద్దిలేటి నాయుడు వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపుతోంది. నేర‌గాళ్లు, హంత‌కుల‌తో వైసీపీ నాయ‌కులు అంట‌కాగుతున్న ఉదంతాలు భ‌యాందోళ‌న‌లు క‌లిగిస్తున్నాయి.   ఆనాడు వైఎస్సార్‌.. నేడు వైఎస్ జ‌గ‌న్‌.. అధికారంలోకి రాగానే టీడీపీ నాయ‌కుల‌పై దాడుల‌కు తెగ‌బ‌డుతూ అరాచ‌క పాల‌న‌కు తెర‌దీశారు. పాత ప‌గ‌ల‌ను మ‌ళ్లీ పురిగొల్పుతూ.. గ్రామాల్లో దాడులతో భ‌య‌కంపితుల‌ను చేస్తున్నారు. అధికారం చేతిలో ఉంద‌నే అహంతో.. టీడీపీ వ‌ర్గీయుల‌పై విచ్చ‌ల‌విడిగా దాడుల‌కు దిగుతున్నారు. జ‌గ‌న్ సీఎం అయ్యాక‌.. ప‌దుల సంఖ్య‌లో టీడీపీ నాయ‌కులు హ‌త్య గావించ‌బ‌డ‌టమే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని నారా లోకేశ్ ప‌దే ప‌దే విమ‌ర్శిస్తున్నారు. ఇప్ప‌టి జ‌గ‌న్‌లానే.. అప్ప‌టి వైఎస్సార్ హ‌యాంలో సైతం ఇలాంటి హ‌త్యాకాండే కొన‌సాగింది. ప‌రిటాల ర‌వి లాంటి ప్ర‌ధాన నేత‌ల‌ను సైతం తెలుగుదేశం పార్టీ కోల్పోయింది. ఆ కోవ‌లోనే.. 2008లో టీడీపీ నాయకుడు కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడి హత్య జ‌ర‌గ‌డం అప్ప‌ట్లో పెను సంచ‌ల‌నం. ఆ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఐదుగురు ఆదివారం విడుదలవ‌డం మ‌రింత క‌ల‌క‌లం. రాష్ట్రంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క‌ర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుడు క‌ప్ప‌ట్రాళ్ల‌ వెంకటప్ప నాయుడును 2008 మే 17న అతని ప్రత్యర్థులు పక్కా ప్రణాళిక ప్రకారం కాపుకాసి మ‌ట్టుబెట్టారు. కోడుమూరు సమీపంలోని మాచాపురం కాల్వ సమీపంలో జీపులో వెళ్తున్న వెంకటప్ప నాయుడును.. లారీతో ఢీకొట్టి.. బాంబులు వేసి.. వేటకొడవళ్లతో న‌రికి.. దారుణంగా చంపేశారు. ఆ ఘటనలో వెంక‌ట‌ప్ప‌నాయుడుతో పాటు మరో 8 మంది అనుచరులు స్పాట్‌లోనే చ‌నిపోగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.  ఆ హత్య కేసులో ప్రధాన నిందితుడు మద్దిలేటి నాయుడు. ఆయ‌న‌తో పాటు మొత్తం 48 మందిపై కేసు నమోదు చేసి విచార‌ణ జ‌రిపారు. 2014 డిసెంబరు 8న 21 మంది నిందితులపై నేరం రుజువు కావడంతో కోర్టు వారికి జీవిత ఖైదు విధించింది. దోషులు కడప కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. అయితే, ఆదివారం హత్య కేసులో ప్రధాన వ్యక్తి అయిన మద్దిలేటి నాయుడుతో పాటు మరో నలుగురు విడుదలయ్యారు. సుప్రీంకోర్టు తాజా ఉత్త‌ర్వులు వీరికి అనుకూలంగా మారాయి. బెయిల్‌ రాకుండా ఐదేళ్ల పాటు మగ్గిపోతున్న ఖైదీలను బెయిల్‌పై విడుదల చేయాలని సుప్రీంకోర్టు నెల రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే కరోనా నేపథ్యంలో జైళ్లలో సంఖ్య తగ్గించాలని కూడా సూచించింది. దీంతో ఐదేళ్ల పాటు బెయిల్‌ రాకుండా ఉన్న వారిని బెయిల్‌పై విడుదల చేస్తున్నారు. ఈ రూల్‌ను ఆధారంగా చేసుకొని.. త‌మ‌కు కావ‌ల‌సిన వారికి అనుకూలంగా మార్చి.. మద్దిలేటి నాయుడును జైలు నుంచి రిలీజ్ చేశారని అంటున్నారు. ఆదివారం క‌ర్నూలు జిల్లా ఈదుల దేవరబండ గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ముఖ్య అతిథిగా హాజరు కాగా, మద్దిలేటి నాయుడు సైతం మంత్రితో కలిసి పాల్గొనడంతో అంతా అవాక్క‌య్యారు. పాల‌కులు, హంత‌కులు ఒకేచోట‌, ఒకే విధంగా మ‌ర్యాద‌లు పొంద‌టంపై చెవులు కొరుక్కుంటున్నారు.  

కొత్త పింఛ‌న్లొచ్చే.. థాంక్యూ ఈట‌ల‌.. మిగ‌తా హామీల సంగ‌తేంది కేసీఆర్‌?

సీఎం కేసీఆర్ ఏది చేసినా.. ఏమి మాట్లాడినా.. దానికో అర్థం.. దాని వెన‌కో ప‌ర‌మార్థం ఉంటుందంటారు. మాట‌లు చెప్ప‌డం.. అర చేతిలో స్వ‌ర్గం చూపించి జ‌నాల్ని న‌మ్మించ‌డం మిన‌హా.. ఆయ‌న చేసేదేమీ ఉండ‌ద‌ని విమ‌ర్శిస్తుంటారు. ఏడేళ్ల క్రితం ఇచ్చిన ఎన్నిక‌ల హామీ అయినా.. ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి నుంచి మొన్న‌టి ఎల‌క్ష‌న్‌లో ఇచ్చిన నిరుద్యోగ భృతి వ‌ర‌కూ.. అనేక హామీలు ఇప్ప‌టికీ స‌జీవంగానే ఉన్నాయి. అందుకే, ప్ర‌జ‌ల్లో కేసీఆర్ గ్రాఫ్ దారుణంగా ప‌డిపోతోంది. సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు పోస్టుల‌తో కుమ్మేస్తున్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ వీడి బ‌య‌ట‌కు రార‌ని.. ఫామ్‌హౌజ్‌లో ప‌డుకుంటారంటూ.. కేసీఆర్ ఇజ్జ‌త్ మొత్తం తీసేస్తున్నారు. దుబ్బాక‌, జీహెచ్ఎమ్‌సీ ఎన్నిక‌ల్లో క‌ర్ర‌కాల్చి వాత కూడా పెట్టారు. ఆ త‌ర్వాత నాగార్జునసాగ‌ర్, ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో న‌యానో భ‌యానో గెలిచినా.. ప్ర‌జ‌ల్లో త‌న ప‌ర‌ప‌తి ప‌డిపోయింద‌నే విష‌యాన్ని ముఖ్య‌మంత్రి గ్ర‌హించారు.  ఆలోగా ఈట‌ల రాజేంద‌ర్ ఎపిసోడ్ తెర‌పైకి రావ‌డం.. కేసీఆర్ తీరును నిల‌దీస్తు పార్టీని వీడ‌టంతో గులాబీ బాస్ ఇమేజ్‌కు మ‌రింత డ్యామేజ్ జ‌రిగింది. ఈట‌ల మాట్లాడిన ఒక్కో మాట‌.. కేసీఆర్‌ను ఈటెల్లా గుచ్చుకున్నాయి. ఆయ‌న ప్ర‌స్తావించిన అంశాలపై ప్ర‌జ‌ల్లో విస్తృత చ‌ర్చ జ‌రిగింది. తెలంగాణ వ‌చ్చాక‌.. ఏడేళ్లుగా ఒక్క కొత్త రేష‌న్‌కార్డు అయినా ఇచ్చారా? ఏడేళ్లుగా ఒక్క కొత్త పింఛ‌న్ అయినా ఇచ్చారా? అంటూ ఈట‌ల నిగ్గ‌దీసి అడ‌గ‌డంతో.. నిజ‌మే క‌దా.. అంటూ జ‌నాలంతా కేసీఆర్‌ను దోషిగా చూడ‌టం మొద‌లుపెట్టారు. ఈట‌ల మాట‌ల‌తో కేసీఆర్ సైతం ఉలిక్కిప‌డ్డార‌ని అంటున్నారు. ఇదేదో కొంప‌ముంచే య‌వ్వారంగా ఉందేన‌ని వెంట‌నే రియ‌లైజ్ అయిన‌ట్టున్నారు. ఆ వెంట‌నే యాక్ష‌న్‌లోకి దిగిపోయారు. ఎవ‌రూ అడ‌గ‌కముందే.. ఈట‌ల ప్ర‌స్తావించినందుకే.. కేబినెట్ మీటింగ్ పెట్టి మ‌రీ.. పెండింగ్‌లో ఉన్న రేష‌న్ కార్డుల‌ను ఆగ‌మేఘాల మీద క్లియ‌ర్ చేయాలంటూ ఆదేశాలు ఇచ్చారు సీఎం కేసీఆర్‌. అదంతా ఈట‌ల వ‌ల్లేన‌ని ఆయ‌న‌తో పాటు అంద‌రికీ తెలిసిన విష‌య‌మే.  ఇక‌.. ఈట‌ల లేవ‌నెత్తిన మ‌రో ఇంపార్టెంట్ విష‌యంపైనా కేసీఆర్ దిగొచ్చారు. గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు.. 57 ఏళ్లు నిండిన అర్హులంద‌రికీ వృద్ధాప్య పింఛ‌న్లు ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. ప్రస్తుతం 60 ఏళ్లు నిండిన వారికే ఆసరా పింఛన్లు ఇస్తుండగా.. తాజాగా కేసీఆర్‌ నిర్ణయంతో 57 ఏళ్లు నిండిన వారికి కూడా వృద్ధాప్య పింఛన్లు రానున్నాయి. అది కూడా వ‌చ్చే నెల నుంచే పెన్ష‌న్స్ ఇవ్వ‌డం స్టార్ట్ చేస్తార‌ట‌. అంటే, హుజురాబాద్ ఎల‌క్ష‌న్స్ రాక‌ముందే.. ఈట‌ల రాజేంద‌ర్ ప్ర‌శ్నించిన స‌మ‌స్య‌ల‌న్నిటినీ సాల్వ్ చేసే ప‌నిలో సీఎం కేసీఆర్‌ ఉన్నార‌న్న మాట‌. అయినా, ఒక‌టా రెండా.. కేసీఆర్ నెర‌వేర్చ‌ని హామీలు ఎన్నో ఉన్నాయ్‌. వాటిన‌న్నిటినీ ఆయ‌న తీర్చ‌గ‌ల‌రా? ఏది ఏమైనా.. ఈట‌ల పుణ్యాన‌.. ఇక ఎప్ప‌టికీ రావ‌నుకున్న కొత్త రేష‌న్‌కార్డులు, కొత్త పెన్ష‌న్లు రాబోతుండ‌టంతో తెలంగాణ ప్ర‌జ‌లు తెగ ఖుషీ అవుతున్నారు. ఇవి రెండూ ఇస్తున్నందుకు కేసీఆర్‌కు కంటే.. ఈట‌ల‌కే ఎక్కువ థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు తెలంగాణ ప్ర‌జ‌లు.   

