జ‌గ‌న్ అవినీతిపై సంఘ్ ఆగ్ర‌హం.. సంచ‌ల‌న క‌థ‌నంతో క‌ల‌క‌లం..

జ‌గ‌న్ ఏం చేస్తుంటారు? ఇప్పుడు ముఖ్య‌మంత్రి. గ‌తంలో ప్ర‌తిప‌క్ష‌నేత‌. అంత‌కుముందు ఖాళీ. ఆయ‌నేదైనా ఉద్యోగం చేస్తారా? అంటే చేయ‌రు. ఆయ‌న‌కేమైనా వ్యాపారాలు ఉన్నాయా? అంటే పెద్ద‌గా ఏమీ లేవ‌నే చెబుతారు. మ‌రి, వంద‌ల కోట్ల ఆస్తులు ఎలా వ‌చ్చాయి? ఇదే  డౌట్ గ‌తంలో అంద‌రికీ వ‌చ్చింది.. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సైతం ఇదే అనుమానం వ్య‌క్తం చేయ‌డం.. జ‌గ‌న్ అవినీతిపై సంచ‌ల‌న క‌థ‌నంతో నిల‌దీయ‌డం.. ఏపీ రాజ‌కీయాల్లో కాక రేపుతోంది.  ఇన్నేళ్ల త‌ర్వాత ఇప్పుడే సంఘ్ ప‌రివార్‌కు జ‌గ‌న్ అవినీతి విష‌యం గుర్తుకు రావ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం అంటున్నారు. జ‌గ‌న్ విష‌యంలో కేంద్ర వైఖ‌రి మార‌బోతుంద‌నే దానికి నిద‌ర్శ‌నమ‌ని చెబుతున్నారు. ఇన్నాళ్ల బీజేపీ, వైసీపీల ర‌హ‌స్య స్నేహం బ్రేక‌ప్ ద‌శ‌కు చేరుకుంద‌ని తెలుస్తోంది. ఏపీలో జ‌రుగుతున్న ఆల‌యాల‌పై దాడులు, మ‌త మార్పిడిలపై హిందుత్వ సంస్థ‌లు గుర్రుగా ఉన్నాయ‌ని.. అందుకే జ‌గ‌న్ అవినీతిపై ఆర్ఎస్ఎస్ త‌న "ది ఆర్గ‌నైజ‌ర్" ప‌త్రిక‌లో నేరుగా దాడికి దిగింద‌ని అంటున్నారు. ఇంత‌కీ "ది ఆర్గ‌నైజ‌ర్"లో ఏం రాశారంటే..  అక్రమాస్తుల కేసులో 2012లో సీబీఐ జగన్‌ను అరెస్టు చేసిందని.. ఆ సమయంలో ఆయన దేశంలోనే అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడిగా ఆరోపణలు వచ్చాయని ది ఆర్గనైజర్‌ పేర్కొంది. తన తండ్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినందుకు గాను పలు కంపెనీలకు లబ్ధి కలిగేలా కుట్రపన్నారని సీబీఐ చార్జిషీటులో పేర్కొందని వెల్లడించింది. ఇది సిగ్గు పడాల్సిన విషయం కాదా అని ప్రశ్నించింది. బెంగళూరు, పులివెందుల, హైదరాబాద్‌లలో జగన్‌ విలాసవంతమైన భవంతులు నిర్మించారని, అమరావతిలోనూ అత్యంత ఖరీదైన భవంతిని నిర్మించారని వెల్లడించింది.  2011లో హైదరాబాద్‌లోని జగన్‌ నివాసంలో సీబీఐ దాడులు చేసినప్పుడు.. ఎకరా విస్తీర్ణంలో 75 గదులున్న ఆ భవనంలో విచారణ చేసేందుకు సీబీఐకి పది గంటల సమయం పట్టిందని తెలిపింది. ఈ భవనం విలువ దాదాపు రూ.400 కోట్లు ఉంటుందని అనధికారిక అంచనా అని వెల్లడించింది. ఈ భవనంపై హెలిప్యాడ్‌ నిర్మించే యోచనలో జగన్‌ ఉన్నారంటూ ప్రచారం జరిగిందని, బెంగళూరులోని ఆయనకు చెందిన 31 ఎకరాల భవన సముదాయంలో హెలిప్యాడ్‌ ఉందని వెల్లడించింది. జగన్‌ అక్రమాస్తుల కేసులో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పేరు ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. జగన్‌ ఒక్క ఉద్యోగం కూడా చేయలేదని, వ్యాపారమూ నిర్వహించలేదని, అయినా ఆయనకు వందల కోట్ల సంప‌ద ఎక్క‌డి నుంచి వ‌చ్చింద‌ని ఘాటుగా విమర్శించింది "ది ఆర్గ‌నైజ‌ర్".  ఇవ‌న్నీ అంద‌రికీ తెలిసిన విష‌యాలే అయిన‌ప్ప‌టికీ.. ఆర్ఎస్ఎస్ ప‌త్రిక‌లో ఇలాంటి ప్ర‌త్యేక విమ‌ర్శ‌నాత్మ‌క‌ క‌థ‌నం రావ‌డం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఆర్ఎస్ఎస్ వైఖ‌రి దేనికి సంకేతం అనే ప్రశ్న మొద‌లైంది. ఆర్ఎస్ఎస్ అభిప్రాయ‌మే బీజేపీ అభిప్రాయం అంటారు.. అలాంట‌ప్పుడు బీజేపీ నేతృత్వంలోని కేంద్రం సైతం జ‌గ‌న్ అవినీతిపై ఆగ్ర‌హంతో ఉందా? ఇక‌పై కేంద్రం నుంచి స‌హాయ నిరాక‌ర‌ణ త‌ప్ప‌దా? త్వ‌ర‌లోనే రాబోతున్న సీబీఐ కోర్టు తీర్పు ఎలా ఉండ‌బోతోంది? ఆర్ఎస్ఎస్ ఆదేశాల‌తో బీజేపీ క‌న్నెర్ర జేస్తే.. జ‌గ‌న్ ప‌రిస్థితి ఏంటి? జ‌గ‌న్ విష‌యంలో కేంద్ర వైఖ‌రి మారిపోనుందా? ఇదంతా జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దుకు ముందస్తు సంకేతమా? అందుకే జ‌గ‌న్‌లో టెన్ష‌న్ నెల‌కొందా..

అప్పుల‌పై నిప్పుల‌తో క‌డిగేసిన ప‌య్యావుల‌.. స‌మాధానం చెప్ప‌గ‌ల‌వా బుగ్గ‌న‌?

చేసిన అప్పులను ప్ర‌భుత్వం దాయ‌డంపై, ఆర్థిక మంత్రి బుగ్గ‌న చెబుతున్న బుర్ర‌క‌థ‌ల‌పై.. పీఏసీ ఛైర్మ‌న్ ప‌య్యావుల కేశవ్ మ‌రోసారి మండిప‌డ్డారు. పాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయడం తప్పుకాదని.. చేస్తే ఆ వివరాలు సమగ్రంగా ఉండాలని టీడీపీ సీనియర్‌ నేత ప‌య్యావుల మండిప‌డ్డారు. అప్పుల విషయాన్ని శాసనసభకు తెలపకుండా రహస్యంగా దాచారని దుయ్య‌బెట్టారు. రాజ్యాంగానికి విరుద్దంగా ప్ర‌భుత్వం ఒప్పందాలు చేసుకుంద‌ని త‌ప్పుబ‌ట్టారు.  సహజంగా ఏ అప్పు చేసినా, ప్రభుత్వం ఏ గ్యారెంటీ ఇచ్చినా బడ్జెట్‌ పద్దులు ప్రవేశపెట్టే సమయంలో దాన్ని రాష్ట్ర శాసనసభకు వాల్యూమ్‌ 5/2 అనే పుస్తకంలో తెలపాలని చెప్పారు. అయితే ప్రభుత్వం అప్పులను ఆ పుస్తకంలో తెలియజేయకుండా దాచిందని త‌ప్పుబ‌ట్టారు. బ్యాంకులకు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వనందున ఆ పుస్తకంలో రాయలేదని ఆర్థిక మంత్రి బుగ్గన అంటున్నారని.. బ్యాంకులేమో గ్యారెంటీలు ఉన్నాయంటున్నాయని తెలిపారు. ఆ మేర‌కు బ్యాంకులతో రాష్ట్రం ప్రభుత్వం చేసిన గ్యారెంటీ అగ్రిమెంట్‌ను విడుదల చేశారు. ఎస్క్రూ ఒప్పంద డాక్యుమెట్లను బయట పెట్టారు ప‌య్యావుల కేశవ్‌. గ్యారెంటీలు ఇవ్వలేదని.. ఎస్క్రో చేయలేదని మంత్రి బుగ్గన చెబుతున్నారు. కానీ, గ్యారెంటీలు ఇచ్చినట్టు ఒప్పందం కుదుర్చుకున్నట్టు డాక్యుమెంట్లు ఉన్నాయి. మంత్రి చెప్పింది నిజమా? బ్యాంకర్లు చెప్పింది నిజమా? రాష్ట్ర ఖజానాకు రాకుండా నేరుగా నిధులను ఎస్క్రో చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. రాజ్యాంగ నిబంధనలకు విరుద్దంగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఒప్పందాన్ని రహస్యంగా ఉంచాలని అగ్రిమెంటులో ప్రస్తావించారు. ఎందుకంత రహస్యం? ఏం దాయాలని అనుకుంటున్నారు? అంటూ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు ప‌య్యావుల‌. భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం తాకట్టు పెట్టింది. ఈ తరహా ఒప్పందాలకు కేంద్రం అంగీకారం ఉందా? RBI దృష్టిలో ఉందా? అని ప్ర‌శ్నించారు. సార్వభౌమాధికారం ద్వారా వచ్చే రక్షణను వదులుకుంటామని ఒప్పందంలో అంగీకరించారు. గవర్నర్ పదవికి ఉన్న హోదాను వదులుకునేలా ప్రభుత్వ ఒప్పందం ఉంది. ఒప్పందం తప్పితే కేసులు పెట్టొచ్చని స్పష్టంగా అగ్రిమెంటులో పేర్కొన్నారు. గవర్నర్ మీద కేసులు పెట్టినా ఫర్వాలేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందా? అంటూ మండిప‌డ్డారు. 10 మద్యం డిపోల ఆదాయాన్ని పూచీ కత్తుగా పెట్టారంటే.. ఇక మధ్య పాన నిషేధం ఎక్కడ? దీంతో ప్ర‌భుత్వం ఇక మద్యపాన నిషేధం అమ‌లు చేయద‌ని తేలిపోతోంది. 25 ఏళ్లు మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టారంటే మద్యపాన నిషేధం లేనట్టే క‌దా అని నిల‌దీశారు కేశ‌వ్‌.  అసెంబ్లీ దృష్టికి ఈ విషయాలేవీ తీసుకు రాలేదు కాబట్టి.. ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను అంగీకరించాల్సిన అవసరం లేదన్నారు పీఏసీ ఛైర్మ‌న్ ప‌య్యావుల.

