మీరు క్యాడ్‌బరీ చాక్లెట్స్ తింటున్నారా ? అయితే ఇది చదవండి.. 

పిల్లలు పెద్దలు ఎవరైనా సరే వయసుతో సంబంధం లేకుండా చాక్లెట్స్ అంటే లొట్టలు వేసుకుని తింటుంటారు. అయితే ఈ తెలిసిన తరువాత ఎంత మంది ఎంత మంది ఈ చాక్లెట్స్ కొనుగోలు చేసి తింటారో చూడాలి మరి.. ఇంతకీ ఆ విషయాన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా ? అయితే చదవండి మీకే తెలుస్తుంది. అట్రాసిటివ్ గా కవర్.. దాని పై ఉన్న ఇమేజ్ ని చూస్తేనే తినాలనిపిస్తుంది.. అది వ్యాపార ప్రకటనలో ఒక భాగం అయితే.. ఎంతో  డిలీషియస్ టెస్ట్ తో  కట్టిపడేసే అనేక రకాల ఫ్లేవర్లు మార్కెట్‌లో అందుబాటులో ఉండగా.. వాటిల్లో క్యాడ్‌బరీకి చాక్లెట్స్ కి  ప్రత్యేక స్థానం ఉంది. టెస్ట్ లోను మార్కెట్ లోను.. అందరు దాదాపు అదే చాక్లెట్స్ తినడానికి ఇష్టపడుతారు.  అయితే తాజాగా ఇండియా వ్యాప్తంగా కొందరు నెటిజన్లు క్యాడ్‌బరీకి చాక్లెట్స్ లో  ఉత్పత్తుల్లో జెలటిన్‌ను వాడుతున్నారని ఆరోపిస్తూ సదరు ప్రొడక్ట్స్ బ్యాన్ చేయాలని ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు. జెలటిన్ ఉందంటే అందులో గొడ్డు మాంసాన్ని వాడినట్టేనని తెలిపే స్ర్కీన్ షాట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. మరి ఇది ఇలా ఉంటే.. నైటీజన్స్ చెపుతున్న ఈ మాటలు నిజమా? అంటూ @CadburyUKను ట్విట్టర్‌లో ప్రశ్నించిన ఒక యూజర్.. నిజమైతే, హలాల్ సర్టిఫైడ్ బీఫ్ ప్రొడక్ట్స్‌ను హిందువులచే బలవంతంగా తినిపించినందుకు క్యాడ్‌బరీపై కేసు పెట్టాల్సిందేనని అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘మా పూర్వీకులు, గురువులు తమ ప్రాణాలను త్యాగం చేశారే తప్ప, గొడ్డు మాంసం తినలేదు. కానీ స్వాతంత్ర్యం తర్వాత పాలకుల విధానంతో మా ధర్మం ఉల్లంఘించబడింది’ అని ట్వీట్ చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే బ్రిటిష్ కంపెనీని బ్యాన్ చేయాలంటూ వందలాది ట్వీట్లు హోరు ఎత్తుతున్నాయి.. ఈ ట్విట్స్  సోషల్ మీడియాలో  వైరల్‌‌గా మారాయి. కాగా ఈ ఇష్యూపై క్యాడ్‌బరీ డైరీ మిల్క్ క్లారిటీనిస్తూ ప్రకటన చేసింది. ఇండియాలో విక్రయించిన, తయారు చేయబడిన మొండేలెజ్/క్యాడ్‌బరీ ఉత్పత్తులు 100 శాతం వెజిటేరియన్ అని, వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్.. క్యాడ్‌బరీ భారతీయ ఉత్పత్తులకు సంబంధించినది కాదని తెలిపింది. అంతేకాదు చాక్లెట్ ర్యాపర్‌పై ఉన్న ఆకుపచ్చ చుక్క ఇదే విషయాన్ని సూచిస్తుందని వెల్లడించింది. అయితే తమ బ్రాండ్‌కు చెడ్డపేరు తీసుకొచ్చే ఇలాంటి నెగెటివ్ పోస్టులను సోషల్ మీడియాలో షేర్ చేసే ముందు ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలని మరొక ట్వీట్‌లో యూజర్లను కోరింది. ఎందుకంటే తమ ఉత్పత్తులపై వినియోగదారులకు ఉన్న విశ్వాసం.. ఫేక్ న్యూస్ వల్ల కోల్పోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. కాగా ఆస్ట్రేలియా వెబ్‌సైట్‌కు చెందిన స్ర్కీన్ షాట్ ఇండియాలో వైరల్ అయిందని చాలా మంది యూజర్లు గుర్తించారు. నిజంగానే ఇండియాలోని క్యాడ్‌బరీ బ్రాండ్ ఉత్పత్తులపై వెజిటేరియన్‌కు గుర్తుగా గ్రీన్ కలర్ మార్క్ ఉంటుందన్నారు. ప్రపంచంలోనే జనాభాలో అదిపెద్ద రెండొవ దేశం మనది.. బిజినెస్ కి ఇక్కడ  మంచి ఫ్యూచర్ ఉంది.. ప్రభుత్వాలను తమ చెప్పు చేతల్లో పెట్టుకుని తమకు ఇష్టం వచ్చినట్లు ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు అని నైటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.. 

