థర్డ్ వేవ్ వార్నింగ్ బెల్స్.. మళ్ళీ లాక్ డౌన్ దిశగా..
posted on Jul 22, 2021 @ 3:13PM
దేశంలో కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే పాజిటివ్ కేసులు, మరణాలు కాస్త షేర్ మర్కెట్స్ వ్యాల్యూస్ తగ్గినట్లు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,383 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 3,12,57,720కి చేరింది. ఇందులో 4,09,394 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గురువారం కొత్తగా 38,652 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ కావడంతో.. రికవరీల సంఖ్య 3,04,29,339కి చేరింది.
అటు నిన్న 507 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 4,18,987 చేరుకుంది. ఇదిలా ఉంటే ఇప్పటిదాకా 41,78,51,151 వ్యాక్సినేషన్ డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అటు థర్డ్ వేవ్ టెన్షన్, కరోనా కొత్త వేరియంట్లు మళ్లీ ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తగిన చర్యలు తీసుకోకపోతే కరోనా థర్డ్ వేవ్ తప్పదని వైద్యులు హెచ్చరిస్తుండటంతో కేంద్రం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఒక వైపు అదే కేంద్ర ప్రభుత్వం సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ అందాకా చనిపోయిన వాళ్ళు ఎవరు లేరని తెగేసి చెప్పింది. ఆ విషయం పై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.. అలా మోడీ సర్కార్ అలా చెప్పడం కూడా సిగ్గుచేటు.. మనదేశంలో ఇప్పటికి 4 లక్షలకు పైగా మరణాలు సంభవించాయని చెపుతున్న.. ప్రపంచ లెక్కల ప్రకారం మన దేశంలో 10 లక్షలకు పైగా కరోనా మరణాలు సంభవించాయని చెపుతున్నారు.
మళ్ళీ థర్డ్ వేవ్ టెన్షన్..
కొంత కాలంగా ఉపశమనం ఇచ్చిన కరోనా.. మరో రెండు మూడు వారాల్లో థర్డ్ వేవ్ వస్తుందని.. అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని చెపుతున్నారు. మరోవైపు అటు ఇప్పటికే కేరళ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈనెల 24,25 తేదీల్లో సంపూర్ణ లాక్డౌన్ విధించింది. కేరళలో ఇప్పటివరకు కరోనా నియంత్రణలోకి రాలేదు. దేశంలో అత్యధిక కేసులు కేరళలోనే నమోదవుతున్నాయి. దీంతో టెస్టింగ్ పెంచాలని నిర్ణయం తీసుకుంది కేరళ ప్రభుత్వం. రోజుకు 3 లక్షల టెస్ట్లు చేయబోతున్నారు. ప్రజలను మరోవైపు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
కేరళలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న జిల్లాల్లో మైక్రో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాట్లను చేయాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. గత నెల 12, 13 తేదీల్లో కూడా కేరళలో కఠిన ఆంక్షలు విధించారు. బక్రీద్ సందర్భంగా ఆంక్షలను ఎత్తివేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం చేయడంతో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా రాష్ట్రంలో కఠిన ఆంక్షలు విధించాలని కేరళ ప్రభుత్వాన్ని కోరింది.
ఇక థర్డ్ వేవ్పై మరో వైపు ఏపీలో అధికారులు అలర్ట్ అయ్యారు. ఎమర్జెన్సీ కొవిడ్ రెస్పాన్స్ ప్లాన్ అమలు చేయాలని ఆలోచిస్తున్నారు. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా 26 ఆసుపత్రుల్లో పీడియాట్రిక్ కేర్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని పీహెచ్సీ, సీహెచ్సీల్లో నాన్ ఐసీయు పడకలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో యుద్ధ ప్రాతిపదికన వసతులు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఎమర్జెన్సీ కొవిడ్ రెస్పాన్స్ ప్లానింగ్ పేరుతో 696 కోట్లు రూపాయలు కేటాయించాయి. ఈ నిధులతో అన్ని జిల్లాల్లోని ఆసుపత్రులు, బోధనా ఆసుపత్రుల్లో 12 పీడియాట్రిక్ కేర్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. అందరూ కొవిడ్ రూల్స్ పాటించేలా అధికారులు పర్యవేక్షించాలని వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది.
మరో వైపు కరోనా పై అనుమానాలు లేక పోలేదు.. సరిగ్గా గంట తర్వాత సినిమాలో ఇంటర్వెల్ వచ్చినట్లు.. అధికారులు, మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినట్లు వస్తుంది.. వాళ్లకు ఎలా అంత కచ్చితంగా తెలుస్తుంది.. పలానా వారంలో వస్తుంది అని.. అది ఇలా ఉండగా తెలంగాణాలో రాజకీయ స్వార్ధం కోసం ప్రజలను బక్రీద్ కి మేకలు బలిచినట్లు బలిస్తున్నారు.. ర్యాలీలు.. ధర్నాలు చేస్తూ.. అసలు సోషల్ డిస్టెన్స్ లేదు మాస్క్ లు పెట్టుకోవడం లేదు.. గతం లో మరణ విలయాన్ని చూసిన దేశ ప్రజలు రాష్టాల ప్రజలు అసలు వినిపించుకోవడం లేదు.. మరో వైపు మెడికల్ ప్రముఖులు అన్నింటికంటే ఈ థర్డ్ వేవ్ చాలా డేంజర్ అని చెపుతున్నారు.. అయినా వినిపించుకోవడం లేదు.. అల్లుఅర్జున్ సినిమాలో డైలాగ్ లా తగ్గేదే లేదు అంటున్నారు.. ఇప్పుడు తగ్గకపోతే ఆ తరువాత దగ్గుతారని తెలియడం లేదు ప్రజలకు.. సో ఏది ఏమైనా కొంచం జాగ్రత్త గా ఉందాం.. మన ఆరోగ్యాలు ప్రభుత్వాలకు ఎలాగూ పట్టవు కాబట్టి మానమైన కొంచం జాగ్రత్తగా ఉండడం మంచింది.