కేసీఆర్ జ‌ల‌క్రీడ‌!.. లొల్లి ఎక్కువ‌.. ప‌నులు త‌క్కువ‌..!

కేసీఆర్ మాయ‌ల మ‌రాఠీ. తిమ్మినిబ‌మ్మి చేయ‌డంలో నెంబ‌ర్ వ‌న్‌. ఏపీ-తెలంగాణ మ‌ధ్య మ‌రోసారి జ‌ల వివాదం త‌లెత్త‌డంతో.. సీఎం కేసీఆర్ తీరుపై మ‌రోసారి విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ కావాల‌నే కిరికిరి పెడుతున్నార‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నారు. 2015లో కృష్ణా జ‌లాల్లో 34శాతం వాటా చాలంటూ.. 299 టీఎంసీల‌కు ఒప్పందంపై సంత‌కాలు పెట్టార‌ని విప‌క్ష నేత‌లు చ‌రిత్ర త‌వ్విపోస్తున్నారు. అప్పుడు స‌రేన‌ని.. ఇప్పుడు తిర‌కాసు పెడుతూ రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుతున్నార‌ని మండిప‌డుతున్నారు.  ఏపీ సీఎం జగన్‌ శాసనసభలో మాట్లాడిన తర్వాత.. ప్రగతి భవన్‌కు వచ్చి కేసీఆర్‌ అనుమతి తీసుకున్నాకే 203 జీవోను విడుదల చేశారని రేవంత్‌రెడ్డిలాంటి నేత‌లు మండిప‌డుతున్నారు. ఏపీ ప్ర‌భుత్వం రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి శ్రీకారం చుట్టి, నిధులు కేటాయించి, ఏడాదిగా ప‌నులు చేస్తున్నా.. కిమ్మ‌న‌కుండా నోరు మూసుకున్న ముఖ్య‌మంత్రి.. ఇప్పుడు తెలంగాణ‌లో ఆయ‌న గ్రాఫ్ దారుణంగా ప‌డిపోవ‌డంతో స‌డెన్‌గా మ‌ళ్లీ కిరికిరి స్టార్ట్ చేశారంటున్నారు. అస‌లు తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌ను ప‌ణంగా పెట్టిందే కేసీఆర్ అంటూ.. ఇటు రేవంత్‌రెడ్డి.. అటు బండి సంజ‌య్‌లు మాట‌ల‌తో కుమ్మేస్తున్నారు. ఇంత సూటిగా ప్ర‌శ్నిస్తున్నా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ నుంచి మాత్రం స‌మాధానం లేదు.  నీళ్ల కోసం పోరాడుతున్నానంటూ రెచ్చ‌గొట్టే మాట‌లు మాట్లాడే కేసీఆర్ తెలంగాణ ప్రాజెక్టు కోసమూ పెద్ద‌గా చేసిందేమీ లేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. అందుకు, ప‌క్కా లెక్క‌ల‌తో స‌హా ఆధారాలు ముందేస్తున్నారు. 2014 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ తెలంగాణ ప్ర‌భుత్వం సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.1.70 ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు చేసింద‌ని.. అయినా ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేద‌ని సాక్షాలు చూపిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ గోదావ‌రి బేసిన్ ప్రాజెక్టుల‌పై 80వేల కోట్లు ఖ‌ర్చు చేస్తే.. కృష్ణా ప్రాజెక్టుల‌పై కేవ‌లం 30వేల కోట్లను మించ‌లేదు. నిధుల ఖ‌ర్చులో మెజార్టీ వాటా కాళేశ్వ‌రంకే పోయింది. ఒక్క కాళేశ్వ‌రం ప్రాజెక్టు కోసమే 68 వేల కోట్లు ఖ‌ర్చు చేసినా.. ఇంత వ‌ర‌కూ అద‌నంగా ఒక్క ఎక‌రా భూమి కూడా త‌డ‌ప‌లేద‌నే విమ‌ర్శ ఉంది. నిర్వాసితులు ప‌రిహారం కోసం ఇంకా క‌న్నీళ్లు ఇంకిన క‌ళ్ల‌తో ఎదురుచూస్తూనే ఉన్నారు. ముంపు పేరుతో త‌న ఇంటిని స‌ర్కారు గుంజుకోగా.. వేరే చోట ఇల్లు ఇవ్వ‌క‌పోవ‌డంతో ఇటీవ‌ల ఓ రైతు త‌న ఇంట్లో తానే చితిని పేర్చుకొని ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం ప్రాజెక్టుల పేరుతో ప్ర‌భుత్వం చేస్తున్న దారుణాల‌కు నిద‌ర్శ‌నం.  ప్ర‌స్తుత గొడ‌వంతా పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కోస‌మే. కాళేశ్వ‌రం కంటే ముందే ప్రారంభ‌మైన ఈ ప్రాజెక్టులో ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి ఎదుగూబొదుగూ లేదు. అంచనాలైతే 35 వేల కోట్ల నుంచి 52 వేల కోట్ల‌కు పెరిగాయి కానీ.. ఖ‌ర్చు మాత్రం 11 వేల కోట్ల ద‌గ్గ‌రే ఆగిపోయింది. భీమా ప్రాజెక్టుపై ఇప్ప‌టి వ‌ర‌కూ 2,600 కోట్లు ఖ‌ర్చు చేస్తే.. తెలంగాణ వ‌చ్చాక కేసీఆర్ ప్ర‌భుత్వం ఇచ్చిన నిధులు మాత్రం కేవ‌లం 700 కోట్లు మాత్ర‌మే. ఇలా.. తెలంగాణ‌లో పెండింగ్‌లో ఉన్న ఏ ప్రాజెక్టు తీసుకున్నా.. ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే. ఇక పెండింగ్ బిల్లులు రాక కాంట్రాక్ట‌ర్లు మొత్తుకుంటున్నారు.  కేసీఆర్ చేస్తున్న‌ ప‌నులు త‌క్కువ‌.. నిధుల కేటాయింపు ఇంకాత‌క్కువ‌.. మాట‌లు, బిల్డ‌ప్ మాత్రం చాలా చాలా ఎక్కువ అంటున్నారు. కేసీఆర్‌కు నీళ్ల కంటే త‌న‌కొచ్చే నిధులే ముఖ్య‌మ‌ని.. ప్రాజెక్టుల పేరుతో ఏపీతో గొడ‌వ క్రియేట్ చేసి.. ఆ మేర‌కు రాజ‌కీయ ల‌బ్ది పొంద‌ట‌మే ఆయ‌న టార్గెట్ అని విమ‌ర్శిస్తున్నాయి ప్ర‌తిప‌క్షాలు. ఇదంతా కేసీఆర్‌-జ‌గ‌న్ క‌లిసి ఆడుతున్న జ‌ల‌క్రీడ అని మండిప‌డుతున్నారు. సీఎం కేసీఆర్‌కే కృష్ణా జలాల‌పై అంత ప్రేమ ఉంటే.. ముందు పెండింగ్ ప్రాజెక్టుల‌కు నిధులు కేటాయించి.. పూర్తి చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ‌వాదులు.   

మ‌మ‌త‌కు క‌రోనా ముప్పు.. సీఎం ప‌ద‌వికి ఎస‌రు..?

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో పుష్కర్ సింగ్ రావత్ ప్రమాణ స్వీకారం చేశారు. తీరథ్ సింగ్ ప్రమాణ స్వీకారం చేసిన నాలుగు నెలలకే ఎందుకు రాజీనామా చేశారు? ఎందుకు రాజీనామా చేయవలసి వచ్చింది? అంటే, అందుకు ఇంకా ఇతర కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ, అటు భారతీయ జనతా పార్టీ, ఇటు నాలుగు నెలలు తిరగకుండానే రాజీనామా చేసిన తీరథ్ సింగ్ చెపుతున్న, ఆరు నెలల నిబంధన కారణం మాత్రం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు వేదిక అయింది.  ముఖ్యంగా పశ్చిమ  బెంగాల్లో రాజకీయాల్లో అయితే ప్రకంపనలే సృష్టిస్తోంది. తీరథ్ సింగ్ ఎమ్మెల్యే కాకుండానే, గత మార్చిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కానీ వారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే, అక్కడి నుంచి 6 నెలల్లోగా శాసన సభ్యునిగా ఎన్నిక కావాలనేది రాజ్యాంగ నిబంధ‌న. ఆవిధంగా ఆయన సెప్టెంబరు 10లోగా శాసన సభకు ఎన్నిక కావలసి ఉంటుంది. ఆయన పోటీ చేసేందుకు వీలుగా గంగోత్రి, హల్ద్వానీ నియోజక వర్గాలు సిద్దంగా ఉన్నాయి. ఈ రెండు నియోజకవర్గాలు ఖాళీగా, రెడీ టూ ఆక్యుపై అన్నట్లుగా ఉన్నాయి. అయితే, కొవిడ్ సెకండ్ వేవ్ కొనసాగడంతో పాటుగా థర్డ్ వేవ్ హెచ్చరికలు వస్తున్న కారణంగా ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధంగా లేదు. అందుకే, రాజ్యాంగ సంక్షోభం, వివాదం ఎదురుకాకుండా, ముందుగానే, ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో పుష్కర్ సింగ్ రావత్ ముఖ్యమంత్రిగా  బాధ్యతలు చేపట్టారు. అలా మూడో కృష్ణుడు ఎంట్రీతో ఉత్తరాఖండ్ కథ ముగిసింది.  అయితే, ఇక్కడే పశ్చిమబెంగాల్ కథ మొదలైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీని, ఒంటి కాలు మీద గెలిపించారు. అయితే, మమతా బెనర్జీ మాత్రం ఓడిపోయారు. నందిగ్రామ్ నియోజవర్గంలో బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో ఆమె ఓటమి చవిచూశారు. అయినా, ఆరు నెలల్లోగా అసెంబ్లీకి ఎన్నికయ్యేదుకు రాజ్యాంగం కల్పించిన వెసులు బాటును ఉపయోగించుకుని, ఎమ్మెల్యేగా ఎన్నిక కాకపోయినా మమతా బెనర్జీ మరోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. ఆరు నెలలలోగా ఆమె అసెంబ్లీకి ఎన్నికయ్యేందుకు  వీలుగా భవానీపూర్ ఎమ్మెల్యే రాజీనామా చేశారు.నామినేషన్ వేస్తే ఆమె గెలిచేస్తారు. అందులో ఎవరికీ సందేహం లేదు. అయితే, కొవిడ్ కారణంగా ఆరు నెలల గడువు ముగిసే లోగా ఉపఎన్నిక జరిగే అవకాశం కనిపించడం లేదు. గతంలో శాసన సభ్యులు కాకుండానే మంత్రులు, ముఖ్యమంత్రులు అయిన వారు, ఆరునెల గడవుకు ముందు రాజీనామా చేసి, మళ్ళీ మరో మారు మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా కొనసాగిన ఉదంతాలున్నాయి. అయితే, 1995లో  సుప్రీం కోర్టు, ఆరు నెలలు అంటే  ఆరే నెలలు, బ్రేక్ తీసుకుని మళ్ళీ మరో ఆరు నెలలు పదవులలో కొనసాగేందుకు వీలు లేదని స్పష్టం చేసింది. ఇక అప్పటి నుంచి, సభ్యులు కానీ వారు ఒక్క ఆరునెలలు మాత్రమే మంత్రులుగా కొనసాగుతున్నారు.  మమతా బెనర్జీ ముచ్చటగా మూడవ సారి, మే 5న ప్రమాణ స్వీకారం చేశారు. ఆ లెక్కన నవంబరు 4 లోగా ఆమె ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాలి. కానీ పశ్చిమ బెంగాల్‌లో మండలి లేనందున ఎమ్మెల్సీ అయ్యే ఛాన్స్ లేదు. ఖచ్చితంగా ఎమ్మెల్యేగానే గెలవాలి. ఐతే రాబోయే రోజుల్లో కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తుందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఎన్నిక సంఘం ముందుకు రావడం లేదు. ఇదే కారణంగా, ఇదే పరిస్థితిలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి రాజీనామా చేశారు. సో , మమతా బెనర్జీకి కూడా రాజీనామా చేయక తప్పదని రాజకీయ, రాజ్యాంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు, కొవిడ్  సెకండ్ వేవ్ ఉదృతికి బెంగాల్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా, కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక సభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించడమే కారణమని న్యాయ స్థానాలు ఎన్నికల సంఘాన్ని తప్పు పట్టిన నేపధ్యంలో ఎన్నికల సంఘం, కొవిడ్ థర్డ్ వేవ్ తలుపులు తడుతున్న సమయంలో మరోమారు అదే తప్పు చేయక పోవచ్చని అంటున్నారు. సో.. రాజీనామా చేయడం మినహా మమత ముందు మరో ఆప్షన్ లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  నిజంగా అదే పరిస్థితి వస్తే, మమతా బెనర్జీ ఏమి చేస్తారు? ఎవరిని ముఖ్యమంత్రిని చేస్తారు? అనేది బెంగాల్ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది . మేనల్లుడు అభిషేక్ బెనర్జీని లేదా ఇటీవలనే సొంతగూటికి తిరిగి వచ్చిన ముకుల్ రాయ్‌ను తాత్కాలికంగా ముఖ్యమంత్రిని చేసి, రిమోట్ కంట్రోల్ పాలన చేస్తారని అంటున్నారు. అయితే, అభిషేక్‌ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రమోట్ చేసిన సమయంలో మమతా బెనర్జీ కుటుంబ పాలనకు బాటలు వేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే, అందుకు జవాబుగా అన్నట్లుగా అభిషేక్ ఈ మధ్యనే తాను మరో 20 ఏళ్ల వరకు అధికార పదవులను ముట్టనని బహిరంగ ప్రకటన చేశారు. ఈ నేపధ్యంలో మమతా దీదీకి నిర్ణయం తీసుకోవడం కొంచెం చాలా  కష్టంగానే ఉంటుంద‌ని విశ్లేషకులు భావిస్తున్నారు.  