నోట్లకు ఓట్లు.. జగన్న స్కీములు! ఏపీకి గుది బండలు.. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురవారం (జులై22) మళ్ళీ మరో బటన్ నొక్కారు. వైఎస్సార్ కాపు నేస్తం సెకండ్ ఇయర్, అమౌంట్’ను రిలీజ్ చేశారు. కాపు,బలిజ,తెలగ, ఒంటరి కులాలకు చెందిన 3లక్షల 27వేల 244 మంది మహిళా లబ్దిదారుల ఖాతాలలోకి రూ.490.86 కోట్లు జమయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి,తమ ప్రభుత్వ గొప్పతనాన్ని చెప్పుకొచ్చారు. ఒక్క కాపు నేస్తం పథకం కిందనే, రెండేళ్లలో మొత్తం రూ. 981.88 కోట్లు (మొదటి సంవత్సరంలో 3లక్షల 27వేల 349 మందికి రూ.491.02 కోట్లు, రెండవ సంవత్సరం 3లక్షల 27 వేల 244 మంది లబ్దిదారులకు రూ.490.86 కోట్లు) నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని సగౌరవంగా ప్రకటించుకున్నారు. అంతే,కాదు, తమ ప్రభుత్వం ఇతవరకు వివిధ పథకాల కింద మొత్తం 59 లక్షల 63 వేల 308 మంది లబ్దిదారుల ఖాతాల్లో  రూ.12 వేల 126.78 కోట్లు జమ చేసిందని జబ్బలు చరుచుకున్నారు.  అయితే, గత సంవత్సర కాలంలో వివిధ పథకాల కింద, నగదు బదిలీ పథకం  ద్వారా రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారుల ఖాతాల్లో జమచేసిన మొత్తంలో, తక్కువలో తక్కువ రూ.700 కోట్లు, చేరకూడని చేతులకు చేరిందని, ఎవరో కాదు రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులే లెక్క తేల్చారు. ఆ వివరాలలోకి వెళితే, జగన్ రెడ్డి ప్రభుత్వం అప్పులు చేసి మరీ చేస్తున్న పందారాలు,నిజంగా ఎవరి చేతుల్లోకి వెళుతున్నాయో, ఎంతలా దుర్వినియోగం అవుతున్నాయో వేరే చెప్పనక్కర లేదని అధికారులే విస్మయం వ్యక్తపరుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 జూన్ నుంచి, 2021 జూన్ వరకు, లక్ష కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని, వేర్వేరు ఉచిత పథకాల కింద పేద ప్రజలకు పంచి ఇచ్చామని పలక పక్షం నాయకులే పేర్కొంటున్నారు. ప్రభుత్వం కూడా అదే అంటోంది.   ఇటీవల రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో, నగదు రాకపోకల పరిస్థితిని, వివిధ పథకాల కింద ప్రయోజనం పొందుతున్నలబ్దిదారుల డేటాను సమీక్షించారు. అదికూడా మొత్తంగా కాదు, పైపైన ఇలా పట్టి చూశారు. అక్కడికే దిమ్మ తిరిగే నిజాలు బయటపడ్డాయని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొన్నారు. పీటీఐ వార్త సంస్థ కథనం ప్రకారం, గడచిన రెండు సంవత్సరాల  కాలంలో సుమరుగా రూ.3,000 కోట్లు అనర్హుల బ్యాంక్ ఖాతాల్లోకి వెళ్ళిపోయాయి. ఇందులో ప్రధానంగా లక్షలాది మంది లబ్దిదారులున్న అమ్మఒడి(ప్రతి తల్లికి రూ. 15,000), పీఎం కిసాన్ రైతు భరోసా (ఒక్కొక్క రైతుకు రూ. 13,50),చేయూత(45 సంవత్సరాలు నిండిన బీసీ,ఎస్సీ ఎస్టీ, మైనారిటీ మహిళలకు ప్రతి సంవత్సరం రూ. 18,750), వాహన మిత్ర (ప్రతి కాబ్ /ఆటో డ్రైవర్’కు రూ.10,000), మత్సకార భరోసా (ప్రతి బెస్తవానికి రూ.10,000) వంటి వార్షిక పథకాలున్నాయి. ఈ పథకాల లబ్దిదారులలో బోగస్ లబ్దిదారులు ఎక్కువగా బయట పడ్డారు. ఈ నేపద్యంలోనే, జూన్ 22 న ముఖ్యమంత్రి చేయూత పధకం కింద 23, 41, 827 మంది లబ్దిదారులు ఒక్కొక్కరికి రూ.18,750 చొప్పున బటన్ నొక్కివిడుదల చేశారు. అయితే ఆతర్వాత  ఆ ఒక్క స్కీమ్’లో  89,694  మంది బోగస్ లబ్దిదారులు ఉన్నట్లు గుర్తించి రూ.168.17కోట్ల  పేమెంట్ ఆపేసినట్లు ఆర్థిక శాఖ అధికారుల సమాచారం.  ఇతర పధకాల విషయంలోనూ ప్రజల సొమ్ము పక్కదారులు పట్టి పోతున్నదని, అమ్మఒడి లాంటి పథకాల విషయంలో అయితే,అసలు ఒక పద్దతి పాడు లేదని అధికారులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. ఈపథకం 2020 జనవరిలో ప్రారంభించారు, ఆ తర్వాత స్కూల్స్  పట్టుమని రెండు నెలలు కూడా పనిచేయలేదు. కొవిడ్ కారణంగా మూతపడ్డాయి. దీంతో తలాతోకా లేకుండా అమ్మ ఒడి పథకం అమలవుతోంది.ఒక విధంగా ఈ పధకం  దోపిడీకి మరు పేరుగా మారిందని, ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులు చెపుతున్నారు. ఒక వంక అప్పులు తెచ్చి అమలు చేస్తున్న పథకాలు ఇలాగే సాగితే, రాష్ట్రం దివాలా తీయడమే కాదు ..ప్రజలు కూడా దివాలా తీయడం ఖాయంగా కనిపిస్తోందని ఆర్థిక శాఖ అధికారులు అంటున్నారు.  అయితే, అధికారాన్ని నిలుపుకునేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం ఉచిత వరాల విషయంలో విచక్షణ కోల్పోయి వ్యవహరిస్తోందని,దీని దుష్పరిణామాలు ముందు ముందు భయంకరంగా ఉంటాయని  ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

నది వంతెనకు .. బాలిక శవం.. అసలు ఏం జరిగింది? 

మనిషికి ఈర్ష్య.. ద్వేషం.. ఈ రెండే మనిషి పతనానికి మూలకారణం.. అవి ఎప్పుడైతే జయిస్తామో మానవ జీవితం సార్ధకతం అవుతుంది.. తాజాగా ఈర్ష్య.. ద్వేషం.. మనిషిని ఎంతలా దిగజార్చాయి చూడండి..పక్కవారికంటే మంచి భోజనం చేసిన.. ఖరీదైన బట్టలు వేసుకుని దర్జగా తిరిగిన ఓర్చుకోలేని సమాజం.. తయారు అయింది.. బయటి వాళ్ళే కాదు ఇంట్లో వాళ్ళు కూడా అలాగే తయారు అయ్యారు.. చివరికి ఏమైంది అనేది తెలుసుకుందాం..  ఓపెన్ చేస్తే.. ఒక బాలిక శవం ఓ నది వంతెనకు  వేలాడుతుంది.. ఒకటి రెండు కాదు కొద్ది గంటల పాటు వేలాడుతుంది.. ఆ శవం  స్థానికుల కంట్లో పడింది.. వాళ్ళను  భయభ్రాంతులకు గురిచేసింది. అయితే ఆ విషయాన్నీ పోలీసులకు చేరవేశారు.. పోలీసులు రంగం లోకి దిగారు.. అప్పుడు వాళ్ళ ముందు ఒక ప్రశ్నల ప్రవాహమే పుట్టుకువచ్చింది.. అది సూసైడ్ హా.. లేదా మర్డర్ హా.. మర్డర్ అయితే ఎవరు చేశారు.. సూసైడ్ ఐతే  ఎందుకు చేసుకుంది. ఎవరైనా మృతదేహాన్ని నదిలోకి విసిరేయడానికి ప్రయత్నించగా.. వంతెన రైలింగ్‌కు తగిలి మధ్యలో ఇరుక్కుపోయిందా.. లేదా బాలికనే నదిలో దూకబోయి ఎక్కడ ఇరుక్కుపోయిందా? అనే ప్రశ్నలు పోలీసులను వెంటాడాయి.. అయితే, చివరికి బాలికను ఎందుకు చంపారనేది మాత్రం పోలీసులు వెల్లడించలేదు. ఇదే సమయంలో పోలీస్ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నట్టు మరో వీడియోలో ఉంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. వలస కార్మికుడైన మృతురాలి తండ్రి పంజాబ్‌లో ఉంటున్నాడు. బాలిక, ఆమె తల్లి ఇటీవలే లూధియానా నుంచి డియోరియాలోని తమ స్వగ్రామానికి వచ్చారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. బాలిక జీన్స్ వేసుకోవడం, ఖరీదైన దుస్తువులు ధరించడం.. ఆమెకు నచ్చిన ఫుడ్ తినడం పట్ల తాత, కుటుంబసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశాడు. చాలా సంవత్సరాలు పట్టణంలో ఉండటం వల్ల బాలిక సంప్రదాయ దుస్తులు ధరించడానికి ఇష్టపడలేదు. దీని వారికి నచ్చలేదు. ‘ఈ వ్యక్తులు తరుచూ అమ్మాయి, ఆమె కుటుంబం జీవనశైలి గురించి వ్యతిరేకిస్తుంటారు.. వారు తినే తిండి నుంచి వేసుకునే బట్టల వరకూ ప్రతీ అంశంపై అసూయ వెళ్లగక్కుతారు..  ఆ విషయం ఆ అమ్మాయికి చాలా సార్లు చెప్పి చూశారు. అయినా ఆ అమ్మాయిలో మార్పు రాకకోపడంతో చివరికి ఆ  బాలిక తలపై రాడ్‌తో కొట్టడం వల్ల ఆమె తీవ్రంగా గాయపడింది.. ఆసుపత్రికి తీసుకువెళుతున్నామని తల్లికి చెప్పారు.. కానీ, ఆసుపత్రికి తీసుకెళ్లకుండా మార్గమధ్యలో వంతెనపై నుంచి నదిలోకి పడేశారు’ అని బాలిక పిన్ని తెలిపింది.  ఈ ఘటనపై డియోరియా పోలీస్ అధికారి శ్రీపతి మిశ్రా మాట్లాడుతూ.. కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ‘‘అమ్మాయి తన తాతతో వాగ్వాదానికి దిగి అతడిని దూషించింది.. దీంతో అమ్మాయి ముగ్గురు బాబాయిలు ఆమెపై దాడి చేయడంతో అపస్మారక స్థితిలో వెళ్లిపోయింది.. బంధువులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళుతుండగా దారిలోనే చనిపోయింది... మృతదేహాన్ని నదిలో విసిరేయడానికి ప్రయత్నించారు... కానీ వంతెన రైలింగ్‌కు తగిలి చిక్కుకుంది’’ అని మిశ్రా అన్నారు. బాలిక తాత హస్నైన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న ముగ్గురు నిందితులు కోసం గాలిస్తున్నారు. తర్వలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. హస్నైన్ ఆటో నడుపుతుంటాడని పోలీసులు పేర్కొన్నారు. సమాజం ఎంతలా తయారు అయిందంటే.. ఇంట్లో ఉన్న ప్రతి మనిషి వాళ్ళ ఇష్టాలను వదిలేసి బతకాలంటే చాలా కష్టం కదా.. అలాగే మన దేశంలో కూడా ఇలాంటి సంస్కృతి మెల్లి మెల్లిగా వెలుగులోకి వస్తుంది.. కొంత మంది తినే ఆహారం పై.. వాళ్ళు బతికే జీవన విధానంపై ఇప్పటికే కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.. వాళ్లకు నచ్చినట్లు బతకాలంటూ ఆంక్షలు కోరుకుంటున్నారు.. ఇలాంటి వాటిని వ్యతిరేకించాలి.ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది.  

ఢిల్లీలో ఏపీ మంత్రుల పడిగాపులు.. పట్టించుకోని కేంద్ర మంత్రులు

ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎక్కడున్నారు? ఢిల్లీలో కేంద్ర మంత్రుల దర్శనం కోసం పడిగాపులు పడుతున్నారా? ఢిల్లీ మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మూడు రోజులుగా (జులై19 తేదీ నుంచి) ఢిల్లీలో ఉన్నారు. కేంద్ర మంత్రుల అప్పాయింట్మెంట్ కోసం నిరీక్షిస్తున్నారు. అయితే, ఇలా ఢిల్లీ వచ్చి పడిగాపులు పడడం ఎందుకు ముందుగా అప్పాయింట్మెంట్ తీసుకుని రావచ్చుగా, అని ఎవరికైనా అనుమానం వస్తే రావచ్చును. అయితే, అక్కడే ఉంది మెలిక, అంటున్నారు ఢిల్లీ అధికార వర్గాలు. బుగ్గన ఢిల్లీ ఎందుకు వస్తారో . ఏమి అడుగుతారో కేంద్ర మంత్రులకు తెలుసు. అందుకే ఆయనకు అప్పాయింట్మెంట్ ఇచ్చేందుకు మంత్రులు అంతగా ఆశక్తి చూపడం లేదుట. అందుకే ఢిల్లీలో తిష్టవేసి కేంద్ర మంత్రులను కలిసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.   జగన్ రెడ్డి రెండేళ్ళ పాలనలో ఆంధ్ర ప్రదేశ్, అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా మారిపోయింది. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారయింది. మరో వంక పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాల సవరణకు కేంద్ర ప్రభుత్వం కొర్రీల మీద కొర్రీలు  పెడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో భేటీకి బుగ్గన ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అలాగే.. ఇటీవలే కేంద్ర మంత్రి హోదా పొందిన పర్యాటకశాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డిని కలవడంతోపాటు, ఇతర శాఖల మంత్రులను కలిసేందుకు బుగ్గన ఢిల్లీ మకాం చేశారని సమాచారం.  బుగ్గన  గత రెండు సంవత్సరాలుగా ఇలా నెలలో రెండు మూడుసార్లు ఢిల్లీకి వచ్చి పోతూనే ఉన్నారు.అయితే గతంలో ఆయన రాకపోకలు సమాచారం మీడియాకు అందేది. ఎందుకొచ్చారు, ఏమిటి అనేది మీడియాకు తెలిసేది, కానీ, గత రెండు, మూడు నెలల నుంచి మాత్రం బుగ్గన ఢిల్లీ పర్యటన సీక్రెట్ గా ఉంచుతున్నారు. మరోవంక ఆయన ఢిల్లీ వచ్చేది అప్పుల కోసమే అని, కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు ముందుగానే పసిగట్టి, ఆయనకు అప్పాయింమేంట్ ఇచ్చే విషయంలో జాగ్రత్త పడుతున్నారని అంటున్నారు.ఒక్క బుగ్గనే కాదు, బొత్స సహా మరికొందరు కీలక మంత్రులు కూడా ఢిల్లీ యాత్రలు చేస్తూనే ఉన్నారని అంటున్నారు. అయితే ఎవరు ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎప్పుడు వెళ్లారు .. అంతా గోప్యంగా ఉంచుతున్నారని ఢిల్లీ మీడియా వర్గాల సమాచారం. అయితే ఇందుకిలా .. అనేదే  అంతుచిక్కని ప్రశ్న.

