రేవంత్ చెప్పిన సీత క‌థ‌.. కేసీఆర్ వింటే మైండ్ బ్లాంక్‌...

పంచ్‌లు.. ప‌టాకాలు.. పేల్చ‌డంలో రేవంత్ త‌ర్వాతే ఎవ‌రైనా. అందులోనూ అది కేసీఆర్ మీద అయితే.. మ‌రింత మ‌జాగా మాట్లాడ‌తారు. కేసీఆర్‌ను క‌వ్వించ‌డంలోను.. కుళ్ల‌బొడ‌వ‌డంలోనూ.. రేవంత్ త‌ర్వాతే ఎవ‌రైనా. అలాంటిది ఇక ఆయ‌న‌ టీపీసీసీ చీఫ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన సంద‌ర్భంగా కేసీఆర్ మీద విరుచుకుప‌డితే ఎట్టా ఉంటాదో తెలుసా..? రేవంత్ నోటి నుంచి వ‌చ్చిన విమ‌ర్శ‌లు ఎంత వాడి వేడిగా ఉన్నాయో తెలుసా..? కేసీఆర్‌కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. లేటెస్ట్ స్పీచ్‌లో ఎప్ప‌టిలానే కేసీఆర్‌పై గాటైన విమ‌ర్శ‌ల‌తో పాటు రేవంత్ చెప్పిన రామాయ‌ణ క‌థ ర‌క్తి క‌ట్టించింది. రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ తల్లిని మనం ఎవరం చూడలేదు. తెలంగాణ ఇచ్చిన సోనియానే మనకు తెలంగాణ తల్లితో సమానం. ఎంతమంది అడ్డుపడ్డా సోనియా తెలంగాణ ఇచ్చారు. అందుకే, ప్రతీ ఇంట్లో సోనియా పటం ఉండాలన్నారు రేవంత్‌రెడ్డి. ఆ స‌మ‌యంలో రేవంత్‌రెడ్డి సీత క‌థ‌ను ఇంట్రెస్టింగ్‌గా చెప్పారు.  రామాయణంలో సీతను ఎత్తుకెళ్లేందుకు రావణాసురుడు మారీచుడితో కలిసి మాయ లేడి రూపంలో వచ్చి సీతమ్మ తల్లిని అపహరించారు. సీతమ్మను లంకలో దాచిపెట్టినట్టే.. తెలంగాణ ప్రజలు పూజించే తెలంగాణ తల్లిని కేసీఆర్.. తన ఫామ్ హౌసులో దాచి పెట్టుకున్నారని ఆరోపించారు.  మారీచుడు, రావణాసురుడు కలిస్తేనే కేసీఆర్ అని విమర్శలు చేశారు. లంకలో ఉన్న సీతను కాపాడేందుకు రాముడికి వానర సేన ఎలా సాయం చేసిందో.. టీఆర్ఎస్‌ను ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే కార్యకర్తలు వానర సేనలా పని చేయాలని పిలుపిచ్చారు రేవంత్‌రెడ్డి. రెండేళ్లు కష్ట‌ప‌డితే.. ఇక విజయం మనదే అని కేడ‌ర్‌లో జోష్ నింపారు.  ఇలా.. తెలంగాణ త‌ల్లిని  సీత‌మ్మతో పోల్చి.. సోనియ‌మ్మ‌ను తెలంగాణ త‌ల్లిని చేసి.. కేసీఆర్‌ను రావ‌ణాసురుడు, మరీచుడితో జ‌త‌క‌ట్టి.. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి చేసిన తొలి ప్ర‌సంగం విశేషంగా ఆక‌ట్టుకుంటోంది.   

12 మంది అవుట్.. చివరి నిమిషంలో స్మృతి సేఫ్! 

కేంద్ర మంత్రివర్గం రూపురేఖలు మారిపోయాయి. కేబినెట్ విస్తరణ ఉంటుందని భావించినా.. పూర్తి స్థాయిలో ప్రక్షాళనే జరిగింది. ప్రధాని మోడీ రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్న తొలి విస్తరణలో భారీ మార్పులే జరిగాయి. జంబో కేబినెట్ ఏర్పాటైంది. ఎవరూ ఊహించని విధంగా కొత్తగా 43 మంది మంత్రులను కేబినెట్ లోకి తీసుకున్నారు ప్రధాని మోడీ. అనేక శాఖలకు కొత్త మంత్రులు వచ్చారు.  ప్రస్తుతం కేబినెట్ లో ఉన్నవారిలో ఏకంగా 12 మందిని తప్పించారు. ఇందులో కొందరిని పని తీరు సరిగా లేదంటూ ఉద్వాసన పలకగా.. వయసు, ఆరోగ్య సమస్యలతో మరికొందరిని తప్పించారని చెబుతున్నారు.  కేబినెట్ నుంచి కొందరిని తప్పిస్తారని ముందు నుంచి ప్రచారం జరిగినా.. ఎవరూ ఊహించని మంత్రులను తొలగించడం ఆసక్తిగా మారింది. ముఖ్యంగా  కేంద్ర వైద్యశాఖ మంత్రి హర్షవర్దన్‌ పై వేటు వేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. కొవిడ్ నియంత్రణ చర్యల్లో ఆరోగ్యశాఖ పని తీరుపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హర్షవర్ధన్ శాఖ మారుస్తారని అంతా భావించారు. కాని మోడీ మాత్రం అతన్ని ఏకంగా తొలగించేశారు.  రమేశ్‌ పోఖ్రియాల్‌,  సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌, సదానందగౌడ, రతన్‌లాల్‌ కటారియా, దేవశ్రీ చౌధురి, సంజయ్‌ ధోత్రే, రావు సాహెబ్‌ ధన్వే పాటిల్‌, అశ్వినీ చౌబే, బాబుల్‌ సుప్రియోలను కేబినెట్ నుంచి తప్పించారు.అనారోగ్య కారణాలతో పదవి నుంచి తప్పుకొంటున్నట్టు రమేశ్‌ పోఖ్రియాల్‌ స్పష్టంచేశారు.   ఇక కేంద్ర కేబినెట్ నుంచి స్మృతి ఇరానీని తప్పిస్తారనే ప్రచారం జరిగింది.ఆమె రాజీనామా చేయబోతున్నారని  నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కాని స్మృతి ఇరానీని కేబినెట్ లోనే కొనసాగిస్తున్నారు ప్రధాని మోడీ. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన స్మృతి గత లోక్ సభ ఎన్నికల్లో అమెథీలో రాహుల్ గాంధీపై సంచలన విజయం సాధించారు. కేంద్ర కేబినెట్ లో కీలక శాఖను దక్కించుకున్నారు. రాహుల్ ను ఓడించిన ఘనతే ఈసారి కూడా ఆమెను కాపాడిందని తెలుస్తోంది. మరికొన్ని నెలల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో స్మృతిని తొలగించడం సరికాదని బీజేపీ పెద్దలు చివరి నిమిషంలో నిర్ణయించారని సమాచారం.  మరోవైపు స్మృతి ఇరాని విషయంలో మరో ప్రచారం కూడా జరుగుతోంది. తనను తొలగిస్తున్నారన్న ప్రచారం రావడంతో స్మృతి ఇరానీ.. బుధవారం ఉదయమే ప్రధాని మోడీ ఇంటికి వెళ్లారని  తెలుస్తోంది. ప్రధానితో పాటు హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమైన స్మృతి.. తనను కేబినెట్ లో కొనసాగించాలని కోరారని చెబుతున్నారు. యూపీలో పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తానని కూడా స్మృతి ఇరానీ చెప్పారట. అన్ని అంశాలు పరిశీలించాకే ఆమెను కేబినెట్ లో ఉంచాలని మోడీ టీమ్ నిర్ణయించిందని బీజేపీ వర్గాల సమాచారం.  

రేవంత్‌ ప‌వ‌ర్‌ఫుల్ స్పీచ్‌.. కేసీఆర్‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్‌.. కేడ‌ర్‌కు స్వీట్ వార్నింగ్‌

కరోనా కంటే పీఎం మోదీ, సీఎం కేసీఆర్‌లే ప్రమాదకరం. అందుకే మోదీ, కేసీఆర్‌ల‌ను వంద మీటర్ల గొయ్యి తీసి పాతిపెట్టాలంటూ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రెండేళ్లు కష్టపడితే కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందంటూ కేడ‌ర్‌లో ఉత్సాహం నింపారు. టీపీసీసీ చీఫ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టాక‌.. కాంగ్రెస్ శ్రేణుల‌ను ఉద్దేశించి మాట్లాడారు రేవంత్‌రెడ్డి. బోరున వ‌ర్షం కురుస్తుండ‌గా.. వాన‌దేవుడు కూడా త‌మ పార్టీలో చేరారంటూ చ‌మ‌త్క‌రించారు.    తెలంగాణ తల్లిని మనం ఎవరం చూడలేదు. తెలంగాణ ఇచ్చిన సోనియానే మనకు తెలంగాణ తల్లితో సమానం. ఎంతమంది అడ్డుపడ్డా సోనియా తెలంగాణ ఇచ్చారు. అందుకే, ప్రతీ ఇంట్లో సోనియా పటం ఉండాలన్నారు రేవంత్‌రెడ్డి. ఆ సంద‌ర్భంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామాయణంలో సీతను ఎత్తుకెళ్లేందుకు రావణాసురుడు మారీచుడితో కలిసి మాయ లేడి రూపంలో వచ్చి సీతమ్మ తల్లిని అపహరించారు. సీతమ్మను లంకలో దాచిపెట్టినట్టే.. తెలంగాణ ప్రజలు పూజించే తెలంగాణ తల్లిని కేసీఆర్.. తన ఫామ్ హౌసులో దాచి పెట్టుకున్నారని ఆరోపించారు. మారీచుడు, రావణాసురుడు కలిస్తేనే కేసీఆర్ అని విమర్శలు చేశారు. లంకలో ఉన్న సీతను కాపాడేందుకు రాముడికి వానర సేన ఎలా సాయం చేసిందో.. టీఆర్ఎస్‌ను ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే కార్యకర్తలు వానర సేనలా పని చేయాలని కోరారు. ఇక విజయం మనదే.. తెలంగాణ ద్రోహులు మంత్రులయ్యారని, తెలంగాణ ప్రజల కష్టాలు తీరాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలన్నారు. కేసీఆర్‌ వచ్చాక ఎన్‌కౌంటర్లు, రైతుల ఆత్మహత్యలు ఆగలేదన్నారు. తెలంగాణకు పట్టిన చీడ కేసీఆర్‌ కుటుంబమేనని, తెలంగాణను కేసీఆర్‌ దోచుకుంటున్నార‌ని అన్నారు. మోదీ, కేసీఆర్‌ వల్ల పేదోడు బతికే పరిస్థితులు లేవన్నారు రేవంత్‌రెడ్డి. రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణలో లక్షా 7 వేల ఖాళీలుంటే.. తాజాగా పీఆర్సీ బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో లక్ష 91 వేల ఖాళీలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కేసీఆర్ నిజంగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఉద్యోగ ఖాళీలు ఎందుకు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చినప్పటికీ ఇంత వరకు ఉద్యమకారుల మీద కేసులు తొలగించలేదని విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజలకు పట్టుకున్న గులాబీ చీడను తరిమికొట్టాలని అన్నారు. ఉద్యమకారుడు అని చెప్పుకునే కేసీఆర్.. తెలంగాణను దోచుకుంటున్నారని ప్రశ్నించారు. ఇక‌, పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్‌ ప్ర‌శాంత్‌కిశోర్‌పైనా రేవంత్‌రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలంటే.. ప్రశాంత్‌ కిషోర్‌ని పెట్టుకోవాలని కొందరు సలహా ఇస్తున్నారని, పాదరసంలాంటి  కార్యకర్తలే తమకు పీకేలు అన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలే పీకేలు.. ఏకే-47 తూటాలు అంటూ కేడ‌ర్‌తో ఫుల్ జోష్ తీసుకొచ్చారు రేవంత్‌రెడ్డి.  రేవంత్ ప్ర‌సంగంలో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన ఘ‌ట‌నా చోటుచేసుకుంది. తాను క్ర‌మ‌శిక్ష‌ణ‌కు ఎంత ప్రాధాన్య‌త ఇవ్వ‌బోతున్న‌ది చాలా స్ట్రాంగ్‌గా తెలియ‌జెప్పారు. అవ‌స‌ర‌మైతే పార్టీ నుంచి బ‌హిష్క‌రిస్తానంటూ కేడ‌ర్‌కు స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. రేవంత్‌రెడ్డి ప్ర‌సంగిస్తుండ‌గా.. సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేశారు కొంద‌రు అభిమానులు. అలాంటి నినాదాలు వ‌ద్ద‌ని.. అందరం సమష్టిగా కలిసి పని చేస్తామని... అధిష్ఠానం నిర్ణయాలకు కట్టుబడి ఉంటామంటూ.. ఎవరూ అలాంటి నినాదాలు చేయొద్దంటూ కాస్త గ‌ట్టిగానే హెచ్చ‌రించారు. ఈ రోజు నుంచి జై సోనియా, జై రాహుల్ గాంధీ నినాదాలు మాత్రమే వినిపించాలని, ఎవరైనా వ్యక్తిగత నినాదాలు ఇస్తే పార్టీ నుంచి బహిష్కరిస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.   

