కేసీఆర్‌కు మెఘా షాక్! కాళేశ్వరంలో ఏం జరిగింది?

కాళేశ్వరం.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్ట్. ఆసియాలోనే అతిపెద్ద ఎత్తిపోథల పథకంగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టును అనతి కాలంలో పూర్తి చేశారు. బ్యారేజీలు, పంపు హౌజ్ లు, వరద కాలువలు, సర్జిపూల్స్  ఈ ప్రాజెక్టులో ప్రత్యేకం. కాళేశ్వరం  ప్రాజెక్టులో మెజార్టీ పనులను మెఘా ఇంజనీరింగ్ సంస్థ నిర్వహించింది. ప్రాజెక్టును అనుకున్న సమయానికే పూర్తి చేసిందంటూ మెఘా సంస్థను కేసీఆర్ కూడా పలు సార్లు ఓపెన్ గానే ప్రశంసించారు. అయితే ఇప్పుడా మెఘా సంస్థే కేసీఆర్ కు షాకిచ్చిందని తెలుస్తోంది. ఆ సంస్థ తీరుపై కేసీఆర్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారట.  కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇటీవల డిస్కవరీ ఛానెల్ లో టెలికాస్ట్ అయిన డాక్యుమెంటరీనే తాజా వివాదానికి కారణమని తెలుస్తోంది. డిస్కవరీలో కాళేశ్వరం డాక్యుమెంటరీని ముందుగా హైలెట్​ చేసిన ప్రభుత్వం… నీటిపారుదల శాఖ ఆ తర్వాత తేలిగ్గా తీసిపారేస్తోంది. దాదాపు 55 నిమిషాల ఈ డాక్యుమెంటరీలో అత్యధికంగా మెఘా ప్రాజెక్టు, సంస్థ ఇంజినీర్లు, సంస్థ ప్రతినిధులనే హైలెట్​చేశారు. ప్రభుత్వం, ఇరిగేషన్​ఇంజినీర్ల భాగస్వామ్యాన్ని తెరకెక్కించడంలో వెనకబడ్డారు. దీంతో ఇది కాళేశ్వరం డాక్యుమెంటరా… మెఘా సంస్థ సొంత వీడియోలా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.​ కాళేశ్వరం ప్రత్యేక డాక్యమెంటరీలో కేవలం నిర్మాణ సంస్థనే హైలెట్​చేసినట్లు ఇరిగేషన్​ఇంజినీర్లు మండిపడుతున్నారు. అసలు ఇంజినీర్లు, ప్రభుత్వం చేసిందంతా పక్కన పెట్టి కేవలం మెఘా నిర్మాణ సంస్థ కష్టంతోనే కాళేశ్వరం పూర్తి చేశారనే విధంగా కథనం వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  వాస్తవానికి డిస్కవరీలో కాళేశ్వరం ప్రత్యేక డాక్యుమెంటరీపై ప్రభుత్వం కూడా విస్తృత ప్రచారం చేసింది. ఆ డాక్యుమెంటరీని తిలకించాలంటూ ప్రకటనలు ఇచ్చింది. కాళేశ్వరం ప్రగతి దేశ, విదేశాలకు పాకుతుందని, అంతర్జాతీయ వేదికపై కాళేశ్వరం ఆవిష్కృతమవుతుందంటూ నీటిపారుదల శాఖ ఈ కథనానికి ప్రచారం కల్పించింది. కానీ డిస్కవరీలో వచ్చిన పూర్తి కథనంలో నిర్మాణ సంస్థను హైలెట్​ చేసినంతగా ప్రాజెక్టును చూపించలేదు. దీనిలో ప్రభుత్వం, ఇంజినీర్లు చేసిన కృషిని తక్కువగానే చూపించారు. పనులపై నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో కాకుండా… ఎంత మేరకు పనులు చేశాం, ఎలా పనులు చేశామంటూ మెఘా ఇంజినీర్లతోనే చెప్పించారు. డాక్యుమెంటరీలో మెఘా ఇంజినీరింగ్​సంస్థ ఎండీ కృష్ణారెడ్డి, డైరెక్టర్​ శ్రీనివాస్​రెడ్డితో పాటు ఇతర స్థాయిల్లోని కంపెనీ ఇంజినీర్లతోనే కథనంలో మాట్లాడించారు.  మొదట్లో ఒకసారి, చివర్లో ఒకసారి కాళేశ్వరం ప్రాజెక్టు సీఈతో మాట్లాడించారు. కాళేశ్వరం నిర్మాణంలో తమ సంస్థను హైలెట్​ చేసుకునే క్రమంలో  ప్రభుత్వాన్ని కూడా పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. నిర్మాణ సంస్థ ఎండీ ఐదారు సార్లు మ్యాపులను పరిశీలిస్తూ, పలుమార్లు పనులను పరిశీలిస్తూ, కొన్ని సందర్భాల్లో తమ సిబ్బందికి సలహాలు ఇస్తూ కనిపించేలా చిత్రీకరించుకున్నారు. దీనిపై సంస్థ ఎండీ కృష్ణారెడ్డి, డైరెక్టర్​శ్రీనివాస్​రెడ్డితో పదేపదే మాట్లాడించారు. కానీ సీఎం కేసీఆర్, ఇంజినీర్లను కేవలం రెండు నిమిషాలకే పరిమితం చేశారు. పనులు మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మెఘా కంపెనీ చేసిన పూజలు, పనులు… ఇలా అన్నింటినీ పాత వీడియోలతో ఈ కథనం చూపించారు. దీంతో సీఎం కేసీఆర్​ కూడా అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రభుత్వ గొప్పతనాన్ని కాదని కేవలం నిర్మాణ సంస్థను ఫోకస్​ చేయడంపై ఇరిగేషన్​ ఉన్నతాధికారులపై కూడా కేసీఆర్ కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు జల వనరుల శాఖ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. లక్ష కోట్లు ఖర్చు పెట్టి చేపట్టిన ప్రాజెక్టును ఒక నిర్మాణ సంస్థ తమ గొప్పతనంగా చూపించుకోవడం డాక్యుమెంటరీలో ప్రధానంగా నిలిచిందని టీఆర్ఎస్​వర్గాలు సైతం అసహనంగా ఉన్నాయి.  ఇరిగేషన్ ఇంజినీర్లు కూడా సదరు నిర్మాణ సంస్థపై బహిరంగంగానే మండిపడుతున్నారు. మెఘా కంపెనీ ఇంజినీర్లు, ఆ సంస్థే పని చేసినట్లుగా చూపించుకుని, తమను తక్కువ చేశారంటూ ఆగ్రహిస్తున్నారు. 

నీళ్ల దొంగ‌లా? తోడు దొంగ‌లా? దొందు దొందేనా..?

జ‌గ‌న్ గ‌జ‌దొంగ‌.. వైఎస్సార్ నీళ్ల‌దొంగ‌. ఇదీ తెలంగాణ మంత్రుల ఆరోప‌ణ‌. కాదు కాదు.. జ‌గ‌న్‌, కేసీఆర్ ఇద్ద‌రూ తోడు దొంగ‌లే అనేది ప్ర‌తిప‌క్షాల‌ విమర్శ‌. ఇలా దొంగ‌ల దంగ‌ల్ తెలుగురాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎవ‌రు దొంగ‌? ఎవ‌రు గ‌జ‌దొంగ‌? ఎవ‌రెవ‌రు తోడు దొంగ‌లు? అనే క‌న్ఫ్యూజ‌న్‌తో వాట‌ర్ పాలిటిక్స్ రంజుగా మారాయి.  తెలంగాణ దూకుడు మీదుంది. ఏపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేందుకు శ్రీశైలం, నాగార్జున సాగ‌ర్‌, పులిచింత‌ల‌లో అవ‌స‌రం లేకున్నా విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తోంది. దీంతో ఏపీ కుర్రోమెర్రోనంటూ మొత్తుకుంటోంది. ఆ ప్రాజెక్టుల్లో నీళ్లే లేవు.. ఉన్న కాసిన్ని నీళ్ల‌ను క‌రెంట్ కోసం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు.. ముందుముందు రైతుల ప‌రిస్థితి ఏంటంటూ గ‌గ్గోలుపెడుతున్నారు ఏపీ మంత్రి అనిల్‌. మేం పైనున్నాం.. మా ఇష్టం అనేది తెలంగాణ టెంప‌ర్‌మెంట్‌. అస‌లు మూలాల్లోకి వెళితే.. నాగార్జున సాగ‌ర్‌, పులిచింత‌ల ప్రాజెక్టులు క‌ట్టిందే విద్యుత్ ఉత్ప‌త్తి కోసం.. సాగునీటికి కాదంటూ లా పాయింట్లతో వాదిస్తోంది తెలంగాణ‌. ఇట్టా అయితే ఎట్టా అంటూ.. కృష్ణాబోర్డుకు, ప్ర‌ధానికి ఫిర్యాదు చేస్తామంటూ.. సీఎం జ‌గ‌న్ గ‌ట్టి రిటార్డ్ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నారు. చూస్తుంటే.. రెండు రాష్ట్రాలు.. ఇద్ద‌రు సీఎంలు.. జ‌ల‌జ‌గ‌డంలో ప‌ట్టుద‌ల‌కు పోతున్నార‌ని.. త‌మ త‌మ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం గ‌ట్టిగా పోరాడుతున్నార‌ని అనిపించేలా జ‌ల వివాదం జోరుగా సాగుతోంది.  అయితే.. ఇదంతా ఉత్తుత్తి డ్రామానే అనే విమ‌ర్శ‌లు కూడా వినిపిస్తున్నాయి. తెలంగాణ‌లో కేసీఆర్ ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింద‌ని.. ఇటు ఈట‌ల.. అటు రేవంత్‌ల‌తో ఆయ‌న‌కు రాజ‌కీయంగా మ‌ద్దెల ద‌రువు మొద‌లైంద‌ని అంటున్నారు. ఆ డ‌బుల్ బ్యారెల్ గ‌న్ ఫైరింగ్ నుంచి త‌ప్పించుకోడానికే.. జ‌నంలో వాట‌ర్ సెంటిమెంట్ రెచ్చ‌గొడుతున్నార‌నేది కొంద‌రి అనుమానం. నీళ్ల కోసం మా కేసీఆర్ ఏపీతో ఫుల్ ఫైట్ చేస్తున్నార‌నే భ్ర‌మ ప్ర‌జ‌ల్లో క‌లిగించ‌డానికే ఇంత ర‌చ్చ చేస్తున్నార‌ని చెబుతున్నారు. తెలంగాణ మంత్రులు కావాల‌నే.. ఇంత‌కుముందెన్న‌డూ లేనంత‌గా జ‌గ‌న్‌ను ఇష్ట‌మొచ్చిన‌ట్టు తిడుతున్నార‌ని.. ఇదంతా తెర‌పైన ఉత్తుత్తి తిట్లేన‌ని.. తెర వెనుక వాళ్లిద్ద‌రూ ర‌హ‌స్య స్నేహితులేన‌నేది ప్ర‌తిప‌క్షాల మాట‌. ఇటు ఏపీ సీఎం జ‌గ‌న్ సైతం డ‌బుల్ గేమ్ ఆడుతున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. రాయ‌ల‌సీమ ప్ర‌యోజ‌నాల కోసం ఫైట్ చేస్తున్న‌ట్టు బిల్డ‌ప్ ఇవ్వ‌డానికే.. రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం- ఆర్డీఎస్‌పై హ‌డావుడి చేస్తున్న‌ట్టు సీన్ క్రియేట్ చేస్తున్నార‌ని అనుమానిస్తున్నారు. నేను కాలువ త‌వ్వుతున్న‌ట్టు చేస్తా.. నువ్వు ఆపుతున్న‌ట్టు చేయి.. అనేట్టు ఇద్ద‌రు సీఎంలా వ్య‌వ‌హారం ఉంద‌ని విమ‌ర్శిస్తున్నారు. సీమ కోసం కేసీఆర్‌తో జ‌గ‌న్ పోరాడుతున్నార‌నే అభిప్రాయం క‌లిగేలా ముఖ్య‌మంత్రి మేనేజ్ చేస్తున్నార‌ని అంటున్నారు. ఇటు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు, అటు హైద‌రాబాద్‌లో త‌న ఆస్తుల ర‌క్ష‌ణ‌కే.. జ‌గ‌న్ ఇలా జ‌ల డ్రామా ఆడుతున్నార‌నేది ప్ర‌తిప‌క్షం ఆరోప‌ణ‌.  తాజాగా, విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని అవే ఆరోప‌ణ‌లు చేశారు. ఇరు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల వివాదం పెద్ద డ్రామా. ప్ర‌జ‌ల‌ను ఆ ఇద్ద‌రూ పిచ్చోళ్ల‌ను చేసి ఆడుకుంటున్నారు. కేసీఆర్‌, జ‌గ‌న్ ఇద్ద‌రూ తోడు దొంగ‌లేనంటూ టీడీపీ చేసిన విమ‌ర్శలపై చ‌ర్చ జ‌రుగుతోంది. లేదంటే.. నిత్యం బూతులు మాట్లాడే మంత్రి కొడాలి నాని.. జ‌గ‌న్‌ను అన్నేసి మాట‌లు అంటున్నా మౌనంగా ఉండ‌ట‌మేంటి? తెలంగాణ మంత్రులు వైఎస్సార్‌ను నీళ్ల‌దొంగ అన్నా.. ఏపీ నీళ్ల మంత్రి అనిల్ అలా సుతిమెత్త‌గా మాట్లాడ‌ట‌టేంటి? నిజ‌మే,. అంతా డ్రామాలానే ఉంద‌ని అంటున్నారు జ‌నాలు. నేను కొట్టిన‌ట్టు చేస్తా.. నువ్వు ఏడ్చిన‌ట్టు న‌టించు.. అన్న‌ట్టు ఉంది తెలుగు పాల‌కుల‌ తీరు అంటూ ప్ర‌జ‌లు ప‌రేషాన్ అవుతున్నారు.    