ర‌ఘురామ‌కు ఆర్ఎస్ఎస్ స‌పోర్ట్‌.. ఇక జ‌గ‌న్‌ జైలుకేనా..?

కేంద్రంలో అధికారంలో ఉన్న‌ది ఎన్డీయే ప్ర‌భుత్వం. ఆ కూట‌మికి బిగ్‌బాస్ బీజేపీ. మ‌రి, క‌మ‌లం పార్టీకి గాడ్‌ఫాద‌ర్ ఆర్ఎస్ఎస్‌. సంఘ్ అనుమ‌తి లేకుండా బీజేపీ ప్ర‌భుత్వం ఒక్క అడుగు అయినా ముందుకు వేయ‌దు. ఆర్ఎస్ఎస్ అడుగుజాడ‌ల్లోనే కేంద్ర న‌డుస్తుంద‌నేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. సంఘ్ పెద్ద‌ల క‌నుస‌న్న‌ల్లోనే కేంద్ర పెద్ద‌లు ప‌రిపాలిస్తుంటార‌ని అంటారు. అలాంటిది, బీజేపీని తోలుబొమ్మ‌లా ఆటాడించే ఆర్ఎస్ఎస్‌యే ఇప్పుడు వైసీపీ రెబెల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజుకు స‌పోర్ట్‌గా నిల‌వ‌డం కీల‌క ప‌రిణామంగా మారుతోంది. ఆర్ఎస్ఎస్ స‌పోర్ట్ ఉందంటే, బీజేపీ స‌పోర్ట్ కూడా ఉన్న‌ట్టే.. బీజేపీ స‌పోర్ట్ ఉందంటే, కేంద్రం స‌పోర్ట్ కూడా ఉన్న‌ట్టే. ఆ లెక్క‌న ర‌ఘురామ‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌నే వైసీపీ ప్ర‌య‌త్నాల‌కు గండిప‌డిన‌ట్టే. మ‌రోవైపు, జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు పిటిష‌న్‌పై సీబీఐ స్టాండ్ ఎలా ఉండ‌బోతోందో కూడా గెస్ చేయ‌వ‌చ్చ‌ని అంటున్నారు.  ఆర్ఎస్ఎస్ ప‌త్రిక "ది ఆర్గ‌నైజ‌ర్"లో ఈ నెల 17న ప్ర‌చురిత‌మైన ప్ర‌త్యేక క‌థ‌నం ఏపీ రాజ‌కీయాల‌ను షేక్ చేస్తున్నాయి. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు, కూల్చివేత.. ఎంపీ రఘురామ కృష్ణరాజును అంతమొందించేందుకు జగన్‌ కుట్ర పన్నారంటూ ఆయన భార్య బాహాటంగా ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ కథనం రాయాల్సి వస్తోందంటూ "ది ఆర్గ‌నైజ‌ర్" వెల్లడించడం క‌ల‌క‌లం రేపుతోంది.  ఒకప్పుడు వలస పాలనలో హిందూ దేవాలయాలను ధ్వంసం చేసినట్టుగా ఇప్పుడు ఏపీలో అలాంటి విధ్వంస రచన జరుగుతోందనే ప్రచారం జరుగుతోందంటూ క‌థ‌నం రాశారు. జగన్‌ పాలనలో హిందూ వ్యతిరేక విధానాలు, అవినీతి, కులతత్వంపై వరుసగా విమర్శలు చేయడం వల్లే రఘురామరాజును అరెస్ట్‌ చేయించారని ‘ది ఆర్గనైజర్‌’ కథనంలో పేర్కొంది. రఘురామ కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, కోర్టు జోక్యంతో ఆయనకు ఊరట కలిగిందని తెలిపింది. ఎమర్జెన్సీ విధించినపుడు కూడా ప్రతిపక్ష నాయకులపై ఇలాంటి వేధింపులు జరగలేదంటూ ఘాటైన వ్యాఖ్య‌లు చేసింది. అక్రమాస్తుల కేసులో జగన్‌ 16 నెలలు జైలులో ఉన్నారని, ఆ కాలంలో ఆయన పట్ల అనుచితంగా వ్యవహరించినట్టు ఆరోపణలు రాలేదని గుర్తు చేస్తూ.. ర‌ఘురామ‌పై సీఐడీ క‌స్ట‌డీలో జ‌రిగిన దాడిని ప‌రోక్షంగా ప్ర‌స్తావించింది "ది ఆర్గ‌నైజ‌ర్".  ఆర్ఎస్ఎస్ ప‌త్రిక క‌థ‌నం ఆసాంతం జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా.. ర‌ఘురామ‌కు స‌పోర్ట్‌గా సాగింది. ఎంపీ ర‌ఘురామ‌పై జ‌గ‌న్ స‌ర్కారు క‌క్ష్య సాధింపు చ‌ర్య‌ల‌ను తీవ్ర స్థాయిలో దుయ్య‌బ‌ట్టింది. ఎమ‌ర్జెన్సీ వేధింపుల‌తో పోల్చ‌డాన్ని బ‌ట్టి చూస్తే.. ర‌ఘురామ‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎంత‌లా టార్చ‌ర్ చేసిందో ఆర్ఎస్ఎస్ గుర్తించిన‌ట్టే అనిపిస్తోంది. హిందూ వ్య‌తిరేకం,, అవినీతి, కుల‌త‌త్వం లాంటి విమ‌ర్శ‌లు చేయ‌డం చూస్తుంటే.. జ‌గ‌న్‌పై సంఘ్ క‌న్నెర్న జేసింద‌ని ఈజీగా అర్థ‌మైపోతోంది. రఘురామ కృష్ణం రాజు అరెస్ట్ అంశాన్ని ప్రస్తావిస్తూ ఓ సిట్టింగ్‌ ఎంపీనే టార్గెట్‌ చేసినపుడు.. రేపు జగన్‌ అజెండాను విమర్శిస్తే ప్రధాని, హోం మంత్రి, సుప్రీం కోర్టు/హైకోర్టు న్యాయమూర్తులను కూడా టార్గెట్‌ చేయరా అనే సందేహాలు కలుగుతున్నాయని పత్రిక పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో చట్టబద్ద పాలన జరగడం లేదని,, జగన్‌ను ఎవరైనా విమర్శిస్తే 24 గంటల్లో అరెస్ట్‌ చేస్తారని చాలామంది చెబుతున్నారని వ్యాఖ్యానించింది. ఆర్ఎస్ఎస్ క‌థ‌నంలో ర‌ఘురామ‌కు వెయ్యి ఏనుగుల బ‌లం వ‌చ్చిన‌ట్టైంది. కేంద్రాన్నే శాసించే సంఘ్ ప‌రివారే త‌న‌కు మ‌ద్ద‌తుగా నిల‌వ‌డంతో ర‌ఘురామ‌లో ఉత్సాహం మ‌రింత పెరిగింది. ఇక‌, ఆయ‌న‌పై వేటు ప‌డే అవ‌కాశ‌మే లేద‌ని అంటున్నారు. జ‌గ‌న్ అవినీతిపై సైతం ఆర్ఎస్ఎస్ గుర్రుగా ఉంద‌ని స్ప‌ష్టం కావ‌డంతో.. ఇక‌, జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దుపై సీబీఐ కోర్టు తీర్పు ఎలా ఉంటుంద‌నే ఉత్కంఠ వైసీపీని వేధిస్తోంది.

కరోనా తో భర్త.. కోర్టుకు వెళ్లిన భార్య.. ఎందుకో తెలుసా..? 

అప్పుడప్పుడు కొన్ని విషాదాలు  వింతగా ఉంటాయి. ఆ విషాదాలు విన్నా, చూసినా మనసు తరుక్కుపోతుంటుంది. మనుషులు మానవత్వాన్ని వదిలి ఎటువైపు వెళ్తున్నారు అనే సందేశం కలుగుతుంది..ఇలాంటి విషాదాలు  ఈ కరోనా సమయంలో ఒకటి వాడు రెండు కాదు ఎన్ని లెక్కలేనన్ని విషాదాలు.  చేతికి వచ్చిన కొడుకు కళ్లముందే చనిపోయినప్పుడు, ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న భర్త పసుకుతాడు ఆరకముందే మరణించినప్పుడు..  తల్లిదండ్రులు కరోనాకు బలై బిడ్డలు అనాథలుగా మారినప్పుడు, ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి కోల్పోయి రోడ్డున పడినప్పుడు.. ఇలా ఎన్నో విషాదాలు మనకు కళ్ళకు మరుపురాని విదంగా చేసింది కరోనా..  ఈ కరోనా మిగిల్చిన విషాధ గాథలు వింటే కన్నీళ్లు  గంగ నదిలో నీరులా నిత్యం ఆగని అలలంటింది.. తాజాగా ఓ భార్య విషాద గాధ అందరి గుండెలను కలిచి వేస్తోంది. చావుబతుకుల మధ్య ఉన్న తన భర్త వీర్యం కావాలని ఆ భార్య ఏకంగా కోర్టు మెట్లెక్కింది. మరి చివరికి ఏమైందో తెలుసుకుందాం పదండి..    వివరాలలోకి వెళితే.. ఓ మహిళకు ఆమె వయసు 28 సంవత్సరాలు. ఆమె గ్రామానికి చెందిన వ్యక్తి. అతనికి వయసు 30 సంవత్సరాలు.. వాళ్లిదరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఏడాది క్రితం వాళ్ళిద్దరికీ కూడా వివాహమైంది. పచ్చని సంసారంలో కరోనా కలకలం రేపింది. ఇటీవల ఆ మహిళ భర్త కరోనా పడ్డాడు.. స్థానికంగా ఉన్న  ఓ ఆస్పత్రిలో  చేర్పించారు. అతను అక్కడే చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, ఆయన అవయవాలన్నీ దెబ్బతినడం వలన బతకడం కష్టమని వైద్యులు తెలిపారు. ఎంతో ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్త తనను వదిలి వెళ్లిపోతాడనే  మాట విన్న భార్య కుదేలయిపోయింది. గుండెలవిసేలా  ఏడ్చింది. భర్త ప్రేమను చిరకాలం పొందాలనుకొని సంకల్పించింది.  తమ బంధం, ప్రేమ అన్యోన్యతకు గుర్తుగా బిడ్డ రూపంలో భర్తను చూసుకోవాలనుకొని భర్త వీర్యాన్ని ఇవ్వాల్సిందిగా వైద్యులను కోరింది. కానీ కరోనా బాధితుడి నుంచి వీర్యం సేకరించేందుకు ఆస్పత్రి వర్గాలు అంగీకరించలేదు. వైద్యులు కోర్టు చెపితేగాని తాము ఏంచేయలేమని వైద్య సిబ్బంది తెలిపారు. ఇక అంటే ఆమె  అక్కడితో తన ప్రయయ్నాన్ని విరమించుకోకుండా.. తన ప్రేమ ను బతికించుకోవడానికి పంతాన్ని వదలకుండా చివరికి  భర్త గుర్తు కోసం ఆమె కోర్టు మెట్లెక్కింది. ఈ విషయమై  కోర్టులో ఈ కేసు సంచలంగా మారింది.  కోర్టు కూడా ఆ మహిళ విజ్ఞప్తికి వెంటనే ఆమోదించింది. ఆమె ప్రేమకు గుర్తుగా తన ఆమె భర్త నుంచి వెంటనే వీర్యం సేకరించి భద్రపరచాలని, ఐవీఎప్ ద్వారా ఆమె  గర్భం దాల్చేందుకు  సహకారం అందించాలని ఆస్పత్రికి సూచించింది. దీంతో కోర్టు ఆదేశాలతో ఆసుపత్రి వర్గాలు ఆమె భర్త వీర్యాన్ని సేకరించి భద్రపరిచాయి. భర్త పోతే మరొకరిని పెళ్ళిచేసుకోని వెళ్లిపోతున్న ఈ రోజుల్లో భర్త  ప్రేమకు గుర్తుగా ఇంతటి సాహసం చేసిన ఆ మహిళను అందరు ప్రశంసిస్తున్నారు. నిజమే కదా ప్రేమంటే ఎవరెస్టు అంటారు నిజంగా.. ఈ మహిళా కూడా ప్రేమ కూడా ఎవరెస్టు లాంటిదని చెప్పాలి. ఈ సంఘటన గుజరాత్ లో జరిగింది..