మోదీ కొత్త కేబినెట్ ఇదే.. అంతా హేమాహేమీలే...

ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్‌లోకి కొత్త‌గా 43 మందిని తీసుకోబోతున్న‌ట్టు స‌మాచారం. వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు, ఉన్న‌త విద్యావేత్త‌లు, బ్యూరోక్రాట్‌లతో పాటు రాజ‌కీయ అవ‌స‌రాల మేర‌కు వివిధ రాష్ట్రాల‌కు చెందిన‌ ప‌లువురు కీల‌క నేత‌ల‌ను మంత్రివ‌ర్గంలో చోటు క‌ల్పించ‌నున్నారు. ఢిల్లీ నుంచి అందుతున్న స‌మాచారం మేర‌కు మోదీ కొత్త టీమ్ ఇదే....   1. నారాయణ రాణే 2. శర్వానంద సోనోవాలా 3. డాక్టర్ వీరేంద్ర కుమార్ 4. జ్యోతిరాదిత్య సింధియా 5. రామచంద్ర ప్రసాద్ సింగ్ 6. అశ్వనీ వైష్ణవ్ 7. పశుపతి కుమార్ పారస్ 8. కిరణ్ రిజిజు 9. రాజ్ కుమార్ సింగ్ 10. హర్దీప్ సింగ్ పూరీ  11. మన్సుఖ్ మాండవ్య 12. భూపేందర్ యాదవ్ 13. పురుషోత్తం రూపాలా 14. కిషన్ రెడ్డి 15. అనురాగ్ ఠాకూర్ 16. పంకజ్ చౌధురి 17. అనుప్రియా పటేల్ 18. సత్యపాల్ సింగ్ బాఘేల్ 19. రాజీవ్ చంద్రశేఖర్ 20. శోభా కరంద్లాజే  21. భానుప్రతాప్ సింగ్ వర్మ 22. దర్శన విక్రమ్ జర్దోశ్ 23. మీనాక్షి లేఖీ 24. అన్నపూర్ణా దేవి 25. నారాయణ స్వామి 26. కౌశల్ కిశోర్ 27. అజయ్ భట్ 28. బి.ఎల్. వర్మ 29. అజయ్ కుమార్ 30. చౌహాన్ దేవూసింగ్  31. భగవంత్ ఖూబా 32. కపిల్ మోరేశ్వర్ పాటిల్ 33. ప్రతిమా భౌమిక్ 34. భగవత్ కృష్ణారావు 35. సుభాశ్ సర్కార్ 36. రాజ్‌కుమార్ రాజన్ సింగ్ 37. భారతీ పవార్ 38. విశ్వేశ్వర్ తుడు 39. శంతనూ ఠాకూర్ 40. మహేంద్ర భాయ్ 41. జాన్ బర్లా 42. మురుగన్ 43. నితీశ్ ప్రామాణిక్   

కాంగ్రెస్‌లో న‌వ‌శ‌కం.. సీనియ‌ర్లు దారికొచ్చే.. రేవంత్‌ను అంద‌రూ మెచ్చే..

ఉత్త‌మ్.. క‌దిలొచ్చి బాధ్య‌త‌లు అప్ప‌గించారు. భ‌ట్టి.. బెట్టు వీడి చేతులు క‌లిపారు. జ‌గ్గారెడ్డి.. రేవంతే త‌మ బాస్ అంటూ జై కొట్టారు. శ్రీధ‌ర్‌బాబు.. రేవంత్ అయితే స‌రేన‌న్నారు. వీహెచ్‌ సైతం ఇప్ప‌టికే ఆశీర్వ‌దించారు. పొన్నాల‌, ష‌బ్బీర్అలీ, మ‌ధుయాష్కీగౌడ్‌.. అంతా రేవంత్‌ను అభినందించారు. ఇక‌, కొర‌క‌రాని కొయ్య‌గా మారిన కోమ‌టిరెడ్డి.. హైక‌మాండ్ ఆదేశాల‌తో హ‌ష్ గ‌ప్‌చుప్ అయ్యారు. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు కాంగ్రెస్‌లో సూప‌ర్ బాస్‌. నిన్నామొన్న‌టి దాకా త‌న‌ను ఎదురించిన‌.. త‌నకు పీసీసీ ప్రెసిడెంట్ ప‌ద‌వి ద‌క్క‌కుండా కుటిల‌య‌త్నాలు చేసిన‌.. సీనియ‌ర్లంతా ఇప్పుడు తోక ముడిచి దారికొచ్చారు. కాంగ్రెస్ కుర‌వృద్ధుల నుంచి.. యంగ్ కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కూ.. అంతా రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వంలో ప‌ని చేసేందుకు.. కాంగ్రెస్‌కు పున‌ర్‌వైభ‌వం సాధించేందుకు ఒక్క‌తాటి మీద‌కు వ‌చ్చారు. ఇప్పుడు.. ఒక్క‌టంటే ఒక్క అస‌మ్మ‌తి స్వ‌రం కూడా వినిపించ‌డం లేదు. రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్య‌క్షునిగా బాధ్య‌త‌లు స్వీక‌రించే స‌మ‌యానికి అస‌మ్మ‌తి అంతా స్వీప్‌. ద‌టీజ్ రేవంత్‌రెడ్డి. ప‌క్కా లీడ‌ర్‌.  కాంగ్రెస్‌లో ఇది స‌రికొత్త క‌ల్చ‌ర్‌. కాంగ్రెస్‌కు ఇప్పుడిక న‌వ శ‌కం. ఎవ‌రు నాయ‌క‌త్వం వ‌హించినా.. ఎవ‌రికి వారే రాజ‌కీయాలు చేసుకోవ‌డం.. అధ్య‌క్షుడిని డోంట్‌కేర్ అన్న‌ట్టు ప‌ట్టించుకోక‌పోవ‌డం.. కాంగ్రెస్ సంస్కృతి. పీసీసీ చీఫ్‌గా ఎవ‌రున్నా.. లుక‌లుక‌లు.. గుస‌గుస‌లు కామ‌న్‌. ఇన్నేళ్లూ అదే జ‌రిగింది. కానీ, రేవంత్‌రెడ్డి రాక‌తో కాంగ్రెస్ మారిపోయింది. పాత వాస‌న‌లు వ‌దులుకుంటోంది. రోత రాజ‌కీయాల‌ను ప‌క్క‌న ప‌డేస్తోంది. ఇప్పుడంతా రేవంత్‌రెడ్డి లీడ‌ర్‌షిప్‌కు జేజేలు ప‌లుకుతున్నారు. మ‌న‌సులో ఏమున్నా.. అది నోరు దాటి బ‌య‌ట‌కు అనే సాహ‌సం ఏ ఒక్క‌రికీ లేద‌నే చెప్పాలి. అలా కాదూ కూడ‌దు అంటే.. ఇంత‌కుముందులా కాదు. రేవంత్‌ను ఎదిరిస్తే.. పార్టీలో భ‌విష్య‌త్ ఉండ‌దు. అంత‌టి స్ట్రాంగ్ లీడ‌ర్ మ‌రి. వైఎస్సార్ త‌ర్వాత ఆ రేంజ్ ఛ‌రిస్మా, క‌రిజ్మా ఉన్న నాయ‌కుడు. ఇప్పుడు రేవంత్ ఉక్కుపిడికిలిలో కాంగ్రెస్ సుర‌క్షితంగా ఉంది. కాద‌ని ఎవ‌రైనా పిడికిలి లేపితే.. రాళ్ల‌తో కొట్టిచంపుడేన‌నేది రేవంత్ కొత్త‌గా తీసుకొచ్చిన కాంగ్రెస్‌ ఫిలాస‌ఫీ.  రేవంత్‌రెడ్డి మామూలు లీడ‌ర్ కాదు. దాదాపు ఇంటికో అభిమాని ఉన్నారంటారు. తెలంగాణ‌తో పాటు ఏపీలోనూ ఆయ‌న‌కు ఫుల్ ఫ్యాన్స్‌. విదేశాల్లోనూ మంచి ఫ్యాన్‌ఫాలోయింగ్‌. చోటామోటా నాయ‌కుల నుంచి సో కాల్డ్ సీనియ‌ర్ల వ‌ర‌కూ.. ఇప్పుడు అంతా రేవంత్ జ‌ప‌మే. రేవంత్‌ను కాదనే నాయ‌కుడికి ఇక‌పై కాంగ్రెస్‌లో పుట్ట‌గ‌తులు ఉండ‌వ‌నే రేంజ్‌కు రేవంత్ ఎదిగారు. పీసీసీ చీఫ్‌గా ఇప్పుడిక మరింత బ‌లోపేత‌మ‌య్యారు. ఆ విష‌యం గుర్తెరిగే.. మ‌న‌సులో ఏమున్నా.. ముఖంపై న‌వ్వు పులుముకున్నారు సీనియ‌ర్లంతా. తాను ఇంటికి వ‌స్తాన‌న‌గానే.. శ్రీధ‌ర్‌బాబు, జ‌గ్గారెడ్డిలాంటి నేత‌లు రేవంత్‌కు గ్రాండ్ వెల్‌క‌మ్ చెప్పారు. భ‌ట్టి విక్ర‌మార్క‌.. మొద‌ట తాను విక్ర‌మార్కుడి రేంజ్‌లో మొండికేశారు. త‌న‌కే పీసీసీ పీఠం ద‌క్క‌క‌పోవ‌డంతో దోబూచులాడారు. గ‌ట్టిగా నోరెత్తి కేసీఆర్‌పై నాలుగు గ‌ట్టి విమ‌ర్శ‌లు చేయ‌లేని భ‌ట్టి చేతితో కాంగ్రెస్ పార్టీని పెట్ట‌డానికి అధిష్టానం ఏమీ అమాయ‌కురాలు కాదు. ఢిల్లీకి ఎవ‌రి స‌త్తా ఏంటో తెలుసు. అయితే, భ‌ట్టి సీనియార్టీని గౌర‌వించి.. ఆయ‌నకు న‌చ్చ‌జెప్పి.. రాయ‌బారం పంపి.. రేవంత్‌తో చేతులు క‌లిపేందుకు ఒప్పించింది కాంగ్రెస్ పార్టీ. సో.. ఇప్ప‌టికైతే భ‌ట్టి.. దారికొచ్చిన‌ట్టే.  ఇక మిగిలింది కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి ఒక్క‌రే. త‌న త‌మ్ముడు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతారంటూ విస్తృతంగా ప్రచారం జ‌రుగుతోంది. రేపేమాపో ఆయ‌న కాషాయ కండువా క‌ప్పుకోవ‌చ్చు అంటున్నారు. త‌న సోద‌రుడినే కాంగ్రెస్ వీడ‌కుండా చేయ‌లేని వెంక‌ట్‌రెడ్డికి పార్టీ ప‌గ్గాలు ఎందుక‌నేది ఓ ప్ర‌శ్న‌. కేవ‌లం ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాకే ప‌రిమిత‌మైన కోమ‌టిరెడ్డిని.. రాష్ట్ర అధ్య‌క్షునిగా చేసేంత సాహ‌సం చేస్తారా? రేవంత్‌రెడ్డి ఇమేజ్‌తో ఆయ‌న స‌రితూగ‌గ‌ల‌రా? మ‌రెందుకు అంత అల‌క‌? ఇంకెందుకు అంత క‌డుపుమంట‌? అని అడుగుతున్నారు రేవంత్ అభిమానులు. రేవంత్‌రెడ్డి ఎంత‌లా క‌లుపుకు పోదామ‌నుకుంటున్నా.. క‌లిసేందుకు ఇంకా ముందుకురాని ఒకేఒక్క‌డు కోమ‌టిరెడ్డి. ఆయ‌న‌కు సినిమా ముందుముందు ఉంటుందంటున్నారు. సో.. ఏదిఏమైనా.. రేవంత్‌రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్‌గా బాధ్య‌తలు స్వీక‌రించ‌డంతో కాంగ్రెస్‌లో కొత్త శ‌కం మొద‌లైంద‌ని చెప్పొచ్చు. డైన‌మిక్ లీడ‌ర్ రేవంత్‌రెడ్డి త‌న‌ నాయ‌క‌త్వ ప‌టిమ‌తో హ‌స్తం పార్టీకి పున‌ర్ వైభ‌వం తీసుకొస్తారా? కాంగ్రెస్‌లో మ‌రో వైఎస్సార్‌లా ఎదుగుతారా? కేసీఆర్‌ను ప్ర‌గ‌తిభ‌వ‌న్ నుంచి బ‌య‌ట‌కు గుంజుతారా? లెట్స్ సీ....  