పాద‌యాత్ర‌గా బీజేపీ బండి.. రాజ‌కీయాల్ని న‌డిపిస్తున్న‌ రేవంత్‌రెడ్డి..

వ‌న్‌షాట్ మెనీ బ‌ర్డ్స్‌. కాంగ్రెస్ త‌న అమ్ముల‌పొదిలో ఉన్న బ్ర‌హ్మాస్త్రాన్ని వ‌దిలింది. చిచ్చ‌ర‌పిడుగు రేవంత్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌ని చేసింది. ఇలా ఢిల్లీలో ప్ర‌క‌ట‌న రాగానే.. అలా తెలంగాణ‌లో ప్ర‌కంప‌ణ‌లు మొద‌ల‌య్యాయి. సునామీలాంటి రేవంత్‌రెడ్డి రాక‌తో.. ఇటు గులాబీ వ‌నం.. అటు క‌మ‌లం పూదోట‌.. చిగురుటాకులా వ‌ణికిపోతున్నాయి. గులాబీ బాస్‌కు గులాబీ ముల్లులా గుండెల్లో గుచ్చుకుంది ఆ న్యూస్‌. అటు క‌మ‌ల ద‌ళ‌ప‌తిలోనూ క‌ల‌వ‌రం చెల‌రేగింది. ఇన్నాళ్లూ టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీగా ఉన్న పొలిటిక‌ల్ సినారియో.. ఇప్పుడు రేవంత్‌రెడ్డి వ‌ర్సెస్ అద‌ర్స్‌గా ట‌ర్న్ తీసుకుంది. ఇప్పుడు.. ఒక్క రేవంత్ ఒక‌వైపు.. కేసీఆర్‌, బండి సంజ‌య్ బ్యాచ్ అంతా మ‌రోవైపు.  ఇంకా బాధ్య‌త‌లైనా తీసుకోలేదు అప్పుడే రేవంత్‌రెడ్డి.. వార్ వ‌న్‌సైడ్ అన్న‌ట్టు దూసుకుపోతున్నారు. కేసీఆర్‌పై ఎంత‌గా అటాక్ చేస్తున్నారో.. బీజేపీపైనా అంతే దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. బండి, గుండు, ప‌గ‌టివేష‌గాళ్లు అంటూ కాషాయం నేత‌ల‌ను కుళ్ల‌బొడుస్తున్నారు. రేవంత్ మాట‌ల‌ దెబ్బ‌కి.. బీజేపీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతోంది. అందుకే కాబోలు.. రేవంత్ అంత‌గా తిడుతున్నా.. క‌మ‌ల‌నాథుల నుంచి క‌నీస కౌంట‌ర్ కూడా ప‌డ‌టం లేదు. రేవంత్ దాడి నుంచి త‌ట్టుకొని నిల‌బ‌డ‌టానికి.. యాక్ష‌న్‌లోకి దిగారు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు బండి సంజ‌య్‌. హైటెన్ష‌న్ తీగ‌లాంటోడైన రేవంత్‌రెడ్డిని ట‌చ్ చేస్తే కాలి బూడిదై పోతామ‌నుకున్నారో ఏమో.. ఆ ట్రాన్ష్‌ఫార్మ‌ర్ జోలికి పోకుండా త‌న దారిన తాను రాజ‌కీయ యాత్ర చేప‌ట్టారు. ఆగ‌స్ట్ 9 నుంచి పాద‌యాత్ర‌కు శంఖారావం ఊదారు బండి సంజ‌య్‌. ఆ రోజు మంచి స‌మ‌యాన‌.. హైద‌రాబాద్‌లో త‌నకు బాగా క‌లిసొస్తున్న భాగ్య‌ల‌క్ష్మి టెంపుల్ నుంచి పాద‌యాత్ర ప్రారంభించ‌నుంది ఈ బీజేపీ బండి. డెస్టినేష‌న్‌-హుజురాబాద్‌.   బండి ప్ర‌జెంట్ టార్గెట్‌--హుజురాబాద్‌. అందుకే, హైద‌రాబాద్ నుంచి హుజురాబాద్‌కు పాద‌యాత్ర‌గా రాజ‌కీయ యాత్ర ఆరంభించ‌నున్నారు. హుజురాబాద్‌ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్‌ను గెలిపించుకొని.. అధ్య‌క్షుడిగా త‌న ఆధిప‌త్యాన్ని మ‌రింత బ‌లోపేతం చేసుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ఇంత‌కు ముందైతే.. హుజురాబాద్‌లో తాము ఈజీగా గెలిచేస్తామ‌ని భావించారు క‌మ‌ల‌నాథులు. కానీ, పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి ఎంట్రీతో.. తెలంగాణ‌లో పొలిటిక‌ల్‌ ఈక్వేష‌న్స్ అమాంతం మారిపోతున్నాయి. రేవంత్ నాయ‌క‌త్వంలో రాజ‌కీయ పున‌రేకీక‌ర‌ణ జ‌రుగుతోంది. స‌బ్బండ‌ వ‌ర్ణాలు రేవంత్‌రెడ్డికే మ‌ద్ద‌తుగా క‌ద‌లివ‌స్తున్నాయి. ఆ జోరు.. ఆ జోష్ చూసి టీఆర్ఎస్‌తో పాటు బీజేపీలోనూ క‌ల‌వ‌ర‌పాటు పెరిగింది. అందుకే, ఆల‌సించినా ఆశాభంగ‌మంటూ.. బీజేపీ బాస్ బండి సంజ‌య్‌.. పాద‌యాత్ర‌కు శ్రీకారం చుట్టార‌ని అంటున్నారు. ప్రజాస్వామ్య తెలంగాణ కోసమే పాదయాత్ర అనేది బండి ట్యాగ్‌లైన్‌.  బండి సంజ‌య్ లాంగ్‌ట‌ర్మ్ పాలిటిక్స్‌ను దృష్టిలో పెట్టుకొని మార‌థాన్ వాకింగ్ చేయ‌బోతున్నారు. మొద‌టి ద‌శ‌లో హైద‌రాబాద్ టూ హుజురాబాద్ వ‌ర‌కు. ఉప ఎన్నిక ముగిశాక తెలంగాణ వ్యాప్తంగా మ‌హా పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్నారు. ఇప్ప‌టికే రూట్ మ్యాప్ కూడా రెడీ అయిపోయింది. ఆగస్ట్ 9న చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. వైఎస్ఆర్ పాదయాత్ర దారిలోనే బండి సంజయ్ కూడా రాజ‌కీయ యాత్ర కొన‌సాగించ‌నున్నారు. రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో మొదట విడత పాదయాత్ర జరగనుంది. మొదట విడతలో 55రోజుల పాటు 750కిలోమీటర్ల పాదయాత్ర చేయ‌నున్నారు. రోజుకు 15నుంచి 20కిలోమీటర్లు నడిచేలా ప్లాన్ చేస్తున్నారు. పాతబస్తీ, ఆర్యమైసమ్మ, మొయినాబాద్, చేవెళ్ల, వికారాబాద్ మీదుగా పాదయాత్ర జరగనుంది. మొదటి విడత పాదయాత్ర హుజురాబాద్‌లో ముగుస్తుంది. నాలుగైదు విడతల్లో తెలంగాణను చుట్టేయాల‌నేది బండి ప్ర‌ణాళిక‌. అసెంబ్లీ ఎన్నికలు వ‌చ్చే వ‌ర‌కూ జ‌నం నోళ్ల‌లో నానేలా.. ప్ర‌జ‌ల‌ను ప‌లక‌రించేలా.. పాద‌యాత్ర షెడ్యూల్ ప్రిపేర్ చేశారు క‌మ‌ల‌నాథులు. అటు, రేవంత్‌రెడ్డి సైతం పాద‌యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతున్న త‌రుణంలో మ‌రి, బీజేపీ బండి.. రేవంత్ దూకుడు ఏమాత్రం బ్రేకులు వేయ‌గ‌ల‌దో చూడాలి...  

కేసీఆర్‌ కేండిడేట్ ఎవ‌రు? హుజురాబాద్ అభ్య‌ర్థి ఆయ‌నేనా?