హుజురాబాద్ లో హరీష్ స్కెచ్? విపక్షాలకు చుక్కలేనా..? 

హుజురాబాద్ నియోజక వర్గం ఉప ఎన్నికలో గెలుపు తెరాసకు, అవసరం. ఒక్క తెరాసకు మాత్రమే కాదు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కూడా కీలకం. అయితే, తెరాసకు  కొంచెం ఎక్కువ అవసరం.ఇది ముఖ్యమంత్రి కేసీఆర్’కి ఇజ్జద్ కి సవాల్.అందుకే,గులాబీ బాస్, హుజురాబాద్ బాధ్యతలను, హరీష్ రావుకు అప్పగించారు. హరీష్ రావుకు బాధ్యత అప్పగిస్తే, ఇక తిరిగి చూసుకోవలసిన అవసరం ఉండదు అనేది, కేసీఆర్ మొదలు తెరాస సాధారణ కార్యకర్త వరకు అందరికీ ఉన్న విశ్వాసం. మొన్నటి దుబ్బాక ఎన్నికల ప్రచారంలో అయితే, అదే మాట హరీష్ రావు స్వయంగా చెప్పుకున్నారు. “నేను ఎక్కడికి వెళ్ళినా, అక్కడి నుంచి గెలుపునే పట్టుకెళతాను” అని చాలా విశ్వాసంతో ప్రకటించుకున్నారు. ఫలితం ఏమిటో వేరే చెప్ప నక్కరలేదు. అయితే, అంత మాత్రం చేత, దుబ్బాక నుంచి ఆయన ఓటమిని పట్టుకెళ్ళారు, కాబట్టి, హరీష్ ఆట అయిపోయిందని అనుకోలేము. ఆ తర్వాత హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. ఆఖరి  నిముషంలో పీవీ కుమార్తె వాణీదేవిని అభ్యర్ధిగా ప్రకటించినా, హరీష్ మరోసారి తన సత్తా నిరుపించుకున్నారు. ఆమెను గెలిపించారు. అందుకే రాజకీయాల్లో అట అయిపోవడం ఉండదు,  24X 7 మ్యాచ్ నడుస్తూనే ఉంటుంది.   అందుకే మళ్ళీ అత్యంత కీలకమైన హుజురాబాద్ ఉప ఎన్నిక బాధ్యతను కేసీఆర్, అల్లుడు హరీష్’కు అప్పగించారు. నిజమే, బాధ్యత హరీష్ మీద ఉంచినా, కీసీఆర్ మొదలు చిన్నాపెద్ద నాయకులు అందరూ, హుజురాబాద్ గెలుపు కోసం, మేము సైతం’ అంటూ నడుం బిగించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర నాయకులంతా ఇప్పటికే అక్కడకు చేరుకున్నారు. ప్రచారం ప్రారంభించారు. ఎవరికి అప్పగించిన పనిని వారు ఇంచక్కా చక్క బెట్టేస్తున్నారు. గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, బాల్క సుమన్ సహా పలువురు టీఆర్ఎస్ నేతలందరూ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.  మధ్య మద్యలో మంత్రులు వెళ్లి వస్తున్నారు. అన్నిటినీ మించి, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎదో ఒక పేరున జనంలోకి వెళ్లి ‘లైవ్ ‘ లో ప్రచారం చేస్తున్నారు.  ఇక  హుజురాబాద్ ఉప  ఏన్నిక ఎపిసోడ్’ ప్రధాన పాత్రదారి, మాజీమంత్రి ఈటల రాజేందర్, ఆయన వెంట బీజేపీ సేనలు, ప్రచారం సాగిస్తున్నారు. ఈటల తమ మాజీ బాస్’కు ఏ మాత్రం తీసిపోకుడా ఆయన భాషలో సమాధానం చెపుతున్నారు. ఇరువర్గాల నాయకులు మధ్య  విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు జోరుగా సాగుతున్నాయి. నిజానికి, ఉపఎన్నిక తేదీ ఇంకా ఖరారు కాకపోయినా, ఇప్పటికే హుజురాబాద్’ లో ఎన్నికల సందడి మొదలైంది. అదలా, ఇంతవరకు కాస్త స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలోనూ  రేవంత్ రెడ్డి రాకతో జోష్ పెరిగింది. రేపు జులై 7 పీసీసీ ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత రంగంలోకి దిగితే, ఇక అసలు కథ  అప్పుడుమొదలవుతుంది.    ఇంత జరుగుతున్నా  హరీష్ మాత్రం ఇంతవరకు అటుగా వెళ్ళలేదు. హుజురాబాద్ వైపు కన్నెత్తి చూడలేదు. హుజురాబాద్ గడప తొక్కలేదు. కథ మొత్తం హైదరాబాద్, సిద్దపేట నుంచే నడిపిస్తున్నారు.అంతా బానే వుంది, అయితే, హరీష్ ఎందుకు దూరంగా ఉంటున్నారు?  దుబ్బాకలో, ‘ఒరేయ్ బండి సంజయ్ ...’ అంటూ గర్జించిన హరీష్ హుజురాబాద్ విషయంలో తెరవెనక పాత్రకే ఎందుకు పరిమితం అవుతున్నారు, అనే అనుమానాలు పార్టీ వర్గాల్లో కూడా  వినిపిస్తున్నాయి. అలాగే ఏవేవో వ్యుహాగానాలు కూడా వినిపిస్తునాయి.  అయితే, హరీష్ తెర మీద కనిపించక పోయినా, ఆయన స్కెచ్ ప్రకారమే కథ నడుస్తోందని పార్టీ వర్గాలు అంటున్నాయి. హుజురాబాద్, వ్యవహారం అంతా ఆయన  కనుసన్నల్లోనే జరుగుతోందని, ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత హరీష్ రియల్ ఎంట్రీ ఉంటుందని పార్టీ  వర్గాలు చెపుతున్నాయి.  ప్రస్తుతం హరీష్ పార్టీలో చేరికలు, సమాలోచనలు కూడా హైదరాబాద్, సిద్దిపేట నుంచే నడిపిస్తున్నారు. నిన్న గాక మొన్న, కొందరు చోటామోటా బీజేపే నాయకులు కూడా హైదాబాద్ వచ్చి అయన చేతుల మీదుగా గులాబీ కండువా కప్పుకున్నారు. ఒక విధంగా హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని హరీష్ అధికార నివాసం, హుజురాబాద్ తెరాస ఎన్నికల కార్యాలయంలాగా మారిపోయింది. ఏమైనా హరీష్, మామూలోడు కాదు, మామకు తగ్గ అల్లుడు. కేసీఆర్ పదవులకు ఆయన వారసుడు అయినా కాకపోయినా, ఆయన రాజకీయ ఎత్తులు,వ్యూహ ప్రతివ్యుహాల చతురతకు మాత్రం ఆయనే నిజమైన వారసుడు అంటారు.గతంలో,  ఉద్యమ కాలం నుంచి అనేక సందర్భాలాలో అది రుజువైంది. ఇక ముందు కూడా అదే నిజం అవుతుందా లేదా అనేది హుజురాబాద్ ఫలితంతో  తెలుస్తుంది.

షాడో సీఎం సజ్జల రామకృష్ణారెడ్డి.. అంతా ఆయ‌న పెత్త‌న‌మే..నా?

ప్రభుత్వంపై మాటల దాడి పెరిగి..సమాధానం చెప్పుకోలేక డిఫెన్స్ లో పడిన టైమ్ లో ఈయన ప్రత్యక్షమవుతారు. పొంతన లేని వాదనలతో ఏదో రకంగా సమాధానం ఇచ్చేస్తారు. మంత్రులు చెప్పాల్సినవి కూడా ఈయనే చెబుతారు. అసలు మంత్రులు ఏదైనా తేడా మాట్లాడితే.. ఈయనకే సమాధానం చెప్పుకోవాలి. అందుకని ఈయన మాట్లాడితేనే బెటరని ఊరుకుంటున్నారు. సీఎం ఎటూ ఎప్పుడుబడితే అప్పుడు టైమ్ ఇవ్వరు. ఈయన మాత్రం పిలిచి మరీ క్లాసు తీసుకుంటారు. అందుకే బాస్ ని షాడో సీఎం అని ఈ మధ్య ముద్దుగా పిలుచుకుంటున్నారు.  వైసీపీలోనూ, ప్రభుత్వంలోనూ నెంబర్ టూగా చాలా డ్రమెటిక్ గా... చాలా స్పీడుగా ఎదిగిపోయారు ప్రభుత్వ సలహాదారుగా నియమించబడ్డ సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల స్పీడు మామూలుగా లేదు. డీఎస్సీ వేయటం లేదు..టీచర్ల పోస్టులు భర్తీ చేయడం లేదంటే.. సమాధానం చెప్పాల్సిన విద్యామంత్రి ఆదిమూలపు సురేష్ ఇప్పటివరకు కనపడనే లేదు. కాని సజ్జల సార్ మాత్రం వచ్చి టీచర్ల పోస్టులపై ఎదురుదాడి చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత గృహ నిర్మాణాలపై ఆ శాఖ మంత్రితో కలిసి రివ్యూ నిర్వహించారు. ఇళ్ల నిర్మాణం ఎలా నడుస్తుందో సమీక్ష నిర్వహించారు సజ్జల. ఇక ఆ తర్వాత లేటెస్టుగా పోలవరం ప్రాజెక్టును ఎమ్మెల్యేలతో వెళ్లి సందర్శించి.. అధికారులతో సమీక్షించారు. ఇవన్నీ చూస్తుంటే సజ్జల రామకృష్ణారెడ్డి సీన్ బాగా పెరిగినట్లే కనపడుతోంది. జగన్మోహన్ రెడ్డి బాస్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. ఇక పోలీసు డిపార్ట్ మెంటుపై సజ్జల గ్రిప్ సంగతి అందరూ చెప్పుకునేదే. ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే పోలీసు అధికారుల బదిలీలు..కానిస్టేబుల్ స్థాయి వరకు లిస్టులు వైసీపీ సెంట్రల్ ఆఫీసులోనే.. అది కూడా సజ్జల చాంబర్ లోనే రెడీ అయ్యాయనే ఆరోపణలు వచ్చాయి. అందుకే ఆ తర్వాత పోలీసులు ఏం చేయాలన్నా.. ఎక్కడ ఎవరిని పట్టుకోవాలన్నా.. ఎవరిని వదిలేయాలన్నా సజ్జల నుంచి ఫోన్లు వెళుతున్నాయని చెప్పుకుంటున్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ను డమ్మీ చేసి మరీ సజ్జల నేరుగా అందరు ఆఫీసర్లకు డైరెక్షన్ ఇస్తున్నారనే విమర్శలు వినపడుతున్నాయి. ఎంపీ రఘురామ అరెస్టు ఎపిసోడ్ లో అదే జరిగిందని అంటున్నారు. ఈ పరిణామాలతో గౌతమ్ సవాంగ్ కూడా సైలెంట్ అయిపోయారని.. పైగా దిశ యాప్ పై సీఎం పెట్టిన సభలో సైతం డీజీపీ పాల్గొనకపోవడం అందుకు సాక్ష్యం అని కూడా కొందరు ఆరోపిస్తున్నారు. వైసీపీలో సజ్జల హవా బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు వైసీపీ సెంట్రల్ ఆఫీసు బాధ్యతలు అప్పచెప్పినా.. మళ్లీ విజయసాయిరెడ్డి అడ్డం పడటంతో అది ఆగిపోయింది. తర్వాత జిల్లాలను విభజించి సజ్జల, విజయసాయి, వైవీ సుబ్బారెడ్డి, వేమిరెడ్డి లకు పంచారు జగన్. కాని విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రకు పరిమితం అయిపోయారు. వైవీ సుబ్బారెడ్డి టీటీడీకే పరిమితమయ్యారు. అటు పార్టీపైనా..ప్రభుత్వంపైనా సజ్జల మాత్రం పట్టు పెంచుకున్నారు. క్రమంగా మంత్రులంతా చేతిలోకి వచ్చారు. ఇప్పుడు సజ్జలకు చెబితే జగన్ కు చెప్పినట్లే.. సజ్జల ఆదేశిస్తే జగన్ ఆదేశించినట్లే అన్నట్లు అయిపోయింది పరిస్ధితి. ఇధి మింగుడుపడని విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు కౌంటర్ మంత్రాంగం కూడా మొదలెట్టారని తెలుస్తోంది.  