వలస నేతలు ఇమడలేరా? కమలం గూడు ఖాళీ అవుతోందా?

ప్రపంచంలో కమ్యూనిస్టుల కంటే మాజీ కమ్యూనిస్టులే ఎక్కువ అంటారు. అది కొంతవరకు నిజమే. రాను రాను బీజేపీ పరిస్థితి కూడా అలాగే మారుతోందా, అంటే అవుననే,అని పిస్తోంది. దేశ వ్యాప్తంగా 2014 నుంచి అన్ని రాష్ట్రాలలోలానే ఉభయ తెలుగు రాష్ట్రలలోనూ  అన్ని పార్టీలలోని అసంతృప్తులకు, బీజేపీ వేదికగా నిలిచింది. కాంగ్రెస్, టీడీపీ తెరాస  పార్టీల నుంచి కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సిట్టింగ్ రాజ్యసభ సభ్యులు ఇంకా ఎందరో ప్రముఖ నాయకులు కమలం గూటికి చేరారు. అయితే, అందులో ఏ కొద్దిమందో తప్పించి మెజారిటీ నేతలు ఆ పార్టీలో ఇమడలేక బయటకు వెళ్లి పోయారు, పోలేని కొందరు  ఉక్కపోతకు గురవుతున్నారు.  తెలుగు దేశం పార్టీ నుంచి నలుగురు సిట్టింగ్ రాజ్య సభ సభ్యులు, అందులో ఒకరు కేంద్ర మాజీ మంత్రి, మరొకాయన పదవీకాలం ఈ మధ్యనే ముగిసింది బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆ నలుగురు ఏమి ఆశించారో ఏమో కానీ, బీజేపీ గూటికి చేరారు. కనీ ఇంతవరకు  కేంద్ర మంత్రి పదవి కాదు కదా, అంతో ఇంతో గుర్తింపు, గౌరవం ఉన్న పదవి ఏదీ ఏ ఒక్కరికీ దక్కలేదు. మంత్రి వర్గ విస్తరణ సమయంలో ఒకటి రెండు  పేర్లు వినిపించినా , ఫైనల్ లిస్టులో ఒక్క పేరు కనిపించ లేదు.పార్టీలో చేరిన సిట్టింగ్ ఎంపీల పరిస్థితే ఇలా ఉంటే ఇక మాజీల గురించి చెప్పేదేముంటుంది. అందుకే మెల్లమెల్లగా కమలం గూటికి చేరిన ఇతర పార్టీల నాయకులు, వచ్చిన దారినే వెనక్కి వెళ్ళే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి టీపీసీసీ పగ్గాలుచేపట్టిన తర్వాత తెరాస వ్యతిరేక శక్తులకు ఒక ప్రత్యాన్మాయ వేదిక లభించినట్లైంది. అందుకే ఇప్పటికే బీజేపీ గూటికి చేరిన కొందరు ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు. ఈ మధ్యనే, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్, భూపాలపల్లికి చెందిన మరో సీనియర్ నాయకుడు గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్దమయ్యారు. ఇప్పుడు ఇంకొందరు ముఖ్యంగా బీజేపీలో చేరిన మాజీ టీడీపీ నాయకులు కూడా రేవంత్ రెడ్డిటి ఉన్న పాత సంబంధాల నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో  చేరేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టిడిపి నుంచి కమలం తీర్థం పుచ్చుకున్న నేతల్లో అసంతృప్తి కాస్త ఎక్కువే ఉందని సమాచారం. పదవుల విషయంలో తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదనే ఆవేదన రోజురోజుకు పెరుగుతోంది. చివరకు పార్టీ కార్యక్రమాల సమాచారం కూడా ఇవ్వక పోతే,ఇక పార్టీలో ఉండేమిటి, లేకేమిటి? అని, మాజీ టీడీపీ నేతలు తమను తాము ప్రశ్నించుకుంటున్నారు. మదన పడుతున్నారు.  ఇటీవలనే ఈటల రాజేందర్’ను పార్టీలోకి తీసుకునే విషయం జిల్లా నాయకులకు చెప్పక పోవడం ఏమిటని,  మాజీ మంత్రి పెద్ది రెడ్డి తీవ్ర అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే, కొన్ని వ్యక్తిగత కారణాల వలన ఆయన ఇంకా పార్టీలో కొనసాగుతున్నా, కన్నుగీటితే చాలు కారెక్కెందుకు పెద్ది రెడ్డి సిద్ధంగా ఉన్నారని సమాచారం.  అలాగే, మోత్కుపల్లి కూడా గులాబీ బాస్ కాల్ కోసం వెయిటింగ్’ లో ఉన్నారని అంటున్నారు. ఈ మధ్య ముఖ్యమంత్రి ఏర్పాటుచేసిన దళిత నేతల సమావేశాన్ని పార్టీ బహిష్కరించినా, మోత్కుపల్లి ఆ సమావేశానికి వెళ్ళడమే కాకుండా ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తారు.  . ఇప్పటికే కొంత కాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకుడు దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ బీజేపీ లోనే ఉన్నా… ఆయన ఇంటికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మధు యాష్కీ గౌడ్ వెళ్లడం అనుమానాలకు తావిస్తోంది. మాజీ ఎంపీ గరిక పాటి కూడా వ్యక్తిగత కారణాలతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇలా ఒకరొకరు వచ్చిన దారిలో వెనక్కి పోవడంతో కమలం మాజీల సంఖ్య రోజురోజుకు పెరిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.  నిజానికి, బీజేపీలో ఇమడడం అందరికీ అయ్యే పనికాదు. ఇటీవల కాలంలో పార్టీలోకి ఎవరు వస్తానన్నా వద్దనకుండా స్వాగతం పలుకుతున్నారు. అయితే, అది గర్భగుడి ఈవలి వరకే .. గర్భ గుడిలోకి ప్రవేశం కావాలంటే ... ఆర్ఎస్ఎస్ ఎంట్రీ పాస్ మస్ట్. అదుంటేనే లోపలకి లేదా... మరికొంత కాలం నిరీక్షించక తప్పుదు.కాదంటే ...  సొంతగూటికి చేక్కేయడమే ఉత్తమ్ అన్న అభిప్రాయం వినవస్తోంది.

థర్డ్ వేవ్ వార్నింగ్ బెల్స్..  మళ్ళీ లాక్ డౌన్ దిశగా..   

దేశంలో కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే పాజిటివ్ కేసులు, మరణాలు కాస్త షేర్ మర్కెట్స్ వ్యాల్యూస్ తగ్గినట్లు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,383 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 3,12,57,720కి చేరింది. ఇందులో 4,09,394 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గురువారం కొత్తగా 38,652 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ కావడంతో.. రికవరీల సంఖ్య 3,04,29,339కి చేరింది. అటు నిన్న 507 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 4,18,987 చేరుకుంది. ఇదిలా ఉంటే ఇప్పటిదాకా 41,78,51,151 వ్యాక్సినేషన్ డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అటు థర్డ్ వేవ్ టెన్షన్, కరోనా కొత్త వేరియంట్లు మళ్లీ ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తగిన చర్యలు తీసుకోకపోతే కరోనా థర్డ్ వేవ్ తప్పదని వైద్యులు హెచ్చరిస్తుండటంతో కేంద్రం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఒక వైపు అదే కేంద్ర ప్రభుత్వం సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ అందాకా చనిపోయిన వాళ్ళు ఎవరు లేరని తెగేసి చెప్పింది. ఆ విషయం పై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.. అలా మోడీ సర్కార్ అలా చెప్పడం కూడా సిగ్గుచేటు..  మనదేశంలో ఇప్పటికి 4 లక్షలకు పైగా మరణాలు సంభవించాయని చెపుతున్న.. ప్రపంచ లెక్కల ప్రకారం మన దేశంలో 10 లక్షలకు పైగా కరోనా మరణాలు సంభవించాయని చెపుతున్నారు.  మళ్ళీ థర్డ్ వేవ్ టెన్షన్.. కొంత కాలంగా ఉపశమనం ఇచ్చిన కరోనా.. మరో రెండు మూడు వారాల్లో థర్డ్ వేవ్ వస్తుందని.. అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని చెపుతున్నారు. మరోవైపు  అటు ఇప్పటికే  కేరళ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈనెల 24,25 తేదీల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించింది.  కేరళలో ఇప్పటివరకు కరోనా నియంత్రణలోకి రాలేదు. దేశంలో అత్యధిక కేసులు కేరళలోనే నమోదవుతున్నాయి. దీంతో టెస్టింగ్‌ పెంచాలని నిర్ణయం తీసుకుంది కేరళ ప్రభుత్వం. రోజుకు 3 లక్షల టెస్ట్‌లు చేయబోతున్నారు. ప్రజలను మరోవైపు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.  కేరళలో కరోనా పాజిటివ్‌ కేసులు అధికంగా ఉన్న జిల్లాల్లో మైక్రో కంటైన్మెంట్‌ జోన్లను ఏర్పాట్లను చేయాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. గత నెల 12, 13 తేదీల్లో కూడా కేరళలో కఠిన ఆంక్షలు విధించారు. బక్రీద్‌ సందర్భంగా ఆంక్షలను ఎత్తివేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం చేయడంతో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కూడా రాష్ట్రంలో కఠిన ఆంక్షలు విధించాలని కేరళ ప్రభుత్వాన్ని కోరింది. ఇక థర్డ్‌ వేవ్‌పై మరో వైపు ఏపీలో అధికారులు అలర్ట్‌ అయ్యారు. ఎమర్జెన్సీ కొవిడ్‌ రెస్పాన్స్‌ ప్లాన్‌ అమలు చేయాలని ఆలోచిస్తున్నారు. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా 26 ఆసుపత్రుల్లో పీడియాట్రిక్‌ కేర్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో నాన్‌ ఐసీయు పడకలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో యుద్ధ ప్రాతిపదికన వసతులు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఎమర్జెన్సీ కొవిడ్‌ రెస్పాన్స్‌ ప్లానింగ్‌ పేరుతో 696 కోట్లు రూపాయలు కేటాయించాయి. ఈ నిధులతో అన్ని జిల్లాల్లోని ఆసుపత్రులు, బోధనా ఆసుపత్రుల్లో 12 పీడియాట్రిక్‌ కేర్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. అందరూ కొవిడ్‌ రూల్స్‌ పాటించేలా అధికారులు పర్యవేక్షించాలని వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. మరో వైపు కరోనా పై అనుమానాలు లేక పోలేదు.. సరిగ్గా గంట తర్వాత సినిమాలో ఇంటర్వెల్ వచ్చినట్లు.. అధికారులు, మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినట్లు వస్తుంది.. వాళ్లకు ఎలా అంత కచ్చితంగా తెలుస్తుంది.. పలానా వారంలో వస్తుంది అని.. అది ఇలా ఉండగా తెలంగాణాలో రాజకీయ స్వార్ధం కోసం ప్రజలను బక్రీద్ కి మేకలు బలిచినట్లు బలిస్తున్నారు.. ర్యాలీలు.. ధర్నాలు చేస్తూ.. అసలు సోషల్ డిస్టెన్స్ లేదు మాస్క్ లు పెట్టుకోవడం లేదు.. గతం లో మరణ విలయాన్ని చూసిన దేశ ప్రజలు రాష్టాల ప్రజలు అసలు వినిపించుకోవడం లేదు.. మరో వైపు మెడికల్ ప్రముఖులు అన్నింటికంటే ఈ థర్డ్ వేవ్ చాలా డేంజర్ అని చెపుతున్నారు.. అయినా వినిపించుకోవడం లేదు.. అల్లుఅర్జున్ సినిమాలో డైలాగ్ లా తగ్గేదే లేదు అంటున్నారు.. ఇప్పుడు తగ్గకపోతే ఆ తరువాత దగ్గుతారని తెలియడం లేదు ప్రజలకు.. సో ఏది ఏమైనా కొంచం జాగ్రత్త గా ఉందాం.. మన ఆరోగ్యాలు ప్రభుత్వాలకు ఎలాగూ పట్టవు కాబట్టి మానమైన కొంచం జాగ్రత్తగా ఉండడం మంచింది.    