ఈట‌ల‌ను చంప‌డానికి కుట్ర‌?.. హుజురాబాద్‌లో క‌ల‌క‌లం..!

హుజురాబాద్ ఉప ఎన్నిక‌. ప్రాణం పెట్టి మ‌రీ పోరాడుతున్నారు ఈట‌ల రాజేంద‌ర్‌. తాను గెలిచి సీఎం కేసీఆర్‌కు బుద్ధి చెప్పాల‌ని శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తున్నారు. అందులో భాగంగా నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర కూడా చేప‌ట్టారు. ఊరూరా తిరుగుతూ.. ప్ర‌జ‌ల‌ను ప‌ల‌క‌రిస్తూ.. త‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని వివ‌రిస్తూ.. కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా ప్ర‌జ‌ల‌ను స‌మీక‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కేసీఆర్‌పై ఇంత‌లా పోరాడుతున్న త‌న‌ను.. అడ్డుతొల‌గించుకునేందుకు కుట్ర చేస్తున్నారంటూ ఈట‌ల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈట‌ల చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు హుజురాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా క‌ల‌క‌లంగా మారాయి.  ‘ప్రజా జీవన యాత్ర’ లో భాగంగా శనిగరంలో పాద‌యాత్ర చేసిన ఈట‌ల కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిప‌డ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రజాకార్లను తలపిస్తున్నారని ఫైర్ అయ్యారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని సర్పంచ్‌లకు సీఎం వెలకట్టారని ఆరోపించారు. తనను చంపడానికి జిల్లా మంత్రి కుట్రలు చేస్తున్నారన్నారు. హంతక ముఠాలతో చేతులు కలిపినట్టు తనకు సమాచారం వచ్చిందన్నారు.  ‘అరె కొడుకుల్లారా ఖబర్దార్..? నరహంతకుడు నయిం చంపుతా అంటేనే భయపడలేదు.. మీ చిల్లర ప్రయత్నాలకు అసలు భయపడను.. ఉగ్గుపాలతో ఉద్యమాలు చేసిన వాడిని, ఈటల మల్లయ్య కొడుకుని.. ఆత్మగౌరవం కోసం ఏ స్థాయిలో అయినా కొట్లడతా.. దుబ్బాకలో ఏం జరిగిందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది.. 2018లో నన్ను ఓడించడానికి ఎన్ని కుట్రలు చేసినా.. నా ప్రజలు అండగా నిలిచారు.. ఇప్పుడూ నిలుస్తారు.. చట్టం మీద నాకు విశ్వాసం ఉంది.. పోలీసులు సహకరించండి’’ అంటూ ఈటల రాజేందర్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.  త‌న‌ను చంపేందుకు కుట్ర చేస్తున్నారంటూ ఈట‌ల రాజేంద‌ర్ చేసిన ఆరోప‌ణ‌లతో హుజురాబాద్‌లో హైటెన్ష‌న్ క్రియేట్ అయింది. ఈట‌ల‌కు ర‌క్ష‌ణ‌గా ఆయ‌న అభిమానులు పెద్ద సంఖ్య‌లో పాద‌యాత్ర‌లో పాల్గొంటున్నారు. ఈట‌ల యాత్ర ఆసాంతం.. ఆయ‌న‌కు తోడుగా ఉంటామంటున్నారు. ఈట‌ల‌కు ఏదైనా జ‌రిగితే సీఎం కేసీఆర్‌దే బాధ్య‌త అంటూ హెచ్చ‌రిస్తున్నారు.   

ఈట‌ల వ‌ర్సెస్ హ‌రీశ్‌.. దోస్తులా? దుష్మ‌న్‌లా?