వైవీ సుబ్బారెడ్డి వ‌ర్రీ.. ప‌క్క‌న పెట్టేశారా? ప‌ట్టు సాధిస్తారా?

ఎంపీ టిక్కెట్ ఇవ్వమంటే ఇవ్వలేదు. కోపం వచ్చింది. కనీసం జిల్లాలో తాను చెప్పినవారికి ఇవ్వమన్నా.. వినలేదు. ఈసారి బాగా హర్టయ్యారు. సైలెంట్ అయిపోయారు. అధికారం వచ్చాక..కీలక పదవి అప్పచెప్పారు. అలక తీరిపోయింది. బాగుంది బాగుంది అనుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు తాను ఒక కోటలో బంధించబడ్డానని.. తన కొలీగ్స్ మాత్రం రాష్ట్రాన్ని ఏలేస్తున్నారని..అర్ధమైంది. అందుకే బాధపడుతున్నారు. ఆ కీలక పదవి ఇక అక్కర్లేదని తెగేసి చెప్పేశారంట. అధినేత ఏమనుకున్నా సరే..ఐ డోంట్ కేర్ అంటున్నారంట. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాల్సిందేనని డిసైడ్ అయ్యారంట. వైవీ సుబ్బారెడ్డి. వైసీపీలో కీలక నేత.. పార్టీ పంచతంత్రంలో ఒక ముఖ్యమైన తంత్రం. అలాంటిది తనకు వాల్యూ లేకుండా పోయిందని.. కీలకమైనవన్నీ ఇతరులు చేసుకుంటుంటే..తాను మాత్రం తిరుపతికే పరిమితమైపోయానని బాధపడుతున్నట్లు సమాచారం. అందుకే ఈసారి టీటీడీ ఛైర్మన్ పదవి తనకు వద్దని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. టీటీడీ ఛైర్మన్ ప్రతి ఏడాది నియమిస్తారు. కొనసాగించాలనుకుంటే కొనసాగిస్తున్నట్లు చెబుతారు. రాష్ట్రంలోని నామినేటెడ్ పదవులపై కసరత్తు చేస్తున్న వైసీపీ అధిష్టానం ముందు వైవీ సుబ్బారెడ్డి ఈ మాట చెప్పారట. తనకు టీటీడీ ఛైర్మన్ పదవి అవసరం లేదని చెప్పేశారంట. బాస్ ఇలా అలగడం మొదటిసారి కాదు. 2014 ఎన్నికలప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మధ్య ప్రకాశంలో ప్రచ్ఛన్న యుద్ధమే జరిగింది. అప్పుడు బాలినేనితో సహా కొందరి ఓటమికి వైవీ సుబ్బారెడ్డే కారణమని పార్టీలో చర్చ జరిగింది. అప్పటి నుంచి జగన్ వైవీపై గుర్రుగా ఉన్నారని చెబుతుంటారు. అందుకే 2019 ఎన్నికలప్పుడు ఎంపీ టిక్కెట్ రెండో సారి ఇవ్వకుండా.. టీడీపీ నుంచి వచ్చిన మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఇచ్చారు. మిగతా నియోజకవర్గాల్లో కూడా వైవీ మాటకు విలువ ఇవ్వలేదు. దీంతో హర్టయిన వైవీ సుబ్బారెడ్డి సైలెంట్ అయిపోయారు. అధికారం వచ్చాక.. వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ ఛైర్మన్ పదవి అప్పచెప్పారు. దీంతో వైవీ శాంతించారు. చాలా కమిటెడ్ గా..జగన్ డైరెక్షన్ ప్రకారం టీటీడీ వ్యవహారాలు నడిపిస్తున్నారు వైవీ సుబ్బారెడ్డి. వారనుకున్నట్లే.. టీటీడీలో ఆసాంతం వారి కంట్రోల్ లోకి తెచ్చుకున్నారు. అంతా బాగానే ఉందనుకున్న టైములో వైవీ సుబ్బారెడ్డికి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కొత్త ఆలోచనలు కలిగించాయని తెలుస్తోంది. సజ్జల రామకృష్ణారెడ్డి నెంబర్ టూ గా ఎదిగిపోవటం.. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అంతా ఆయనదే నడుస్తుండటం వైవీ సుబ్బారెడ్డికి మింగుడుపడటం లేదని తెలుస్తోంది. అలాగే విజయసాయిరెడ్డికి ప్రాధాన్యం తగ్గినట్టు కనపడ్డా..ఉత్తరాంధ్రను సామంతరాజ్యంలా నడిపిస్తూ..ఢిల్లీలో తన పట్టు కొనసాగించుకోవడంతో..ఆయనకు ఏ ఢోకా లేకుండా ఉంది. ఎటొచ్చీ వారిద్దరి కంటే జగన్ కు క్లోజ్ అయినప్పటికీ...తాను మాత్రం దూరమైపోయానా అనే బాధ ఆయన గుండెలను మెలిపెడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. తన మనిషి సీఎంగా ఉంటే..తాను మాత్రం ఏడుకొండల మధ్య బందీ అయిపోయానని.. ఇలా కాదని.. తాను కూడా రాష్ట్రమంతా పట్టు సంపాదించాలని పట్టుదల మీదున్నట్లు తెలుస్తోంది. అందుకే  ఈసారి తనకు టీటీడీ ఛైర్మన్ పదవి అవసరం లేదని తెగేసి చెప్పేశారంట. మరి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. దానికి వైవీ సుబ్బారెడ్డి రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.  

బ్రోకర్ జీవన్ రెడ్డి.. పార్క్ హయత్ లో ఏమి నీ దందా?

తెలంగాణ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెస్ నేతల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ నేతలు టార్గెట్ గా రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పంచ్ డైలాగులతో విరుచుకుపడుతుండగా... ఆయన బాటలోనే హస్తం నేతలు వాయిస్ పెంచారు. కేసీఆర్, కేటీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కౌంటరిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ కథ ముగిసిందని అన్నారు. దీంతో జీవన్ రెడ్డి కౌంటరిస్తూ కాంగ్రెస్ నేతలు సంచలన కామెంట్లు చేశారు.  ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని బ్రోకర్ జీవన్ రెడ్డి అంటేనే ఎవరైనా గుర్తుపడతారని టీపీసీసీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్య రెడ్డి విమర్శించారు. బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ లో జీవన్ రెడ్డికి ఉన్న విలాసవంతమైన సూట్ లో జరుగుతున్న వ్యవహారాలు అందరికీ తెలుసునని అన్నారు. సినిమా రంగముతో ఉన్న సంబంధాలు, వాటిని రాజకీయ అవసరాల కోసం వాడుతున్న సంగతి గురించి మీ టీఆరెస్ నాయకులు ఎవరిని అడిగినా చెప్తారని అయోధ్య రెడ్డి చెప్పారు. దుబాయ్ లో దొంగ వ్యాపారం, బ్యాంకులకు రుణాలు ఎగవేత ఇలా ఎన్ని చెప్పినా జీవన్ రెడ్డి  గురించి ఇంకా తక్కువేనని విమర్శించారు.  ఆర్మూరులో జీవన్ రెడ్డి అవినీతి అక్రమాలపై పోరాడుతున్న తలారి సత్యం ఎలా దారుణంగా హతం అయ్యాడో ముందుగా ప్రజలకు చెప్పుకోవాల్సిన బాధ్యత జీవన్ రెడ్డి మీద ఉందన్నారు కాంగ్రెస్ లీడర్.  ఆర్మూరులో పసుపు రైతులకు అన్యాయం జరిగిందని మొత్తుకున్నా  పట్టించుకోకుండా పార్క్ హయత్ హోటల్ లో నువ్వు జల్సాలు చేసుకుంటున్న సమయంలోనే ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకునిగా రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున సభ పెట్టారని అయోధ్య రెడ్డి గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి కొట్లాడేదాకా సోయి లేని జీవన్ రెడ్డి సలహాలు ఇచ్చే స్థాయిలో ఉన్నాడా అని ప్రశ్నించారు.తన మీద ఉన్న ఆరోపణలు, బ్రోకర్ పనుల మీద అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక టీవీ స్టూడియో నుంచి పారిపోయిన జీవన్ రెడ్డి నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జీవన్ రెడ్డి మాటలు చూసి టీఆర్ఎస్ నేతలే  నవ్వుతున్నారని అయోధ్య రెడ్డి ఎద్దేవా చేశారు. 

తహసీల్దార్ ఆఫీసు గేటుకు తాళిబొట్టు.. లంచం ఇవ్వలేక మహిళ నిరసన..

ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు ఇవ్వనిదే ఏ పని జరగదని అంటారు. రెవిన్యూ పనులైతే ఛాన్సే ఉండదు. తహశీల్దార్ కార్యాలయం పని కావాలంటే పర్సు ఫుల్లుగా ఉండాల్సిందే. రెవిన్యూ అధికారుల తీరుపై ఎన్ని ఆరోపణలు వచ్చినా.. ఆ శాఖ సిబ్బందిలో మాత్రం మార్పు రావడం లేదు. రెవిన్యూ సిబ్బందికి అమ్యామ్యాలు ఇచ్చుకోలేక గతంలో కొంత మంది విరాళాలు సేకరించి నిరసన తెలిపారు. తాజాగా మంత్రి కేటీఆర్ సొంత జిల్లాలో  మహిళా రైతు వినూత్న రీతిలో నిరసన తెలిపింది. ఏకంగా తన తాళి బోట్టు తీసి తహసీల్దార్ కార్యాలయం గేటుకు కట్టింది. అది లంచంగా తీసుకుని తన సమస్యను పరిష్కరించాలని వేడుకుంది.  రాజన్న సిరిసిల్ల మండలం రుద్రంగి మండలం తహసీల్దార్ కార్యాలయం గేటుకు తాళిబొట్టు కట్టి  మహిళ నిరసనకు దిగింది. మానాల గ్రామానికి చెందిన మంగకు సంబంధించిన భూమిని వేరేవారికి పట్టా చేశారని తహసీల్దార్ కార్యాలయం ముందు ఆమె బైఠాయించింది. తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నా భూమిని వేరే వాళ్లకు ఎలా పట్టా చేశారని ప్రశ్నించింది. తనకు న్యాయం చేయాలని, తన భూమి తనకు ఇవ్వాలని ఆ మహిళ కన్నీటి పర్యంతమైంది. వెంటనే తన పేరుపై పట్టా చేయాలని బాధితురాలు మంగ అధికారులను వేడుకుంది. అయినా అధికారులు స్పందించలేదు. దీనికి సంబంధించి అనేకసార్లు అధికారులను వేడుకున్నా పట్టించుకోలేదని అందుకే కార్యాలయం గేటుకు తన తాళిబొట్టు కట్టి నిరసన తెలుపుతున్నానని మంగ తెలిపింది.  మహిళ తన మెడలో ఉన్న తాళిబొట్టును తీసి తహసీల్దార్ కార్యాలయం గేటుకు కట్టడం కలకలం రేపింది.మహిళకు తాళిబొట్టే మాంగల్యం అంటారు. లంచం కోసం తాళిబొట్టును కూడా తీసింది అంటే... అధికారులు ఆ మహిళను ఎంతగా వేధించారో అర్ధం చేసుకోవచ్చు. మహిళ నిరసనతో అధికారులు షాకయ్యారు. స్థానికులు ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ మహిళ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.   