దమ్మాలపాటి కేసులో సంచలనం.. పిటిషన్ ను వెనక్కి తీసుకున్న ఏపీ సర్కార్

ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ లో సంచలన మలుపు తిరిగింది. దమ్మాలపాటి శ్రీనివాస్ పై గతంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను జగన్ రెడ్డి సర్కార్ వెనక్కి తీసుకుంది. అమరావతిలో అసలు ఇన్ సైడర్ ట్రేడింగే జరగలేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.  అమరావతిలో రాజధాని వస్తుందన్న ముందస్తు సమాచారంతో దమ్మాలపాటి శ్రీనివాస్  ముందే భూములు కొనుగోలు చేశారని వైసీపీ సర్కారు ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. ఇన్ సైడర్ ట్రేడింగ్ లో దమ్మాలపాటి కూడా భాగస్వామేనని చెబుతోంది. దీనిపై ఏసీబీ విచారణ షురూ చేయగా, దమ్మాలపాటి హైకోర్టుకు వెళ్లారు. దాంతో హైకోర్టు ఏసీబీ దర్యాప్తుపై స్టే ఇచ్చింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఏపీ ప్రభుత్వం. అయితే ఇన్ సైడర్ ట్రేడింగ్ పై హైకోర్టును  సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా, అక్కడా చుక్కెదురైంది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో దమ్మాలపాటిపై తాము దాఖలు చేసిన పిటిషన్ ను ఉపసంహరించుకుంటున్నట్టు ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది  సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ కు సంబంధించిన వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టులో విచారణ ఇంకా పెండింగ్ లో ఉంది. ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలియజేశారు. హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయాల్సి ఉందని వెల్లడించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం... నాలుగు వారాల్లో దీనికి సంబంధించిన విచారణ పూర్తి కావాలని హైకోర్టుకు స్పష్టం చేసింది. 

జగన్ పాలనపై ఆర్ఎస్ఎస్ ఎటాక్.. ఇక మూడినట్టేనా? 

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబం కులం ఏమిటి, మతం ఏమిటి? ఇది అనవసరమైన ప్రశ్న.అయితే, గడచిన రెండు సంవత్సరాలకు పైగా సాగుతున్న  జగన్ రెడ్డి పాలనలో ఈ ప్రశ్న తరచూ వినవస్తూనే వుంది. అందుకు కారణం అయన పాలనలో అడ్డు అదుపు లేకుండా సాగుతున్న అన్యమత ప్రచారం. మత మార్పిడులు. క్రైస్తవులే లేని గ్రామాల్లో చర్చిల నిర్మాణం జరుగుతోంది. ఒకప్పుడు ఒకరిద్దరుగా సైకిల్ మీద వచ్చి క్రైస్తవ మత ప్రచారం చేస్తే ఇప్పుడు ఏసీ బసులలో ఒకే సారి 30- 40 మంది ఊరుమీద పడి ప్రచారం సాగిస్తున్నారు. అది నేరం. అయినా, అడిగే నాధుడు లేడు.ముఖ్యమంత్రి మావాడు, ప్రభుత్వమే తమదన్న భావన క్రైస్తవ సమాజంలో  బలపడుతోంది. అందుకే. మత ప్రచారం మహా జోరుగా సాగుతోంది. క్రైస్తవ గ్రామాలు వెలుస్తున్నాయి, ఇందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న హిందూ వ్యతిరేక, క్రైస్తవ అనుకూల విధానాలే కారణం అనేది అంతటా వినవస్తున్న ఆరోపణ.   హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి.దేవుళ్ళ రథాలు  తగలబడి పోతున్నాయి. విగ్రహాలు ద్వంసమవుతున్నాయి. ఇంతవరకు ఇంచు మించుగా 150 పైగా దేవాలయాల పై దాడులు జరిగాయి. పవిత్ర రామతీర్ధం దేవాలయంలోని  రాములోరి విగ్రహం తలను తెగనరికిన దుండగులు ఎవరో ఇంతవరకు తేలలేదు. అంతర్వేది రథాన్ని దగ్ధం చేసిన దుండగుల ఆచూకీ దొరకలేదు. విజయవాడ కనక దుర్గమ్మ రథం నుంచి వెండి సింహం ఎవరు ఎత్తుకెళ్ళారో తెలియదు. అసలు ప్రభుత్వం ఆ నేరాలను నేరాలుగా పరిగణించడం లేదు. మంత్రులు హిందువుల మనోభావాలను దెబ్బతీసినా, హిందూ దేవుళ్ళను దుర్భాషలాడినా, ముఖ్యమంత్రి కనీసం మందలించిన సందర్భం లేదు.   అందుకే జగన్ రెడ్డి మతం ఏమిటన్న చర్చ మళ్ళీ మళ్ళీ జరుగుతోంది.అయితే, ఈ ప్రశ్నకు జగన్ రెడ్డి తల్లి, విజయమ్మ చాలా స్పష్టంగానే సమాధానం ఇచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి,వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా తమ కుటుంబం మొత్తం క్రైస్తవ కుటుంబం అని ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. అంతే కాదు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి, మెజారిటీ ప్రజలు హిందువులు కాబట్టి, హిందూ వేడుకల్లోనో పాల్గొంటామని చక్కగా చెప్పారు. తప్పు కాదు. అయితే, తమ మత విశ్వాసాలను ఇతర మతాల మీద రుద్దే ప్రయత్నం ఎవరు చేసినా తప్పే.  అలాంటి ప్రయత్నం ప్రభుత్వమే చేయడం,తప్పే కాదు,నేరం కూడా.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం అలాంటి నేరమే చేసింది, చేస్తోంది అంటోంది ... రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఆర్ఎస్ఎస్ అధికార పత్రిక, ‘ఆర్గనైజర్ ‘ జులై 17 సంచికలో ‘ఆర్గనైజర్’ తొలి  సారిగా జగన్ రెడ్డి సాగిస్తున్న మత  రాజకీయాల మీద మండిపడింది.విశ్లేషనాత్మక కథనాన్ని ప్రచురించింది. నిజానికి జగన్ రెడ్డి, రిలిజియస్ ఎజెండా గురించి, ‘జాగృతి’ వంటి స్థానిక సంఘ్ పరివార్ పత్రికలలో, సోషల్ మీడియా సైట్స్’లో చాలా కథనాలు వచ్చాయి. అదలా ఉంటే ‘ఆర్గనైజర్’, ఎలాంటి సందేహాలకు తావులేకుండా “రాష్ట్రంలో మతమార్పిడులే అజెండాగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పాలన సాగుతోంది” అని కుండబద్దలు కొట్టింది. జగన్ రెడ్డి ఒక్కరే కాదు, ఆయన కుటుంబ సభ్యులు పాశ్చాత్య క్రిస్టియన్‌ మిషనరీ అజెండాను అమలు చేస్తున్నారని పేర్కొంది.నిజమే, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో కూడా ఇలాగే, క్రైస్తవ మత ప్రచారానికి ప్రభుత్వం ఊత మిచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలలో చర్చిల నిర్మాణం, మరమ్మతులకు ప్రభుత్వ నిధులు కేటాయించిన విషయం కోర్టు విచారణలు వరకు వెళ్ళింది. ప్రజ్ఞా భారతి చైర్మన్ హనుమాన్ చౌదరి, హైకోర్టులో కేసు వేశారు. అలాగే, ఏడుకొండలను రెండు చేసి అన్యమత ప్రచారానికి, కొండ మీద చర్చి నిర్మాణానికి కూడా వైఎస్ ప్రభుత్వ హయాంలో ప్రయత్నాలు జరిగినట్లు ఆరోపణలు, అనుమానాలు వినవచ్చాయి. అయితే, ఆ తర్వాత ప్రభుత్వం ఎందుకనో  వెనకడుగు వేసింది.  ఇప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వం అయితే, ఏకంగా చర్చిల నిర్మాణానికి టెండర్లే పిలిచింది.  ఇప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వం అత్యంత పవిత్ర కార్యంగా భావిస్తున్న మతమార్పిడి వ్యవహారం, క్రైస్తవీకరణ కుట్రలు  దేశ వ్యాప్తంగా చర్చనీయాంశ మయ్యాయి. ఈ నేపధ్యంలోనే, ఆర్గనైజర్’ పత్రిక జగన్ రెడ్డి పాలన దేశ విచ్చిన్నపోకడలు పోతోందని పేర్కొంది. అలాగే, అధికారం కోసం జగన్‌ కుటుంబం ప్రమాదకరమైన హిందూ వ్యతిరేక అజెండాను అనుసరిస్తోందని  ఆరోపించింది. జగన్ ఒక్కరే కాదు, జగన్‌ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, బావ అనిల్‌ కుమార్‌ ఈ అందరూ కూడా క్రైస్తవీకరణలో భాగస్వాములే అని ‘ఆర్గనైజర్’పత్రిక పేర్కొంది. ప్రపంచ క్రైస్తవీకరణకు కృషి చేస్తున్న క్రైస్తవ్ మిషనరీలతో వైఎస్ కుటుంబానికి ప్రత్యక్ష సంబంధాలున్నాయని పత్రిక ఆరోపించింది. నిజానికి, ఇది కూడా పాత ఆరోపణే, వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఆయన కుమార్తె వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనీల్ అంతర్జాతీయ మత ప్రచారకుని స్థాయికి ఎదిగారని కేఏ పాల్ వంటి వారు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు.ఇదే విషయాన్ని ఆర్గనైజర్ మరో మారు ప్రస్తావించింది. ఆర్‌ఎ్‌సఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌లో జగన్‌పై ప్రత్యేక విమర్శనాత్మక కథనం రావడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.ఇది దేనికి సంకేతం అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. 

అనిల్ మంత్రి ప‌ద‌వి ఊస్ట్‌!.. ఇండికేష‌న్ ఇచ్చేసిన జ‌గ‌న్‌!..