ఈట‌ల రాజేంద‌ర్‌, త‌న్నీరు హ‌రీశ్‌రావు. ఉద్య‌మ‌కాలం నుంచి మంచి దోస్తులు. కేసీఆర్‌కు లెఫ్ట్ అండ్‌ రైట్‌లు. గులాబీ బాస్ డైరెక్ష‌న్‌లో ఉద్య‌మాన్ని ఉర‌క‌లెత్తించిన యోధులు. ప్ర‌భుత్వంలో స‌హ‌చ‌ర మంత్రులుగా నెంబ‌ర్ 2 పొజిష‌న్ వారిది. కేటీఆర్ ఎంట్రీతో ఈ ఈక్వేష‌న్ త‌ల‌కిందులైపోయింది. పార్టీలో, ప్ర‌భుత్వంలో ప్ర‌యారిటీ మారిపోయింది. కేసీఆర్ త‌ర్వాత కేటీఆరే సూప‌ర్ బాస్‌. హ‌రీశ్‌రావు, ఈట‌లలు ఆట‌లో అర‌టిపండ్ల‌లా మిగిలిపోయారు. చాలా సైలెంట్‌గా ఆ ఇద్ద‌రినీ సైడ్ చేసేశారు కేసీఆర్‌. ఇలా, అసంతృప్తులుగానూ హ‌రీశ్‌, ఈట‌ల‌లు ఒకే బ్యాచ్‌గా కొన‌సాగారు. గులాబీ బాస్‌పై రివేంజ్‌కు స‌రైన స‌మ‌యం కోసం ఎదురుచూడ‌సాగారు. అప్పుడ‌ప్పుడు రెబెల్ స్టేట్‌మెంట్స్‌తో ఈట‌ల బ‌య‌ట‌ప‌డ‌గా.. హ‌రీశ్‌రావు మాత్రం వ్యూహాత్మ‌క మౌనంతో సిద్ధిపేట‌కే ప‌రిమిత‌మ‌య్యారు.  క‌ట్ చేస్తే.. ఈట‌ల‌పై ఇప్పుడు హ‌రీశ్‌రావు క‌త్తులు దూస్తున్నారు. ఈట‌ల మాత్రం త‌న పాత మిత్రుడిని ప‌ళ్లెత్తు మాట కూడా అన‌డం లేదు. గ‌తాన్ని గుర్తు చేసి భ‌విష్య‌త్తుపై హెచ్చ‌రిక‌లు చేస్తున్నారంతే. కేసీఆర్‌పై ఈట‌ల త‌న ఆగ్ర‌హాన్ని బ‌య‌ట‌పెట్టి పార్టీ నుంచి బ‌య‌ట‌కొస్తే.. ఈట‌ల ఎపిసోడ్‌ను అడ్డుపెట్టుకొని మ‌ళ్లీ కేసీఆర్‌కు ద‌గ్గ‌ర‌య్యారు హ‌రీశ్‌రావు. మున‌ప‌టిలా యాక్టివ్ అయ్యారు. ఈట‌ల‌ది ఆత్మ‌గౌర‌వ‌మైతే.. హ‌రీశ్‌ది బ‌త‌క నేర్చిన‌త‌న‌మంటున్నారు. కేసీఆర్ చాణ‌క్యంతో ఇప్పుడు వీళ్లిద్ద‌రూ క‌త్తులు దూసే ప‌రిస్థితి రావ‌డంతో రాజ‌కీయం రంజుగా మారింది. మిత్రుడిపైకి మిత్రుడినే ఎగ‌దోసి కేసీఆర్‌ త‌మాషా చూస్తున్నారని అంటున్నారు. ఈట‌ల‌ను ఓడించే టాస్క్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కాకుండా.. హ‌రీశ్‌రావుకు అప్ప‌గించి మైండ్‌గేమ్ మొద‌లుపెట్టారు గులాబీ బాస్‌. హ‌రీశ్‌రావు త‌న మ‌నిషో.. కాబోయే ఈట‌ల‌నో తేల్చే శ‌ల్య‌ప‌రీక్ష పెట్టారు. కేసీఆర్ పెట్టిన ఎగ్జామ్‌లో ఫ‌స్ట్ క్లాస్‌లో పాస్ కావాల‌ని గట్టిగా ప్ర‌య‌త్నిస్తున్నారు హ‌రీశ్‌రావు. ఈట‌ల‌ను ఓడించేందుకు త‌న రాజ‌కీయ అనుభ‌వం, ప‌ర‌ప‌తి మొత్తం ప్ర‌యోగిస్తున్నారు. ఈట‌ల‌ను ఒంట‌రి వాడిని చేసేలా స్థానిక నాయ‌కులంద‌రినీ టీఆర్ఎస్‌కు మ‌ద్ద‌తుగా కూడ‌గ‌డుతున్నారు. ర‌హ‌స్య స‌మావేశాలు, తాయిలాలు, బెదిరింపుల‌తో ఈట‌ల‌ను క‌ట్ట‌డి చేసే ప్ర‌య‌త్నాలు, కుట్ర‌లు, కుతంత్రాలు హ‌రీశ్‌రావు పెద్ద ఎత్తున చేస్తున్నారని అంటున్నారు. ఈట‌ల‌ను ఈ స్థాయి నేత‌గా తీర్చిదిద్దింది కేసీఆరే అని, ఆ విశ్వాసం లేకుండా తిన్నింటి వాసాలు లెక్క‌బెట్టారంటూ రాజేంద‌ర్‌ను ఫుల్‌గా బ‌ద్నామ్ చేస్తున్నారు హరీశ్‌రావు.  అయితే, హ‌రీశ్ అంతేసి మాట‌లంటున్నా.. త‌న‌కు వ్య‌తిరేకంగా అన్నేసి కుట్ర‌లు చేస్తున్నా.. ఈట‌ల మాత్రం త‌న పాత దోస్తును ఒక్క మాట కూడా అన‌డం లేదు. పైగా, హ‌రీశ్‌రావుతో పాటు త‌న‌పై కేసీఆర్ చేసిన కుతంత్రాల‌ను ఒక్కోటి బ‌య‌ట పెడుతూ.. త‌న స్నేహితుడికీ త‌న గ‌తే ప‌డుతుంద‌ని.. జాగ్ర‌త్త సుమా అంటూ సుద్దులు చెబుతున్నారు. త‌న‌తోపాటు హరీశ్‌రావు కోరలు పీకాలన్న ఆలోచనతో 2018 ఎన్నికల తర్వాత మా ఇద్దరికీ మంత్రి పదవులు ఇవ్వనిది నిజం కాదా? అంటూ ప్ర‌శ్నించారు. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో మూడ్నెళ్ల తర్వాత త‌మ‌ను మంత్రులు చేశార‌ని అన్నారు. త‌న‌తో పాటు హ‌రీశ్‌రావూ పార్టీలో తీవ్ర అవ‌మానాల‌కు గుర‌య్యారంటూ పాత చేదు జ్ఞాప‌కాల‌ను ప‌దే ప‌దే గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం త‌న‌ను ఓడించాలని మంత్రి హరీశ్‌రావు పనిచేస్తున్నారని.. కుల సంఘాల నేతలను పిలిపించుకొని త‌న‌కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని.. ఏదో ఒకరోజు త‌న‌కు జరిగినట్టే హ‌రీశ్‌రావుకూ జరుగుతుందంటూ.. పాత మిత్రుడిని కొత్త‌గా హెచ్చ‌రిస్తున్నారు ఈటల రాజేంద‌ర్‌. ఇలా, హ‌రీశ్‌రావు, ఈట‌ల రాజేంద‌ర్‌ల ద‌శాబ్దాల స్నేహం.. కేసీఆర్ మూలంగా వైరంగా మార‌డం రాజ‌కీయ చ‌ద‌రంగంలో కామ‌నే అంటున్నారు. మ‌రి, ఈ దోస్తుల దుష్మనీ ఎందాక దారితీస్తుందో చూడాలి...

తాడేపల్లిలో 30 కోట్ల స్కాం.. ఇద్దరు మంత్రులకు వాటా ? 

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో 30 కోట్ల రూపాయల స్కాం జరిగిందని జనసేన పార్టీ ఆరోపించింది. తాడేపల్లిలో క్యాపిటల్ బిసినెస్ పార్క్‌కి జీఓ 61 ద్వారా లబ్ది చేకూర్చుతూ 30 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ చెప్పారు. దేవాదాయశాఖ  మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందని, ఇందుకు సంబంధించి తమ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని పోతిన వెంకట మహేష్ తెలిపారు.  తాడేపల్లిలో క్యాపిటల్ బిసినెస్ పార్క్‌కి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే బిసినెస్ పార్కు కోసం జీఓ 61 ద్వారా లబ్ది చేకూర్చుతూ మంత్రి వెల్లంపల్లి  స్కామ్‌కు తెరలేపారని మహేష్ ఆరోపించారు. ఇందులో ఉన్న నలుగురు పార్టనర్లు వెల్లంపల్లి పక్కనే ఉండేవారన్నారు. వెల్లంపల్లి మిత్ర బృందానికి 30 కోట్ల రూపాయలు రాయతి ఇచ్చారని ఆరోపించారు.  సీఎం దృష్టిలో లేకుండా మేకపాటి గౌతమ్ రెడ్డి జీవో తెచ్చాన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్‌లో లేని ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీకి కోసం జీఓ తెచ్చారని.. ఇద్దరు మంత్రులు ఇద్దరు కమిషన్ పంచుకుంటున్నారని పోతిన వెంకట మహేష్ ఆరోపించారు. వెల్లంపల్లి బినామీ వ్యవస్థకు జీఓ తెచ్చి స్కామ్ చేస్తుంటే జనసేన చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని... సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వస్త్రాలతా కాంప్లెక్స్‌ని ఖాళీ చెయ్యాలని వత్తిడి చేసి, క్యాపిటల్ బిసినెస్ పార్క్‌కి తరలించారని వెల్లంపల్లి చూస్తున్నారని పోతిన మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వెల్లంపల్లికి జి.ఓ61తో లబ్ది పొందిన సంస్థకు అందులోని వ్యక్తులకు సంబంధం లేదని దుర్గమ్మపై ప్రమాణం చేయాలన్నారు. తప్పు చేయకుంటే ధైర్యంగా శుక్రవారం మంత్రి దుర్గమ్మ కొండకి రావాలని...తాను అన్న ప్రకారం శుక్రవారం ఉదయం 10:30 గంటలకు చేరుకుంటానని మహేష్ తెలిపారు. 