బాలయ్య ఫుల్ ఖుషీ.. బసవతారకంపై నీతి ఆయోగ్ ప్రశంసలు

తెలుగు రాష్ట్రాల్లో  వైద్య సేవలు అందిస్తున్న బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి, సత్యసాయి ఆస్పత్రులపై నీతిఆయోగ్ ప్రశంసలు కురిపించింది. ఈ ఆస్పత్రులకు ఇచ్చే విరాళాలకు వంద శాతం పన్ను మినహాయింపు ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. లాభాపేక్ష లేకుండా సేవ చేస్తున్నందున ఈ హాస్పిటల్స్ కు వందశాతం పన్నుమినహాయింపు ఇవ్వాలని నీతిఆయోగ్ కేంద్రాన్ని కోరింది.  దివంగత సీఎం ఎన్టీఆర్ తన సతీమణి క్యాన్సర్‌తో చనిపోయారు. క్యాన్సర్ బారినపడిన భార్యకు సరైన చికిత్స చేయించలేకపోయామేనని ఎన్టీఆర్ ఆవేదన చెందారు. నాటి పరిస్థితులను మార్చాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ బసవతారకం ఆస్పత్రిని లాభాపేక్ష లేకుండా నిర్మించారు. చివరకు 2000లో బసవతారకం మెమోరియల్ క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు పేదలకు క్యాన్సర్ వైద్యంలో నమ్మకమైన ఆస్పత్రిగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ ఆస్పత్రికి చైర్మన్‌గా నందమూరి బాలకృష్ణ వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆస్పత్రిని 500 పడకలకు విస్తరించారు. తెల్లకార్డు ఉన్న పేదలకు దాదాపుగా ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ఇతరులకు కూడా చాలా తక్కువ మొత్తంతో క్యాన్సర్ వైద్యం అందిస్తారు. వ్యాధి వచ్చిన వారికే కాకుండా.. క్యాన్సర్ రాకుండా అవగాహన చేపట్టడం.. పేదల ప్రజలకు క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడం వంటివి ఈ మెమోరియల్ ఆస్పత్రి చేస్తోంది.  అనంతపురం జిల్లాలోని సత్య సాయి హాస్పిటల్ లో కూడా రూపాయి తీసుకోకుండా అత్యాధునిక వైద్యం పేదలకు అందుతోంది. ప్రతి నెలా అనంతపురం జిల్లాలోని 12 నోడల్‌పాయింట్లలో మొబైల్‌ ఆసుపత్రులను నిర్వహిస్తోంది. 400 గ్రామాల ప్రజలు ఉచితంగా సేవలు పొందుతున్నారు. బసవతారకంతో పాటు సత్యసాయి ఆస్పత్రులకు ఇప్పటి వరకూ వీటికి వచ్చే విరాళాల్లో యాభై శాతం పన్ను మినహాయింపు ఉంది. ఇక నుంచి వంద శాతంఇవ్వాలని నీతి ఆయోగ్ కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ రెండు హాస్పటల్స్ లో  ఏదైనా విరాళమో.. ఆదాయమో వస్తే.. ఆస్పత్రిలో మెరుగైన సౌకర్యాల కోసమే ఖర్చు చేస్తారు.  బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‎స్టిట్యూట్‌తో పాటు పుట్టపర్తిలోని సత్యసాయి ఆసుపత్రులపై నీతిఆయోగ్ ప్రశంసలపై బసవతారకం ఆసుపత్రి మేనేజింగ్ ట్రస్ట్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ స్పందించారు. దేశ అత్యున్నత ప్రణాళిక వ్యవస్థ నీతి ఆయోగ్ తమ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని గుర్తించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనత అంతా తన తండ్రి దివంగత నందమూరి తారక రామారావుకే చెందుతుందన్నారు. పేదలకు సముచిత ధరలో ప్రపంచస్థాయి క్యాన్సర్ చికిత్స అందాలన్న తన తండ్రి దార్శనికత వల్లే ఈ గుర్తింపు లభించిందని చెప్పుకొచ్చారు. ట్రస్టు సభ్యులు, పెద్ద మనసు చూపుతున్న దాతలు, యాజమాన్యం, డాక్టర్లు, నర్సులు, సిబ్బంది తన తండ్రి ఆశయాన్ని నిజం చేస్తున్నారని బాలకృష్ణ కొనియాడారు.

రేవంత్ దూకుడు.. బీజేపీ బేజారు.. భ‌య‌మా? వ్యూహాత్మ‌క మౌన‌మా?

రేవంత్‌రెడ్డి నాన్‌స్టాప్‌గా వాయిస్తున్నారు. నోటికి మ‌రింత‌గా ప‌ని చెబుతున్నారు. పీసీసీ చీఫ్‌గా ప్ర‌మోష‌న్ వ‌చ్చాక‌.. చిచ్చ‌ర‌పిడుగులా చెల‌రేగి పోతున్నారు. రేవంత్ నోటి నుంచి మాట‌లు తూటాల్లా దూసుకొస్తున్నాయి. ఇటు కేసీఆర్‌, కేటీఆర్‌తో పాటు అటు మ‌రో ప్ర‌త్య‌ర్థి అయిన బీజేపీనీ ఏకిపారేస్తున్నారు. మోదీ నుంచి బండి.. వ‌ర‌కూ ఏ ఒక్క‌రినీ వ‌ద‌ల‌కుండా విమ‌ర్శ‌ల‌తో తూట్లు పొడుస్తున్నారు. రేవంత్ మాట‌లు సూదుల్లా పొడుస్తున్నా.. క‌మ‌ల‌నాథుల నుంచి క‌నీస కౌంట‌ర్ ప‌డ‌క‌పోవ‌డం రాజ‌కీయంగా ఆస‌క్తి రేపుతోంది.  పీసీసీ ప్రెసిడెంట్‌గా ప్ర‌క‌ట‌న వ‌చ్చిన ఫ‌స్ట్‌డేనే కేసీఆర్‌తో పాటు స‌మానంగా బీజేపీపైనా విమ‌ర్శ‌లు సంధించారు రేవంత్‌రెడ్డి. అప్ప‌టి నుంచీ దాదాపు ప్ర‌తీరోజూ క‌మ‌ల‌నాథుల‌ను ఏదో విధంగా క‌వ్విస్తూనే ఉన్నారు. అయినా, వారి నుంచి ఉలుకుప‌లుకూ లేదు. ప్ర‌ధాని మోదీ స‌న్యాసి అని కామెంట్లు చేసినా.. క‌నీసం ఖండించ‌నేలేదు కాషాయ‌ద‌ళం. ఈట‌ల‌ను కేసీఆరే బీజేపీలోకి పంపించార‌ని.. ఆ రెండు పార్టీలు ఒక్క‌టేనంటూ.. కిష‌న్‌రెడ్డి ఢిల్లీ నుంచి హైద‌రాబాద్ రావ‌డానికి ఫ్లైట్‌ను కేసీఆరే అరేంజ్ చేశారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు కూడా చేశారు. ప్ర‌ధానిని, కేంద్ర మంత్రిని ప‌ట్టుకొని అన్నేసి ఆరోప‌ణ‌లు చేసినా.. ఏ ఒక్క బీజేపీ నేత రేవంత్ వ్యాఖ్య‌ల‌ను ఖండించ‌క‌పోవ‌డం విచిత్రం.  మోదీ దాకా ఎందుకు.. బండి సంజ‌య్‌ను ప‌ట్టుకొని జీహెచ్ఎమ్‌సీ హామీలు ఏమ‌య్యాయంటూ దుమ్ము దులిపేశారు. ఎంపీ అర్వింద్‌ను సైతం వ‌ర‌ద నీటితో క‌డిగిప‌డేశారు. బండి.. గుండు.. అంటూ ఆ ఇద్ద‌రినీ ఓ రేంజ్‌లో వేసుకున్నా.. కిమ్మ‌న‌కుండా ప‌డుంటున్నారే కానీ.. నోరు తెరిచి రేవంత్‌ను ఒక్క‌మాట కూడా తిరిగి అన‌క‌పోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. బీజేపీ నేత‌లు ప‌గ‌టి వేష‌గాళ్లు అన్నా.. పౌరుషానికి పోవ‌ట్లేదు. ఎందుకు? రేవంత్‌రెడ్డికి బీజేపీ నేత‌లు భ‌య‌ప‌డుతున్నారా? ఆయ‌న నోరు చూసి మ‌న‌కెందుకులేన‌ని బెదిరిపోతున్నారా? బండి సంజ‌య్‌. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు. పే..ద్ద నోరున్న నేత‌. కేసీఆర్‌పై ఎప్పుడూ ఒంటికాలిపై లేస్తుంటారు. రేవంత్ విష‌యానికి వ‌చ్చేస‌రికి మాత్రం.. బండి నోరు బోరుకొచ్చిన‌ట్టు మాట పెదాలు క‌ద‌ల‌డ‌మే లేదంటున్నారు. త‌న‌ను, తమ పార్టీని, ప్ర‌ధానిని.. రేవంత్ నోటికొచ్చిన‌ట్టు విమ‌ర్శిస్తుంటే.. క‌మ‌ల‌నాథుల నుంచి క‌నీస ప్ర‌తిఘ‌ట‌న రాక‌పోవ‌డం ఆశ్చ‌ర్యంగా ఉందంటున్నారు. కిష‌న్‌రెడ్డికి ఫ్లైట్ ఏర్పాటు చేసింది కేసీఆరే అంటే.. కౌంట‌ర్ రాలేదంటే.. రేవంత్ ఆరోప‌ణ నిజ‌మేనా? ఈట‌లను బీజేపీలోకి కేసీఆరే పంపించారా? మౌనం అర్థ అంగీకార‌మేనా? అనే అనుమానాలు వ‌స్తున్నాయి. బండి సంజ‌య్‌, ఎంపీ అర‌వింద్‌లు ఫైర్ బ్రాండ్ లీడ‌ర్లుగా ఫుల్ ఫేమ‌స్‌. అలాంటి నోరున్న నేత‌ల‌నే.. బండి.. గుండు.. అంటూ రేవంత్‌రెడ్డి వారిని ప‌ర్స‌న‌ల్‌గా టార్గెట్ చేసి విమ‌ర్శ‌లు చేసినా.. బీజేపీ నాయ‌కుల నుంచి మౌన‌మే స‌మాధానంగా వ‌స్తుండ‌టం నాట‌కీయ ప‌రిణామంగా క‌నిపిస్తోంది.  రేవంత్‌రెడ్డి నిన్న‌కాక మొన్న పీసీసీ చీఫ్ అయ్యారు. కొత్త మురిపం ఇంకా పోలేదు. అందుకే ఎగిరెగిరి ప‌డుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు రేవంత్‌రెడ్డి టాపికే న‌డుస్తోంది. ఆయ‌న హ‌వా అలా ఉంది. ఇలాంటి స‌మ‌యంలో రేవంత్‌.. కేసీఆర్‌తో పాటు బీజేపీనీ టార్గెట్ చేయ‌డం కామ‌న్‌. ఫోక‌స్ అంతా రేవంత్‌రెడ్డి.. కేసీఆర్‌పై చేస్తున్న విమ‌ర్శ‌ల‌పైనే ఉంది. ఇలాంటి టైమ్‌లో.. ఆవేశ‌ప‌డి రేవంత్‌రెడ్డికి కౌంట‌ర్ ఇస్తే.. ప్ర‌జ‌ల దృష్టి, విమ‌ర్శ‌ల డోసు.. కేసీఆర్ నుంచి త‌మ‌వైపు షిఫ్ట్ అవుతుంద‌నేది బీజేపీ భావ‌న‌లా ఉంది. అందుకే, రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను ఎంత‌గా తిడ‌తారో అంత‌గా తిట్ట‌నిచ్చి.. రేవంత్ ఫోక‌స్ అంతా ముఖ్య‌మంత్రిపై మ‌ళ్లేలా చేసి.. రేవంత్ విమ‌ర్శ‌ల‌తో కేసీఆర్ ఇమేజ్‌ను డ్యామేజ్ కానిచ్చి.. వాళ్లిద్ద‌రి టామ్ అండ్  జెర్రీ ఫైట్‌లో మ‌ధ్య‌లో క‌మ‌ల‌నాథులు క‌ల‌గ‌జేసుకోకుండా కొంత‌కాలం సైలెంట్‌గా ఉంటేనే బెట‌ర్ అనే భావ‌న‌తో బీజేపీ నాయ‌కులు రేవంత్‌రెడ్డి విమ‌ర్శ‌ల‌పై స్పందించ‌డం లేద‌నే వాద‌న వినిపిస్తోంది. లేదంటే, బండి సంజ‌య్ నోటికేమైనా హ‌ద్దా? ఆయ‌న సైతం రేవంత్‌రెడ్డిలా ఇష్టం వ‌చ్చిన‌ట్టు నోటికి ప‌ని చెప్ప‌గ‌ల నేతే? ఇదంతా వ్యూహాత్మ‌క మౌనం అని.. స‌రైన స‌మ‌యంలో మౌన‌వ్ర‌తం వీడి అస‌లైన ట్ర‌యాంగిల్ వార్‌కు తెర‌లేపుతార‌ని అంటున్నారు. అందాకా.. రేవంత్‌రెడ్డికి వార్ వ‌న్ సైడే...