అన్ని పార్టీలు, మరీ ముఖ్యంగా అధికార తెరాస, అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హుజూరాబాద్ ఉపఎన్నికలో ఆ పార్టీ అభ్యర్ధి ఎవరు? ఇప్పుడు ఈ ప్రశ్న రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా వినవస్తోంది. ఈస్థానం  నుంచి వరసగా గెలుస్తూ వచ్చిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. బీజేపీలో చేరిన ఈటల ఆ పార్టీ అభ్యర్ధిగా బరిలో దిగుతున్నారు.  గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగాపోటీ చేసిన కౌశిక్ రెడ్డికే మళ్ళీ పార్టీ టికెట్ లభించే అవకాశం లేక పోలేదని అంటున్నారు. అయితే, టీపీసీసీ పగ్గాలు చేతుల మారిన నేపధ్యంలో, పీసీసీ కొత్త చీఫ్ రేవంత్ రెడ్డి కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం.  కౌశిక్ రెడ్డి గత ఎన్నికల్లో ఈటలకు గట్టి పోటీ ఇచ్చారు. ఈటలకు, ఒక లక్షా 4 వేల 840 (59.34 శాతం) ఓట్లు వస్తే, కౌశిక్ రెడ్డికి 61 వేల 121 (35 శాతం) ఓట్లు వచ్చాయి. ఈటల 43,719 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ద్విముఖ పోటీలో తెరాస అభ్యర్ధిగా పోటీ చేసిన ఈటలకు గట్టి పోటీ ఇచ్చిన కౌశిక్ రెడ్డి  రేపటి త్రిముఖ పోటీలో కాంగ్రెస్ పార్టీకి మంచి అభ్యర్ధి అవుతారు. ఆయన గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.అయితే, రాజకీయ లెక్కలు, ఎప్పుడు ఒకలా ఉండవు. అన్ని సందర్భాలలో వన్ ప్లస్ వన్ రెండు కాదు, అలాగే, వన్ బై టూ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ కాదు. ఎన్నికల ఇష్యూస్ ‘ను బట్టి ఓటింగ్ సరళీ, స్వభావం మారుతూ ఉంటుంది . ఓటర్ల ప్రాధాన్యతలు  మారుతూ ఉంటాయి. అందుకే ఏ ఎన్నికకు ఆ ఎన్నిక ప్రత్యేకంగా ఉంటుంది. ఫలితాలు అంతే ..    అదలా ఉంటే, కౌశిక్ రెడ్డికి మాజీ పీసీసీ చీఫ్’తో ఉన్న చుట్టరికం, అలాగే, ఇటీవల ఓ వేడుకల్లో ఆయన తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్’ను కలవడంతో ఆయన టికెట్ చుట్టూ అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి. నిజానికి కౌశిక్ రెడ్డి, మంత్రి కేటీఆర్’ను  ఉద్దేసపూర్వకంగానే కలిశారో లేక యాదృచ్చికంగా అలా జరిగిందో ఏమో గానీ,ఆయన తెరాసలో చేరుతున్నారు, హుజూరాబాద్ నుంచి తెరాస అభ్యర్ధిగా పోటీ చేస్తారు అనే పుకార్లు వినిపించాయి. దీంతో, ఆయన విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా మారిందని అంటున్నారు.నిజానికి ఒక దశలో కౌశిక్ రెడ్డి కూడా గోడదూకే ఆలోచన చేసినట్లు సమాచారం. అయితే, రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత ఆయన ఆలోచన మారింది. అందుకే, ఆయన రేవంత్’నుకలిసి తమ మనసులోని మాటను అయన ముందు ఉంచినట్లు వార్తలొచ్చాయి. నిజానికి, ఇప్పడు పరిస్థితులో ఉప ఎన్నికల్లో గెలుపు కంటే, గెలిచిన ఎమ్మెల్యే చేజారి పోకుండా చూసుకోవడం పీసీసి అధ్యక్షుడి  ముందున్న, ప్రధాన సవాల్’గా పార్టీ  వర్గాలు హెచ్చరిస్తున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్  మీద గెలిచిన 19 మందోలో 12 మంది పార్టీకి జెల్లకొట్టి కారెక్కి తుర్రుమన్నారు. కాబట్టి, కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్ పొడ కూడా గిట్టని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్’ను బరిలో దింపే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.  ఇక అసలు విషయంలోకి వస్తే, అధికార తెరాసకు అభ్యర్ధి దొరకడం లేదని అంటున్నారు. ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలు పోసీ, సొంత పార్టీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులను కొనుకున్నారన్న  అపవాదును/అవమానాన్ని మోస్తున్న తెరాస, ఈటలకు ధీటుగా నిలిచే సామర్ధ్యం కోసం దిక్కులు చూడవలసి రావడం మరింత అవమానకరంగా మారిందని అంటున్నారు. అయితే, వ్యూహాత్మకంగా దుగులు వేయడంలో ఆయనకు ఆయనే పోటీగా నిలిచే కేసీఆర్, ఎలాంటి వ్యూహంలో ఉన్నారో ఎవరికీ   తెలియదని అంటున్నారు. ఇటీవల జరిగిన హైదరబాద్ –రంగారెడ్డి – మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో, చివరి  వరకు మౌనంగా ఉంటూ వచ్చిన కేసీఆర్ ఆఖరి క్షణంలో పీవీ కుమార్తె వాణీ కుమారిని పార్టీ అభ్యర్ధిగా ప్రకటించి, ప్రత్యర్ధులను చిత్తు చేశారు. ఇప్పడు కూడా అదే వ్యూహంతో ఉన్నారని, ఎవరూ ఉహించని బ్లాక్ హార్స్, పార్టీ అభ్యర్ధి అయినా ఆశ్చర్య పోనవసరం లేదని పార్టీ వర్గాల్లోనే  కాదు, తెలంగాణ భవన్ వేలుపుల రాజకీయ వర్గాల్లో వినవస్తోంది.  అయితే, ప్రస్తుతానికి అయితే, మాజీ ఎంపీ వినోద్ మొదలు మంత్రి హరీష్ వరకు చాలా  మంది పేర్లే షికారు చేస్తున్నాయి. అలాగే, సామాజిక సమీకరణాలను కూడా బేరీజు వేస్తున్నట్లు తెలుస్తోంది.ఈటలకు సొంత ముదిరాజ్ వర్గంతో పాటుగా, రెడ్డి సామాజిక వర్గం (ఆయన భార్య రెడ్డి సామాజిక  వర్గానికి చెందినా వారు), అగ్ర కులాలు ( బీజేపీ అనుకూల ఓటు) కాకుండా .. ఇతర సామాజిక వర్గాలకు, ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధిని కేసీఆర్ బరిలో డింప వచ్చని  అంటున్నారు. ఇటీవల వరంగల్ పర్యటనలో, అంత వరకు  కూరలో కరివేపాకులా  పక్కన పెట్టిన కడియం ఇంటికి వెళ్లి విందు ఆరగించడం, అలాగే, ఎస్సీ సాధికారిత  పేరున, కాంగ్రెస్, బీజేపీ సహా అన్ని పార్టీలలోని ఎస్సీ నేతలను దగ్గర చేయడం, ఎస్సీ సాధికారిత ప్రకటన.. ఈ వ్యూహ రచనలో భాగమేనా అన్న మాట కూడా పార్టీ వర్గాల్లో వినవస్తోంది. ఈమధ్య కాలంలో ప్రభుత్వం దళిత సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. దళితులకు ప్రత్యేక నిధుల కేటాయింపు మొదలుకొని ఇటీవల దళిత మహిళ మరియమ్మ లాకప్‌డెత్‌ విషయంలో సీఎం స్పందన, ఇతర పరిణామాలు హుజూరాబాద్‌లో కొత్త రాజకీయ సమీకరణాలపై ఆసక్తిని రేపుతోంది. ఈ నేపధ్యంలో తెలుగుదేశం సీనియర్‌ నేత, దివంగత మాజీ మంత్రి ముద్దసాని దామోదర్‌ రెడ్డి సతీమణి ముద్దసాని మాలతి పేరు ప్రముఖంగా వినవస్తోంది. అయితే, చివరకు, అందరి ఉహాలను తల్లకిందులు చేయడం, కేసీఆర్  మార్క్ రాజకీయం. సో.. చివరకు, ఒకే దెబ్బకు రెండు పిట్టలు  అన్నట్లుగా హరీష్ రావు అయినా పార్టీ అభ్యర్ధి కావచ్చునని అంటున్నారు. ఏమో.. కేసీఆర్ మనసులో ఏముందో.. ఆయనకే తెలియదు. సో .. ఏదైనా జరగ వచ్చును.  

అన్నీ సిరిసిల్ల‌, సిద్ధిపేట‌ల‌కేనా? మిగ‌తా జిల్లాల మాటేంటి? త‌ల్ల‌డిల్లుతోన్న‌ తెలంగాణ‌!