పెళ్లి వద్దని.. కానిస్టేబుల్ ఆత్మహత్య.. 

పెళ్లి అంటే ఒక ఆడ మగ, పెద్దల అంగీకారం.. డబ్బు , మూడు ముళ్ళు , ఏడు అడుగులు మాత్రమే కాదు..రెండు మనసుల కలయిక, ఇద్దరు మనుషుల ప్రయాణం.. వందేళ్ల జీవితం, అన్నింటికంటే ముందు ముందు రెండు మనసులు కలవాలి ఆ తరువాత మనుషులు కలవాలి.. ఇష్టం లేని పెళ్లిళ్లు చేశారని కొంత మంది తమ ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడంలేదు.. తాజాగా తనకు ఇష్టం లేకున్నా పెళ్లి చూపులకు తీసుకెళ్లారన్న మనస్తాపంతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన  హైదరాబాద్‌లో జరిగిందీ .  పోలీసుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా కదిరికి చెందిన దండగల ఆంజనేయులు (25) ఏఆర్ కానిస్టేబుల్. కొన్నేళ్ల క్రితమే నగరానికి వచ్చిన ఆంజనేయులు తల్లి లక్ష్మితో కలిసి కార్ఖానాలోని న్యూవాసవి నగర్‌లో ఉంటున్నాడు. ఆంజనేయులు మరెవరితో నైనా ప్రేమలో ఉన్నదో లేదంటే నిజంగానే పెళ్లి అంటే ఇష్టం లేదో తెలియదు గాని.. అతనికి ఈ పెళ్లి వద్దని చెబుతున్నప్పటికీ పట్టించుకోని కుటుంబ సభ్యులు ఇటీవల పెద్దల సమక్షంలో పెళ్లి చూపులు జరిపించారు. అప్పటి నుంచి తీవ్ర మానసిక ఆందోళనకు గురి అయ్యాడు. మనస్తాపం చెందాడు. ఎలాగైనా ఆ పెళ్లి చేసుకోవద్దనుకున్నాడు ఆంజనేయులు అందుకు అందుకు ఒకటే మార్గం అనిపంచింది. అందుకే మరో ఆలోచన లేకుండా, వేరే ఆప్షన్ తీసుకోకుండా శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పింఛను తీసుకునేందుకు తల్లి లక్ష్మి శుక్రవారం కదిరి వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆంజనేయులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ లోని స్థానిక విక్రంపురి కాలనీలో ఉండే ఆంజనేయులు సోదరి శనివారం ఫోన్ చేసి మాట్లాడింది. తనకు నైట్ డ్యూటీ ఉందని ఆమెకు చెప్పాడు. అదే రోజు రాత్రి మళ్లీ ఆమె ఫోన్ చేయగా స్పందన లేకపోవడంతో అనుమానించిన ఆమె.. నిన్న ఉదయం తనకు సోదరుడి వరుసైన క్రాంతిని పంపించింది. ఎంతసేపు తలుపుకొట్టినా తీయకపోవడంతో అనుమానించిన క్రాంతి స్థానికుల సాయంతో తలుపు బద్దలుకొట్టి చూడగా ఆంజనేయులు లోపల ఉరి వేసుకున్న స్థితిలో కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి వాడంటే ఇంట్లో వాళ్ళకి చేప్పి వాళ్ళను ఒప్పించాలి, అర్థం ఎట్లు చెప్పాలి. కానీ ఇలా ప్రాణాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఏముంటుంది.  