స‌మ‌ర‌మా? స‌రెండ‌రా? జ‌గ‌న్ మాట‌ల‌కు అర్థాలే వేరులే..!

తెలంగాణ‌లో ఏపీ ప్ర‌జ‌లు ఉన్నార‌ని ఊరుకుంటున్నా.. వాళ్ల‌ని ఇబ్బంది పెడ‌తార‌నే ఎక్కువ‌గా మాట్లాడ‌టం లేదు.. లేదంటేనా...? అన్న‌ట్టు మాట్లాడారు ఏపీ సీఎం జ‌గ‌న్‌. తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల వివాదంపై సంచ‌ల‌న కామెంట్లు చేశారు. తెలంగాణ‌కు వ్య‌తిరేకంగా ఆయ‌నేదైనా కామెంట్లు చేస్తే.. హైద‌రాబాద్‌లోని ఏపీ ప్ర‌జ‌ల‌పై అక్క‌డి వారు దాడులు చేస్తార‌నే అర్థం వ‌చ్చేలా.. జ‌గ‌న్ వ్యాఖ్య‌లు ఉన్నాయంటున్నారు. బ‌హుషా జ‌గ‌న్ అలా అనడానికి.. ఇటీవ‌ల తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చేసిన హెచ్చ‌రికే కార‌ణం కావొచ్చ‌ని కూడా చెబుతున్నారు. కొడాలి నాని.. నీకు హైద‌రాబాద్‌లో రెండు ఇళ్లు ఉన్నాయి జాగ్ర‌త్త అంటూ ఆ మంత్రి వార్నింగ్ ఇవ్వ‌డంతోనే సీఎం జ‌గ‌న్ ఇలాంటి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసుంటార‌ని అంటున్నారు.  ఏపీ ప్ర‌భుత్వాన్ని, ఏపీ ప్రాజెక్టుల‌ను, సీఎం జ‌గ‌న్‌ను, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్సార్‌ను.. నోటికొచ్చిన‌ట్టు తిట్టింది తెలంగాణ మంత్రులు మాత్ర‌మే. అక్క‌డి ప్ర‌జ‌లు కాదు. టీఆర్ఎస్ నాయ‌కులు త‌మ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ఏపీపై మ‌ళ్లీ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. త‌న‌నూ, త‌న తండ్రిని గ‌జ‌దొంగ‌, నీళ్ల‌దొంగ అంటూ నోటికొచ్చిన‌ట్టు తిడుతున్నా.. ఏదో కార‌ణంతో ఇన్నాళ్లూ నోరుమూసుకుని మౌనంగా ఉన్న జ‌గ‌న్‌.. తాజాగా ఏపీ కేబినెట్‌లో త‌న మౌనానికి కార‌ణాన్ని వివ‌రించి చెప్పారు. తానేమైనా తిరిగి మాట్లాడితే.. తెలంగాణ‌లోని ఏపీ ప్ర‌జ‌లను వాళ్లు ఇబ్బంది పెడ‌తారనే ఉద్దేశ్యంతోనే అన్నీ మూసుకొని భ‌రించానంటూ స్ప‌ష్టం చేస్తూ.. రెండు ప్ర‌భుత్వాల జ‌ల జ‌గ‌డంలోకి ప్ర‌జ‌ల‌నూ ఇన్వాల్స్ చేసే ప్ర‌య‌త్నం జ‌గ‌న్ చేశారంటున్నారు.   ఇటీవ‌ల జరిగిన తెలంగాణ కేబినెట్‌లో కృష్ణా న‌దిపై క‌డుతున్న ప‌లు ఏపీ ప్రాజెక్టుల‌పై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కృష్ణాబోర్డుకు, కేంద్రానికి, గ్రీన్ ట్రైబ్యున‌ల్‌కు తెలంగాణ స‌ర్కారు ఫిర్యాదు చేసింది. అందుకు కౌంట‌ర్‌గా.. తాజా ఏపీ కేబినెట్ భేటీలోనూ సీఎం జ‌గ‌న్ తెలంగాణ తీరుపై మండిప‌డ్డారు. ఏపీ రైతులకు అన్యాయం జరుగుతుంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చ‌రించారు. నీటి వివాదంపై తెలంగాణ మంత్రులు పరిధి దాటి మాట్లాడుతున్నారని మండిప‌డ్డారు. అయితే.. త‌న‌ను గ‌జ‌దొంగ‌, వైఎస్సార్‌ను నీళ్ల‌దొంగ అన్నందుకు జ‌గ‌న్ త‌ర‌ఫు నుంచి ఎలాంటి స్ట్రాంగ్  రియాక్ష‌న్ మాత్రం రాలేదు. తెలంగాణ‌లోని ఏపీ ప్ర‌జ‌ల ర‌క్ష‌ణ కోస‌మే తానేమీ అన‌ట్లేద‌న్న‌ట్టు క‌వ‌రింగ్ ఇస్తున్నార‌ని అంటున్నారు. ఏడేళ్లుగా ఒక్క‌దాడి కూడా జ‌ర‌క్కున్నా.. స‌డెన్‌గా హైద‌రాబాద్‌లో ఏపీ వాసుల‌ను ఏమైనా చేస్తారేమోన‌నే అనుమానం ఎందుకొచ్చిందో ఎవ‌రికీ అర్థం కావ‌ట్లేదు. తెలంగాణ‌లో త‌న‌కున్న ఆస్తుల ర‌క్ష‌ణ కోస‌మో.. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మో.. కార‌ణ‌మేంటో తెలీదు కానీ.. కేసీఆర్‌-జ‌గ‌న్‌లు మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగంగానే మ‌ళ్లీ జ‌ల వివాదాల‌ను రెచ్చ‌గొడుతున్నార‌నే వాద‌నా వినిపిస్తోంది.  అయితే, వారి ప్ర‌యోజ‌నాల మాటేమో కానీ.. ఇదే అద‌నుగా తెలంగాణ ప్ర‌భుత్వం విద్యుదుత్ప‌త్తి కోస‌మంటూ కృష్ణా వాట‌ర్‌ను ఇష్టం వ‌చ్చిన‌ట్టి వాడేసుకుంటోంది. ఈ విషయంలో మరోసారి కృష్ణా యాజమాన్య బోర్డుకు లేఖ రాయాలని.. అలాగే జలవివాదాలపై ప్రధానికి కూడా లేఖ రాయాలని మంత్రులను సీఎం జ‌గ‌న్‌ ఆదేశించారు. నీటి విషయంలో ఎలా చేస్తే బాగుంటుందో అలోచించి ముందుకు వెళ్లాలని మంత్రులకు ముఖ్య‌మంత్రి సూచించారు. అయితే, ఏ నిర్ణ‌య‌మైనా జ‌గ‌న్ సొంతంగానే తీసుకుంటారు. అర్థ‌రాత్రి వైఎస్సార్‌తో చ‌ర్చించి ముందుకెళ‌తారని అంటారు. అలాంటిది, అతి సంక్లిష్ట‌మైన జ‌ల జ‌గ‌డంపై మాత్రం మంత్రులే నిర్ణ‌యం తీసుకోవాలంటూ తాను సైడ్ అయిపోవాల‌ని చూడ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.  మ‌రోవైపు.. రాయలసీమ ప్రాజెక్టు పనులను బుధవారం పరిశీలించాల్సిన కేఆర్ఎంబీ టూర్ వాయిదా పడింది. తమకు ఏపీ నుంచి సహకారం అందడం లేదని ఆరోపించింది. జూలై 3న భద్రతా బలగాల సాయంతో ప్రాజెక్టును పరిశీలిస్తామని కేఆర్ఎంబీ కేంద్ర జలవనరుల శాఖకు తెలిపింది. కేఆర్ఎంబీ ఆదేశాలను రెండు రాష్ట్రాలు పట్టించుకోకపోవడంతో జల వివాదం ఎటువైపు దారి తీస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలోనూ ఓసారి నాగార్జున సాగర్ డ్యాం దగ్గర ఇరు రాష్ట్రాలు పోటాపోటీగా బలగాలను మోహరించడం.. రెండు రాష్ట్రాల పోలీసులు బాహాబాహీకి దిగడం కలకలం రేపింది. ఈసారి కూడా అలాంటి పరిస్థితులు ఏర్పడుతాయోమోనన్న చర్చ జరుగుతోంది. ఇంత‌టి ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో తెలంగాణలో ఏపీ ప్ర‌జ‌ల‌ను అక్క‌డి వాళ్లు ఇబ్బంది పెడ‌తార‌నే ఊరుకుంటున్నా.. అంటూ వివాదాస్ప‌ద కామెంట్లు చేసి జ‌ల వివాదాన్ని మ‌రింత రాజేశారు సీఎం జ‌గ‌న్‌. ఈ ప‌రిణామాలు ఏ తీరానికో....

ఏపీ ప్రజల కోసమే కూల్ గా ఉన్నా! జల వివాదంపై జగన్ సంచలనం...

తెలుగు రాష్ట్రాల  మధ్య నెలకొన్న కృష్ణా జలాల వివాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు మౌనం వీడారు. ఏపీ ప్రభుత్వంతో పాటు ఏపీ జనాలను కించపరుస్తూ తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ నేతలు కొన్ని రోజులుగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నా సైలెంటుగానే ఉన్నారు జగన్. దీంతో ఆయన తెలంగాణ ముఖ్యమంత్రికి భయపడే మాట్లాడటం లేదనే ఆరోపణలు వచ్చాయి. అయితే బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ  సమావేశంలో జల వివాదంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం జగన్.  తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారనిే సంయమనం పాటిస్తున్నట్లు జగన్ కామెంట్ చేశారు. మన రాష్ట్రం వాళ్లు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఈ అంశంపై ఎక్కువగా మాట్లాడటం లేదని అన్నారు. టీఆర్ఎస్ నేతలు దూకుడుగా మాట్లాడుతున్నారన్న  జగన్.. తెలంగాణలోని ఏపీ ప్రజలు ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే ఎలా ఊరుకోవాలి? అని ప్రశ్నించిన ఏపీ సీఎం .. సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. తెలంగాణ మంత్రులు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారని కామెంట్ చేసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్.. నీటి అంశంలో ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించాలని మంత్రులకు సూచించారు. శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న విద్యుత్ ఉత్పత్తిని ఆపేయాలని కోరుతూ కేఆర్ఎంబీకి మరోసారి లేఖ రాయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇదే అంశంపై ప్రధాని నరేంద్ర మోడీకి కూడా లేఖ రాయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.

ఏపీలో విద్యార్థులకు లాప్ టాప్..