మోదీ టీమ్ అట్ట‌ర్‌ఫ్లాప్‌!.. అందుకే వారంతా అవుట్‌?

రెండేళ్లుగా అధికారంలో ఉన్నారు. ఇంత‌టి గొప్ప ప్ర‌భుత్వం ఇంత‌వ‌ర‌కూ లేద‌న్న‌ట్టు ఫోజులు కొట్టారు. ఇప్పుడేమైంది? రెండేళ్లు తిరిగే స‌రికి త‌త్వం బోధ‌ప‌డింది. ఏవేవో కార‌ణాలు చెబుతూ.. కేంద్ర కేబినెట్‌లో ప‌లువురు మంత్రుల‌పై వేటు వేశారు ప్ర‌ధాని మోదీ. అంటే, రాజీనామా చేసిన వారంతా అస‌మ‌ర్థుల‌న్నట్టేగా? గ‌త‌ రెండేళ్లుగా దేశాన్ని పాలించిన వారేగా? అంటే, వారంతా రెండేళ్లుగా చెత్త ప‌నితీరును ప్ర‌ద‌ర్శించిన‌ట్టేనా? అంటే, మోదీ టీమ్ ఫెయిల్ అయిన‌ట్టేగా? అని ప్ర‌శ్నిస్తున్నాయి ప్ర‌తిప‌క్షాలు.  క‌రోనాను ఎదుర్కోవ‌డంలో మోదీ స‌ర్కారు ఘోరంగా విఫ‌ల‌మైంద‌నే అప‌వాదు ఎదుర్కొంటోంది. మోదీ ప‌ని తీరుపై ఇంటాబ‌య‌టా భారీగా విమ‌ర్శ‌లు. గ‌డ్డం పెంచ‌డం మిన‌హా ఆయ‌న చేసిందేమీ లేద‌నే సెటైర్లు. పీఎం మోదీ చేత‌గాని త‌నంతోనే దేశంలో క‌రోనా ఇంత‌లా విజృంభించింద‌నే ఆరోప‌ణ‌లు. దేశంలో వ్యాక్సిన్ కొర‌త‌కు మోదీయే కార‌ణ‌మ‌నే ఆగ్ర‌హం. ఆ అప‌వాదుల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు.. ఆ వైఫ‌ల్యాల‌ను ప్ర‌ధాని మోదీ మీద నుంచి తొల‌గించేందుకు.. కేంద్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌ను బ‌లి చేశార‌ని అంటున్నారు. సెకండ్ వేవ్‌ను స‌రిగా హ్యాండిల్ చేయ‌లేక‌పోయారంటూ స్వ‌త‌హాగా డాక్ట‌ర్ అయిన‌.. సీనియ‌ర్ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌ను కేబినెట్ నుంచి గెంటేశారు మోదీ.  ఇక‌ మ‌రో మంత్రి సదానంద గౌడనూ మంత్రిమండ‌లి నుంచి తొల‌గించ‌డంపైనా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మోదీని కాపాడేందుకే ఈయ‌న‌నూ బ‌ర్త‌ర‌ఫ్ చేశార‌ని అంటున్నారు. కర్నాటకకు చెందిన స‌దానంద గౌడ‌.. రసాయనాలు, ఎరువుల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కరోనా కాలంలో ఔషదాల కొరత తీవ్రంగా ఏర్పడిందని, దీనిని సమన్వయం చేయడంలో సదానంద గౌడ విఫలం చెందారని చెబుతున్నారు.  స‌ర్కారు వైఫ‌ల్యాల‌ను ప్ర‌శ్నించినందుకు మ‌రో మంత్రి త‌న ప‌ద‌విని కోల్పోయారు. యూపీకి చెందిన సంతోశ్ గాంగ్వర్.. కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. కరోనా కాలంలో యూపీ పాలనను ఇరుకున పెట్టే విధంగా ఓ లేఖ రాశారు. ఈ లేఖ విపరీతంగా వైరల్ అవ‌డంతో యూపీ ప్ర‌భుత్వ ప‌రువు గంగపాలైంది. ఆ క‌డుపు మంట‌తోనే.. గాంగ్వ‌ర్‌ను ప‌ద‌వి నుంచి తీసేశార‌ని అంటున్నారు.  ఇక‌.. బెంగాల్‌లో రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దేవశ్రీ చౌదరిపై వేటు ప‌డింద‌ని.. అనారోగ్య కార‌ణాల‌తో ఉత్త‌రాఖండ్‌కు చెందిన కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్‌ను తొల‌గించిన‌ట్టు తెలుస్తోంది. ఇలా క‌రోనా వైఫ‌ల్యాలు.. భ‌విష్య‌త్ రాజ‌కీయ అవ‌స‌రాల‌ కోస‌మే కేబినెట్ పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ జ‌రుగుతోంద‌ని అంటున్నారు. మంత్రుల సంగ‌తి స‌రే.. మ‌రి, కరోనా క‌ట్ట‌డిలో పూర్తిగా విఫ‌ల‌మయ్యారంటూ ప్ర‌ధాన ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మోదీని.. ఎందుకు ప‌ద‌వి నుంచి తొల‌గించ‌ర‌నేది ప్రతిపక్షాల ప్రశ్న. మంత్రుల‌ను కాదు.. ముందు మోదీని పీఎం పోస్ట్ నుంచి తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తున్నాయి.   

 సీఎం ఇంటి దగ్గరే ధర్నా! పవన్ కల్యాణ్ వార్నింగ్..

జనసేనాని చాలా కాలం తర్వాత జనంలోకి వచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే... ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమైన పవన్ కల్యాణ్.. ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు, సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా తాడేపల్లి కరకట్ట వాసులు పవన్ కల్యాణ్ ను కలిసి తమ కష్టాలను, సమస్యలను తెలిపారు.  సీఎం ఇంటి చుట్టూ ఉన్నవారిని ఖాళీ‌ చేయాలని నోటీసులు ఇచ్చారని, ముందు స్థలంలో ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా ఖాళీ‌ చేయాలని బెదిరిస్తున్నారని చెప్పారు. అర్ధరాత్రి ప్రొక్లెయినర్లను ఇళ్ల మీదకు పంపిస్తున్నారన్నారు. అదేమని అడిగితే చెప్పలేని విధంగా బూతులు తిట్టి‌ బెదిరిస్తున్నారన్నారు. ముప్పై ఏళ్లుగా ఉంటున్న తమకు గూడు లేకుండా చేస్తున్నారన్నారు. తమకు అండగా నిలబడి ఉద్యమం చేయాలని పవన్‌ను బాధితులు విజ్ఞప్తి చేశారు. వాళ్ల సమస్యలు విన్న జనసేన చీఫ్.. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.   కరకట్ట వాసుల సమస్యలపై స్పందించిన పవన్.. వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సీఎం ఇంటి‌చుట్టూ ఉన్న‌వారికే రక్షణ లేదని ఆరోపించారు. సీఎం భద్రత పేరుతో ఇళ్లను ఖాళీ‌ చేయిస్తారా అంటూ మండిపడ్డారు. ఆడపడుచులను పచ్చి బూతులను తిడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి నాయకులు ఉంటే.. ‌మానభంగాలు  ఆగుతాయా అని ప్రశ్నించారు పవన్ కల్యాణ్. 35 ఏళ్లుగా ఉన్నవారికి పునరావాసం కల్పించాలని, భయపెట్టి.. బెదిరిద్దాం అనుకుంటే ప్రజలు భయపడరని హెచ్చరించారు. ఖాళీ చేయించడం తప్పని సరైతే... వారికి ముందు న్యాయం చేయాలన్నారు. 350 కుటుంబాలకు ఇళ్లు ఇచ్చాకే అక్కడి నుంచి ఖాళీ చేయించాలన్నారు. మొండిగా ముందుకెళితే... జనసేన తరపున సీఎం నివాసం వద్దే ఉద్యమిస్తామని పవన్ హెచ్చరించారు. జనసేన అధినేతను నిరుద్యోగ, విద్యార్థి సంఘాల ప్రతినిధులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. జాబ్ క్యాలెండర్‌ పేరుతో సీఎం జగన్ లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశారన్నారు. ఎన్నికల ముందు ‘అన్న వస్తున్నాడు’ అంటూ ఊదరగొట్టారని, ఏటా జాబ్ క్యాలెండర్‌ ప్రకటిస్తాం‌ అన్నారని, ఇప్పుడు ఆ ఊసే లేకుండా చేస్తూ.. జాబులు అడిగితే జైలుకు పంపిస్తున్నారని వాపోయారు. జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మామని, ఇప్పుడు  నట్టేట మునిగామంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై జనసేనాని పోరాడాలని కోరారు.  నిరుద్యోగ, విద్యార్థి సంఘాల నేతల మాటలను  విన్న పవన్.. పీఏసీలో చర్చించి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. 