సీఎం కేసీఆర్ సిరిసిల్ల‌లో అభివృద్ధి అద్భుతం ఆవిష్క‌రించారు. రాజ్యం త‌ల‌చుకుంటే.. ఒక ప్రాంతాన్ని ఎంత‌గా డెవ‌ల‌ప్ చేయ‌గ‌ల‌దో చేసి చూపించారు. స్వ‌యంగా ముఖ్య‌మంత్రి కుమారుడు కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో సిరిసిల్ల‌లో అర‌చేతిలో స్వ‌ర్గం అవిష్కృత‌మైంది. సిరిసిల్ల స‌రే.. మ‌రి మిగ‌తా జిల్లాల ప‌రిస్థితి ఏంద‌ని నిల‌దీస్తోంది తెలంగాణం. మండేపల్లిలో డ‌బుల్ బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్స్ స‌ముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. రూ.83.37 కోట్లతో 27 ఎకరాల్లో 1,320 డ‌బుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్స్‌ నిర్మించి.. లబ్ధిదారులకు అంద‌జేశారు. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డ్రైవింగ్, ట్రైనింగ్‌ రీసెర్చ్‌ కేంద్రంతో పాటు ఐడీటీఆర్‌ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. సిరిసిల్లలో నర్సింగ్ కాలేజీని ఓపెన్ చేశారు. సిరిసిల్ల మార్కెట్‌ కమిటీ సముదాయం, గిడ్డంగులు ప్రారంభించారు. సకల సౌకర్యాలతో రూ.64.70 కోట్లతో 93.33 ఎకరాల్లో నిర్మించిన‌.. సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్స‌వం జ‌రిగింది.  రాజు త‌లుచుకుంటే నిధుల‌కు కొర‌తా అన్న‌ట్టు.. వంద‌ల కోట్ల‌తో సిరిసిల్ల‌ను అత్య‌ద్భుతంగా తీర్చిదిద్దుతోంది తెలంగాణ స‌ర్కారు. ఒక్క సిరిసిల్ల‌నే కాదు.. సిద్ధిపేట కూడా అంతే. ఆ రెండు ప్రాంతాల్లో అచ్చం హైద‌రాబాద్‌లాంటి అభివృద్ధి అడుగ‌డుగునా క‌నిపిస్తుంది. సిరిసిల్ల‌, సిద్ధిపేట‌లు ప‌ర‌స్ప‌రం పోటీప‌డుతూ మౌలిక వ‌స‌తుల్లో దూసుకుపోతున్నాయి. అద్దంలాంటి రోడ్లు.. అంద‌మైన స‌ర్కిళ్లు.. ఎటుచూసినా ప‌చ్చ‌ద‌నం.. చెత్తాచెదారం లేకుండా ప‌రిశుభ్ర‌త‌.. అంద‌మైన ప్ర‌భుత్వ భ‌వ‌నాలు.. హాస్ట‌ళ్లు.. స్టేడియాలు.. మార్కెట్లు.. స్టోరేజ్ యార్డ్లు.. స్కూళ్లు.. కాలేజీలు.. ఆసుప‌త్రులు.. డ‌బుల్ బెడ్‌రూమ్ ఇళ్లు.. అబ్బో ఇది లేదు అది లేదు అనేది లేదు.. నిజంగా సిరిసిల్ల‌, సిద్ధిపేట‌ల‌దే అదృష్ట‌మంటే. కేసీఆర్ సొంత గ‌డ్డ‌, ఆయ‌న అల్లుడు హ‌రీష్‌రావు ఇలాఖా కావ‌డంతోనే సిద్ధిపేట‌లో అంత డెవ‌ల‌ప్‌మెంట్ జ‌రిగింది. కేసీఆర్ కొడుకు కేటీఆర్ సిరిసిల్ల‌ను త‌న రాజ‌కీయ వేదిక‌గా చేసుకోవ‌డంతోనే ఇంత‌టి అభివృద్ధి సాధ్య‌మైంది. సిరిసిల్ల సిగ‌లో టెక్స్‌టైల్ పార్కు కొలువుదీరింది. సిరిసిల్ల‌లో కొన్ని ప్రాంతాల్లో బంజారాహిల్స్ మాదిరి.. గ‌జం భూమి ల‌క్ష రూపాయ‌లు ప‌లుకుతోందంటే న‌మ్మాల్సిందే. డౌట్ ఉంటే వెళ్లి చూడాల్సిందే... సిరిసిల్ల‌, సిద్ధిపేట‌లు బాగా అభివృద్ధి చెంద‌టం సంతోష‌క‌రం. బ‌హు బాగుంది క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీ ప‌నిత‌నం. ఆ అభివృద్ధికి వారిని అభినందించాల్సిందే. కానీ.. తెలంగాణ అంటే సిరిసిల్ల‌, సిద్ధిపేట‌లు మాత్ర‌మే కాద‌ని.. ఇంకా హైద‌రాబాద్ మిన‌హా మ‌రో 30 జిల్లాలు ఉన్నాయ‌నే విష‌యం మ‌రిచిన‌ట్టున్నారు. సిరిసిల్ల దాటి ప‌క్క జిల్లాలో అడుగుపెడితే క‌నిపిస్తుంది అస‌లైన తెలంగాణ‌. సిద్ధిపేట వ‌దిలి మ‌రో జిల్లాలో ఎంట్రీ అయితే అడుగ‌డుగునా వెన‌క‌బాటుత‌న‌మే. మెద‌క్‌, కామారెడ్డి, ఆదిలాబాద్‌, న‌ల్గొండ‌, మ‌హ‌బూబాబాద్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌.. ఈ జిల్లా ఆ జిల్లా అని కాకుండా.. ఏ జిల్లా చూసినా అభివృద్ధికి ఆమ‌డ‌దూర‌మే. అంతెందుకు.. హైద‌రాబాద్ త‌ర్వాత అతిపెద్ద న‌గ‌రంగా గొప్ప‌లు చెప్పే వ‌రంగ‌ల్‌ను చూస్తే తెలుస్తుంది ఎంత అధ్వాహ్నంగా ఉంటుందో. ద‌శాబ్దాలుగా స‌మ‌స్య‌ల సుడిగుండంలో కూరుకుపోయిన ఎమ్‌జీఎమ్ హాస్పిట‌ల్ ఉదంతం.. కేసీఆర్ కంటికి క‌నిపించ‌డానికి ఇంత కాలం ప‌ట్టిందంటే ఆశ్చ‌ర్య‌మే.  హైద‌రాబాద్ అంటే నిజాంల కాలం నుంచే డెవ‌ల‌ప్ అయిందనుకోండి. మ‌రి, సిరిసిల్ల‌, సిద్ధిపేట‌లు ఈ ఏడేళ్ల‌లోనే హైద‌రాబాద్ స్థాయికి ఎద‌గ‌డం ఆయా ప్రాంతాల వారికి ఆనంద‌దాయ‌క‌మే అయినా.. మ‌రి, మిగ‌తా జిల్లాల ప‌రిస్థితి ఏంద‌నేదే ఇక్క‌డ ప్ర‌శ్న. ఎందుకీ, ద్వంద్వ వైఖ‌రి? ఎందుకీ స‌వ‌తి చేష్ట‌లు? కేవ‌లం మీ ఇలాఖాల‌నే డెవ‌ల‌ప్ చేసుకొని.. మీ రాజ‌కీయ వేదిక ప‌ది కాలాల పాటు చ‌ల్ల‌గుంటే స‌రిపోతుందా? మిగ‌తా జిల్లాలు ఎలా ఉన్నా ప‌ర్లేదా? అంటూ నిల‌దీస్తున్నారు మిగ‌తా జిల్లాల ప్ర‌జ‌లు.   తెలంగాణ వ‌చ్చిన కొత్త‌లో సీఎం కేసీఆర్ క‌రీంన‌గ‌ర్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చి ఎన్నెన్నో మాట‌లు చెప్పారు. అలా చేస్తా, ఇలా చేస్తానంటూ అర‌చేతిలో స్వ‌ర్గం చూపించారు. మానేరు డ్యామ్‌లో బోటు షికార్లు.. ఓడ్డున స్టార్ హోట‌ళ్లు.. అదేదో లండ‌న్‌లా తీర్చిదిద్దుతాన‌న్నారు కేసీఆర్‌. ఇప్పుడు క‌రీంన‌గ‌ర్‌ను చూస్తే.. లండ‌న్‌ సంగ‌తి దేవుడెరుగు.. ముందు రోడ్ల‌పై గుంత‌లు పూడ్చండి ముఖ్య‌మంత్రి గారూ అని వేడుకుంటున్నారు క‌రీంన‌గర్వాసులు. అప్ప‌ట్లో వ‌రంగ‌ల్‌లోనూ రెండు రోజులు విడిది చేసి.. సుడిగాలి ప‌ర్య‌ట‌న‌ల‌తో ఊద‌ర‌గొట్టి.. ఆ త‌ర్వాత ఉసూరుమ‌నిపించారు. ఇలా.. జిల్లా జిల్లాకు కేసీఆర్ ఇవ్వ‌ని హామీ లేదు.. ఎర్ర‌వ‌ల్లి, గంగ‌దేవిప‌ల్లి లాంటి గ్రామాల్లో ప‌ర్య‌టించి మ‌స్తు మాట‌లు జెప్పిండు. కానీ, వాటిని క‌నీసం అర‌కొరగానైనా నెర‌వేర్చిన పాపాన పోలేదు అంటున్నారు. ఏ జిల్లాను చూసినా అదే దౌర్బాగ్యం. కొత్త జిల్లాల పేరులైతే ఘ‌నంగా పెట్టారు కానీ.. ఖ‌జానా నుంచి కాసులు విద‌ల్చ‌క‌పోవ‌డంతో అవి అలానే కునారిల్లుతున్నాయి. అది జోగులాంబ-గ‌ద్వాల జిల్లా అయినా.. జ‌న‌గాం జిల్లా అయినా.. బంగారు తెలంగాణ‌లో సిరిసిల్ల‌, సిద్ధిపేట మిన‌హా ఏ జిల్లా చూసినా ఏముంది గ‌ర్వకార‌ణం..? సొంతింటి క‌ల గ‌జ్వేల్ వాసుల‌కే నెర‌వేరుతుందా? అద్దాల్లాంటి రోడ్లు సిద్దిపేట‌లోనే ఉండాలా? సిరిసిల్ల మాత్ర‌మే కోన‌సీమ‌లా మారాలా? మ‌రి, మిగ‌తా జిల్లాల మాటేంటి? ఆయా జిల్లాల వాసులు టీఆర్ఎస్‌కు ఓటు వేయ‌లేదా? అక్క‌డి వారు ప‌న్నులు క‌ట్ట‌డం లేదా? వారంతా తెలంగాణ బిడ్డ‌లు కారా? అని నిల‌దీస్తున్నారు అభివృద్ధికి నోచుకోని ప్ర‌జ‌లు. అధికారం మీ చేతుల్లోనే ఉంది కాబ‌ట్టి.. రాష్ట్ర‌ ఖ‌జానా మీ గుప్పిట్లోనే ఉంది కాబ‌ట్టి.. మీ ప్రాంతాలు మాత్ర‌మే తీర్చిదిద్దుకుంటారా? మ‌రి మా సంగ‌తేంట‌ని నిగ్గ‌దీసి అడుతున్నారు జ‌నాలు. ఓహో.. మిగ‌తా జిల్లాలూ డెవ‌ల‌ప్ కావాలంటే కేసీఆర్‌, కేటీఆర్‌, హ‌రీష్‌రావులు ఒక్కో ట‌ర్మ్‌లో.. ఒక్కో జిల్లా నుంచి పోటీ చేయాల‌న్న మాట‌..? అని సోష‌ల్ మీడియాలో సెటైర్లు ప‌డుతున్నాయి. మ‌రి, ఆ జిల్లాల ఆక్రంద‌న ఆ ముగ్గురి చెవికి సోకుతుందా? ఎప్ప‌టికైనా మిగ‌తా జిల్లాల్లోనూ ఆభివృద్ధి ఆన‌వాళ్లు క‌నిపిస్తాయా? సిరిసిల్ల‌, సిద్ధిపేటలే కాకుండా మిగ‌తా ప్రాంతాలూ బంగారు తెలంగాణగా మారుతాయా? ఏమో.....  

కేసీఆర్‌-జగన్ WWF డూప్‌ ఫైట్‌!.. ఆ ముగ్గురినీ ఏకిపారేసిన రేవంత్‌..