నోరున్నోడికే మంత్రి ప‌ద‌వి. జ‌గ‌న్ న‌మ్మిన సిద్దాంతం. ఎంత తిడితే అంత మంచి కేబినెట్ పోస్ట్. జ‌గ‌న్ ఆచ‌రించిన విధానం. కేవ‌లం, తిట్లే ప్రాతిప‌దిక‌న మంత్రి ప‌ద‌వులు పంచేశార‌నే విమ‌ర్శ ఆయ‌న‌పై బ‌లంగా ఉంది. రెండేళ్లుగా శాఖ‌ల‌ ప‌ని తీరుక‌న్నా.. టీడీపీపై ఎదురుదాడి చేయ‌డ‌మే ఏకైక ఎజెండాగా ప‌ని చేస్తున్నారు ప‌లువురు మంత్రివ‌ర్యులు. జ‌గ‌న్ క‌ళ్ల‌ల్లో ఆనందం చూసేందుకు, త‌మ ప‌ద‌విని ఐడేళ్ల పాటు ప‌దిలంగా కాపాడుకోడానికి.. కొంద‌రు మంత్రులు బూతులు మాట్లాడ‌టానికి కూడా వెన‌కాడ‌లేదు. ఆ రేసులో కొడాలి నాని అంద‌రికంటే ముందు ఉంటే.. అనిల్ కుమార్ యాద‌వ్ నెంబ‌ర్ 2 ర్యాంక్ కొట్టేశార‌ని అంటుంటారు. అయితే, ఇంత‌లా జ‌గ‌న్‌ను వెన‌కేసుకొచ్చినా కూడా అనిల్‌పై ముఖ్య‌మంత్రి అసంతృప్తిగా ఉన్నార‌ట‌. తాజా ప‌రిణామాలు ఆ నోరున్న మంత్రిపై జ‌గ‌న్ నోరు పారేసుకునేలా చేశాయ‌ట‌. అదిప్పుడు ఏకంగా అనిల్ మంత్రి ప‌ద‌వికే ఎస‌రు పెట్టింద‌ని అంటున్నారు. రెండున్న‌రేళ్ల త‌ర్వాత కేబినెట్లో మార్పులు జ‌రిగితే.. ముందు దేవాదాయ‌శాఖ‌మంత్రి వెల్లంప‌ల్లి, ఆ త‌ర్వాత జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ ప‌ద‌వులే ఊడిపోనున్నాయ‌ట‌. ప‌ద‌వులు కోల్పోయే జాబితాలోనూ అనిల్‌ నెంబ‌ర్ 2గానే ఉండ‌టం విశేషం.  మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు స‌మ‌యం దగ్గర పడేకొద్దీ ప‌లువురు మంత్రుల్లో గుబులు పెరుగుతోంది. ఇన్నాళ్లూ త‌న ప‌ద‌వికేం కాదంటూ బిందాస్‌గా ఉన్న అనిల్‌.. ఇప్పుడు ఎక్క‌డ త‌న సీటుకు ఎస‌రు వ‌స్తుందోన‌ని తెగ టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌. జ‌గ‌న్ ప్ర‌వ‌ర్త‌న‌లో స్ప‌ష్ట‌మైన మార్పు క‌నిపించ‌డం.. ఇటీవ‌ల జ‌రిగిన పోల‌వ‌రం ప‌ర్య‌ట‌న‌లో ఆ శాఖ మంత్రికి త‌గిన ప్రాధాన్యం ద‌క్క‌క‌పోవ‌డం.. అందుకు ఇండికేష‌న్లుగా భావిస్తున్నారు.  సీఎం జ‌గ‌న్‌ పోల‌వ‌రం ప్రాజెక్టు సంద‌ర్శ‌న ఆసాంతం అనిల్ కుమార్ ముఖ్య‌మంత్రి ప‌క్క‌నే లేకుండా.. అప్పుడ‌ప్పుడు మాత్ర‌మే ప‌క్క‌న ఉండి.. ఆ త‌ర్వాత చాలా వెన‌కాలే ఉండిపోవాల్సి వ‌చ్చిందంటున్నారు. అధికారులతో సీఎం జరిపిన సమీక్షలో మంత్రికి అంత‌గా ప్రాధాన్యం ల‌భించ‌లేదు. ప్రాజెక్ట్ సందర్శనలో కూడా ఇతర మంత్రులు ముందుకొచ్చారే కానీ, అనిల్ వెనకబడిపోయారు. ఇక హెలికాప్ట‌ర్‌తో ఏరియల్ వ్యూ విషయంలోనూ మంత్రి అనిల్‌ను ప‌క్క‌న పెట్టేశారు సీఎం జ‌గ‌న్‌. ముఖ్య‌మంత్రి, ఇతర అధికారులు మాత్రమే హెలికాప్టర్ ఎక్కారు. అనిల్ కి ప్లేస్ మిస్ అయింది. కేవలం హెలికాప్టర్ లోనేనా? లేక, కేబినెట్‌లో కూడా అనిల్‌కు ప్లేస్ మిస్ అయిన‌ట్టేనా అనే అనుమానాలు పెరిగాయి, యువ‌త‌కు ప్రాధాన్యం పేరుతో.. బీడీఎస్ చ‌దివిన అనిల్‌కు కీల‌క‌మైన‌ జ‌ల‌వ‌న‌రుల శాఖ క‌ట్ట‌బెట్ట‌డంపై మొద‌ట్లోనే తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఆయ‌న నోరు, మాట తీరు చూసి.. ఇలాంటి వారిని కూడా మంత్రుల‌ను చేస్తారా అంటూ అంతా ముక్కున వేలేసుకున్నారు. జ‌నం అనుకున్న‌ట్టుగానే.. జ‌గ‌న్ కోరుకున్న‌ట్టుగానే.. రెండేళ్లుగా నోటికి ప‌ని చెప్ప‌డం మిన‌హా, త‌న మంత్రిత్వ శాఖ ప‌ని చేయ‌డం త‌క్కువేనంటారు. జ‌గ‌న్ కోరుకున్న‌దీ అదేన‌నుకోండి. అంతా త‌న క‌నుస‌న్న‌ల్లోనే జ‌ర‌గాలంటే.. అనిల్ లాంటి క‌ట్ట‌ప్పలే మంత్రులుగా ఉండాల‌నేది జ‌గ‌న్ సిద్దాంతం అంటారు. క‌ట్ట‌ప్ప రోల్‌లో తెగ‌ జీవించేసిన అనిల్‌కు తెలంగాణ మంత్రుల రూపంలో ఊహించ‌ని షాక్ త‌గిలింద‌ని చెబుతున్నారు. ఆ బ‌ట‌ర్ ఫ్లై ఎఫెక్ట్ మూలంగానే ఇప్పుడు ఆయ‌న మంత్రి ప‌ద‌వికి గండం వ‌చ్చింద‌ని అంటున్నారు.  రెండు రాష్ట్రాల జలవివాదంలో తెలంగాణ మంత్రులు రెచ్చిపోయారు. వైఎస్సార్‌ను, జ‌గ‌న్‌ను నోటికొచ్చిన‌ట్టు తిట్టారు. నీళ్ల విష‌యమే అయినా.. ఆ శాఖ మంత్రిగా అనిల్ ఏపీ త‌ర‌ఫున‌ స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇవ్వ‌లేక‌పోయారు. అందుకే జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి అనిల్‌ను అప్ప‌టిక‌ప్పుడు సైడ్ చేసేసి.. ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిని జగన్ రంగంలోకి దింపార‌ని తెలుస్తోంది. అందుకే, ఇటీవ‌ల తెలంగాణ ఆరోప‌ణ‌ల‌పై.. మంత్రి అనిల్ కాకుండా, స‌ల‌హాదారు స‌జ్జ‌లనే స్పందిస్తున్నార‌ని అంటున్నారు. కావాల‌నే మంత్రి అనిల్‌ను ప‌క్క‌న పెట్టేశార‌ని చెబుతున్నారు. రెండున్న‌రేళ్ల త‌ర్వాత కేబినెట్ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ జ‌రిగితే.. అనిల్ ప‌ద‌వి కృష్ణాలో క‌లిసిపోవ‌డం ఖాయ‌మంటున్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టు సందర్శ‌న‌లో ఆ మేర‌కు ఇండికేష‌న్ కూడా ఇచ్చేశార‌ని.. త్వ‌ర‌లోనే అనిల్‌కుమార్‌కు షాక్ త‌ప్ప‌ద‌ని చ‌ర్చించుకుంటున్నారు. త‌న‌కు మంత్రి ప‌ద‌వి పోతుంద‌నే భ‌యంలో అనిల్ మ‌రింత‌గా త‌న నోటికి ప‌ని చెబుతారా? లేక‌, అన్నీమూసుకొని కూర్చుంటారా? చూడాలి.....

తెలంగాణలో కుండపోత వానలు.. జనాలు ఇండ్ల నుంచి రావొద్దన్న కేసీఆర్ 

తెలంగాణ వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. తూర్పు తెలంగాణలో కుండపోత వానలు పడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం 25 సెంటిమీటర్ల వర్షం నమోదైంది. గురువారం కూడా కుండపోతగా వాన పడుతూనే ఉంది.  చెరువులు మత్తడి దుంకుతున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులన్ని నిండిపోవడంతో గేట్లు ఎత్తి దిగువకు వదిలేశారు. దీంతో తూర్పు తెలంగాణలో వరద బీభత్సం కొనసాగుతోంది.  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి  పొంగిపొర్లుతోంది. ఆదిలాబాద్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ నుంచి 1 లక్షా 93వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదలడంతో జిల్లాలోని గోదావరీ పరివాహక ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురిలోనూ గోదావరి ఉధృతి పెరుగుతుండగా.. మురో పుణ్యక్షేత్రమైన కోటిలింగాలలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వెల్గటూరు మండలం కోటిలింగాలను ధర్మపురి సీఐ. ఇతర అధికారులతో కలిసి సందర్శించారు. జాలర్లు, గొర్లకాపరులు, రజకులు, భక్తులు ఇలా ఎవ్వరూ కూడా గోదావరీ పరివాహక ప్రాంతాల్లోకి వెళ్లకూడదని... హెచ్చరించారు. ధర్మపురి, వెల్గటూర్ మండలాల్లో రెవెన్యూ అధికారులు కూడా ఎక్కడికక్కడ అప్రమత్తమై ప్రమాద హెచ్చరికలను జారీచేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశించారు. నిర్మల్ పట్టణంలో భారీ వ‌ర్షాల కార‌ణంగా చాలా ప్రాంతాలు నీటమునగ‌డంతో అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తక్షణమే పంపాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను ముఖ్య‌మంత్రి ఆదేశించారు.ఎస్సారెస్పీ ఎగువ నుంచి గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద పెరుగుతున్నందున వెంట‌నే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలందరూ ఇళ్లలోంచి బయటకు రాకూడ‌ద‌ని సీఎం కేసీఆర్ సూచించారు.ఆయా ప్రాంతాల టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పరిస్థితులను సమీక్షిస్తుండాలన్నారు. గోదావరితో పాటు కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో... మన రాష్ట్రంతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆయా రాష్ట్రాల వాల్లు కూడా అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తుతున్నారని, ఈ నేపథ్యంలో తెలంగాణలోకి వరద ఉదృతి పెరగనున్నదని  గోదావరి కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లోని తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ తమ జిల్లాల్లో, తమ తమ నియోజకవర్గాల్లో వుంటూ ఎప్పటికప్పుడు వరద పరిస్థిని సమీక్షిస్తూ వుండాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఈ ప్రాంతాల అన్నిస్థాయిల లోని టిఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు తెలంగాణ భవన్ కు అందుబాటులో ఉంటూ పరిస్థితులను సమీక్షిస్తుండాలన్నారు. గోదావరి కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లోని అధికారులతో పాటు మొత్తం టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి మంత్రుల దాకా, పార్టీ కార్యకర్తలు నేతలంతా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సిఎం ఆదేశించారు. రానున్న రెండు రోజులు అత్యంత భారీ స్థాయిలో వర్షాలు కురిసే పరిస్థితిల్లో  ప్రజలు అత్యంత అప్రమత్తంగా వుంటూ ఎవరి జాగ్రత్తలు వాల్లు తీసుకోవాలని సిఎం పిలుపునిచ్చారు. 

ఎమ్మెల్యే కాదు రాష్ట్ర స్థాయి పదవి..! క్లారిటీ ఇచ్చిన కేసీఆర్..

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇంచార్జీగా ఉన్న పౌడి కౌశిక్ రెడ్డి అధికార పార్టీలో చేరారు. బుధవారం తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో  గులాబీ కండువా కప్పుకున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కౌశిక్ రెడ్డి 61 వేల ఓట్లు సాధించారు. ఈటల రాజేందర్ రాజీనామా చేసినప్పటి నుంచి ఆయన నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. అయితే ‘ఆడియో లీక్’ల వ్యవహారంలో ఇరుక్కొని  ఆయన హస్తం పార్టీకి గుడ్ బై చెప్పాల్సి వచ్చింది.  టీఆర్ఎస్ లో చేరాల్సిన పరిస్థితులొచ్చాయి.  అయితే అధికార పార్టీలో చేరిన కౌశిక్ రెడ్డికి టీఆర్ఎస్ టికెట్ వస్తుందా రాదా అన్నదే ఇప్పుడు చర్చగా మారింది. నిజానికి ఈటల రాజీనామా చేసినప్పటి నుంచే టీఆర్ఎస్ నేతలతో కౌశిక్ రెడ్డి టచ్ లోకి వచ్చారనే ప్రచారం జరిగింది. ఓ కార్యక్రమంలో కేటీఆర్ ను ఆయన కలవడం సంచలనంగా మారింది. కౌశిక్ రెడ్జి కారెక్కనున్నారనే వార్తలు వచ్చాయి. అయితే తాను పార్టీ మారడం లేదని కౌశిక్ రెడ్డి చెబుతూ వచ్చారు. ఇంతలోనే ఆడియో లీక్ కావడం.. కాంగ్రెస్ సీరియస్ గా స్పందించడంతో సీన్ మారిపోయింది. కేటీఆర్ తో కౌశిక్ రెడ్డి చాలా రోజులుగా సంప్రదింపులు జరుపుతున్నారన్నది కాంగ్రెస్ నేతల ఆరోపణ. ఆడియో లీక్ కాకున్నా.. ఎన్నికల ముందు టీఆర్ఎస్ లో చేరేవాడని వాళ్లు చెబుతున్నారు. కౌశిక్ రెడ్డి విషయంలో గులాబీ పార్టీలోనూ రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆడియో లీక్ కాకుండా ఉంటే కౌశిక్ రెడ్డికి ఖచ్చితంగా టీఆర్ఎస్ టికెట్ వచ్చేదని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనను బరిలోకి దింపకపోవచ్చనే అభిప్రాయపడుతున్నారు. కౌశిక్ రెడ్డి చేరిక సమయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు బలాన్నిస్తున్నాయి. కౌశిక్ రెడ్డిని ప్రోత్సహించడానికి ప్రయత్నించారు. కానీ హుజూరాబాద్ టికెట్ పై మాత్రం సీఎం క్లారిటీ ఇవ్వలేదు. ‘కౌశిక్ రెడ్డి రాజకీయాల్లో ఒక యువకుడు. అతడు అపారమైన ప్రజా సేవ చేయగలడు. తన రాజకీయ వృద్ధిని ఎవ్వరూ ఆపలేరు. ఆయనకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. అతడి పురోగతికి నేను మంచి మార్గం వేస్తానని హామీ ఇస్తున్నా’ అని  కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కౌశిక్ రెడ్డి నియోజకవర్గానికే పరిమితం కాదు.. ఆయన సేవలు రాష్ట్రానికి మొత్తం ఉపయోగించుకుంటామని చెప్పారు. కేసీఆర్ వ్యాఖ్యలను బట్టి కౌశిక్ రెడ్డిని హుజురాబాద్ బరిలో దింపకుండా.. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి ఇచ్చే యోచనలో కేసీఆర్ ఉన్నారని తెలుస్తోంది. కౌశిక్ రెడ్డి క్రికెట్ ప్లేయర్. జాతీయ స్థాయిలోనూ ఆయన ఆడారు. కేసీఆర్ ఈ విషయం కూడా చెప్పారు. దీంతో క్రీడలకు సంబంధించిన శాప్ చైర్మన్ గా కౌశిక్ రెడ్డిని నియమించవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతానికి కార్పొరేషన్ చైర్మన్ గా నియమించి.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలనే ఆలోచనలో టీఆర్ఎస్ పెద్దలు ఉన్నారని అంటున్నారు. అందుకే రెండు, మూడు సార్లు కౌశిక్ రెడ్డిని రాష్ట్ర స్థాయిలో ఉపయోగించుకుంాటమని కేసీఆర్ చెప్పారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