అమరావతిలోని సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యాశాఖకు సంబంధించిన కీలక అంశాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. జగనన్న అమ్మఒడి పథకం కింద 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ల్యాప్ టాప్ లు అందించడానికి జగన్ మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రకాశం జిల్లా ఒంగోలు శివారులో ఆంధ్ర కేసరి యూనివర్సిటీ ఏర్పాటు, విజయనగరం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలను వర్సిటీగా మార్చాలని నిర్ణయించింది. ఇందుకోసం జేఎన్టీయూ చట్టం-2008కి సవరణకు అంగీకారం తెలిపింది. మౌలిక సదుపాయల కల్పనకు రూ.5,990 కోట్ల మేర బ్యాంకు రుణం హామీకి ఆమోదం తెలిపింది. 2021-24 ఐటీ విధానానికి ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ వెటర్నరీ అంబులెన్సుల కొనుగోలుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై ఇప్పటికే కార్యాచరణ పూర్తవడంతో త్వరలోనే వెటర్నరీ అంబులెన్సులను కొనుగోలు చేయనుంది. వైసీపీ ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 28 లక్షల ఇళ్ల నిర్మాణానికి భారీగా ప్రచార కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన విధివిధానాలను మంత్రివర్గం ఆమోదించింది. టిడ్కో ద్వారా 2,62,216 ఇళ్ల నిర్మాణం పూర్తికి ఓకే చెప్పింది.  కాకినాడ పోర్టులో రీ గాసిఫికేషన్ టెర్మినల్ ఏర్పాటుపై చర్చింటిన మంత్రివర్గం మారిటైమ్ బోర్డుతో సంయుక్త కార్యకలాపాల నిర్వహణకు అనుమతిచ్చింది. రీసర్వే పట్టాదారులకు ధ్రువపత్రాల జారీకి భూహక్కు చట్ట సవరణకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం.. విశాఖ జిల్లా నక్కపల్లి హెటిరో డ్రగ్స్ కు 81 ఎకరాల భూ కేటాయింపుకు అంగీకారం తెలిపింది. పుట్టపర్తి నియోజకవర్గానికి రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు కింద నీటి సరఫరా కోసం తొలిదశ కింద ఎత్తిపోతల, గ్రావిటీ ద్వారా నీటి సరఫరాకు అంగీకారం తెలిపింది. వైద్యశాఖలో మౌలిక సదుపాయల కల్పనపై చర్చించిన మంత్రివర్గం రాష్ట్ర వ్యాప్తంగా పీహెచ్ సీలకు 539 కొత్త 104 వాహనాల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. విజయవాడలో గుణదలలో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రేవంత్‌రెడ్డితో వైఎస్సార్ బ్యాచ్‌!.. కాంగ్రెస్‌లో మ‌రో మ‌హానేత‌..!

రేవంత్‌రెడ్డికి పీసీసీ పీఠం వ‌రించ‌గానే.. కాంగ్రెస్‌లో ఫుల్ జోష్. ద‌మ్మున్ననాయ‌కుడు వ‌చ్చాడంటూ కేడ‌ర్‌లో క‌ద‌నోత్సాహం. కేసీఆర్‌కు క‌రెక్ట్ మొగుడంటూ.. ఇక హ‌స్తం పార్టీదే అధికారమంటూ అప్పుడే ఊహాగానాలు. కాంగ్రెస్‌లో ఇలాంటి ఉత్తేజం ఇంత‌కు ముందెప్పుడూ లేదు. అప్ప‌ట్లో వైఎస్సార్ ఉన్న‌ప్పుడు పార్టీ ఇలానే కొత్త‌పుంత‌లు తొక్కింది. మ‌ళ్లీ ఇన్నేళ్ల త‌ర్వాత కాంగ్రెస్ త‌న హ‌స్త‌రేఖ‌లు మార్చుకుంటోంది. రేవంత్‌రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల ఆశాకిర‌ణం.. రేవంత్‌రెడ్డితోనే పార్టీకి పున‌ర్‌వైభ‌వం సాధ్యం., అని గ‌ట్టిగా న‌మ్ముతున్నారు. బ‌హుషా అందుకే కాబోలు.. కాంగ్రెస్‌లోని పాత కాపులంతా మ‌ళ్లీ యాక్టివ్ అవుతున్నారు. ఏడేళ్లుగా మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్న లీడ‌ర్లంతా మ‌ళ్లీ ఖ‌ద్ద‌ర్ బ‌ట్ట‌లు బ‌య‌ట‌కు తీస్తున్నారు. రేవంత్‌రెడ్డిని క‌లిసి.. త‌మ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించేందుకు ఆయ‌న క్యాంప్ ఆఫీసులు వ‌ల‌స క‌డుతున్నారు. ఒక‌రా.. ఇద్ద‌రా.. రేవంత్ ఇంటి దగ్గ‌ర జాత‌ర‌. బ‌డాబ‌డా నేత‌ల నుంచి బ‌క్కప‌ల‌చ కార్య‌క‌ర్త వ‌ర‌కూ.. రేవంత్‌ను క‌లిసి శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. ఇక అభిమానుల హంగామా అంతాఇంతా కాదు. ఇటు ఇంటి ముందు.. అటు సోష‌ల్ మీడియాలో.. రేవంత‌న్న నినాదాలు మారుమోగుతున్నాయి.  చాలాకాలం త‌ర్వాత వైఎస్సార్ మ‌నుషులుగా ముద్ర‌ప‌డిన ప‌లువురు నేత‌లు తాజాగా రేవంత్‌రెడ్డిని క‌ల‌వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. సురీడు తెలుసుగా.. ఒక‌ప్ప‌టి వైఎస్సార్ అనుచ‌రుడు. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మ‌ర‌ణంతో అర్థాంత‌ర‌మైన ఆయ‌న‌.. ఇప్పుడు మ‌ళ్లీ రేవంత్‌రెడ్డి వెలుగుల్లో ఉద‌యిస్తున్న సూరీడుగా బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇటీవ‌ల రైతు భ‌రోసా పాద‌యాత్ర స‌భ‌లోనే రేవంత్ స‌భ‌లో త‌ళుక్కున మెరిసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఇప్పుడు రేవంత్‌కు పీసీసీ పీఠం ద‌క్క‌డంతో మ‌రోసారి ఆయ‌న్ను క‌లిసి అభినంద‌న‌లు చెప్పారు. బ‌హుషా.. వైఎస్సార్ త‌ర్వాత రేవంత్‌రెడ్డిపైనే ఆయ‌న‌కు గురి కుదిరిన‌ట్టుంది. కుదిరితే.. రేవంత్‌కూ ప్ర‌ధాన అనుచ‌రుడు అవ్వాల‌ని సురీడు భావిస్తున్నారో ఏమో.... ఇక‌, ఫైర్ బ్రాండ్ లీడ‌ర్ కొండా సురేఖ సైతం రేవంత్‌రెడ్డిని కలిసి శుభాకాంక్ష‌లు తెల‌ప‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. ప్ర‌స్తుతం ఆమె కాంగ్రెస్‌లోనే ఉన్నా.. కొన్నాళ్లుగా పార్టీలో స్త‌బ్దుగా ఉన్నారు. రేవంత్‌రెడ్డి రాక‌తో మ‌ళ్లీ యాక్టివ్ అవుతున్నారు. రేవంత్‌లానే కొండా సురేఖ‌కు కేసీఆర్ అంటే బ‌ద్ద విరోధం. అప్ప‌ట్లో జ‌గ‌న‌న్న కోసం కేసీఆర్‌ను ఎదిరించి.. మ‌హ‌బూబాబాద్‌లో రాళ్ల దాడిని ఎదుర్కొన్నారు. అంత‌కుముందు వైఎస్సార్ మ‌నిషిగా కాంగ్రెస్‌లో ఆధిప‌త్యం చెలాయించారు. వైఎస్సార్ మ‌ర‌ణంతో కాంగ్రెస్‌ను వీడి జ‌గ‌న్ వెనుక నిల‌బ‌డ్డారు. అయితే, జ‌గ‌న్ తెలంగాణను వ‌దిలేసి ఏపీకి పారిపోవ‌డంతో.. వేరే గ‌త్యంత‌రం లేక టీఆర్ఎస్‌లో చేరి ఎమ్మెల్యే అయ్యారు. అయితే, నియోజ‌క‌వ‌ర్గంలో అరాచ‌కాలు చేస్తున్నార‌నే కార‌ణంతో సెకండ్ ట‌ర్మ్‌లో ఆమెకు క‌నీసం టికెట్ కూడా ఇవ్వ‌కుండా అవ‌మానించారు. దీంతో.. కేసీఆర్‌ను దెబ్బ కొడ‌తానంటూ స‌వాల్ చేసి మ‌రీ కారు దిగి.. మ‌ళ్లీ కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. పార్టీలో చేరినా రెండేళ్లుగా యాక్టివ్‌గా లేరు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ కావ‌డంతో.. కొండా క‌ళ్ల‌ల్లో ఆనందం క‌నిపిస్తోంది. అందుకేనేమో.. హార‌తి ఇచ్చి మ‌రీ రేవంత్‌కు అభినంద‌న‌లు తెలిపారు కొండా సురేఖ‌. రేవంత్‌రెడ్డి అయితేనే కేసీఆర్‌ను గ‌ద్దె దించ‌గ‌ల‌డు.. ఆయ‌న ద్వారా మాత్ర‌మే తాము గులాబీ బాస్‌పై ప‌గ తీర్చుకోగ‌ల‌ము అని కొండా భావిస్తున్నారేమో. అందుకే, ఒక‌ప్ప‌టి వైఎస్సార్ మ‌నిషి.. ఇప్పుడు మ‌ళ్లీ రేవంత్‌రెడ్డి మ‌నిషిగా మారుతున్నారు.   కొండా దంప‌తుల‌నే కాదు.. ష‌బ్బీర్ అలీ, మ‌ల్లు ర‌వి, పొన్నం ప్ర‌భాక‌ర్‌, గోనె ప్ర‌కాశ్‌రావు లాంటి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అనుచ‌ర‌గ‌ణ‌మంతా ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప‌క్షాన నిలుస్తున్నారు. వైఎస్సార్ లాంటి ఛ‌రిస్మాను వాళ్లు రేవంత్‌లో చూడ‌గ‌లుగుతున్నారు. అవే నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు.. అదే పోరాట ప‌టిమ‌. రేవంత్‌రెడ్డి మ‌రో వైఎస్సార్ అవుతార‌ని వారు బ‌లంగా న‌మ్ముతున్నారు. అందుకే, ఆల‌స్యం చేయ‌కుండా.. రేవంత్‌రెడ్డికి పీసీసీ ప‌గ్గాలు అంద‌గానే.. ఆయ‌న వెనుక నిలిచి.. కాంగ్రెస్‌ను ముందుకు న‌డిపించి.. కేసీఆర్‌పై దండెత్త‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. వైఎస్సార్‌లానే రేవంత్‌రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్‌లో తిరుగులేని నేత. వైఎస్సార్‌లానే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ను గెలిపించే మ‌హానేత‌. వైఎస్సార్‌లానే పాద‌యాత్రగా ముఖ్య‌మంత్రి పీఠం వైపు అడుగులు వేయ‌బోతున్నారు రేవంత్‌రెడ్డి అంటున్నారు. 

పంజాబ్ లో మళ్ళీ హస్తానిదే హవా ...