ఏ డైలాగ్ అయినా రేవంత్‌రెడ్డి నోటి నుంచి వ‌స్తే ఆ కిక్కే వేర‌ప్ప‌. ఏ విమ‌ర్శ అయినా.. రేవంత్ చేస్తే ఆ స్పైసీనెస్‌ వేరు. మాట‌ల‌తో తూట్లు పొడ‌వాల‌న్నా.. విష‌యాన్ని విడ‌మ‌రిచి చెప్పాల‌న్నా.. రేవంత్‌రెడ్డి త‌ర్వాతే ఎవ‌రైనా. ఇక ఇంట‌ర్న‌ల్ మేట‌ర్స్ రివీల్ చేయ‌డంలో ఆయ‌నే ఎక్స్‌ప‌ర్ట్‌. అందుకే, రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యారు. ఇక రాజ‌కీయ‌ వేట మొద‌లెట్టేశారు. తాజాగా, రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య జ‌రుగుతున్న జ‌ల వివాదంపై త‌న‌దైన స్టైల్‌లో విమ‌ర్శ‌లు గుప్పించారు. కేసీం కేసీఆర్‌, సీఎం జ‌గ‌న్‌ల‌ది ఉత్తుత్తి ఫైట్ అంటూ తీసిపారేశారు. ‘‘నీళ్ల విషయంలో కేసీఆర్‌-జగన్‌ది WWF ఫైట్‌ లాగా ఉంది. ఇదో డూప్‌ ఫైట్‌. వాళ్లిద్దరికి నీళ్లు... ఓట్లు, నోట్లు కురిపించే ఏటీఎంలా మారాయి. రాజకీయ ప్రయోజనం కోసం వివిధ ప్రాంతాల ప్రజల మధ్యన వైషమ్యాలు రెచ్చగొడుతున్నారు. ప్రశాంతంగా బతుకుతున్న వాళ్లను ఇబ్బందులు పెడుతున్నారు.’’ అంటూ రేవంత్‌రెడ్డి కాక రేపారు.   ఇక సీఎం జ‌గ‌న్‌ను ఓ ఆటాడుకున్నారు రేవంత్‌రెడ్డి. జ‌గ‌న్‌ను, వైఎస్సార్‌ను గ‌జ దొంగ, నీళ్ల‌ దొంగ అని తిడుతుంటే.. వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ కానీ, సీఎం జగన్ కానీ స్పందించకపోవడం ఏంట‌ని నిల‌దీశారు. రాజకీయాల్లో ఎన్టీఆర్‌, వైస్సార్‌ ఒక శకమని, వారిద్దరూ రాజకీయాలకు అతీతమన్నారు రేవంత్‌రెడ్డి. తెలంగాణలో సీమాంధ్ర ప్రాంత వాసులున్నారని, వారి కోసం సమయంనం పాటిస్తున్నానని ఏపీ సీఎం జగన్‌ అనడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణలోని సీమాంధ్రులకు రక్షణ కోటగా తాను, కాంగ్రెస్ పార్టీ ఉంటామ‌న్నారు రేవంత్‌రెడ్డి.  ఇక‌, త‌న‌కు పీసీసీ చీఫ్ ఇప్పించింది చంద్ర‌బాబేనంటూ వైసీపీ ఎంపీ విజ‌యసాయిరెడ్డి చేసిన కామెంట్ల‌పైనా రేవంత్‌రెడ్డి విరుచుకుప‌డ్డారు. విజయసాయిరెడ్డి తిక్కలోడు.. ఆయ‌న‌ది శునకానందం.. రాజకీయంగా అణాపైసా విలువ చేయడు.. అంటూ ఓ రేంజ్‌లో మండిప‌డ్డారు. చంద్రబాబుకి పీసీసీ పదవీ ఇప్పించగలిగే శక్తి సామర్థ్యాలున్నాయని విజయసాయి ఒప్పుకుంటున్నారా? అని ప్రశ్నించారు.   

కాపు వ‌ర్సెస్ గాలి.. సూసైడ్ అటెంప్ట్‌తో క‌ల‌క‌లం..

అక్ర‌మార్కులంతా ఒక‌టే బ్యాచ్‌. ఎక్క‌డున్నా అరాచ‌క‌వాదులంతా మిలాఖ‌త్‌. పార్టీలు వేరైనా.. ప్రాంతాలు వేరైనా.. ఫ్రెండ్‌ఫిప్ ఫ్రెండ్‌ఫిపే. అక్ర‌మ ఐర‌న్‌ మైనింగ్ సామ్రాజ్యానికి రారాజు గాలి జ‌నార్థ‌న్‌రెడ్డి కుటుంబం అనే ఆరోప‌ణ ఉంది. అక్ర‌మ సంపాద‌న‌కు కేరాఫ్ వైఎస్ కుటుంబ‌మ‌నే విమ‌ర్శ ఉంది. య‌ధారాజా త‌థా ప్ర‌జా అన్న‌ట్టు.. జ‌గ‌న్‌లానే వైసీపీ నేత‌లూ పెద్ద ఎత్తున అక్ర‌మ లావాదేవీల‌కు పాల్ప‌డుతున్నార‌నే ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. ఆ విష‌యం ప‌క్క‌న పెడితే.. తాజాగా జ‌రిగిన ఓ వివాదం ఏపీ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారింది. బీజేపీ బ‌ళ్లారి ఎమ్మెల్యే గాలి సోమ‌శేఖ‌ర్‌రెడ్డి తన‌యుడికి.. వైసీపీ రాయ‌దుర్గం ఎమ్మెల్యే కాపు రామ‌చంద్రారెడ్డి కుమారుడికి జ‌రిగిన గొడ‌వ‌.. సూసైడ్ అటెంప్ట్‌కు దారి తీయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.  రాష్ట్ర ప్రభుత్వ విప్‌, అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తనయుడు కాపు ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారు. గాలి కుటుంబంతో కాపు కుటుంబానికి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం బళ్లారి సిటీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి తనయుడు శ్రవణ్‌కుమార్‌రెడ్డితో క‌లిసి కాపు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కియా కార్ల షోరూం నిర్వ‌హిస్తున్నారు. ఆ బిజినెస్‌లో విభేదాలు వ‌చ్చి.. పెద్ద గొడ‌వ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. బ‌ళ్లారిలో జ‌రిగిన ఈ వివాదం ప్ర‌వీణ్ సూసైడ్ అటెంప్ట్‌తో వెలుగులోకి వ‌చ్చింది.  ఉమ్మ‌డిగా న‌డుపుతున్న కియా షోరూం ఆర్థిక‌ లెక్క‌లు స‌రిచూసుకుందామంటూ గాలి సోమశేఖర్‌రెడ్డి కుమారులు రెండుమూడు నెలలుగా అడుగుతున్నా.. కాపు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కాలయాపన చేస్తూ వ‌స్తున్నార‌ని అంటున్నారు. ఎంత‌కీ ప్ర‌వీణ్ లెక్క‌లు చూపించ‌క‌పోవ‌డంతో.. ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి ఆ విష‌యంలో జోక్యం చేసుకున్నారు. తన కుమారులను వెంటేసుకొని.. ఎమ్మెల్యే గాలి.. బళ్లారి సిటీలోని కియా కార్ల షోరూంకు చేరుకున్నారు. ప్రవీణ్‌ షోరూం ద‌గ్గ‌ర లేక‌పోవ‌డంతో ఫోన్ చేసి కాపు ప్ర‌వీణ్‌కుమార్‌రెడ్డిని పిలిపించారు. ప్రవీణ్‌ను ఎమ్మెల్యే గాలి, ఆయన కుమారులు ఆర్థిక‌ లావాదేవీల లెక్క‌లు అడ‌గ్గా.. వారి మధ్య వాగ్వాదం మొద‌లైంది. కాపు ప్రవీణ్‌కు ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి  గట్టిగానే వార్నింగ్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. దీంతో ప్రవీణ్‌ తీవ్ర మనస్తాపం చెంది.. పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పు అంటించుకునే ప్రయత్నం చేశారు. షోరూం సిబ్బంది కాపు ప్ర‌వీణ్‌కుమార్‌రెడ్డిని అడ్డుకుని.. బళ్లారిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రవీణ్‌ ఆరోగ్యం నిలకడగానే ఉండ‌టంతో వెంట‌నే డిశ్చార్జ్‌ చేశారు. ఇదీ జ‌రిగింది.  కేసులు, వివాదాల‌కు నిల‌య‌మైన ప‌క్క‌రాష్ట్రానికి చెందిన‌ బీజేపీ ఎమ్మెల్యే గాలి కుటుంబంతో.. వైసీపీ ఎమ్మెల్యే కాపు రామ‌చంద్రారెడ్డికి బిజినెస్ లావాదేవీలు ఉండ‌టం.. అందులో గొడ‌వ రావ‌డం.. కాపు కుమారుడు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేయ‌డం.. ఏపీలో చ‌ర్చ‌నీయాంశమైంది.   

‘రా’ఏజెంట్ @ టెర్ర‌రిస్ట్‌.. ఉగ్ర‌ క‌థా చిత్ర‌మ్‌..

నేను ‘రా’ఏజెంట్‌.. ఇప్పుడే మేడమ్‌కు రిపోర్టు చేశా.. దేశం కోసం ప‌ని చేస్తున్నా.. ‘రా’ కీల‌క ఆప‌రేష‌న్ అప్ప‌గించింది.. ఆ టాస్క్ మీదే ఉన్నా.. ఇలా దేశ అత్యున్న‌త సంస్థ రీసెర్చ్ అండ్ అనాల‌సిస్ వింగ్‌-రా పేరును ఇష్టం వ‌చ్చిన‌ట్టు వాడేసుకున్నాడు ఆ ఉగ్ర‌వాది. భార్య‌కు, మాజీ సైనికాధికారి అయిన తండ్రికి ఇలా సొల్లు క‌బుర్లు చెప్పి.. తాను ‘రా’ ఏజెంట్‌న‌ని న‌మ్మించాడు. పాపం.. ఆ కుటుంబ స‌భ్యులు సైతం త‌మ‌వాడు ‘రా’ ఏజెంట్ అనే న‌మ్మారు. అందుకే, త‌రుచూ అర్థ‌రాత్రి గంట‌ల త‌ర‌బ‌డి ఫోన్లో మాట్లాడినా అనుమానించ‌లేదు. అనుమానాస్ప‌ద వ‌స్తువులు ఇంట్లో క‌నిపించినా ప్ర‌శ్నించ‌లేదు. పైగా త‌మ వాడు దేశంకోసం ప‌ని చేస్తున్నాడంటూ గ‌ర్వంగా ఫీల్ అయింది ఆ ఫ్యామిలీ.  క‌ట్ చేస్తే, ‘రా’ఏజెంట్ డ్రామా టెర్ర‌రిస్ట్ ట‌ర్న్ తీసుకుంది. సంచ‌ల‌నం సృష్టించిన ద‌ర్భంగా రైల్వేస్టేష‌న్ పార్సిల్ బాంబు పేలుళ్ల కేసుల నిందితుడిగా తేలాడు మ‌హ‌మ్మ‌ద్ నాస‌ర్ ఖాన్‌. న‌లుగురు నిందితుల్లో వాడూ ఒక‌డు. నాస‌ర్ ఖాన్‌ తాను ‘రా’ ఏజెంట్ అని ఇంట్లో బిల్డ‌ప్ కొట్టి.. బ‌య‌ట బాంబులు పేల్చిన టెర్ర‌రిస్ట్‌. ఎన్ఐఏ విచార‌ణ‌లో ఈ విష‌యాలు వెలుగుచూశాయి. ‘రా’ ముసుగులో ఇంటినే టెర్ర‌రిస్ట్ డెన్‌గా మార్చిన ఆ కేటుగాడి ఉదంతం ద‌ర్యాప్తులో బ‌య‌ట‌ప‌డింది. జూన్‌ 17న బిహార్‌లో చోటుచేసుకున్న దర్భంగా పేలుళ్ల కేసులో ఇటీవల హైదరాబాద్‌ ఆసిఫ్‌నగర్‌లోని అన్నాదమ్ములు ఇమ్రాన్‌ఖాన్‌, నాసిర్‌ ఖాన్‌లను ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. వీరి అరెస్టుతో వారి ఫ్యామిలీ షాక్ అయింది. అదేంటి.. త‌న కొడుకు భార‌త గూఢ‌చారి.. త‌న‌నెందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ.. మాజీ సోల్జ‌ర్ అయిన‌ నాసిర్ తండ్రి ఎన్ఐఏను ప్ర‌శ్నించాడంటే.. ఆ ఉగ్ర‌వాది ఇంట్లో వాళ్ల‌ను ఏ రేంజ్‌లో మేనేజ్ చేశాడో తెలుస్తోంది.  ఇంట్లో ‘రా’ఏజెంట్ అనే డ్రామాను మ‌హ‌మ్మ‌ద్ నాస‌ర్ ఖాన్ కొన్నేళ్లుగా ర‌క్తి క‌ట్టిస్తున్నాడు. క్ర‌మ‌క్ర‌మంగా క‌రుడుగ‌ట్టిన ఉగ్ర‌వాదిగా మారాడు. 2012లో ఓ బంధువును కలుసుకోవడం కోసం అంటూ అధికారిక పత్రాలతో  నాసిర్‌ పాకిస్థాన్ వెళ్లాడు. ఆ సమయంలో తనకు ‘రా’ ఓ కీల‌క టాస్క్‌ అప్పజెప్పిందని భార్యను, మాజీ సైనికుడైన తండ్రిని నమ్మించాడు. ఆ తర్వాత అనధికారికంగా వేర్వేరు మార్గాల్లో పాకిస్థాన్‌కు రెండు,మూడు సార్లు వెళ్లివచ్చాడు. ఆ క్ర‌మంలో 4 నెలల పాటు పాక్‌-అఫ్గానిస్థాన్ బోర్డ‌ర్‌లో లష్కరే శిబిరంలో బాంబుల త‌యారీలో శిక్షణ పొందాడు. టైమర్‌ పరికరాలు వాడటం, ఐఈడీ బ్లాస్టింగ్స్ చేయ‌డంలో ఎక్స్‌ప‌ర్ట్‌గా మారాడు.  పాక్ నుంచి వ‌చ్చిన ఆదేశాల మేర‌కు.. ఇటీవ‌ల బాంబు పేలుడు జ‌ర‌ప‌డం.. ఎన్ఐఏ ద‌ర్యాప్తులో నాసిర్ దొరికిపోవ‌డం.. విచార‌ణ‌లో ‘రా’ఏజెంట్ అని ఇంట్లో వారిని బురిడీ కొట్టించిన విష‌యం వెలుగుచూడ‌టం.. త‌దిత‌ర విష‌యాల‌న్నీ జ‌రిగాయి. ఈ నెల 17న బిహార్‌లోని దర్భంగా రైల్వే స్టేషన్‌లో పార్సిళ్లు దింపుతుండగా పేలుడు సంభవించింది. దుస్తుల మధ్యలో ఉంచిన చిన్న సీసా నుంచి పొగలు వచ్చి పేలుడు జరిగింది. దర్యాప్తు జ‌ర‌ప‌గా.. ఆ పార్సిల్‌ సికింద్రాబాద్‌లో బుక్‌ చేసినట్లు గుర్తించడం.. ఉగ్ర కోణంపై అనుమానం రావ‌డంతో.. కేసు ఎన్ఐఏకు బ‌దిలీ అయింది. ఈ కేసులో యూపీలో ఇద్ద‌రు, హైద‌రాబాద్‌లో ఇద్ద‌రు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్‌ ఆసిఫ్‌నగర్‌లో అద్దెకు ఉంటూ రెడీమేడ్ డ్రెసెస్ అమ్ముతున్న‌ ఇమ్రాన్‌, నాసిర్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. ఈ విచార‌ణ‌లో భాగంగానే టెర్ర‌రిస్ట్‌ నాసిర్ ఖాన్ ఆడిన‌.. ‘రా’ఏజెంట్ డ్రామా బ‌య‌ట‌కు వ‌చ్చింది.   