సంతోష్ గుప్పిట్లో ప్రగతి భవన్.. రగిలిపోతున్న కేటీఆర్? సీఎం పోస్టు కోసం కోల్డ్ వార్? 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో కోల్డ్ వార్ నడుస్తుందా?  ప్రగతి భవన్ లో పెత్తనంతా సంతోష్ రావు చేతుల్లోకి వెళ్లిందా?  కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి కావాలని సంతోష్ పావులు కదుపుతున్నారా? సంతోష్ తీరుతో కేటీఆర్, కవిత కన్నీళ్లు పెట్టుకుంటున్నారా?.. కేసీఆర్ కుటుంంబంలో విభేదాలు వచ్చాయంటూ కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ ను సీఎం చేయాలని కేసీఆర్ భావించినా... కుటుంబ గొడవల వల్లే వెనక్కి తగ్గారనే చర్చ కూడా ఉంది. పదవుల విషయంలో కేటీఆర్, హరీష్ రావు, కవిత మధ్య వార్ నడుస్తుందనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా కేసీఆర్ కుటుంబానికి సంబంధించి సంచలన విషయాలు బయటపెట్టారు ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశ్ రావు.  కేసీఆర్ ఇంట్లో రెండు గ్రూపులయ్యాయని గోనే ప్రకాష్ రావు చెప్పారు. పెత్తనమంతా రాజ్యసభ సభ్యుడు సంతోష్ చేతుల్లోకి వెళ్లిందన్నారు. ప్రగతి భవన్ లోని ప్రతి అధికారి, ఉద్యోగి సంతోష్ కుమార్ కనుసన్నల్లో పనిచేస్తున్నారని చెప్పారు. ఎవరు కేసీఆర్ ను కలవాలన్నా సంతోష్ అనుమతి తప్పని సరిగా తీసుకోవాలన్నారు. కేటీఆర్ కూడా తన తండ్రిని కలవాలంటే సంతోష్ కు ఫోన్ చేయాల్సిందేనని చెప్పారు గోనే ప్రకాష్ రావు. కేటీఆర్, కవిత కూడా ప్రగతి భవన్ లో స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి లేదన్నారు. ఏదైనా మాట్లాడుకోవాలనుకుంటే బెడ్రూంకు తలుపులు వేసుకుని, కార్లలో కూర్చుని వాళ్లు మాట్లాడుకుంటున్నారని తెలిపారు. కేటీఆర్, కవిత ప్రగతి భవన్ లో ఏం మాట్లాడుకున్నా సంతోష్ కు తెలుస్తాయని భయపడుతున్నారని చెప్పారు. రాష్ట్ర పాలనలో చక్రం తిప్పుతున్న ఎంపీ సంతోష్ కు  ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచన పుట్టిందన్నారు గోనే ప్రకాష్ రావు.  కేటీఆర్ కు వ్యతిరేకంగా ఉండే గ్రూపును సంతోష్ లీడ్ చేస్తున్నారని గోనే ప్రకాష్ రావు తెలిపారు. ఇంతకాలం హరీశ్, కేటీఆర్ ల మధ్య  పోటీ ఉండగా.. ఇప్పుడు కేటీఆర్, సంతోష్ మధ్య యుద్దం నడుస్తోందన్నారు. కనీసం హోంమంత్రికి కూడా ఇవ్వకూడని డీఐజీ ఇంటిలెజెన్స్ నివేదికలను కూడా  సంతోష్ తీసుకుంటున్నారని ఆరోపించారు. డీజీపీ,డీఐజీ ఇంటిలెజెన్స్ లాంటి ఉన్నతాధికారులు లా అండ్ ఆర్డర్ వంటి కీలక విషయాలను నేరుగా సీఎంకే వివరించడం ఆనవాయితీ అని.. కాని ఇప్పుడు మాత్రం అంతా సంతోషే చూస్తున్నారని మండిపడ్డారు. మొక్కలు నాటే కార్యక్రమంతో సంతోష్ కుమార్ తన బల ప్రదర్శన చేస్తున్నారని చెప్పారు.సంతోష్  అవినీతి చిట్టా  అంతా తన దగ్గర ఉందని, త్వరలోనే ఆధారాలతో బయటపెడుతానని గోనే ప్రకాష్ రావు ఆరోపించారు.  లల్లూ ప్రసాద్ యాదవ్, జయలలిత లాగే  సంతోష్ కూడా త్వరలోనే జైలుకు పోవడం ఖాయమన్నారు.  మిడ్ మానేరు కింద ముంపునకు గురైన కొదురుపాక గ్రామంలో అర్హత లేని సంతోష్ కుమార్ బంధువులు వ్యవసాయ కూలీ కింద 2015లో పరిహారం తీసుకున్నారని గోనే ఆరోపించారు. 4-5 వేల కోట్ల రూపాయలు సంతోష్, ఆయన బినామీలు కూడబెట్టారని, త్వరలోనే ఆధారాలు బయటపెడుతానని తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి అనే ఎమ్మెల్సీ పేరు మీద ఉన్న ఆస్తులన్నీ సంతోష్ కుమార్ వేనని ఆరోపించారు. సంతోష్ తండ్రి రవీందర్ రావు మిడ్ మానేరు దిగువన ఉన్న మాన్వాడనుంచి వందలాది ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు 150 ట్రాక్టర్లతో ఇసుక రవాణా చేస్తున్నారని..