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా  తొమ్మిది నెలల సమయముంది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్  రాష్ట్రాలతో పాటుగా పంజాబ్ శాసన సభకు వచ్చే సంవత్సరం మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. అయితే, రాష్ట్రంలో రాజకీయం మాత్రం ఇప్పటికే వేడెక్కింది. ఓ వంక అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ షరా మాములుగా అంతర్గత కుమ్ములాటలతో కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్, మాజీ మంత్రి, క్రికెటర్ నవజ్యోతి సింగ్ సిద్దుల మధ్య పచ్చగడ్డి వేయకుండానే మంటలు మండుతున్నాయి. అయినా, జనం మాత్రం కాంగ్రెస్ పార్టీకే జై కొడుతున్నారు. నిజానికి, ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయం సాధించింది. మొత్తం ఏడు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే ఆరు మున్సిపాలిటీలలో హస్తం పార్టీ విజయకేతనం ఎగరేసింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళన కాంగ్రెస్ పంట పండిచ్చింది. సో, అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీదే పై చేయిగా ఉంటుందని, రాజకీయ వర్గాలు ఒక అంచనాకు వచ్చాయి, అయితే అమరేందర్,  సిద్దుల మధ్య సాగుతునన్న రచ్చ పార్టీ విజయావకాశాలను కొంత మేర దెబ్బ తీస్తుందన్న అనుమానాల మాత్రం పార్టీ వర్గాలు వ్యక్త పరుస్తున్నాయి.   ఇక ప్రతిపక్షాల  విషయానికి వస్తే, ఎంతో కాలంగా కలిసి కాపురం చేసిన బీజేపీ, అకాళీదళ్ పార్టీల మధ్య పెద్ద అగాధమే ఏర్పడింది. సుదీర్గ కాలంగా బీజేపీ సారధ్యంలోని ఎన్డీఎలో భాగస్వామిగా ఉన్న శిరోమణి  అకాలీ దళ్, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ, కూటమికి గుడ్ బై చెప్పింది. ఆ పార్టీకి చెందిన మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా చేశారు. మరో వంక  వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా జరుగతున్న ఆందోళన ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఉంటుందని వేరే చెప్పనక్కర లేదు. ఈ ప్రభావంతోనే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలలో కమల దళం  ఖాతా తెరవలేదు. నిజానికి అకాలీ దళ్, బీజేపీ కలిసి పోటీచేసిన 2017 ఎన్నికలలోనే, ఎన్డీఎ కూటమి ఘోరంగా. పదేళ్ళు పాలించిన కూటమి 15 స్థానాలకు పరిమితం అయింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)20 స్థానాలతో రెండవ స్థానంలో నిలిచింది.ఆ ఎన్నికలలో కాంగ్రెస్ ఏకంగా 77 స్థానాలను కైవసం చేసుకుంది.   ఈనేపధ్యంలో, ముఖ్యంగా బీజేపీ,ఆకాలి దళ్’ అడ్రెస్స్ గల్లంతైన నేపధ్యంలో, ఆప్’ పంజాబ్ పై కన్నేసింది. నిజానికి మొన్నటి మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ, అకాలీ దళ్’తో పాటుగా ఆప్ కూడా తుడిచిపెట్టుకు పోయింది.అయితే,గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారం, పంజాబ్ ‘పై ఆప్ ఆశలు పెంచుకుంటోంది. ఈ నేపధ్యంలోనే ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ పంజాబ్ పై వాగ్దానాల వరాల జల్లు కురిపించారు. ముఖ్యంగా, విద్యుత్ విషయంలో ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలు దృష్టిలో ఉంచుకుని , రేపటి ఎన్నికలకు కేజ్రివాల్ విద్యుత్’ నే ప్రధాన అజెండా చేసుకున్నారు.పంజాబ్‌లో తాము అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.అంతేకాదు, పెండింగ్ బిల్లుల రద్దు సహా విద్యుత్తు కనెక్షన్ పునరుద్ధరిస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడం ద్వారా పంజాబ్‌లోని 77 నుంచి 80 శాతం ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.   24 గంటల నిరంతరాయం కరెంట్‌ను మూడేళ్లలో నెరవేరుస్తామని హామీ కేజ్రీవాల్  హామీ ఇచ్చారు.అయితే, గత ఎన్నికలలోనూ ఆప్, ఉచిత వాగ్దానాలు గట్టిగానే చేసింది. 25 లక్షలు ఉద్యోగాలు, రూ.5 లకే భోజనం, ఉచిత వైఫై, పారిశ్రామిక ప్రోత్సాహక పథకాలు, వృద్ధాప్యపు పింఛన్లు, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చుతామని హామీలిచ్చింది. అయినా ఓటర్లు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ఆప్ కేవలం 20 సీట్లకు పరిమితమయ్యింది.మరి ఈసారి ఏమవుతుందో చూడాలని పరిశీలకులు అంటున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితే కొనసాగితే, 2022 ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్ , ఆప్ మదనే ఉంటుందని పరిశీలకులు పేర్కొంటున్నారు.

కొడంగల్ కు బైబై.. రేవంత్ రెడ్డి పోటీ చేయబోయేది ఇక్కడే? 

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడిగా ఎంపికైన ఎంపీ రేవంత్ రెడ్డి.. తనదైన మార్క్ చూపిస్తున్నారు. పొలిటికల్ ఫైర్ బ్రాండ్ లీడర్ గా పిలుచుకునే రేవంత్ రెడ్డి.. పీసీసీ పగ్గాలు వచ్చాక కూడా అదే దూకుడు కొనసాగిస్తున్నారు. సంచలన ఆరోపణలతో ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతూ కాక రేపుతున్నారు. పీసీసీ చీఫ్ గా ఏఐసీసీ నుంచి ప్రకటన వచ్చిన కాసేపటికే ఈటల బీజేపీలో చేరికపై సంచలన ఆరోపణలు చేసి బంబా పేల్చారు రేవంత్ రెడ్డి. తర్వాత రోజు కేటీఆర్, కేసీఆర్ ను టార్గెట్ చేశారు. మంగళవారం గులాబీ లీడర్లతో పాటు కమలం నేతలను కడిగిపారేశారు. రేవంత్ రెడ్డిని పీసీసీ ప్రకటించడంతో జోష్ మీదున్న కాంగ్రెస్ కేడర్.. ఆయన స్పీడ్ చూసి మరింత ఉత్సాహంగా కదులుతున్నారు.  ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి... రాజకీయంగా ఎదిగింది మాత్రం కొడంగల్. రేవంత్ రెడ్డి పేరు చెప్పగానే అందరికి వినిపించేది కూడా కొడంగలే. అక్కడి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రేవంత్ రెడ్డి. అయితే 2018 ఎన్నికల్లో మాత్రం ఆయన కొడంగల్ నుంచి అనూహ్యంగా ఓడిపోయారు. తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికలో మల్కాజ్ గిరి బరిలో నిలిచి విజయం సాధించి పార్లమెంట్ లో అడుగు పెట్టారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావడంతో.. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖాయం. అయితే రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఇప్పుడు చర్చగా మారింది. తనకు గుర్తింపు తెచ్చిన కొడంగల్ నుంచే పోటీ చేస్తారా లేక మరో స్థానానికి మారుతారా అన్న చర్చ జరుగుతోంది.  గత రెండేండ్లుగా రేవంత్ రెడ్డి రాజకీయ కదలికలు, ఆయన ముఖ్య అనచురుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి ఈసారి.. కొడంగల్ కాకుండా కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది.  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అసెంబ్లీ స్థానం నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేస్తారని సమాచారం. మాల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని ఎల్బీ నగర్ అసెంబ్లీకి రేవంత్ రెడ్డి పోటీ చేయడం ఖాయమంటున్నారు. ఇప్పటికే ఎల్బీనగర్ పై ఆయన ఫోకస్ చేశారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నికలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సంచలన విజయం సాధించింది. బీజేపీకి అధికార టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చినా... రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి ఘన విజయం సాధించారు. రేవంత్ వల్లే విజయం దక్కిందని చెబుతున్నారు. లింగోజిగూజ కార్పొరేటర్ ప్రమాణస్వీకరానికి జీహెచ్ ఎంసీ కార్యాలయానికి కూడా వెళ్లారు.గత లోక్ సభ ఎన్నికల్లోనూ రేవంత్ రెడ్డికి ఎల్బీనగర్ లో భారీ మెజార్టీ వచ్చింది. అప్పటి నుంచే ఎల్బీ నగర్ అసెంబ్లీపై ఆయన ఫోకస్ చేశారని చెబుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎక్కువ ప్రచారం చేశారు రేవంత్ రెడ్డి.  జీహెచ్ఎంసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి... ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. చాలాసార్లు సుదీర్ రెడ్డి పేరు చెబుతూ విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ఎల్బీనగర్ నుంచి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు కాబట్టి... ప్రస్తుతం ఆ ఎమ్మెల్యేగా ఉన్న సుదీర్ రెడ్డిని టార్గెట్ చేశారని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి ఎల్బీ నగర్ నియోజకవర్గం ఎంచుకోవడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గం పరిధిలో రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉంది. వందలాది కాలనీలకు రెడ్లే అధ్యక్షులు, చైర్మన్లుగా ఉన్నారు. ఎంపీగా రేవంత్ గెలవాడనికి వీళ్లంతా సాయం చేశారు. రేవంత్ ను అసెంబ్లీకి పోటీ చేయాలని వీళ్లంతా కోరుతున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఎల్బీ నగర్ పరిధిలో ఎక్కువగా నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల జనాలతో పాటు సెటిలర్లు భారీగానే ఉన్నారు. నల్గొండ, పాలమూరు ప్రజల మద్దతు రేవంత్ రెడ్డికి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక సెటిలర్లు మొదటి నుంచి రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉంటున్నారు. ఇవన్ని కలిసివచ్చే అవకాశాలు ఉండటం వల్లే ఎల్బీనగర్ నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేయడం ఖాయమంటున్నారు. ఎల్బీనగర్ లో రేవంత్ పోటీ చేస్తే.. ఆయనకు కనీస పోటీ ఉండకపోవచ్చనే టాక్ నియోజకవర్గంలో వినిపిస్తోంది..  

పోలీస్ పహారాలో సాగర్, శ్రీశైలం..  జల జగడంలో ఏం జరగబోతోంది? 

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతోంది. కృష్ణానది జలాల విషయంలో నెలకొన్న వివాదాల నేపథ్యంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్ద భద్రతను పెంచారు. నాగార్జున సాగర్ వద్ద భారీగా పోలీసులు మోహరించింది తెలంగాణ సర్కార్. నాగార్జున సాగర్ జలవిద్యుత్, ప్రధాన డ్యామ్ వద్ద ఎస్పీఎఫ్‌తో పాటు అదనంగా ప్రత్యేక భద్రతా దళాలతో భద్రత ఏర్పాటు చేశారు. పులిచింతల వద్ద కూడా సెక్యూరిటీని పెంచింది. కృష్ణా జలాల వినియోగంపై కృష్ణా రివర్ బోర్డుకు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసినందున సాగర్ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోథల ప్రాజెక్టు పనులపై కేఆర్ఎంబీకి తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేయగా.. పనులు వెంటనే ఆపాలంటూ బోర్డు ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణకు కౌంటర్ గా  విద్యుత్ ఉత్పత్తి పేరుతో శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేస్తుందని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు కంప్లైంట్ చేసింది. దీంతో శ్రీశైలం పవర్ జనరేషన్ అపాలని తెలంగాణ విద్యుత్ సంస్థలను ఆదేశించింది కేఆర్ఎంబీ.అయినా విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తోంది తెలంగాణ సర్కార్.  శ్రీశైలం, నాగార్జున సాగర్ విద్యుత్ కేంద్రాల్లో వందశాతం విద్యుత్ ఉత్పత్తి చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో నాగార్జున సాగర్, పులిచింతల జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి  ప్రారంభమైంది. నాగార్జున సాగర్ పవర్ ప్లాంట్ 815 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో నాగార్జున సాగర్‌లో పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తికి జెన్‌కో సన్నాహాలు చేస్తోంది. మరోవైపు రాయలసీమ ప్రాజెక్టు పనులను బుధవారం పరిశీలించాల్సిన కేఆర్ఎంబీ టూర్ వాయిదా పడింది. తమకు ఏపీ నుంచి సహకారం అందడం లేదని ఆరోపించింది. జూలై3న భద్రతా బలగాల సాయంతో ప్రాజెక్టును పరిశీలిస్తామని కేఆర్ఎంబీ కేంద్ర జలవనరుల శాఖకు తెలిపింది.  కేఆర్ఎంబీ ఆదేశాలను రెండు రాష్ట్రాలు పట్టించుకోకపోవడంతో జల వివాదం ఎటువైపు దారి తీస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలోనూ ఓసారి నాగార్జున సాగర్ డ్యాం దగ్గర ఇరు రాష్ట్రాలు పోటాపోటీగా బలగాలను మోహరించడం టెన్షన్ పుట్టించింది. ఒకానొదక దశలో ఇరు రాష్ట్రాల పోలీసులు బాహాబాహీకి దిగడం కలకలం రేపింది. ఈసారి కూడా అలాంటి పరిస్థితులు ఏర్పడుతాయోమోనన్న చర్చ జరుగుతోంది. 

తెలంగాణ‌ జాతిర‌త్నాలు.. చంద్ర‌బాబు చెక్కిన శిల్పాలు..