ఏపీ ఖ‌జానా ఖాళీ!.. స‌మ‌యానికి నో పెన్ష‌న్‌..!

ఏపీ ఖ‌జానా ఖాళీ. ఉద్యోగుల‌కు స‌మయానికి జీతాలు కూడా ఇవ్వ‌లేని దుస్థితి. 1వ తేదీ జీతం తీసుకొని చాలా నెల‌లే అయిందంటున్నారు. మాజీ ఉద్యోగుల పెన్ష‌న్ల‌కు కూడా ఇదే ప‌రిస్థితి. కేలండ‌ర్‌లో డేట్లు మారుతుంటాయి.. కానీ ఏపీ ఉద్యోగుల మొబైల్‌కు మ‌నీ క్రెడిటెడ్ అనే మెసేజ్ మాత్రం అంత ఈజీగా రాదంటారు. ఈ నెల కాక‌పోతే వ‌చ్చే నెల అయినా.. ప‌రిస్థితి మారుతుందిలే అనుకుంటే.. నెల నెలా అదే తీరు అని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఒక‌టో తారీఖు ఈఎమ్ఐలు క‌ట్ అయ్యే వారి బాధ‌లు అంతాఇంతా కాదు. అప్పు చేసి అకౌంట్లో డ‌బ్బులు ఉండేలా చూసుకుంటున్నారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌మైనా ఇలా అప్పులు చేయ‌డం ఏంటంటూ వాపోతున్నారు. ఉద్యోగుల‌తో పాటు రిటైర్డ్ ఉద్యోగుదీ అదే బాధ‌. అస‌లే అర‌కొర పెన్ష‌న్‌. అది కూడా టైమ్‌కి రాక‌పోతే ఎలా? ఎన్ని ఖ‌ర్చులుంటాయి? ఎన్ని బాధ్య‌త‌లుంటాయి? టైమ్‌కి పెన్ష‌న్ ప‌డ‌క‌పోతే ఇంత క‌ష్ట‌మవుతుంది? ఈ బాధ‌లేవీ స‌ర్కారు చెవికి సోక‌డం లేదు. ఇంత‌కుముందెప్పుడూ ఇలా జ‌ర‌గ‌లేద‌ని.. జ‌గ‌న్ హ‌యాంలోనే ఈ దుస్థితి దాపురించింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.  ఓ రిటైర్డ్ ఎంప్లాయిస్ వాట్స‌ప్ గ్రూల్‌లో జ‌రిగిన వాట్సాప్ చాట్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. పెన్ష‌న్ ఎవ‌రెవ‌రికి ప‌డ‌లేదంటూ ఓ పెద్దాయ‌న మెసేజ్ పెడితే... హ్యూజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. మాకు రాలేదంటే... మాకు రాలేదంటూ.. ట‌కట‌కా మెసేజ్‌లు పెడుతూనే ఉన్నారు.   మొద‌ట కృష్ణా జిల్లా రిటైర్డ్ ఎంప్లాయ్ త‌మ జిల్లాలో ఎవ‌రికీ ఇంకా పెన్ష‌న్ ప‌డ‌లేద‌ని పోస్ట్ పెట్టారు. ఆ త‌ర్వాత గుంటూరు, విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం, ప్రకాశం.. ఇలా ఏపీ వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఎవ‌రికీ స‌మ‌యానికి పెన్ష‌న్ రాలేదంటూ.. మెసేజ్‌ల‌తో హోరెత్తించారు. ఆ వాట్సాప్‌ మెసేజ్‌లు ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి.. ఏపీలో స‌మ‌యానికి పెన్ష‌న్లు కూడా వేయ‌డంలేదంటూ.. ఇదేమి స‌ర్కారంటూ నెటిజ‌న్లు జ‌గ‌న్ స‌ర్కారును కామెంట్ల‌తో కుమ్మేస్తున్నారు.   ఏపీ ఆర్థిక ప‌రిస్థితి అస‌లేమాత్రం బాగాలేద‌ని అంటున్నారు. న‌వ‌ర‌త్నాల పేరుతో ఖ‌జానా ఖాళీ చేశారు. ఏపీని అప్పుల కుప్ప‌గా మార్చేశారు. చేసిన ప‌నుల‌కు కాంట్రాక్ట‌ర్ల‌కు బిల్లులే ఇవ్వ‌డం లేదు. ప్ర‌భుత్వ ఖాతాలో పైసా కూడా లేదంటున్నారు. ఈ విష‌యం స్వ‌యంగా అధికారులే హైకోర్టుకు చెప్పారంటే ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. డ‌బ్బుల కోసం భూముల వేలానికీ సిద్ధ‌మ‌య్యారు. పెట్టుబ‌డులు ఆక‌ర్షిస్తే.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే.. ఆదాయం పెరుగుతుంది. అది వ‌దిలేసి.. ఓట్ల కోసం సంక్షేమ ప‌థ‌కాలతో ఊద‌ర‌గొడితే.. ఉన్న సొమ్ముంతా ఖ‌ర్చ‌యిపోతోంది. అమ‌రావ‌తిని డెవ‌ల‌ప్ చేసినా బాగుండేది.. ఎంతోకొంత ఏపీ ఇమేజ్ పెరిగి కంపెనీలు పెట్టుబ‌డుల‌కు ముందుకొచ్చేవి. సీఎం జ‌గ‌న్ అరాచ‌క విధానాల‌తో రాష్ట్రం దివాళా తీస్తోందంటూ విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ఆర్థిక క్లిష్ట ప‌రిస్థితుల్లో కేంద్రం రూపంలో మ‌రో స‌మ‌స్య వ‌చ్చిప‌డింది.  ఏం చేసినా.. ఎంత ప్ర‌య‌త్నిస్తున్నా.. ఏపీ స‌ర్కారుకు అప్పు ముట్ట‌డం లేదు. ఇప్ప‌టికే లిమిట్ దాటేయ‌డ‌మే.. కొత్త అప్పుల‌కు కేంద్ర స‌ర్కారు చెక్ పెట్టింది. తాజాగా, ఏ మేర‌కు కేంద్రం నుంచి వ‌చ్చిన తాఖీదు.. జ‌గ‌న్ స‌ర్కారుకు పెద్ద షాక్ అనే చెప్పాలి. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌ రుణ పరిమితిని రూ.27,668 కోట్లకే పరిమితం చేయ‌డం మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డ్డ‌ట్టే. రుణ పరిమితిని పెంచాలంటూ రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు కేంద్రం చుట్టూ తిరుగుతుంటే.. ఉన్న లిమిట్‌నూ త‌గ్గిస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకోవ‌డంతో ఏపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.  అప్పుల‌నే న‌మ్ముకొని సంక్షేమ ప‌థ‌కాల‌తో ఊద‌ర‌గొడుతున్న జ‌గ‌న్ స‌ర్కారుకు కేంద్రం విధించిన ఈ ష‌ర‌తు బిగ్ షాక్ అనే చెబుతున్నారు. అప్పు ప‌రిమితిలో కోత ప‌డ‌టంతో.. ఇప్పుడిక తిప్ప‌లు త‌ప్ప‌వంటున్నారు. మ‌రి ఈ అప్పుల ఊబి నుంచి జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం ఎలా బ‌య‌ట‌ప‌డుతుందో.. ఉద్యోగుల‌కు, పెన్ష‌న్‌దారుల‌కు స‌మ‌యానికి శాల‌రీ ఎప్పుడు ప‌డుతుందో.....    

అనుకున్న టైమ్‌కే మంత్రివర్గ మార్పులు.. నో వాయిదా..