తెలంగాణ‌లో మైక్రోసాఫ్ట్‌ డేటాసెంటర్‌.. ఏపీకి అథోగ‌తే..నా? చంద్ర‌బాబు ఉండి ఉంటేనా..

తెలంగాణ‌లో మ‌రో భారీ పెట్టుబ‌డి. డేటా సెంట‌ర్‌కు హైద‌రాబాద్ కేరాఫ్‌గా నిలుస్తోంది. ఇప్ప‌టికే వ‌చ్చిన‌ అమెజాన్‌, వాల్‌మార్ట్‌ల డేటా సెంట‌ర్లతో పాటుగా.. తాజాగా మైక్రోసాఫ్ట్ సైతం 15వేల కోట్ల పెట్టుబ‌డితో డేటా సెంట‌ర్ ఏర్పాటుకు ముందుకు వ‌చ్చింది. హైద‌రాబాద్‌లో ఉన్న మైక్రోసాఫ్ట్ డెవలప్‌మెంట్‌ సెంటర్‌కు ఇది అద‌నం. హైదరాబాద్‌లో అనేక సానుకూల అంశాలు ఉండటంతో దిగ్గజ కంపెనీలు తమ డేటా సెంటర్ల ఏర్పాటుకు నగరానికి వస్తున్నాయి. సాఫ్ట్‌వేర్‌ రంగానికి హైదరాబాద్‌ ముఖ్య కేంద్రంగా మారడం, సాంకేతిక నిపుణులకు కొర‌త లేక‌పోవ‌డం, ప్రభుత్వ ప్రోత్సాహం.. ఇలా అనేక‌ అంశాలు క‌లిసిరావ‌డంతో హైద‌రాబాద్‌కు కంపెనీలు క్యూ క‌డుతున్నాయి.  హైద‌రాబాద్‌కు ఈ స్థాయిలో పెట్టుబ‌డులు రావ‌డం అంద‌రికీ సంతోష‌క‌రమే. హైద‌రాబాద్ సంగ‌తి స‌రే.. మ‌రి, ఏపీ ప‌రిస్థితి ఏంట‌నేది ఇక్క‌డి వారి ఆవేద‌న‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఒక్క పెట్టుబ‌డి కూడా రావ‌డం లేదేంట‌నే బాధ‌. హైద‌రాబాద్ ఆ రేంజ్‌లో డెవ‌ల‌ప్ కావ‌డానికి, ఐటీ హ‌బ్‌గా మార‌డానికి అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబే కార‌ణ‌మ‌నేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ను హైద‌రాబాద్ ర‌ప్పించింది చంద్ర‌బాబు నాయుడే. హైద‌రాబాద్‌లో సైబ‌ర్ ట‌వ‌ర్స్ నిర్మించి.. ఐటీ కంపెనీల‌ను ర‌ప్పించి.. పెట్టుబ‌డుల కేపిట‌ల్‌గా మార్చింది.. అక్ష‌రాల చంద్ర‌బాబే. సైబ‌రాబాద్ నిర్మాత చంద్ర‌బాబునాయుడు. ఆ రోజుల్లో సీఎం చంద్ర‌బాబు నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌ను, ప్ర‌భుత్వ పాల‌సీల‌ను చూసే ఐటీ ప‌రిశ్ర‌మ హైద‌రాబాద్‌కు త‌ర‌లివ‌చ్చింది. ఆనాడు ఆయ‌న నాటిన విత్త‌నాలే.. ఇప్పుడు మ‌హావృక్షాలై అభివృద్ధి ఫ‌లాలు ఇస్తున్నాయి.  రాష్ట్ర విభ‌జ‌న‌తో న‌వ్యాంధ్రను మ‌ళ్లీ పునాదుల నుంచి నిర్మించే  ప్ర‌య‌త్నాలు చేశారు చంద్ర‌బాబు. ఏపీకి అంత‌ర్జాతీయ స్థాయిలో రాజ‌ధానిని రూపొందించేందుకు కృషి చేశారు. హైద‌రాబాద్ మాదిరే విశాఖ‌ప‌ట్నంను ఐటీ హ‌బ్‌గా మార్చేందుకు మాస్ట‌ర్ ప్లాన్ రెడీ చేశారు. దావోస్‌లో ప్ర‌పంచ‌ పెట్టుబ‌డుల స‌మావేశాల‌కు హాజ‌రై ఏపీకి పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేశారు. దావోస్‌లో చంద్ర‌బాబును చూసి గుర్తుప‌ట్టిన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌.. ఆయ‌న్ను ప‌ల‌క‌రించ‌డం.. చంద్ర‌బాబుతో క‌లిసి డిన్న‌ర్‌ చేయ‌డం గుర్తుండే ఉంటుంది. ఇదంతా 2015 విష‌యం.  ఆ త‌ర్వాత‌ సీఎం చంద్ర‌బాబు ఆహ్వ‌నం మేర‌కు.. విశాఖ‌లో జ‌రిగిన అగ్రిటెక్ స‌ద‌స్సుకు సైతం హాజ‌ర‌య్యారు బిల్‌గేట్స్‌. ఆ బిల్‌గేల్స్ సంస్థ మైక్రోసాఫ్టే ఇప్పుడు హైద‌రాబాద్‌లో డేటా సెంట‌ర్ ఏర్పాటు చేస్తోంది. భారత్‌లో డేటా సెంటర్ల ఏర్పాటు కోసం రిలయన్స్‌ జియోతో మైక్రోసాఫ్ట్‌తో క‌లిసి ప‌ని చేస్తోంది. ఆ రిల‌య‌న్స్ సంస్థ సైతం చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు తిరుప‌తిలో 15వేల కోట్ల పెట్టుబ‌డులు పెట్టేందుకు సిద్ధ‌మైంది. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం రిల‌య‌న్స్‌కు భూములు కూడా కేటాయించింది. అయితే, సీఎం జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావ‌డంతో.. అంతా త‌ల‌కిందులైంది. చంద్ర‌బాబు హ‌యాంలో వ‌చ్చిన అనేక కంపెనీలు, పెట్టుబ‌డులు వెన‌క్కి వెళ్లిపోయాయి. రిల‌య‌న్స్ సైతం తిరుప‌తి భూముల‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి తిరిగిచ్చేసి.. జ‌గ‌న్‌కో దండమంటూ తిరిగెళ్లిపోయింది.  జ‌గ‌న్ గ‌ద్దె నెక్క‌డంతో.. ఆంధ్రుల క‌ల‌ల రాజ‌ధాని అమ‌రావ‌తి క‌నుమ‌రుగైంది. విశాఖకు ఐటీ కంపెనీలు గుడ్‌బై చెప్పాయి. వైజాగ్‌లో ఇప్పుడు భూదందా మిన‌హా.. ఐటీ హ‌డావుడి ఏమాత్రం లేదు. చంద్రబాబు హ‌యాంలో వ‌చ్చిన పెట్టుబ‌డులు అట‌కెక్కేశాయి. ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అరాచ‌క పాల‌న మిన‌హా అభివృద్ధి, పెట్టుబ‌డుల ఊసే లేదంటున్నారు. అందుకే, హైద‌రాబాద్‌కు పోటీ లేకుండా పోయిందంటున్నారు. హైద‌రాబాద్‌కు మైక్రోసాఫ్ట్ డేటా సెంట‌ర్ రాక‌తో.. మ‌రోసారి తెలుగువారంద‌నికీ అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు ఐటీ ప‌రిశ్ర‌మ కోసం చేసిన కృషిని మ‌రోసారి గుర్తు తెచ్చుకుంటున్నారు. తెలుగునేల‌కు ఐటీతో అనుబంధం కొన‌సాగిన‌న్నాళ్లూ.. అంద‌రి మ‌దిలో చంద్ర‌బాబు మెదులుతూనే ఉంటారు. అంత‌టి చెద‌ర‌ని ముద్ర వేశారు మ‌రి.

ఆడవాళ్లు మీకు జోహార్లు.. వధువును హెలికాప్టర్లో తీసుకెళ్లిన వరుడు..

ఒకప్పుడు మన దేశం మాతృస్వామిక దేశం.. అది రాను రాను పితృసామిక దేశంగా అవతరిండిచి. గతంలో ఆడవాళ్లను చాలా గౌరవంగా చూసుకునే సంప్రదాయం మనది.. కానీ ఇప్పుడు ఎక్కడ చూసిన మహిళలపై నిత్యం దాడులతో వెలుగొందుతున్న దేశం గా మారింది.. ఎంత లా అంటే.? తల్లిదండ్రులు ఆడపిల్లలని కనాలంటే ఆలోచించేంతలా.. తన కడుపులో ఆడపిల్ల ఉందంటే గర్భంలోనే చంపేసెంతలా తయారు అయింది. ఎందుకంటే ఆడవాళ్లకు ఈ సమాజంలో రక్షణ లేకపోవడం అందుకు ఒక కారణం అయితే.. ఆ ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే వరకట్నం సమస్య మరొకటి.. కానీ  తాజాగా ఒక వ్యక్తి  పైసా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. అంతేగాక.. మహిళలకు గౌరవం ఇస్తూ ఆమెను మహరాణిలా హెలికాప్టర్‌లో ఇంటికి తీసుకెళ్లాడు. ఆడపిల్లను అంతా తక్కువగా చూస్తారు. అయితే, అతడు మాత్రం అలా కాదు. తల్లికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి అతడు ఓ యువతిని పైసా కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు.. ఆమెను హెలికాప్టర్‌లో మహరాణిలా ఇంటికి తీసుకొచ్చాడు. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.  పానీపట్‌కు చెందిన మాజీ కౌన్సిలర్ రామ్ కుమార్ సైనీకి ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ఇద్దరు కొడుకులకు కట్నం తీసుకోకుండానే పెళ్లి చేశాడు. మూడో కుమారుడు మనీష్ సైనీకి సైతం కట్నం తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. తన కొడుకులకు కట్నం తీసుకోకూడదనే అతడి భార్య రమ్‌కాలీ కోరికను వారు సాంప్రదాయంలా పాటిస్తున్నారు. ఇటీవల రామ్ కుమార్.. అతడి మూడో కొడుకు మనీష్ సైనికి జింద్‌లోని నర్వానాకు చెందిన మోనికా సైనీతో పెళ్లి చేశాడు.ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు అందరు సమాజం లో ఆదర్శంగా నిలుస్తున్నారు. నిజంగా వాళ్ళ కుటుంబానికి సెల్యూట్ చెయ్యాలి.  ఆడబిడ్డ గొప్పతనం తెలిపేందుకు తన చిన్న కోడలిని హెలికాప్టర్‌లో తీసుకురావాలని రామ్‌కాలీ కొడుకును కోరింది.తండ్రి మాటను జవదాటని రాముడిలా అతడు మోనికాను హెలికాప్టర్‌లో తన ఇంటికి తీసుకొచ్చాడు. తమ కుటుంబంలో ఆడ, మగా అనే తేడా ఉండదని, అందరినీ సమానంగా చూస్తామని సైనీ కుటుంబికులు తెలిపారు. తల్లి కోరిక మేరకు సైనీ ఢిల్లీలో హెలికాప్టర్లను అద్దెకు ఇచ్చే ఓ సంస్థను సంప్రదించాడు. వధువరులిద్దరూ హెలికాప్టర్ నుంచి ఠీవిగా దిగడాన్ని చూసి ప్రజలు సైతం మురిసిపోయారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన హర్యానా లో జరిగింది..  తాజాగా కేరళ రాష్ట్రము లో వరకట్న నిషేధ చట్టాన్ని మారిందా పకడ్బందీగా రూపొందించడానికి చర్యలు తీసుకుంటుంది.. అలాగే మిగతా రాష్ట్రాలు కూడా ఆలోచిస్తే తల్లి గర్భం లో చనిపోయే ఆడవాళ్లు కనీసం ఈ ప్రపంచాన్ని చూస్తారు.. ఆడపిల్లలు పుట్టనిద్దాం.. చదవనిద్దాం అనే నినాదం అందరు అమలు చేస్తే ఈ దేశ ప్రగతి ముందుకు వెళుతుంది.. ఆడామగా తేడాలేని సమాజం కోసం అందరు కృషి చెయ్యాలి..   