అప్పు ఇవ్వలేదని.. అశ్లీల వెబ్ సైట్ లో భార్య ప్రొఫైల్.. 

ఓపెన్ చేస్తే.. ఒక వివాహిత ఫొటోస్ .. ఆమె ఫోన్ నెంబర్ అశ్లీల వెబ్ సైట్ లో చెక్కర్లు కొడుతుంది.. ఆ మహిళకు వేరేవాళ్ళ నుండి ఫోన్స్ రావడం.. అసభ్యంగా మాట్లాడం చేసేవాళ్ళు వాళ్ళ బాధను భరించలేని ఆమె భర్త సహాయంతో  పోలీసులను ఆశ్రయించింది.. ఇక అంతే పోలీసులు రంగంలోకి దిగారు.. అలా చేసినవాడిని పట్టుకున్నాడు.. ఆ తర్వాత వాడికి రెండు తగిలిస్తే చివరికి నిజం కక్కాడు.. ఇంతకీ ఆ నిజం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ వార్త చదవండి మీకే తెలుస్తుంది..  వివరాలలోకి వెళితే..అది  కరీంనగర్. ఆ పట్టణంలోని ఓ వ్యక్తి , తనకు తెలిసిన  మరో వ్యక్తి వద్ద  దగ్గర రూ. 70 వేలు అవసరానికి అప్పు తీసుకున్నాడు. తిరిగి చెల్లిస్తానని మూడు నెలలు గడువు తీసుకున్నాడు. అసలే కరోనా కాలం కావడం తో అతనికి డబ్బులు ఎక్కడ పుట్టలేదు.. అనుకున్న సమయానికి డబ్బు అందకపోయేసరికి అప్పు చెల్లించలేకపోయాడు. దీంతో అప్పిచ్చిన వ్యక్తి చాలా సార్లు డబ్బులు కోసం అతడిని అడిగాడు. ఈరోజు ఇస్తా.. రేపు ఇస్తా అంటూ అతని చుట్టూ తిప్పుతూ ఉన్నాడు. ఇక అతని మాటలతో విసిగిపోయిన అప్పిచ్చిన వ్యక్తి  అతనిపై కక్ష పెంచుకున్నాడు. అతనిలో ఉన్న మానవ మృగం నిద్రలేచింది.. చివరికి తన దగ్గర డబ్బు తీసుకుని అప్పు చెల్లించని వ్యక్తి భార్య ఫోటోను సంపాదించి.. మానవత్వం వారికీ కర్కశంగా ప్రవర్తించి సదరు ఫోటోను అశ్లీల వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశాడు. అంతేకాకుండా ఆ ఫోటో కింద ఆమె ఫోన్ నెంబర్ ని యాడ్ చేశాడు. దీంతో ఆమె ఫోన్ కి రోజూ  చాలామంది ఫోన్ చేసి విసిగించండం మొదలుపెట్టారు. ఇక తనకు ఫోన్ కాల్స్ చేసి కొందరు అసభ్యంగా మాట్లాడి ఇబ్బంది పెట్టడంతో ఆ గృహిణి విసిగిపోయి పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు అప్పిచ్చిన వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు నిర్దారించుకొని అతడిని అరెస్ట్ చేశారు. అప్పు చేసినవారు అప్పు చెల్లించకపోతే అప్పు సమానంగా ఇంట్లో వస్తువులు తీసుకుపోవడమో లేదా అతనికి ఏదైనా వాహనాలను ఉంటే ఆ వాహనాలు ఐన తీసుకుపోవాలిగాని మరి గింత కర్కశంగా ప్రవర్తిస్తారా ? మరి ఇంత రాక్షసానందం ఎవరైనా పొందుతారా అని స్థానికులు దుమ్మెత్తి పోస్తున్నారు.. అందుకనే మన పెద్దలు అన్నారు అప్పు ఎప్పటికైనా ముప్పు అని.. అలాగే అప్పు ఇవ్వడం కూడా తప్పే.. ఒకవేళ ఇచ్చిన మరి ఇలాంటి పంటకు చెయ్యడం చాలా తప్పు.. అంతకు మించి నేరం.. సో అప్పు ఇచ్చే ముందు తీసుకునే ముందు ఆలోచించండి.. జాగ్రత్తపడండి. 

కాంగ్రెస్ లో టీజేఎస్ విలీనం?  రేవంత్ వెంటే కేసీఆర్ వ్యతిరేక వర్గం!

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం జరగబోతోందని తెలుస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సారథ్యంలో ఫుల్ జోష్ లో కనిపిస్తున్న కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున వలసలు మొదలు కాబోతున్నాయని సమాచారం. గతంలో కాంగ్రెస్ లో కీలక నేతలుగా ఉండి.. ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతలంతా తిరిగి సొంత గూటికి రాబోతున్నారని సమాచారం.  ఇప్పటికే కొందరు నేతలు రేవంత్ రెడ్డితో మాట్లాడారని, త్వరలో అధికారికంగా చేరబోతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా గతంలో టీడీపీ పని చేసి బీజేపీలో చేరిన నేతలంతా రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ లో పని చేసేందుకు ముందుకు వస్తున్నారని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. వలసలతో పాటు ఓ పార్టీ కూడా కాంగ్రెస్ లో విలీనం కావచ్చనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఉద్యమంలో కీలక నేత, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్.. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే యోచనలో ఉన్నారని సమాచారం. టీజేఎస్ విలీనంపై ఇప్పటికే రేవంత్ రెడ్డితో కోదండరామ్ మాట్లాడారని చెబుతున్నారు. టీజేఎస్ విలీనంపై క్లారిటీగా ఉన్నందునే.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను కాంగ్రెస్ లో చేరాలని కోదండరామ్ సూచించారని తెలుస్తోంది. టీఆర్ఎస్ కు ఈటల రాజీనామా చేసిన తర్వాత.. అతనితో పలు సార్లు కోదండరామ్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమావేశమయ్యారు. అయితే రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోనే ఈటలతో ఈ ఇద్దరు నేతలు చర్చలు జరిపారని, కాంగ్రెస్ లో చేరాలని సూచించారని చెబుతున్నారు.  టిపిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి నియమితులైన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెరిగింది. గత ఏడేండ్లుగా నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ కేడర్ లో  కొత్త ఉత్సాహం కనబడ్డది. రేవంత్ రెడ్డి దూకుడు స్వభావంతోపాటు టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ను ఢీకొట్టగల సమర్థుడిగా ఆయన పేరుతెచ్చుకున్నారు. దీంతో ఇప్పటి వరకు చెల్లాచెదరైన కేసిఆర్ వ్యతిరేకులంతా రేవంత్ రెడ్డి వెనకాల ర్యాలీ అయ్యే వాతావరణం కనబడుతున్నది. తెలంగాణ  జన సమితి పార్టీ పరిస్థితి కూడా గందరగోళంగానే ఉంది. కోదండరాం వ్యక్తిగతంగా ఉన్నతమైన వ్యక్తిగా జనాల్లో గుర్తింపు ఉన్నా.. రాజకీయా లు నడపాలంటే ఆయనకు  సరైన వ్యూహం లేదని అంటున్నారు. అందుకే  ఆయనే పోటీ చేసినా పట్టభద్రుల ఎమ్మల్సీగా ఓటమిపాలయ్యారు. ఇక పార్టీని నడిపించడం సాధ్యం కాదనే ఆలోచనకు వచ్చిన కోదండరామ్..  పార్టీని వదిలించుకునే పనిలో ఉన్నట్లు చెబుతున్నారు. కోదండరాంతో రేవంత్ కొంతకాలంగా టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. తనకు పిసిసి వస్తే జన సమితిని కాంగ్రెస్ లో విలీనం చేయాలని రేవంత్ కోరినట్లు చెబుతున్నారు. ఇద్దరి మధ్య ఈవిషయమై చర్చలు కూడా సాగినట్లు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గా ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీలో జన సమితిని విలీనం చేద్దామనే ప్రతిపాదన ఇటీవల కోదండరాం నుంచి వచ్చినట్లు జన సమితి నేతల్లో టాక్ నడుస్తోంది. కుదిరితే కాంగ్రెస్ తో పొత్తు, లేదంటే విలీనం అనేదిశగా వారు సమాలోచనలు చేసినట్లు చెబుతున్నారు.ఇప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత స్వయంగా ఆయన కోదండరాం ను కలిసి ఓపెన్ గానే విలీనం చేయాలని అభ్యర్థించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. మరికొద్దిరోజుల్లోనే తెలంగాణ జన సమితి కాంగ్రెస్ పార్టీలో విలీనమైపోవచ్చని టాక్ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. 

పొలంలో బావి పోయిందని.. పోలీసులకు పిర్యాదు చేసిన రైతులు.. 

ఎవరైనా ఎక్కడైనా తమ బంగారం పోయిందని. డబ్బులు పోయాయని. వస్తువులు పోయాయని పోలీసులకు కంప్లెయింట్ చేస్తారు.. కానీ తాజాగా కొందరు రైతులు తమ పొలంలో ఉన్న  బావి కనిపించడం లేదని.. వెతికి పెట్టాలని ఓ రైతు పోలీసులకు విన్నవించారు. అదేంటి అని అనుకుంటున్నారా ? మీరు విన్నది అక్షరాల నిజం అదేదో సినిమాలో నా నీడాపోయిందని పోలీసులను కంప్లేయింట్ చేసినట్లు.. వీళ్ళు ఇలా ఇవ్వడం ఏంటి ? అందులో ఉన్న అంతరంగం ఏంటని అనుకుంటున్నారా ? అమ్మ ఆశ దోష అప్పడం వడ.. అది తెలుసుకోవాలంటే సచినట్లు మొత్తం వార్త చదవాలి.. మరి ఇంకెందుకు ఆలస్యం పదండి ముందుకు పదండి తోసుకు అని శ్రీ శ్రీ కవిత ముందుకు వెళ్లి చదవండి ఈ వార్త ని  తన పొలంలోని బావి అకస్మాత్తుగా అదృశ్యమైందని, వెతికి పెట్టాలని కోరుతూ ఓ రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ వార్త వినగానే పోలీసులు ఒక్కసారిగా టైడ్ సర్ఫ్ యార్డ్ లా అవాక్కయ్యారు. ఆ తర్వాత అసలు విషయం ఏంటని  ఆరాతీశారు. అప్పుడు తెలిసింది పంచాయితీ అందికారుల పన్నాగం.. ప్రభుత్వ నిధుల కోసం పంచాయితీ  అధికారులు కక్కుర్తి పడ్డారు. అదే నెపంతో రైతు మల్లప్ప పొలంలో బావిని తవ్వినట్లు రికార్డు సృష్టించి ప్రభుత్వ నిధులను కాజేశారు. బావి తవ్వించుకున్నందుకు తీసుకున్న రుణం తిరిగి చెల్లించాలంటూ రైతుకు ఇటీవల నోటీసులు అందాయి. దీనిపై పరిశీలించగా అధికారుల నిర్వాకం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన  కర్ణాటకలోని బెళగావి జిల్లా మావినహొండలో జరిగింది. 

కిషన్ రెడ్డికి కేబినెట్ ప్రమోషన్! మోడీ టీంలో సోయంకు ఛాన్స్? 

కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం గంటల్లోకి వచ్చేసింది. బుధవారం సాయంత్రం ఆరు గంటలకు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి రాష్ట్రపతి భవన్’లో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అదలా ఉంటే, తెలుగు రాష్ట్రాల నుంచి మంత్రివర్గంలో స్థానం ఎవరికి లభిస్తుందనే విషయంలో ఇంకా. ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే, తెలంగాణ నుంచి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావుకు గిరిజన కోటాలో బెర్త్ దక్కే అవకాశం ఉందని సమాచారం. తెలంగాణలో అయిపొయింది అనుకున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రాకతో పునర్జీవనం పొందిన  నేపధ్యంలో, తెలంగాణలో అధికార తెరాసతో పాటుగా రేవంత్ యువ సేనను దీటుగా ఎదుర్కునేందుకు, మంత్రి వర్గంలో రాష్ట్రానికి సముచిత స్థానం ఇవ్వాలని బీజేపీ అగ్ర త్రయం నిర్ణయానికి వచ్చారని సమాచారం. ఇందులో భాగంగా  ప్రస్తుతం హోమ్ శాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి స్వతంత్ర మంత్రిగా పదోన్నతి కల్పించడంతో పాటుగా, అదిలాబాద్ ఎంపీ సోయం బాబురావును సహాయ మంత్రిగా తీసుకుంటారని తెలుస్తోంది. దీంతో తెలంగాణ బీజేపీ నేతలు మోదీ కేబినెట్ విస్తరణలో మార్పుల కోసం ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలతో పాటు 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేపట్టిన మంత్రివర్గ విస్తరణకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున కసరత్తు చేశారని అంటున్నారు. ఈ నేపధ్యంలో విస్తరణ భారీగా ఉంటుందని తెలుస్తోంది. అలాగే, మంత్రి వర్గ విస్తరణతో పాటుగా, ప్రధాని మోడీ కొద్దిమందికి మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలకవచ్చని అంటున్నారు. ఆలాగే, పెద్ద ఎత్తున శాఖల మార్పు కూడా ఉంటుందని సమాచారం. ఇందులో భాగంగా  గిరిజన వ్యవహారాల శాఖను నిర్వహిస్తున్న అర్జున్ ముండాతో పాటు సహాయ మంత్రి రేణుక సింగ్ సరుటను మంత్రివర్గం నుంచి తొలగించి.. మోడీ తొలి ప్రభుత్వంలో ఈ శాఖను నిర్వహించిన జ్యుయల్ ఓరమ్‌కు మళ్లీ తిరిగి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని, అదే శాఖ సహాయ మంత్రిగా బాబురావుకు అవకాశం  దక్కవచ్చని తెలుస్తోంది.  ప్రస్తుతం మోడీ మంత్రివర్గంలో 53 మంది ఉండగా కొత్తగా తన మరో 28 మందికి ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. మరో వంక ఆంధ్ర ప్రదేశ్’లో ఇంతవరకు, ఒక్క జీవీఎల్ నరసింహ రావు మినహా మరెవరి పేరు పైకి రాలేదు. యూపీ నుంచి ఎన్నికైన రాజ్య సభ సభ్యుడు జీవిఎల్ కు మంత్రివర్గంలో స్థానం కలిపించడం ఉభయ తారకంగా ఉంటుందని మోడీ,షా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యులు కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నా, వారికి ఇంతవరకు ఎలాంటి ఇంటిమేషన్ రాలేదని తెలుస్తోంది. చివరకు ఎవరిని అదృష్టం వరిస్తుందో .. మరికొద్ది గంటల్లో తేలిపోతుంది.

ఆ న‌లుగురు.. కేసీఆర్‌కు చార్‌మార్‌.. అప్పుడే ఎల‌క్ష‌న్ ఫీవ‌ర్‌...

ఏడేళ్లుగా తెలంగాణ‌లో కేసీఆర్‌ది వ‌న్ మ్యాన్ షో. అడిగేవాడు లేడు.. ప్ర‌శ్నించే గొంతుక లేదు.. నిల‌దీసే చొర‌వ‌.. నిగ్గ‌దీసే స‌త్తువ‌.. లేనేలేదు.. విప‌క్షం ఘోరంగా విఫ‌ల‌మైంద‌నే టాక్‌. అందుకే, ఏ ఎల‌క్ష‌న్ వ‌చ్చినా కేసీఆర్‌కు వార్ వ‌న్‌సైడ్‌గా ఉండేది. ఎన్నిక‌ల హామీలు మూల‌కు ప‌డేసినా.. ప‌ట్టించుక‌నే నాథుడే లేకుండా ఉండే. కానీ, ఇటీవ‌ల బీజేపీ కాస్త యాక్టివ్ కావ‌డంతో సీన్ మారిపోయింది. దుబ్బాక‌, జీహెచ్ఎమ్‌సీలో త‌గిలిన షాక్‌తో కేసీఆర్‌కు దిమ్మ తిరిగింది. ఆ త‌ర్వాత నాగార్జున సాగ‌ర్‌, ఎమ్మెల్సీ, వ‌రంగ‌ల్‌-ఖ‌మ్మం కార్పొరేష‌న్లు గెలుచుకొని.. ఇక బిందాస్‌గా ఉందామ‌నుకున్న టైమ్‌లో ఈట‌ల మేట‌ర్ ఈటెల్లా గుచ్చుకుంది. ఆయ‌న బీజేపీలో చేర‌డంతో గులాబీ బాస్‌లో గుబులు పెరిగింది. బండి సంజ‌య్ సైతం చీటికీ మాటికి.. కేసీఆర్‌ను జైలుకు పంపిస్తామంటూ సెగ రాజేస్తున్నారు. ఈలోగా అస‌లైన ప్ర‌మాదం.. రేవంత్‌రెడ్డి రూపంలో పిడుగులా ప‌డింది. ఇక ష‌ర్మిల సైతం సూటిపోటి మాట‌ల‌తో ఎంతోకొంత డిస్ట‌ర్బ్ చేస్తోంది. ఇలా.. రేవంత్‌రెడ్డి, ఈట‌ల రాజేంద‌ర్‌, బండి సంజ‌య్‌, షర్మిల‌.. ఆ న‌లుగురు క‌లిసి కేసీఆర్‌ను చార్‌మార్ అడుకుంటున్నారు.  తెలంగాణ‌లో రాజ‌కీయ వేడి ఒక్క‌సారిగా పెరిగిపోయింది. ఇంకా ఎన్నిక‌ల‌కు రెండేళ్ల‌కు పైనే స‌మ‌యం ఉన్నా.. రేపోమాపో ఎన్నిక‌లు అన్నంత‌గా పొలిటిక‌ల్ యాక్టివిటీ న‌డుస్తోంది. అంద‌రిలోనూ టెన్ష‌న్‌. అంద‌రికంటే సీఎం కేసీఆర్‌లో ఇంకా అటెన్ష‌న్‌. అందుకే కాబోలు.. శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు, జిల్లా ప‌ర్య‌ట‌న‌లు, స‌హ‌పంక్తి భోజ‌నాలు, ఆక‌స్మిక సంద‌ర్శ‌న‌లు, ఆక‌ట్టుకునే ప్ర‌సంగాలు, స‌రికొత్త ప‌థ‌కాలు, పింఛ‌న్‌లు, రేష‌న్‌కార్డులు.. అబ్బో కేసీఆర్ స‌ర్కారులో క‌ద‌లిక బాగా ఉంది. ప‌నిలో ప‌నిగా పాచిపోయిన నీళ్ల పంచాయితీని మ‌ళ్లీ ఫ్రిడ్జ్ నుంచి ఫ్రెష్‌గా బ‌య‌ట‌కు తీసి.. ఎవ‌ర్‌గ్రీన్ సెంటిమెంట్ పాలిటిక్స్‌ను ర‌క్తి క‌ట్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అంటున్నారు. కేసీఆర్‌లో.. ఇంత‌లా మున‌ప‌టి కేసీఆర్ బ‌య‌ట‌కు రావ‌డానికి కార‌ణం.. ఆ న‌లుగురు...? అంద‌రికంటే కేసీఆర్‌కు య‌మ డేంజ‌ర్ గండం రేవంత్‌రెడ్డితోనే. పీసీసీ చీఫ్‌గా ప‌గ్గాలు చేప‌ట్టి.. ప్ర‌గ‌తిభ‌వ‌న్ పైకి దండెత్తుతున్నారు. ఏ రేవంత్‌నైతే అసెంబ్లీలోకి అడుగుపెట్ట‌కుండా చేయ‌గ‌లిగారో.. అదే రేవంత్ ఎంపీగా, పీసీసీ ప్రెసిడెంట్‌గా.. గోడ‌కు కొట్టిన బంతిలా త‌న‌వైపే దూసుకురావ‌డం కేసీఆర్‌కు క‌ల‌వ‌ర‌పాటే. గాంధీభ‌వ‌న్‌లో రేవంత్‌రెడ్డి ప‌ట్టాభిషేకం ఘ‌నంగా జ‌ర‌గ‌డం.. కాంగ్రెస్ సీనియ‌ర్లంతా ఏక‌మ‌వ‌డం గులాబీ ద‌ళానికి డేంజ‌ర్ సింబ‌లే. రాళ్ల‌తో కొడ‌తాం.. బ‌య‌ట‌కు గుంజుతాం.. ఇలాంటి దూకుడు స్వ‌భావం.. సీనియ‌ర్లను త‌న దారికి తెచ్చుకున్న చాతుర్యం.. ఇక కేసీఆర్‌ను ఏనాటికైనా జైల్లో పెట్టాల‌నే జీవిత ల‌క్ష్యం.. ఇవ‌న్నీ క‌ల‌గ‌లిసిన రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వంలో కాంగ్రెస్ పార్టీ వెయ్యి ఏనుగుల బ‌లం పుంజుకోవ‌డం.. కేసీఆర్‌కే ఎక్కువ‌ ప్ర‌మాద‌క‌రం అంటున్నారు.  ఇక‌.. బీజేపీ. తోక‌లో పార్టీ అనుకుంటే.. తోక క‌ట్ చేసే పార్టీగా ఎదుగుతుంద‌ని అస్స‌లూ ఊహించ‌లేదెవ్వ‌రు. దుబ్బాక క‌లిసొచ్చింద‌ని అనుకుంటే.. జీహెచ్ఎమ్‌సీతో త‌మ‌ది వాపు కాదు బ‌లం అని నిరూపించుకుంది క‌మ‌లం పార్టీ. ఆ త‌ర్వాత వ‌రుస ఓట‌ములు ఎదురైనా.. ఉత్సాహం మాత్రం త‌గ్గ‌లేదు. రేవంత్‌రెడ్డిలాంటి స్టామినా లేక‌పోయినా.. ఈట‌ల రాజేంద‌ర్‌లాంటి బ‌ల‌మైన నేత‌ బీజేపీలో చేర‌డం ఆ పార్టీకి అనుకూలం. ఇక బండి జోరు మామూలుగా లేదు. నోరు తెరిస్తే.. కేసీఆర్‌పై కేసులు పెడ‌తాం.. సాక్షాలు సేక‌రించాం.. త్వ‌ర‌లోనే జైలుకు పంపుతాం.. ఇవే బెదిరింపులు. కేసీఆర్‌కు కునుకు ప‌ట్ట‌కుండా.. చెవిలో తూనీగ మోత మోగిస్తున్నారు బండి సంజ‌య్‌. హుజురాబాద్‌లో స‌త్తా చాటి కేసీఆర్‌కు స్ట్రాంగ్ సందేహం ఇవ్వాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నారు.  రేవంత్‌రెడ్డి ఎఫెక్టో ఏమోగానీ.. తాజాగా పాద‌యాత్ర ప్ర‌క‌టించి తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌క నేత‌గా అడుగులేస్తున్నారు బండి సంజ‌య్‌. బండి ఎంత బ‌ల‌ప‌డితే.. కేసీఆర్‌కు అంత మైన‌స్‌. ఇక ఈట‌ల రాజేంద‌ర్ చేసే డ్యామేజ్ గురించి చెప్పేదేముంది. స్వ‌త‌హాగా ఉద్య‌మ‌నేత కావ‌డంతో ఈట‌ల‌కు తెలంగాణ వ్యాప్తంగా మంచి ఇమేజ్ ఉంది. ఆయ‌న‌ ఏనాటికైనా కేసీఆర్ కొంప ముంచే ప్ర‌మాదం ఉంది. ప్ర‌గ‌తి భ‌వ‌న్ గోడ‌లు బ‌ద్ద‌లు కొడ‌తానంటూ ఈట‌ల చేసిన శ‌ప‌థం ద‌డ‌ద‌డ‌లాడిస్తోంది. ముందు హుజురాబాద్‌లో గెలిచి.. ఆ త‌ర్వాత‌ కేసీఆర్ సంగ‌తి చూస్తానంటూ ఈట‌ల జోరు మీదున్నారు. బండి సంజ‌య్‌, ఈట‌ల రాజేంద‌ర్‌ల‌తో బీజేపీ.. కేసీఆర్ వైపు డ‌బుల్ బ్యారెట్ గ‌న్ ఎక్కుపెట్ట‌డం గులాబీ బాస్‌కు గుబులు పుట్టించే అంశ‌మే.  ఇక‌, వైఎస్ ష‌ర్మిల‌. మొద‌ట ఆట‌లో అర‌టిపండు అనుకున్నారు. తాను అర‌టిపండు కాదు అన‌కొండానంటూ అన్నిపార్టీల ఓటుబ్యాంకును మింగేసేందుకు ముందుకు వ‌స్తున్నారు. సింగిల్‌గానైనా సింగంలా గాండ్రిస్తున్నారు. కొత్త పార్టీతో బ‌లంగా ఉనికి చాటుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తెలంగాణ స‌మ‌స్య‌ల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు స్పందిస్తూ.. ప్రొఫెష‌న‌ల్ పొలిటిక‌ల్ అడ్వైజ‌ర్ల సాయంతో.. ప‌క్కా ప్లాన్డ్‌గా ముందుకు సాగుతున్నారు వైఎస్ ష‌ర్మిల‌. తెలంగాణ మ‌నిషి కాద‌నే అనుమానం ఉన్నా.. ఎవ‌రు సంధించిన బాణ‌మో అర్థం కాకున్నా.. ఆ క‌న్ఫ్యూజ‌న్‌లోనే మ‌రింతగా రాజ‌కీయ దెబ్బ కొట్టేస్తున్నారు ష‌ర్మిల‌. వైఎస్సార్‌టీపీ ఎఫెక్ట్‌.. కేసీఆర్‌తో పాటు రేవంత్‌రెడ్డి ఓటుబ్యాంక్‌కూ ఎంతోకొంత దెబ్బ‌ ఉంటుందంటున్నారు.  ఇలా.. రేవంత్‌రెడ్డి, బండి సంజ‌య్‌, ఈట‌ల రాజేంద‌ర్‌, వైఎస్ ష‌ర్మిల‌.. ఆ న‌లుగురు క‌లిసి కేసీఆర్‌తో చెడుగుడు ఆడుకునేందుకు తెలంగాణ దంగ‌ల్‌లోకి దిగిపోయారు. రాష్ట్రంలో తాజా పొలిటిక‌ల్ యాక్టివిటీతో అప్పుడే ఎల‌క్ష‌న్ ఫీవ‌ర్ పెరిగిపోయింది. అయితే.. మంది ఎక్కువైతే మ‌జ్జిగ ప‌ల‌చ‌న అన్న‌ట్టు.. ప్ర‌త్య‌ర్థులంతా ఎవ‌రికి వారే తొడ‌లు కొట్టి.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓట్ల‌ను చీల్చి.. కేసీఆర్‌కే లాభం చేసే అవ‌కాశ‌మూ లేక‌పోలేదంటున్నారు విశ్లేష‌కులు. మాయ‌ల మ‌రాఠీ, మాట‌ల మాంత్రికుడైన కేసీఆర్‌ను.. ఆ న‌లుగురు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.. ఈ రాజ‌కీయ వైకుంఠ‌పాళిలో నిచ్చెన ఎక్కేది ఎవ‌రో? అధఃపాతాళానికి ప‌డిపోయేది ఇంకెవ‌రో..? వెయిట్ అండ్ సీ...   