ట్రాక్టర్లు నడిపేవాళ్ల దగ్గర నెలకు 13 వేల రూపాయలు రవీందర్ రావు తీసుకుంటారని ఆరోపించారు. ఇసుక ట్రాక్టర్లను రెవెన్యూ, పోలీసులు అడ్డుకోకుండా రవీందర్ రావు మీడియేటర్ గా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా అక్రమ ఇసుక రవాణా ఆపాలని, అమాయకులపై కేసులు ఎత్తివేయించాలని గోన్ ప్రకాష్ రావు డిమాండ్ చేశారు.    

పార్లమెంట్ లో తొలి రోజే రచ్చ.. తమను మాట్లాడనీయాలన్న ప్రధాని మోడీ 

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల తొలి రోజే రచ్చరచ్చైంది. విపక్షాల ఆందోళనలో ఉభయసభలు దద్దరిల్లాయి. లోక్ సభ ప్రారంభం కాగానే... కొత్తగా ఎంపీలుగా గెలిచిన నలుగురు సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన వైసీపీ ఎంపీ డాక్టర్‌ గురుమూర్తి ప్రమాణం చేశారు. తర్వాత కేబినెట్ కొత్త మంత్రులను సభకు పరిచయం చేశారు ప్రధాని మోడీ. అయితే ఈ కార్యక్రమాన్ని విపక్షాలు అడ్డుకున్నాయి. కొవిడ్ , చమురు ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. దీంతో నిరసనల మ‌ధ్యే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప్రసంగించారు. ఎక్కువమంది ఎస్సీలు, మహిళలు మంత్రులు కావడం శుభపరిణామమని వ్యాఖ్యానించారు. కేబినెట్‌లో అన్నివర్గాలకు సామాజిక న్యాయం చేశామని తెలిపారు ప్రధాని మోడీ.  లోక్‌సభలో ప్రధాని మోడీ ప్రసంగంపై ప్రతిపక్షాల అభ్యంతరం వ్యక్తం చేశారు. చమురు ధరల పెంపుపై చర్చకు కాంగ్రెస్‌ ఎంపీలు డిమాండ్‌ చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకింగా ఆప్‌ వాయిదా తీర్మానం ఇచ్చింది. తామిచ్చిన వాయిదా తీర్మానాలపై విపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో లోక్ సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. దీంతో సభను వాయిదా వేశారు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా.  మరోవైపు ప్రతిపక్షాలు కఠిన ప్రశ్నలను ఎన్నైనా సంధించొచ్చని, కానీ, వాటికి జవాబు చెప్పేందుకు ప్రభుత్వాన్ని మాట్లాడనివ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు. అందరు ఎంపీలు, అన్ని విపక్షాలు అత్యంత కఠినమైన, తెలివైన ప్రశ్నలను సంధించాలని కోరుతున్నానన్నారుసమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడిన మోడీ.. సభలో క్రమశిక్షణతో మెలగాలని ప్రతిపక్ష సభ్యులకు హితవు చెప్పారు. అలాగైతేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని, ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని, అభివృద్ధిలో వేగం పుంజుకుంటుందని  చెప్పారు. కొవిడ్ వ్యాక్సినేషన్ పైనా మాట్లాడారు ప్రధాని మోడీ.  వ్యాక్సిన్ వేసుకున్న వారంతా బాహుబలులేనని చమత్కరించారు. ‘‘టీకాను భుజాలకు (బాహువు) వేస్తారు. కాబట్టి, టీకాలేసుకున్న వారంతా బాహుబలులు. ఇప్పటికే 40 కోట్ల మంది బాహుబలులయ్యారు. మిగతా వారూ టీకా తీసుకుని బాహుబలి అవ్వాలి’’ అని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలను విధిగా పాటించాలని సూచించారు. ప్రపంచం మొత్తాన్ని కరోనా మహమ్మారి గుప్పిట పట్టేసిందని, సభలో దానిపై అర్థవంతమైన చర్చలు జరగాల్సిన అవసరం ఉందని  చెప్పారు.