ఇక మన టైమ్ వస్తోంది...ఇప్పుడు పదవి వస్తే వచ్చినట్లు.. లేదంటే ఇక అంతే సంగతులు.. అని ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తున్నారు రోజాలాంటి కొందరు. మన టైమ్ అయిపోతుంది.. తీసేస్తారేమో.. సజ్జలనో, విజయసాయినో పట్టుకుంటే ఏమైనా కంటిన్యూ చేస్తారేమో.. ఏం చేద్దాం అంటూ టెన్షన్ పడుతున్నారు వెల్లంపల్లి లాంటి కొందరు మంత్రులు. ఎవరి టైమ్ మారినా.. మన టైమ్ మారే సమస్య లేదు.. జగనన్న మనలను పక్కకు పెట్టడు అనే ధైర్యంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని వంటి వాళ్లు ఫీలవుతున్నారు. రెండున్నరేళ్లకు మంత్రివర్గాన్ని మారుస్తానన్న జగన్ అప్పటి ప్రకటన.. ఇప్పుడు ఆ టైమ్ దగ్గరికొస్తున్న కొద్దీ కాక పుట్టిస్తోంది. డిసెంబర్ తో ఆ గడువు పూర్తి కానున్నది.. దీంతో రకరకాల ఊహాగానాలతో వైసీపీలో నేతలు అల్లాడిపోతున్నారు.  వైసీపీని నెత్తికెత్తుకునే ఓ వెబ్ పోర్టల్ లో ఈ మంత్రివర్గ మార్పులు లేటు కావొచ్చని..ఎందుకంటే కోవిడ్ రావడంతో సంవత్సరం పాటు..మంత్రుల పనులకు ఆటంకాలు వచ్చాయని.. దీని వలన వారి పెర్ ఫార్మెన్స్ అంచనా వేయడంలో ఇబ్బందులొస్తాయని.. కాబట్టి ఈ గడువు పెంచే అవకాశముందని స్టోరీ ఇచ్చారు. అయితే ఇది కొందరు మంత్రులు రాయించుకున్న స్టోరీ అని.. వాస్తవానికి జగన్ డిసెంబర్ తర్వాత మంత్రివర్గ మార్పులకు ఫిక్స్ అయిపోయారని.. కోవిడ్ కారణంతో ఏ పనులు ఆపని..జగన్మోహన్ రెడ్డి ఇది మాత్రం ఎందుకు ఆపుతారని వైసీపీలోని కొందరు నేతలు వాదిస్తున్నారు.  కాదు.. టీడీపీ నుంచి వచ్చిన కొందరు..ఇంకా వస్తారని ప్రచారంలో ఉన్నవారు...వీరిలో కొందరికి మంత్రి పదవుల హామీ ఉందని.. అయితే టీడీపీలాగా పార్టీ మారినవారికి మంత్రి పదవి ఇవ్వడం కుదరదని.. వారితో రాజీనామా చేయించి.. ఎన్నికలు జరిగి.. వైసీపీ టిక్కెటుపై తిరిగి గెలిచేవారికే ఆ మంత్రి పదవి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచించారని.. కాని ఇప్పుడు ఆ ప్రక్రియ జరిగే అవకాశం లేదని..అందుకే వాయిదా వేయొచ్చని కొందరు వాదిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో నయానో భయానో.. తమకున్న బలంతో గెలిచారు. దీంతో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోయాయి. కాబట్టి ఇలాంటి ప్రక్రియలు..వాళ్లకు వీళ్లకు మంత్రి పదవులు ఇవ్వకపోతే ఎలా అనే డౌట్స్ జగన్ కు లేవని..అందుకే ఆయన అనుకున్నది అనుకున్నట్లు షెడ్యూల్ ప్రకారం ప్రొసీడ్ అయిపోవడం ఖాయమనే వాదన గట్టిగా వినపడుతుంది. కాబట్టి డిసెంబర్ చివరిలోనో..లేదా సంక్రాంతికో మంత్రివర్గ మార్పులు ఉంటాయని.. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని వైసీపీలో బలంగా వినపడుతోంది. అంతే కాదు.. ఎవరిని తీసేయాలి..ఎవరిని కొత్తగా తీసుకోవాలి.. ఎవరి శాఖలు మార్చాలి అనేవన్నీ జగన్ ఇప్పటికే డిసైడ్ అయిపోయారని.. జస్ట్ టైమ్ రావాలంతే అని కూడా చెబుతున్నారు.  

పేరు గొప్ప‌.. ప‌నితీరు చెత్త‌.. ఏపీ I&PRపై విమ‌ర్శ‌లు..

ఏపీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ I&PR. ఇన్ఫ‌ర్మేష‌న్ అండ్ ప‌బ్లిక్ రిలేష‌న్స్ డిపార్ట్‌మెంట్‌. అత్యంత కీల‌క‌మైన విభాగం. ప్ర‌భుత్వాన్ని ప్ర‌జ‌ల‌కు అనుసంధానించే బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మం. ప్ర‌భుత్వం ఏం చేసింది.. ఏం చేస్తోంది.. ఏం చేయ‌బోతోంది.. అనే స‌మాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల‌కు చేర‌వేయ‌డ‌మే ఈ శాఖ ప‌ని. కానీ ఏపీ ప్ర‌భుత్వ‌ I&PR శాఖ‌ ప‌ని తీరుపై అనేక విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. చెయ్యాల్సిన ప‌నుల‌ను ప‌క్క‌న‌పెట్టేసి.. కులాసాగా అధికారులు సేద‌తీరుతున్నార‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.  ఏ ప్ర‌భుత్వానికైనా I&PR డిపార్ట్‌మెంట్ చాలా కీల‌కం. క‌మిష‌న‌ర్ ఆధ్వ‌ర్యంలో అనేక మంది అధికారులు, సిబ్బంది, ఇత‌ర‌ వ‌న‌రుల‌తో ఏపీ I&PR కు ఘ‌న‌మైన నెట్‌వ‌ర్క్ ఉంది. అయినా, ప‌నితీరు మాత్రం పేల‌వంగా ఉంద‌నే విమ‌ర్శ వినిపిస్తోంది. ఇక‌, ఏపీ I&PR చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు 18 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఉన్నాయ‌ని తెలుస్తోంది. చాలా కాలంగా బిల్లులు క‌ట్ట‌క‌పోవ‌డంతో.. I&PRకు ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్‌ క‌ట్ చేశార‌ట‌. టెలిఫోన్ బిల్లులూ చెల్లించ‌క‌పోవ‌డంతో.. అవుట్‌గోయింగ్ క‌ట్ అయింద‌ట‌. ఇంత‌కంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా?   ఇక‌, ఏకంగా I&PR క‌మిష‌న‌ర్ ప‌నితీరు మీద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. హైద‌రాబాద్‌లో ఓ చిన్న స్కూల్ న‌డిపే.. క‌మిష‌న‌ర్ గారి మామ ఇటీవ‌ల చ‌నిపోతే.. గొప్ప విద్యావేత్త మ‌ర‌ణించిన‌ట్టుగా.. త‌న ప‌ర‌ప‌తి ఉప‌యోగించి మీడియాలో తెగ ప్ర‌చారం ఇప్పించుకున్నారంటూ ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. జ‌ర్న‌లిస్టుల‌ అక్రిడేష‌న్లు ఏళ్ల త‌ర‌బ‌డి పెండింగ్‌లో పెట్ట‌డం.. చెత్త రూల్స్ పెట్టి జ‌ర్న‌లిస్టులంద‌రికీ అక్రిడేష‌న్లు రాకుండా చేయ‌డం.. ఆయ‌న ఘ‌న‌కార్య‌మేనంటూ ఆరోప‌ణ‌లు ఉన్నాయి.  ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ ప్ర‌చార బాధ్య‌త I&PR నిర్వహించాల్సి ఉంటుంది. ప్ర‌భుత్వ విధానాల‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డం.. అభివృద్ధి, సంక్షేమాన్ని ప్ర‌జ‌ల చెంత‌కు చేర్చ‌డం I&PR ముఖ్య క‌ర్త‌వ్యం. మీడియా కో-ఆర్డినేష‌న్‌తో ప్ర‌భుత్వాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. చేయాల్సిన ప‌నులు చాలానే ఉన్నా.. చేస్తున్న ప‌నులు మాత్రం నామ‌మాత్రం. ఏపీలో న‌వ‌ర‌త్నాల పేరుతో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌ల‌వుతున్నాయి. వాటి ప్ర‌చార బాధ్య‌త‌ల‌ను సాక్షి మీడియానే త‌మ భుజాల మీద వేసుకుంది కానీ.. ప్ర‌భుత్వ విభాగ‌మైన I&PR అస‌లేమాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. సీఎం జ‌గ‌న్ ప్ర‌సంగాల‌ను I&PR పోర్ట‌ల్‌లో ప్ర‌చారం చేయ‌డం మిన‌హా.. త‌మవంతుగా ప‌థ‌కాల ప్ర‌మోష‌న్‌కు ఎలాంటి ప్ర‌త్యేక క‌థ‌నాలు క్రియేట్ చేయ‌డం లేద‌ని చెబుతున్నారు. అదే, సాక్షి మీడియాలోనైతే.. ఉన్న‌ది లేన‌ట్టుగా.. విష‌యాన్ని హైప్ చేసి చూపిస్తుంటే.. I&PR మాత్రం ఉన్న విష‌యాన్నే సరిగ్గా ప్ర‌మోట్ చేయ‌డం లేద‌ని ఆ శాఖ ప‌నితీరుపై ప్ర‌భుత్వ‌ వ‌ర్గాలే పెద‌వి విరుస్తున్నారు.  I&PRకు పెద్ద నెట్‌వ‌ర్కే ఉంది. ముఖ్య‌మంత్రితో స‌హా మంత్రులంద‌రికీ ఈ శాఖ‌ త‌ర‌ఫున పీఆర్వోలు ఉన్నారు. మంత్రుల నిర్ణ‌యాల‌ను, కార్య‌క్ర‌మాలు ఎప్ప‌టిక‌ప్పుడు మీడియాకు, ప్ర‌జ‌ల‌కు తెలియ చేయాల్సి బాధ్య‌త పీఆర్వోల‌దే. కానీ, ప్ర‌జ‌లు ఎవ‌రికైనా తెలుసా ఏ మంత్రి ఏ స‌మీక్ష నిర్వ‌హించారో? ఏ మంత్రి ఛాంబ‌ర్ నుంచి ఎలాంటి ఉత్త‌ర్వులు రిలీజ్ అయ్యాయో? మంత్రుల ప‌నితీరుపై ఎలాంటి స‌మాచారం బ‌య‌ట‌కు రానేరాక‌పోవ‌డానికి కార‌ణం.. ఆ మంత్రులు ప‌ని చేయ‌డం లేద‌నా? లేక‌, I&PR విభాగం ప‌నితీరు బాగాలేద‌నా? అనే అనుమానం క‌ల‌గ‌క మాన‌దు. ఇక, ప్ర‌తీ ప్ర‌భుత్వ విభాగంలోనూ I&PR త‌ర‌ఫున‌ పీఆర్వోలు ఉంటారు. వాళ్లు ఆయా శాఖ‌ల ప‌నితీరును, పాల‌సీల‌ను ప్ర‌చారం చేయాలి. మ‌రి, ప్ర‌భుత్వ శాఖ‌ల అప్‌డేట్స్ ఏవైనా ప‌బ్లిక్‌కు తెలుస్తున్నాయా? ఏ డిపార్ట్‌మెంట్ నుంచి ఏ జీవో వ‌చ్చింద‌నే స‌మాచారం ప్ర‌జ‌ల‌కు చేరుతుందా? ఏ శాఖ ఎన్ని నిధులు ఖ‌ర్చు చేసిందో.. ఏ విభాగం నుంచి ఏయే ప‌నులు అయ్యాయనే దానిపై.. ఏపీ ప్ర‌జ‌ల‌కు స‌మాచారం ఇవ్వ‌డంలో I&PR దారుణంగా విఫ‌ల‌మైంద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ప‌నంతా సాక్షి మీడియా మీద తోసేసి.. ఈ ప్ర‌భుత్వ శాఖ చేతులు ముడుచుకు కూర్చుంద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇలా ఏపీ I&PR ను భ్ర‌ష్టుప‌ట్టిస్తున్న వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌నే డిమాండ్లు బ‌లంగా వినిపిస్తున్నాయి.