పదవి నిలుపుకునేందుకు మమత పాట్లు.. మండలి పునరుద్ధరణకు అసెంబ్లీ తీర్మానం 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని పదవీ గండం వెంతడుతోందా అంటే, అవుననే అంటున్నారు, రాజకీయ విశ్లేషకులు. అసెంబ్లీ ఎన్నికల్లో మమతా దీదీ  సారధ్యంలో తృణమూల్ కాంగ్రెస్ వరసగా మూడవసారి విజయంసాధించి, హట్రిక్ కొట్టింది. అయితే, నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన ఆమె ఓడిపోయారు. అయినా, ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.అయితే, శాసన సభ సభ్యులు కాని వారు మంత్రి లేదా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే, అక్కడి నుంచి అరునెలల్లో శాసన సభ లేద శాసన మండలిలలో ఎదో ఒక  సభకు ఎన్నిక  కావడం రాజ్యాంగ  నియమావళి ప్రకారం అనివార్యం. నిజానికి ఆమెకు  అదేమంత కష్టం కాదు. ఆమె కోసం భవానీపూర్ నియోజక వర్గం ఎమ్మల్యే సీటు ఖాళీ  (రాజీనామా) చేశారు. ఉపఎన్నిక జరిగితే చాలు, ఆమె గెలిచినట్లే. కానీ, ఆరు నెలల గడువు ముగిసే లోగా ఉప ఎన్నిక జరిగే పరిస్థితి లేదు. కరోనా అనిశ్చిత పరిస్థితి దృష్ట్యా ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం  సుముఖంగా లేదు. మరో వంక దీదీని ఎలాగైనా గద్దెదించాలని కంకణం కట్టుకున్న, బీజేపీ, గడువులోగా ఉప ఎన్నికలు జరిపేందుకు ఏ మాత్రం సహకరించదు. సో.. దీదీ అసెంబ్లీ రూట్’లో  సభలో ప్రవేశించేందుకు తపులుపులు మూసుకు పోయాయి.  అసెంబ్లీ కాకపోతే మండలి రూట్’లో వద్దామంటే, అ అవకాశం కూడా లేదు. పశ్చిమ బెంగాల్’లో ఎగువ సభే లేదు.ఆదిలో, అంటే, 1952లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బెంగాల్’లో ఎగువ సభను ఏర్పాటు చేసింది. అయితే, 1969లో అప్పటి  ప్రభుత్వం మండలిని రద్దు చేసింది. కాబట్టి దొడ్డిదారి తలుపులు కూడా మూసుకు పోయాయి.    అందుకే, ఇప్పుడు అర్జెంటుగా ఎగువ సభ పునరుద్దణకు దీదీ ప్రయత్నాలు ప్రారంభించారు.మంగళవారం బెంగాల్ రాష్ట్ర శాసన సభ  ఈ మేరకు తీర్మానం ఆమోదించింది.అయితే, మండలి రద్దు, పునరుద్ధరణ విషయంలో తీర్మానం చేసి పంపడం వరకే అసెంబ్లీ చేతుల్లో ఉంటుంది . మిగిలిన తతంగం అంతా కేంద్రం దయ రాష్ట్రం ప్రాప్తం అన్నట్లుగానే ఉంటుంది. ఆంధ్ర ప్రదేశ్’లో మండలి రద్దును కోరుతూ శాసన సభ ఎప్పుడో సంవత్సరం క్రితమే తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపింది. అయితే,ఇంతవరకు కేంద్రం నుంచి స్పందన లేదు. ఈలోగా మండలిలో అధికార పార్టీ బలం పెరగడంతో జగన్ ప్రభుత్వం కూడా చప్పుడు చేయడంలేదు.  సో,బెంగాల్ అసెంబ్లీ తీర్మానం ఆమోదించినా, జరిగేది మమతా దీదీకి ఒరిగేదీ ఏమీ ఉండదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అదీ గాక, అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని, బీజేపీ వ్యతిరేకించింది. తీర్మానంపై బెంగాల్ అసెంబ్లీలో ఓటింగ్ జరిగిన సమయంలో సభలో ఉన్న 265 మందిలో 196 మంది తీన్మారానికి అనుకూలంగా, 69 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. అంటే బీజేపీ ఎమ్మెల్యేలు అందరికి అందరూ తీన్మారాన్ని వ్యతిరేకించారు. సో.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంత త్వరగా నిర్ణయం తీసుకుంటుందని అనుకోవడం అయితే అజ్ఞానం, కాదంటే మరొకటి అవుతుంది. సో.. నవంబర్ 4 గడువు లోగా మమతా బెనర్జీ సభలో అడుగు పెట్టడం అయ్యే పనికాదని, ఆమె రాజీనామా చేయక తప్పక పోవచ్చని రాజకీయ పండితులు భావిస్తున్నారు.  ప్రస్తుతం దేశం మొత్తంలో  ఉభయ తెలుగు రాష్ట్రాలు సహా ఆరు రాష్ట్రాలలో మాత్రమే శాసన మండలి వుంది. అవిభక్త ఆంధ్ర ప్రదేశ్’లో కూడా 1985లో  అప్పటి ఎన్టీఅర్ ప్రభుత్వం మండలిని రద్దు చేసింది. అయితే.తిరిగి 2007లో వైఎస్సార్ ప్రభుత్వం మండలిని పునరుద్ధరించింది. మండలి పునరుద్ధరణకు,ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ 2015లో తీర్మానం చేసినా, కేంద్రంలోనూ,రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉన్నా, కేంద్రం ఓకే చేయడానికి ఇంచుమించుగా రెండున్నర సంవత్సరాలు పట్టింది.సో.. బెంగాల్ కౌన్సిల్ పునరుద్ధరణకు ఇంకా  ఎక్కువ సమయం పట్టినా ఆశ్చర్య పోనవసరం లేదు. ఈ లోగా పుణ్యకాలం  ముగిసి పోతుంది . అందకే, దీదీకి తాత్కాలికంగానే అయినా పదవీ గండం తప్పదని పరిశీలకులు బావిస్తున్నారు.

రేవంత్ ర్యాలీ అదుర్స్‌.. ప్ర‌గ‌తిభ‌వ‌న్ బెదుర్స్‌..