మెసేజ్ ఫార్వర్డ్ చేసిన టీచర్ సస్పెండ్.. జగనన్న పాలన ఇంత అరాచకమా? 

ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన సాగుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడుతున్నాయి. ఇందుకు సంబంధించి గతంలో చాలా ఘటనలు వెలుగు చూశాయి. పోలీసుల తీరుపై కోర్టులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయినా ప్రభుత్వం మాత్రం తీరు మార్చుకోవడం లేదు. తాజాగా మరో అరాచక ఘటన జరిగింది. వాట్సాప్ మెసేజ్ ను ఫార్వర్డ్ చేసినందుకు ఓ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయడం దుమారం రేపుతోంది.  విశాఖపట్నం జిల్లా నాతవరం మండలం ఉప్పరగూడెం పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న ఎస్‌. నాయుడును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న మెసేజ్ ను ఆయన ఫార్వడ్ చేసినందుకే ఆయనపై వేటు వేశారని తెలుస్తోంది. ఈ ఘటనపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. సీఎం జగన్ పై విమ‌ర్శ‌లు చేస్తూ ట్వీట్ చేశారు. విశాఖపట్నం జిల్లా నాతవరం మండలం ఉప్పరగూడెం పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న ఎస్‌. నాయుడును సస్పెండ్ చేశారంటూ ఓ దిన‌ప‌త్రిక‌లో వ‌చ్చిన వార్త‌ను ఆయ‌న పోస్ట్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాట్సప్‌లో సందేశాలు పంపుతున్నారని ఫిర్యాదు రావ‌డంతో ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు నారా  లోకేష్ తెలిపారు   .'సామాజిక మాధ్యమాల్లో ఎవరో పంపిన మెసేజ్ ని ఫార్వార్డ్ చేస్తేనే ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తే, విద్యాబుద్ధులు నేర్పే గురువులకు త‌న చీప్ లిక్క‌ర్ అమ్మే మ‌ద్యం దుకాణాల ముందు డ్యూటీవేసిన వైఎస్ జ‌గ‌న్ గారిని ఏం చెయ్యాలి?' అని లోకేశ్ నిలదీశారు.  'సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారంటూ విశాఖ జిల్లా నాతవరం మండలం ఉప్పరగూడెం ప్రాథమిక పాఠ‌శాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న ఎస్. నాయుడు గారిని సస్పెండ్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. సర్వీస్ రూల్స్ కి విరుద్ధంగా వ్యవహరిస్తూ భావవ్యక్తీకరణ స్వేచ్ఛ‌ని హరిస్తోంది వైకాపా ప్రభుత్వం' అని ఆయ‌న మండిప‌డ్డారు.'మాస్టారిపై తక్షణమే సస్పెన్షన్ ఎత్తివెయ్యాలి. జగన్ రెడ్డి పాలనలో టీచర్లను వేధించడం పరిపాటిగా మారింది. ఉపాధ్యాయుల స‌మ‌స్యల పరిష్కారం కోసం చేసే ప్రతి పోరాటానికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతిస్తుంది' అని లోకేశ్ చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో ఎవరో పంపిన మెసేజ్ ని ఫార్వార్డ్ చేస్తేనే ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయడంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టీచర్ పై విధించిన సస్పెన్షన్ వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాయి. 

ప్రియురాలు  కరోనా మరణం.. తట్టుకోలేక ప్రియుడు మృతి.. 

ప్రేమంటే చంపడమే కాదు, చావడం కూడా ,ఒక అమ్మాయి ప్రేమించలేదని ఆ అమ్మాయి పై దాడి చేయడమే కాదు.. అవసరం అనుకుంటే ప్రేమించిన అమ్మాయి కోసం  మరంచడానికి కూడా సిద్ధంగా ఉండడం అని కూడా నిరూపించాడు ఒక వ్యక్తి.  బట్ అలా చనిపోవడం తప్పు. కానీ.. అతను తన ప్రియురాలు లేదనే మాట తట్టుకోలేడు అందుకే అలా మరణించాడు. మ్యాటర్ లోకి వెళితే.. తాను ఎంతగానో ఇష్టపడిన అమ్మాయి కరోనా బారిన పడింది. తన ప్రియురాలు కోలుకోవాలి అని ప్రియుడు కోరుకున్నాడు. కానీ ఆ దేవుడు అతని కోరికను వినిపించుకోలేదు. మూడు రోజుల క్రితం అతని ప్రియురాలు మరణించదని  తట్టుకోలేకపోయిన యువకుడు తాను బలవన్మరణానికి పాల్పడిన ఘటన విశాఖలోని గాజువాకలో వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.    పరవాడ మండలం దేశపాత్రునిపాలేనికి చెందిన దట్టి కృష్ణారావు, శాంతి దంపతుల కుమారుడు రోహిత్‌కుమార్‌ (25) ఇంటర్‌ వరకు చదివి గాజువాకలోని ఓ హోటల్‌లో ఆన్‌లైన్‌ పార్శిల్‌ సర్వీసు పని చేస్తున్నాడు. ఆరుగురు ఫ్రెండ్స్‌తో కలిసి కణితి రోడ్డులోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. బుధవారం మధ్యాహ్నం వరకూ సహచర మిత్రులతో పార్శిల్‌ సర్వీసు కొనసాగించిన రోహిత్ మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఏదో మూడ్ ఆఫ్ తో వర్క్ మానేసి రూమ్ కి వెళ్ళాడు. ఫ్రెండ్స్ అందరు ఏదో చిన్న బాధలో ఉన్నట్లు ఉన్నాడు అనుకున్నారు. రూంకి వెళ్లి రెస్ట్ తీసుకుంటాడు లే అని అనుకున్నారు.  కట్ చేస్తే సాయంత్రం రోహిత్ మిత్రులు రూమ్ కి వచ్చారు. డోర్ ఓపెన్ చేసి చూడగా  రోహిత్‌ సీలింగ్ ఫ్యాన్ కి వేలాడుతున్నాడు. అందరు ఒక్కసారిగా షాక్ తిన్నారు. మెల్లిగా షాక్ లో నుండి తేరుకుని వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లీదండ్రులు పరుగున సంఘటన స్థలానికి వచ్చారు. అప్పుడు అసలు విషయం తెలిసింది. తనకు కొడుకు అనకాపల్లికి చెందిన యువతిని ప్రేమించాడని, ఆమె మూడురోజుల క్రితం గుంటూరులో కరోనాతో చనిపోయిందని రోహిత్ తండ్రి కృష్ణారావు తెలిపారు. ఆమె మరణంతో రోహిత్ కుంగిపోయాడని, ఆ విషయం తట్టుకోలేకే ఈ పని చేశాడని. తాము మరో సంబంధం చూసి పెళ్లి చేస్తామని ఎంత నచ్చజెప్పినా ఆ విషాదంలోని నుంచి తేరుకోలేకపోయాడని పేర్కొన్నారు. ఆ డిప్రెషన్‌తో తమ కొడుకు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని ఆయన పోలీసులకు తెలిపారు. గాజువాక పోలీసులు రోహిత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సీఐ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

స్టాట్యూ ఆఫ్ లిబర్టీ  కిరీటం తరహాలో గొర్రె కొమ్ములు.. యుగాంతానికి సంకేతం అంటూ కామెంట్స్..

మాములుగా ఏ  గొర్రెకు అయినా రెండే కొమ్ములు ఉంటాయి. ఈ గొర్రెకు మాత్రం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా  ఐదు కొమ్ములు ఉన్నాయి. ఒకే గొర్రెకు ఐదు కొమ్ములు  ఉండటంతో ఈ గొర్రెను జనం  వింతగా చూశారు. అంటే కాదు దాన్ని చూడగానే కొంతమంది  అది యుగాంతం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నవారికి మరో సంకేతం వచ్చింది. ఈ సారి ఐదు కొమ్ములు గల గొర్రె భూమిని అంతం చేసేందుకు పుట్టింది. ఆ గొర్రెను చూసిన నెటిజనులు అంటున్నారు. ఆ గొర్రె బర్త్ ప్లేస్  నైజీరియా. అక్కడ పెరుగుతున్న ఈ గొర్రె ఇటీవలే వార్తల్లోకి ఎక్కింది. నెత్తి మీద కింగ్ కిరీటం  పెట్టినట్లుగా ఆ గొర్రె కొమ్ములు భలే అందంగా ఉన్నాయి. దీంతో చుట్టుపక్కల ప్రజలు సైతం దాన్ని చూసేందుకు ఎగబడుతున్నారు. ఒకరకంగా ఆ గొర్రె టూరిస్ట్ ప్లేస్ గా మారింది. ఈ గొర్రె గురించి తెలుసుకోవాలనుకుంటే కొంచం ముందుకు వెళ్ళాలి.. మరింకెందుకు ఆలస్యం పదండి ముందుకు.. జులై 21న బక్రీద్ నేపథ్యం నైజీరియాలోని లాగోస్‌లోని ఓ మార్కెట్‌లో గొర్రెల గోనుగోలు  జోరుగా సాగింది. ఈ సందర్భంగా మార్కెట్ లోకి  ఓ వ్యక్తి తీసుకొచ్చిన గొర్రె అందరినీ ఆకట్టుకుంది. అలరించించి. సాధారణంగా గొర్రెకు రెండే కొమ్ములు ఉంటాయి. అయితే, ఆ గొర్రెకు మాత్రం ఐదు కొమ్ములు ఉండటంతో దాన్ని వింతగా చూశారు. వింతగా చూడడమే కాదు అది ఈ భూమిని నాశనం చేయడానికి వచ్చిందని మాట్లాడుకున్నారు.అంతే కాదండోయి కొందరు ఆ గొర్రెకు ఫొటోలు, వీడియోలు తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ కిరీటం తరహాలో ఆ గొర్రె కొమ్ములు ఉన్నాయని పలువురు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇది యుగాంతానికి సంకేతమని అంటున్నారు. ఈ వీడియోను చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ముస్లింలు జరుపుకొనే మరో ముఖ్యమైన పండుగల్లో బక్రీద్ కూడా ఒకటి. ఈ పండుగను ‘ఈద్ ఉల్ అద్హా’ అని కూడా పిలుస్తారు. బక్రీద్ పండుగ త్యాగానికి గుర్తుగా భావిస్తారు. ఏటా హజ్ యాత్ర చివర్లో ఈ పండుగను నిర్వహిస్తారు. అల్లాహ్ ఆదేశంతో ఇబ్రహీం అనే ప్రవక్త తన ఏకైక కుమారుడిని సైతం బలి ఇవ్వడానికి సిద్ధపడతారు. ఆయన త్యాగానికి సంతోషించిన అల్లాహ్.. అతడి కుమారుడి బదులు గొర్రెను ఉంచుతాడు. అప్పటి నుంచి బక్రీద్‌ను ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. మరి రెండు గొర్రెల ధర రూ.4.5 లక్షలట, బక్రీద్ సందర్భంగా గొర్రెను బలిచ్చి.. దాని మాంసాన్ని మూడుగా విభజిస్తారు. ఒక భాగం తమ కుటుంబానికి కేటాయిస్తారు. మిగతా రెండు భాగాలను బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగువారికి, పేదలకు పంచుతారు. అందుకు బక్రీద్ రోజున మేకలు, గొర్రెలకు అంత డిమాండు ఉంటుంది.