తెలంగాణ ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్‌రావు. ఆయ‌న ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి. ఒక‌నాడు టీడీపీలో మామూలు నాయ‌కులు. సైకిల్ దిగే స‌మ‌యానికి జాతిర‌త్నాలు. టీడీపీలో చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలోనే వాళ్లు రాజ‌కీయంగా రాటుదేలారు. తెలుగు జాతికి స‌మ‌ర్థులైన‌ నాయ‌కుల‌ను అందించిన పొలిటిక‌ల్ ఫ్యాక్ట‌రీ టీడీపీ అయితే.. వారంద‌రికీ రింగ్‌మాస్ట‌ర్ చంద్ర‌బాబు నాయుడు. కొర‌డా ప‌ట్టుకొని.. త‌ప్ప‌ట‌డుగులు వేయ‌కుండా ట్రైనింగ్ ఇచ్చారు. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ప‌ని చేయ‌డం చంద్ర‌బాబే నేర్పించారు. పార్టీ అభ్యున్న‌తికి కృషి చేయ‌డం చంద్ర‌బాబు నుంచే నేర్చుకున్నారు. ఎన్టీఆర్‌తో చెప్పి.. ఎమ్మెల్యేగా ప‌లుమార్లు అవ‌కాశం ఇచ్చి.. కేసీఆర్‌ను బ‌ల‌మైన నాయ‌కుడిని చేసింది చంద్ర‌బాబే. రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల్లో మంత్రి ప‌ద‌వి సాధ్యం కాక‌పోతే కేసీఆర్‌ను డిప్యూటీ స్పీక‌ర్‌ను చేసింది చంద్ర‌బాబే. అసంతృప్తితో పార్టీని వీడి.. టీఆర్ఎస్‌ను స్థాపించి.. ముఖ్య‌మంత్రిగా పాలిస్తున్నా.. ఆయ‌న రాజ‌కీయ బీజం టీడీపీలోనే. ఆయ‌న నాయ‌కత్వ ద‌క్ష‌త చంద్ర‌బాబు నుంచి వ‌చ్చిందే. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిగా కేసీఆర్ ఆ విష‌యం ఒప్పుకోక‌పోవ‌చ్చు కానీ.. ఆయ‌న అంత‌రాత్మ‌కు తెలుసు చంద్ర‌బాబు వ‌ల్లే తాను రాటుదేలాన‌ని... ఇక సీఎం కేసీఆర్‌కు స‌రిస‌మాన స‌త్తా గ‌త రేవంత్‌రెడ్డిని ఆ స్థాయి లీడ‌ర్‌గా తీర్చిదిద్ద‌డంలో క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ‌.. అంతా చంద్ర‌బాబే. రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌ను గుర్తించింది చంద్ర‌బాబే. ఎమ్మెల్యేగా అవ‌కాశ‌మిచ్చి ఆయ‌న‌లోని నాయ‌కుడిని సాన‌బెట్టిందీ చంద్ర‌బాబే. టీడీపీలో వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి ఆయ‌న్ని ప్ర‌మోట్ చేసిందీ చంద్ర‌బాబే. అందుకే, కేసీఆర్‌పై పోరాడేందుకు.. టీడీపీని వీడ‌లేక వీడిపోయారు రేవంత్‌రెడ్డి. ఆయ‌న‌కు రాజ‌కీయ రోల్‌మోడ‌ల్ చంద్ర‌బాబేనంటారు స‌న్నిహితులు.  కేసీఆర్‌, రేవంత్ అనే కాదు.. తెలంగాణ రాజ‌కీయాల్లో రాణిస్తున్న చాలామంది చంద్ర‌బాబు ద‌గ్గ‌ర శిష్య‌రికం చేసి రాటుదేలిన వారే. కేసీఆర్ కేబినెట్‌లో ప‌ద‌వులు అనుభ‌విస్తున్న ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు, త‌ల‌సాని శ్రీనివాస్‌యాద‌వ్‌, గంగుల క‌మ‌లాక‌ర్‌, స‌త్య‌వ‌తి రాథోడ్‌.. వీళ్లంతా ఒక‌ప్పుడు చంద్ర‌బాబుకు ప్ర‌ధాన అనుచ‌రులు. ఎర్ర‌బెల్లి రాజ‌కీయ జీవిత‌మంతా చంద్ర‌బాబు నీడ‌లోనే సాగింది. ఒక‌ద‌శ‌లో పార్టీలో నెంబ‌ర్ టూ పొజిష‌న్ ఎర్ర‌బెల్లిదే. ఎక్క‌డో వ‌రంగ‌ల్ జిల్లాలో రేష‌న్ షాపు డీల‌ర్‌గా ఉండే ఎర్ర‌బెల్లిని.. చంద్ర‌బాబు ప‌క్క‌సీట్లో కూర్చొనే స్థాయి నాయ‌కుడిగా త‌యారు చేసింది ఆయ‌న కాదా? ఇప్పుడు మంత్రి ప‌ద‌వి అనుభ‌విస్తున్నారంటే.. ఎర్ర‌బెల్లి ఆ స్థాయి లీడ‌ర్‌గా ఎదిగింది చంద్ర‌బాబు చ‌ల‌వ‌తోనే క‌దా అని గుర్తు చేస్తున్నారు.  ఒక్క ఎర్ర‌బెల్లినే కాదు.. త‌ల‌సానిని హైద‌రాబాద్‌లో కీల‌క నేత‌గా చేసింది.. ఆయ‌న‌కు అప్ప‌ట్లోనే మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టి ప్ర‌మోట్ చేసింది.. చంద్ర‌బాబే అనేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. గంగుల క‌మ‌లాక‌ర్ క‌రీంన‌గ‌ర్ టీడీపీలో కీల‌క నాయ‌కుడిగా తీర్చిదిద్దింది కూడా చంద్ర‌బాబే. మ‌రోమంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ సైతం చంద్ర‌బాబు శిబిరం నుంచి వ‌చ్చిన నాయ‌కురాలే. మంత్రులే కాదు.. టీఆర్ఎస్‌లో స‌గం మంది కీల‌క నేత‌లు చంద్ర‌బాబు కార్ఖానా నుంచి త‌యారైన వారే. ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు నుంచి గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి వ‌ర‌కూ అంతా చంద్ర‌బాబు చెక్కిన శిల్పాలే. ఇక‌, చంద్ర‌బాబు శిష్య‌రికంలో స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌కుడిగా ఎదిగిన ఎల్‌.ర‌మ‌ణ‌నూ టీఆర్ఎస్ త‌మ‌వైపు లాక్కోవాల‌ని చూస్తోంది. నాయ‌కుల‌ను త‌యారు చేసే స‌త్తాలేని కేసీఆర్‌.. చంద్ర‌బాబు తూనీరంలోని తురుపుముక్క‌ల‌ను త‌న‌వైపున‌కు తిప్పుకొని రాజ‌కీయ ప‌బ్బం గుడుపుకుంటున్నార‌నేది విమ‌ర్శ‌కుల మాట‌.     ఇక‌, కాంగ్రెస్‌, టీఆర్ఎస్ అనే కాదు ప‌లువురు బీజేపీ నేత‌లు సైతం చంద్ర‌బాబు డైరెక్ష‌న్లో ప‌ని చేసిన‌ ఒక‌ప్ప‌టి ఎన్టీఆర్ భ‌వ‌న్ నాయ‌కులే. హుజురాబాద్‌లో బీజేపీకి పెద్ద‌దిక్కుగా ఉన్న‌ పెద్దిరెడ్డితో పాటు మాజీ ఎంపీ చాడా సురేశ్‌రెడ్డి, మోత్కుప‌ల్ల న‌ర్సింహులు లాంటి వాళ్లు ఒక‌ప్పుడు చంద్ర‌బాబు ప్ర‌ధాన అనుచ‌రులే. ఇలా, తెలంగాణ రాజ‌కీయ నాయ‌కుల్లో అనేక మంది చంద్ర‌బాబు శిబిరం నేత‌లే. ఆయ‌న చెక్కిన శిల్పాలే. టీడీపీ ఉగ్గుపాలు తాగి, చంద్ర‌బాబు నుంచి ఓన‌మాలు నేర్కిన వారే.. ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో రాణిస్తున్నారు. అన్నిపార్టీలు ఆ తానుముక్క‌లే. ఎనీ డౌట్స్‌?  

వైఎస్ షర్మిలకు అమరావతి సెగ.. 

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిలకు సీమాంధ్ర నేతల నుంచి సెగ తగిలింది.అమరావతి పరిరక్షణ సమితి కార్యకర్తలు ఆమె ఇంటిని ముట్టడించారు. అమరావతి పరిరక్షణ సమితి ఛైర్మెన్ కొలికపుడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చలో లోటస్ పాండ్ కు పిలుపునిచ్చారు. వారి సభ్యులు లోటస్ పాండ్ లోని షర్మిల ఆఫీసును ముట్టడించారు. సీమాంధ్రకు వ్యతిరేకంగా, సీమ రైతుల నోట్లో మట్టి కొట్టేలా ప్రకటనలు చేస్తే సహించబోమని వార్నింగ్ ఇచ్చారు.  తెలంగాణలో పార్టీ పెడుతున్న షర్మిల.. ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల తెలంగాణకు అనుకూలంగా, సీమాంధ్రకు వ్యతిరేకంగా కొన్ని వివాదాస్పద కామెంట్స్ చేశారు. చుక్క నీరు కూడా వదులుకోం అంటూ గంభీరమైన స్టేట్మెంట్ ఇచ్చారు. అవసరమైతే దీనిపై ఎవరితోనైనా పోరాటానికి సిద్ధమేనని కామెంట్ చేశారు. షర్మిల వ్యాఖ్యలపై సీమాంధ్ర జనాలు పైరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొలికపుడి శ్రీనివాస్ టీమ్ షర్మిల ఇంటి ముట్టడికి ప్రయత్నించింది.  ఈ సమయంలో షర్మిల పార్టీ అనుచరులకు, అమరావతి పరిరక్షణ సమితి నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కొద్దిసేపు లోటస్ పాండ్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.బంజారాహిల్స్ పోలీసులు జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. కొలికపూడి శ్రీనివాస్ ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళనకారులను అక్కడినుంచి వెల్లగొట్టడంతో వివాదం సద్దుమణిగింది. 

చంద్రబాబు వల్లే రేవంత్ కు పీసీసీ పదవి? క్లారిటీ ఇచ్చిన సీతక్క..

తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు ఎంపీ రేవంత్ రెడ్డికి రావడంతో.. ఆ పార్టీ కేడర్ లో జోష్ కనిపిస్తోంది. అదే సమయంలో కొందరు పార్టీ సీనియర్ల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. పీసీసీ పోస్టును అమ్ముకున్నారంటూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. టీపీసీసీని టీటీడీపీగా మార్చేశారని, రేవంత్ ఎంపికలో టీడీపీ అధినేత చంద్రబాబు పాత్ర ఉందని కామెంట్ చేశారు కోమటిరెడ్డి. తమను టార్గెట్ చేస్తున్న రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతలు కూడా తీవ్రమైన ఆరోపణలే చేస్తున్నారు. చంద్రబాబు రాహుల్ తో మాట్లాడటం వల్లే టీపీసీసీ పదవి రేవంత్ రెడ్డికి ఇచ్చారని చెబుతున్నారు.  చంద్రబాబు వల్లే రేవంత్ రెడ్డికి పీసీసీ పోస్టు వచ్చిందంటూ కొందరు చేస్తున్న ఆరోపణలపై .. ములుగు ఎమ్మెల్యే సీతక్క స్పందించారు. రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఎవరో చెబితే రాలేదన్నారు. మెజారిటీ అభిప్రాయం మేరకే అధిష్టానం రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి ఇచ్చారని  సీతక్క స్పష్టం చేశారు .ఒక్క రోజులో సీల్డ్ కవర్‌ రాలేదని.. చాలా రోజులు చర్చలు, అభిప్రాయ సేకరణ జరిగిన తర్వాతే అధిష్టానం రేవంత్ అన్న పేరు ఖరారు చేసిందని ఎమ్మెల్యే సీతక్క తేల్చి చెప్పారు.  అధికారాన్ని అనుభవించడానికి తాము కాంగ్రెస్‌లోకి రాలేదని  సీతక్క అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీని అధికారంలోకి తేవడానికే కాంగ్రెస్‌లోకి చేరినట్లు ఆమె స్పష్టం చేశారు. పార్టీ పలుచన అయ్యేలా ఎవరూ మాట్లాడవద్దంటూ పరోక్షంగా కోమటిరెడ్డికి సీతక్క హితవుపలికారు. రేవంత్ టీమ్‌లో పదవి రానందుకు తనకు కూడా అసంతృప్తి ఉందన్నారు. రేవంత్ కు పదవి వచ్చిందన్న సంతోషం కంటే తమకు బాధ్యత పెరిగిందన్నారు. నేతలు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీని సక్రమంగా నడిపించే బాధ్యత రేవంత్ అన్నపై ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి, ప్రజల సమస్యలు పరిష్కరించినప్పుడు నిజమైన సంతోషమని సీతక్క అన్నారు.