టీవీల్లో చూసిన వారంతా షాక్‌. యూట్యూబ్ ఓపెన్ చేసిన వారంతా షేక్‌. ఏంద‌ది.. అస‌లేంద‌ది.. ఇంత‌కు ముందెప్పుడూ చూడ్లేదే.. ఏమి జ‌నం.. ఏమి జాత‌ర‌.. ఏమీ జ‌న‌జాత‌రా. లీడ‌ర్ అంటే అట్టుండాల‌. అభిమానులంటే ఇట్టే ఉండాల‌. అప్పుడే రాజ‌కీయాల్లో మ‌జా వ‌చ్చేది. ప్ర‌త్య‌ర్థుల‌కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేది.  పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి ప‌ట్టాభిషేకానికి కాంగ్రెస్ శ్రేణులు, రేవంత్‌ అభిమానులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. జూబ్లిహిల్స్‌లోని రేవంత్‌రెడ్డి ఇంటి నుంచి ర్యాలీగా గాంధీభ‌వ‌న్ చేరుకున్నారు. ర్యాలీ అంటే సింపుల్‌గా ర్యాలీ మాత్రం కాదు. అంత‌కుమించే. మొద‌ట రేవంత్ ఇంటి ద‌గ్గ‌ర వంద‌లాదిగా వాహ‌నాలు. కార్లు,, బైకుల్లో అభిమానాలు. రేవంత్ ఇంటి నుంచి బ‌య‌ట‌కు రాగానే.. ఇక సంద‌డి షురూ. తీన్మార్ డ్యాన్సులు,, ఈల‌లు.. పాట‌లు.. గోల‌లు.. జూబ్లిహిల్స్‌లో రేవంత్‌ వైబ్రేష‌న్స్‌..... రేవంత్‌రెడ్డి మీద రాసిన ఒక్కో పాట రోమాలు నిక్క‌బొడిచేలా ఉన్నాయి.. మైకుల్లో ఆ పాటలేసి.. రేవంత‌న్న ర్యాలీగా వ‌స్తుంటే.... నా సామి రంగ‌... అభిమానుల్లో పూన‌కమే... దారి పొడ‌వునా దండ‌లు.. దండాలే.. రేవంత్‌రెడ్డి వాహ‌నానికి.. ముందూ వెన‌కాలంతా జ‌న సందోహ‌మే... కారెన‌క కార్ల‌తో భారీ కాన్వాయ్‌.. బండెన‌క బండితో భారీ బైక్ ర్యాలీ... దారి పొడ‌వునా.. కాంగ్రెస్ జెండాల రెప‌రెప‌లే... రేవంత్‌రెడ్డిపై పూల వానే.... వాహ‌నం మీద నుంచి రేవంత్‌రెడ్డి అంద‌రికీ అభివంద‌నం చేస్తూ ముందుకు సాగారు.. న‌గ‌రం న‌లుమూల‌ల నుంచి బైకుల‌పై త‌ర‌లివ‌చ్చిన యువ‌త‌.. రేవంత‌న్న సైన్యంగా ఆసాంతం ఆయ‌న్ను అనుస‌రించింది.. మొద‌ట వంద‌లాది మంది.. ర్యాలీ ముందుకు సాగుతున్న కొద్దీ ఆ సంఖ్య వేల‌కు చేరింది.. ర్యాలీలో సిటీ యూత్ భారీగా పాల్గొంది.. ఇక తెలంగాణ‌లోని ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ శ్రేణులు, రేవంత్ అభిమానులు సైతం వేల‌ల్లో గాంధీభ‌వ‌న్‌కు త‌ర‌లివ‌చ్చారు.. తెలంగాణ‌లోని అన్నిదారులు గాంధీభ‌వ‌న్ వైపే దారి తీశాయి.. ఆ దారుల‌న్నీ కాంగ్రెస్ జెండాల‌తో.. రేవంత‌న్న నినాదాల‌తో మారుమోగిపోయాయి... ఇక్కడ మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. ఒక‌ప్ప‌డు వైఎస్సార్ వెంట అనుంగ అనుచ‌రుడిగా ఉన్న సురీడు.. ఇప్పుడు రేవంత్‌రెడ్డికి సైతం ప్ర‌ధాన సేవ‌కుడిగా మారాడు. ర్యాలీ ఆసాంతం సురీడు.. రేవంత్ వెన‌కాలే ఉండ‌టం చూసి.. రేవంత్ కూడా మ‌రో వైఎస్సార్‌లానే క‌నిపిస్తున్నారంటూ అభిమానులు చ‌ర్చించుకుంటున్నారు.   ముందుగా జూబ్లిహిల్స్ పెద్ద‌మ్మ త‌ల్లి ఆశీస్సులు తీసుకున్నారు.. ఆ త‌ర్వాత నాంప‌ల్లి ద‌ర్గాలో ద‌ట్టీ క‌ట్టుకున్నారు.. చివ‌రాఖ‌రికి గాంధీభ‌వ‌న్‌లో పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి అడుగు....  టీవీల్లో, యూట్యూబ్‌లో.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న‌ కోట్లాది మంది అభిమానులు రేవంత్‌రెడ్డి కార్య‌క్ర‌మాన్ని వీక్షించి.. పీసీసీ చీఫ్‌ ప‌ట్టాభిషేకాన్ని గ్రాండ్ స‌క్సెస్ చేశారు.  ఇక్క‌డ హైద‌రాబాద్ రోడ్ల‌పై రేవంత్‌రెడ్డి ర్యాలీ ముందుకు సాగుతుంటే.. అక్క‌డ ప్ర‌జ‌ల్లో కేసీఆర్ ఇమేజ్ వెన‌కెన‌క్కి పోతోంది.. ఇక్క‌డ అభిమానుల నినాదాల‌తో గాంధీభ‌వ‌న్ హోరెత్తుతుంటే.. జై రేవంతన్న‌ నినాదాలు అక్క‌డ ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో రీసౌండ్‌లో వినిపిస్తున్నాయి.. ఇప్పుడు పీసీసీ చీఫ్‌గా గాంధీభ‌వ‌న్‌లో రేవంత్‌రెడ్డి వేసిన అడుగు.. భ‌విష్య‌త్‌లో అధిష్టించ‌బోయే ముఖ్య‌మంత్రి పీఠం వైపు తొలిఅడుగు అంటున్నారు. ఇక కాస్కో కేసీఆర్‌.. అప్నా టైమ్ ఆయేగా.. అంటూ రాజ‌కీయ న‌గారా మోగిస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు.

డెల్టా, లాంబ్డా వేరియంట్లతో మహా ముప్పు! ప్రపంచ దేశాలకు WHO అలర్ట్.. 

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ముప్పు ఇప్పట్లో పోదా? వైరస్ మరింతగా విజృంభించబోతుందా? అంటే అవుననే అంటున్నాయి వైద్య సంస్థలు. కాలానికి తగ్గట్టుగా మార్పులు చేసుకుంటున్న కరోనా… కొత్త వేరియంట్ల రూపంలో విరుచుకుపడబోతోందని చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే చెబుతోంది. కరోనా ముప్పు ఇంకా ఉందని, ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని ప్రపంచ దేశాలకు తాజాగా హెచ్చరికలు జారీ చేసింది డబ్ల్యూహెచ్ వో.  ప్రస్తుతం డెల్టా వేరియంట్ పలు దేశాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. డెల్టాతో పాటు లాంబ్డా వేరియంట్ల మళ్లీ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ వేరియంట్‌ను గతంలో C.37 గా ప్రకటించింది WHO. కరోనా వైరస్ నుంచి రూపాంతరం చెందుతున్న ఏడవ సరికొత్త వేరియంట్‌గా దీన్ని వెల్లడించింది.  భారత్ లో సెకండ్ వేవ్ కల్లోలానికి కారణమైంది డెల్టా వేరియంట్. ఇప్పుడది 96 దేశాల్లో విస్తరించింది.  పలు దేశాల్లో డెల్టా ప్లస్‌ కలవరపెడుతుంటే..మరికొన్ని దేశాల్లో లాంబ్డా వణుకు పుట్టిస్తోంది.దక్షిణ అమెరికా, లాటిన్ ఆమెరికా దేశాల్లో లాంబ్డా వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి.  లాంబ్డా ధాటికి గజగజలాడిపోతోంది బ్రిటన్‌. కొత్త వేరియంట్ డెల్టా కంటే లామ్డా చాలా ప్రమాదకరమైనదని బ్రిటన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు అంతర్జాతీయ ప్రయాణికుల్లో 6 కేసులు నమోదయ్యాయి. గత నాలుగు వారాల్లో బ్రిటన్‌తో పాటు..మరో 30 దేశాలకు వ్యాప్తించింది ఈ లాంబ్డా వేరియంట్‌. దీంతో ఈ స్ట్రెయిన్‌పై ఫోకస్‌ పెట్టాల్సిందేనని ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ పెరూ దేశంలో తొలి లాంబ్డా వేరియంట్ ఉద్భవించిందని ప్రపంచ ఆరోగ్య శాఖ భావిస్తోంది. ఈ వైరస్ ద్వారా దాదాపు 80% ఇన్ఫెక్షన్లు వ్యాప్తిస్తున్నట్లు తెలిపింది. ఇది డిసెంబర్ 2020 నాటి నమూనాలలోనే శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది పొరుగున ఉన్న చిలీలో కూడా లాంబ్డా వేరియంట్ ప్రబలుతోంది. లాంబ్డా అనుమానాస్పద సమలక్షణ చిక్కులతో అనేక ఉత్పరివర్తనాలను కలిగి ఉందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఈ జన్యుసంబంధమైన మార్పులతో సంబంధం ఉన్న పూర్తి స్థాయిలో ప్రస్తుతం పరిమిత సాక్ష్యాలు ఉన్నాయి. ప్రతికూల చర్యలపై ప్రభావాన్ని బాగా అర్థం చేసుకోవడానికి, వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి సమలక్షణ ప్రభావాలపై మరింత బలమైన అధ్యయనాలు అవసరమని WHO ఒక ప్రకటనలో తెలిపింది టీకాల నిరంతర ప్రభావాన్ని ధృవీకరించడానికి మరిన్ని అధ్యయనాలు చేయాల్సి ఉందని పేర్కొంది. ప్రపంచ దేశాలు కరోనా పోయింది అనుకోవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని హెచ్చరించింది.

హిందువు మతం ప్రకారం.. ఇవి దానం చేస్తే ఖతం..

మతం  అంటే కొన్ని కోట్ల మంది ఆచారపు అలవాట్లు.. వాళ్ళ జీవన విధానం.. వాళ్ళ సంస్కృతి.. అని చెప్పవచ్చు.. హిందువులు మతంలో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి.. కొన్ని నిబంధనలు ఉన్నాయి.. భారత దేశమంతా హిందూ మతంలో కొన్ని ముఖ్య విషయాలు.. ఏదైనా వస్తువు దానం చేసేటప్పుడు.. దానివల్ల జరిగే మంచి చెడులు చూస్తాం.. ఒక్కొక్కసారి దానం చేయడం శుభసూచకంగా భావిస్తారు. ఇలా చేస్తే ఇంట్లో మంచి జరుగుతుందని.. అయితే మన హిందూ మంతం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఈ వస్తువులు దానం చేయొద్దు..! ఒకవేళ చేశారనుకో అంతే సంగతులు..? తిరుపతి వెంకన్న దగ్గరికి పోకుండానే గుండు.. మూడు నామాలు మీకు పడినట్లే.. మరి ఇంతకీ ఏం ఏం వస్తువులు దానం చేయకూడదో తెలుసుకుందామా  ? మరి.. 1. పసుపు పసుపుకు అటు సైటిఫిక్ ఇటు శాస్రం గా మంచి పేరు ఉంది.. వాస్తు  శాస్త్రం ప్రకారం.. సాయంత్రం పసుపు దానం చేస్తే ఇంట్లో మంచి జరగదు. పసుపు బృహస్పతి కారకంగా పరిగణిస్తారు. కనుక సాయంత్రం పసుపును దానం చేయకూడదు. 2. పాలు పాముకి పాలు పోస్తే అది చివరికి విషాన్ని చిమ్ముతుంది అన్న సామెత వినేవుంటారు.. పాలు చాలా స్వచ్చమైనవి.. రంగులోను రుచిలోనూ చాలా అద్భుతమైనవి. పాలు నేరుగా చంద్రుడికి సంబంధించినవి. ఇది లక్ష్మీ, విష్ణు దేవత కారకంగా నమ్ముతారు. అందువల్ల సూర్యాస్తమయం తరువాత పాలు దానం చేయడం వల్ల డబ్బు కొరత ఏర్పడుతుంది. 3. పెరుగు వాస్తు ప్రకారం పెరుగును శుక్రుని కారకంగా పరిగణిస్తారు. ఇది ఇంట్లో ఆనందం, శ్రేయస్సుని తెస్తుంది. సాయంత్రం పెరుగు దానం చేయడం ద్వారా ఇంటి ఆనందం పోతుందని నమ్ముతారు. 4. పాడైపోయిన ఆహారాన్ని దానం చేయడం మంచిది కాదు.. చాలా మంది పాడైపోయిన అన్నని ఆడుకునేవాళ్ళకో.. లేదంటే ఇంట్లో పనిచేసేవాళ్లకో పెట్టి పుణ్యం కావలి అని అనుకుంటారు .. అన్ని దానాల్లో  అన్నదానం గొప్పదనం అంటారు అందుకే  పేదవారికి ఆహారం దానం చేస్తే పుణ్యలోకాలు దక్కుతాయని పెద్దలు చెబుతుంటారు. అయితే చాలా మంది పాడైపోయిన ఆహారాన్ని దానం చేస్తారు. అలా చేయడం పాపం. ఎల్లప్పుడూ శుభ్రమైన ఆహారాన్ని దానం చేయాలి. 5. డబ్బు, వ్యాపారం చేయవద్దు.. వాస్తు శాస్త్రం ప్రకారం సాయంత్రం ఎవరికీ రుణాలు ఇవ్వవద్దు. ఇలా చేయడం ద్వారా తల్లి లక్ష్మి వెళ్లిపోతుందని నమ్మకం. దీంతో పాటు ఇంట్లో డబ్బు సమస్యలు మొదలవుతాయి. అందువల్ల సాయంత్రం సమయంలో రుణాలు తీసుకోవడం మానుకోవాలి. నోట్ - ఈ సమాచారం మత విశ్వాసాల ఆధారంగా ఉంటుంది. మేము కూడా హిందూ మతాన్ని బట్టి చెప్పడం జరిగింది.. సహాయం చేసేటప్పుడు తిథి నక్షత్రం చూడడం ఏంటి అని మీరు అనుకుంటే.. తప్పు ఏం లేదు.. మేము చెప్పిన పై మాటలకూ శాస్త్రీయ ఆధారాలు లేవని గుర్తించండి..

రూ 120 కోసం.. మామ ప్రాణం తీశాడు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..

పగకోసం పక్కవారిని చంపడం మూర్ఖత్వం.. అదే పైసల కోసం మరొకడ్ని చంపడం నేరం.. అదే డబ్బుల కోసం ఇంట్లో వాళ్ళను చంపడాన్ని ఏమంటారు మరి.. అది ఏ లక్షల కోసమో కాదు.. కోట్లకు కాదు.. జస్ట్ రూ 120 కోసం మేనమామనే చంపాడు ఓ వ్యక్తి.. ఎవడైనా ఒక వ్యక్తిని చంపాడు అంటే ఏ కోట్లు రావడం కోసమో.. చేస్తాడు వీడేంటి మరి దారుణంగా రూ 120  ఒక వ్యక్తిని చంపడం అని అనుకుంటున్నారా? మీకు ఉన్న అనుమానం క్లియర్ కావాలంటే ఈ వార్త చదవాలి మీరు.. మరింకెందుకు ఆలస్యం.. పదండి వివరాల్లోకి..  అది గ్యాలియర్‌లోని ఓల్డ్ కాంట్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలో కయూమ్ ఖాన్ చేపలను విక్రయించేవాడు. అతని మేనల్లుడు కల్లుఖాన్ సమీపంలో చేపల వేపుడును అమ్ముతూ జీవించేవాడు. ఇద్దరు మామఅల్లులు కలిసి మెలిసి ఉండేవాళ్ళు ఆదివారం  రాత్రి కల్లు ఖాన్ అతని మేనమామ దగ్గర రూ.120కి చేపలను విక్రయించి.. అల్లుడే కదా డబ్బులు ఇవ్వడమే ఎందుకులే అని అనుకున్నాడు ఆ మేనమామ. పైసల్ అంటే మాములు విషయం కాదు కాదా శత్రుత్వాన్ని మిత్రుత్వం గాను మిత్రుత్వాన్ని శత్రుత్వం గాని చేస్తాయి.. డబ్బు ముందు బంధువులు, ప్రేమలు ఏం పనికి రావు.. మామ డబ్బులు ఇవ్వలేదని అల్లుడు కల్లు ఖాన్ మేనమామకు రూపాయలు 120 ఇవ్వాలని అడిగాడు.. అంతటితో అల్లుడితో మామ  గొడవకు దిగాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో మేనల్లుడు కల్లుఖాన్.. కత్తితో మామ కయూమ్ ఖాన్‌పై దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన కయూమ్‌ను స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ కయూమ్ మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన జరిగిన అనంతరం కల్లు ఖాన్ అక్కడినుంచి పరారయ్యాడు. దీంతో మృతుడి కుటుంబం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

వైవీ మంత్రి పదవి ఆశలు ఆవిరేనా ? కారణం ఆయనేనా..? 

జీవితంలో ఒక్కసారి అయినా మంత్రి పదవి దక్కితే చాలనే కోరిక ఒక స్థాయికి చేరిన రాజకీయ నాయకులు అందరిలో సహజంగా ఉంటుంది. అలాంటిది, ముఖ్యమంత్రి  బాబాయ్, మాజీ ఎంపీ, టీటీడీ చైర్మన్ అయిన వైవీ సుబ్బారెడ్డికి ఆ కోరిక ఉండడంలో తప్పు లేదు. ఆయనకు కోరిక ఉంటే ఉండవచ్చును కానీ, అందరి కోరికలు, అన్ని సందర్భాలలో తీరాలనే రూలేమీ లేదు. అందులోనూ జగన్ రెడ్డి పాలనలో లెక్కలు తప్పడం కొత్తేమి కాదు. తొలి మంత్రి వర్గం కూర్పులోనే ఆయన చాలా మంది ఆశల మీద నీళ్లు చల్లారు, కన్నీళ్లు మిగిల్చారు. అందులో కొందరి కోరికలు ఒక జీవితకాలం లేటు అయినా అవ్వచ్చును. గతంలో, సీనియర్ రాజకీయ నాయకుడు రాయపాటి, ప్రస్తుతం వైవీకి దక్కిన టీటీడీ చైర్మన్ పదవి కోసం పరితపించి పోయారు. ఆ ఒక్కటి చాలని, అనేక మొక్కులు మొక్కుకున్నారు. ఆ ఒక్కటి ఇస్తే ఇంకేదీ  కోరనని నేరుగా దేవదేవునికే మొర పెట్టుకున్నారు. అయినా ఫలితం లేక పోయింది.   ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కోరుకున్న మంత్రి  పదవి కాదని.. మరోసారి టీటీడీ చైర్మన్‌’ గా కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే వైవీకి మాత్రం రాష్ట్రంలో మంత్రి పదవి  కాదంటే, రాజ్యసభ ఎంపీగా ఢిల్లీలో చక్రం తిప్పాలనే కోరిక చాలా బలంగా ఉందని ఆయన సన్నిహితుల సమాచారం. ఆయన తమ కోరికను జగన్ రెడ్డికి అనేక మార్లు నివేదించుకున్నారు. చివరకు ప్రస్తుత టీటీడీ పాలక మండలి  చివరి సమావేశానికి వెళ్తున్నసమయంలో కూడా వైవీ, తన పరిస్థితి ఏమిటని ముఖ్యమంత్రిని  కోరినట్లు సమాచారం. ముఖ్యంగా, వైవీ టీటీడీ అధ్యక్ష పదవీకాలం ముగింపుకు సమయానికే, రెండున్నర ఏళ్ల తర్వాత ఉన్నవారిని తొలిగించి కొత్తవారికి అవకాశం ఇస్తామని, అప్పట్లోనే ముఖ్యమంత్రి మంత్రులకు డెడ్లైన్ విధించిన నేపధ్యంగా      రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కసరత్తు మొదలు కావడంతో, ఆయన తమ కోరికను మరోమారు అబ్బాయి చెవిలో వేశారని  సమాచారం.  జగన్ రెడ్డి కూడా బాబాయ్ రిక్వెస్ట్’ను పరిశీలించ  సారీ చెప్పినట్లు తెలుస్తోంది. మరో మారు టీటీడీ చైర్మన్ గా కొనసాగక తప్పదని తేల్చివేశారని పార్టీ వర్గాలలో వినవస్తోంది.  ఒక దశలో వైవీ అభ్యర్ధనకు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి, ఎందుకు మనసు మార్చుకున్నారు, ఎందుకు మరోసారి, సారీ చెప్పారు అంటే, అందుకు రెండు మూడు కారణాలు కనిపిస్తున్నాయని, రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఒంగోలు జిల్లా నుంచి ముఖ్యమంత్రి సమీప బంధువైన బాలినేనికి మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు వైవీకి ఇస్తే బాలినేనిని తొలిగించవలసి వస్తుంది.కారణాలు ఏవైనా ఇది జగన్ రెడ్డికి ముఖ్యంగా ఆయన కుటుంబ కోటరీకి ఇష్టంలేదు. అందుకే ముఖ్యమంత్రి,ఇటు పార్టీలోని ఒకరిద్దరు కీలక నేతలతో, అటు కుటుంబ సభ్యులతో చర్చించి, వైవీని తిరిగి మరోమారు టీటీడీ ఛైర్మన్‌గా, బాలినేని మంత్రిగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.  అదొక కారణం అయితే జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగాబాధ్యతలు చేపట్టినప్పతి నుంచి, టీటీడీ ఆస్తులపై కన్నేశారు అనేది, రాజకీయ పార్టీలే కాదు, ఆధ్యాత్మిక, ధార్మిక సంస్థలు మొదలు సామాన్య భక్తుల వరకు అందరూ చేస్తున్న ఆరోపణ. నిజానికి ఇది ఆరోపణ కాదు, దేశ వ్యాప్తంగా ఉన్న వెంకన్న దేవుని స్థిరాస్తులను విక్రయించేందుకు ఆమోదం తెలుపుతూ టీటీడీ పాలక మండలి తీర్మానం చేసింది. అయితే, అ విషయంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా వెనక్కి తీసుకున్నారు. అయితే, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి రోజు రోజుకు దిగజారి దివాలా స్థితికి చేరుకున్న నేపధ్యంలో ఇప్పుడు కాకపోయినా, రేపు ఎప్పుడైనా పూట గడిచేందుకు వెంకన్న ఆస్తులే దిక్కయ్యే పరిస్థితి వస్తే, కాగల కార్యం కానిచ్చేందుకు సొంత మనిషి టీటీడీ చైర్మన్’గా ఉండడం మంచిది అన్న ఆలోచనతో కూడా వైవీ కోరికను కాదన్నట్లు తెలుస్తోంది.  ఒంగోలు జిల్లానుంచి వైవీకి ఆవకాశం ఇస్తే, రెండున్నర సంవత్సరాల డెడ్లైన్’ కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఆశావహుల ఆందోళన చెందడం, మరో వంక కుల సమీకరణల లెక్క తప్పడం కూడా ఆయన మంత్రి పదవి ఆశలపై నీళ్ళు చల్లిందని అంటున్నారు.ఏమైనా, జీవితకాలం అని అనలేము కానీ, ప్రస్తుతానికి అయితే, వైవీ మంత్రిపదవి  ఆశ కొండెక్కి కూర్చుంది.