ముంచుకొస్తున్న థర్డ్ వేవ్.. తెలంగాణలో డేంజర్ బెల్స్ 

దేశం నుంచి కరోనా వెళ్ళిపోలేదు.ఈరోజు వరకు దేశంలో ఏ ఒక్క రాష్ట్రం కూడా ‘కరోనా రహిత రాష్ట్రం’ గా ప్రకటించుకోలేదు. అంటే, అన్ని రాష్ట్రాలలోనూ ఎక్కువ తక్కువ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. చాలా వరకు రాష్ట్రాలలో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. తెలంగాణలో తాజాగా ఆదివారం ఐదు వందల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. ముగ్గురు  చనిపోయారు. కానీ, అన్ని రాష్ట్రాలలో ఒకేలా లేదు. రాష్ట్రాలలో కొన్నికేసుల సంఖ్య తగ్గినట్లే తగ్గి మళ్ళీ పెరుగుతోంది.   అయితే దేశంలో, రాష్ట్రంలో పరిస్థితులను గమనిస్తే, థర్డ్ వేవ్ కు తోరణాలు, బ్యానర్లు కట్టి  స్వాగతం పలుకుతున్నట్లు ఉందని డాక్టర్లు, వైద్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ప్రజలు, పాలకులు, రాజకీయ నాయకులు మాత్రం కరోనా కథ ముగిసిపోయిందనే భ్రమల్లో ఉన్నారు అనిపిస్తోంది. కరోనా ఉదృతి తగ్గిన నేపధ్యంలో ప్రజా జీవనం దెబ్బతినకుండా ఉండేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షలను ఎత్తివేసింది.అయినా, మహమ్మారి ఇంకా పూర్తిగా పోలేదు, మరో వేవ్ వచ్చేందుకు సిద్దంగా ఉందని అధికారులు  హెచ్చరిస్తూనే ఉన్నారు.  మాస్క్  ధరించడం, భౌతిక దూరం పాటించడం, అదే విధంగా ఇతర అన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని గొంతులు చించుకుంటున్నారు.  అయినా, ప్రజలు చాలావరకు ప్రభుత్వ హెచ్చరికలను పెడ చెవిన పెడుతున్నారు. మహమ్మారి లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మాస్కులు తీసేశారు. భౌతిక దూరం మాటే మరిచి పోయారు. ఇక వ్యక్తిగత పరిశుభ్రత ఇతర నియమాల గురించి అయితే చెప్పనే అక్కరలేదు. టీకా తీసుకున్నామన్న అతి ధీమానో ఏమో ... కొవిడ్‌ భయం కొట్టుకు పోయింది. టీకా తీసుకోవడం విషయంలోనూ తొందరేముందిలే మెల్లిగా ఎప్పుడో వీలైన నప్పుడు చూద్దాం అన్న ధోరణి వ్యక్తమవుతోంది. ఈ విషయంలో రెక్కాడితే కానీ డొక్కాడని సామాన్య జనాలే కాదు, అన్ని వర్గాల ప్రజలు ఒకే విధంగా ప్రవర్తిస్తున్నారు.  రాజకీయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అన్ని పార్టీల నాయకులు ఎలాంటి సంకోచం లేకుండా సామూహిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్‌ తమ దత్తత గ్రామం వాసాలమర్రికి వెళ్లారు. సంహపక్తి భోజనాలు చేశారు. బహిరంగ సభలో కరోనాపై జోకులు వేస్తూ మాట్లాడారు. ఆ తర్వాత నిఅజమో కాదో కానీ, సంహపక్తి భోజనాలలో ముఖ్యమంత్రి పక్కన కూర్చున్న మహిళకు కరోనా సోకిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.   మరో వంక పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొంటున్న మంత్రులు, ఇతర్ ప్రజా ప్రతినిధులు,  మాస్కులు లేకుండానే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎవరికి వారు, కరోనా అనేది ఒకటుందని, ఈ మహమ్మారి కొన్ని లక్షల ప్రాణాలు బలితీసుకుందనే మాటే మర్చి పోయారు. కరోనా స్పృహ లేకుండా ఎప్పుడో వచ్చే ఎన్నికల కోసం ఇప్పటినుంచే  పరుగులు తీస్తున్నారు. హుజురాబాద్’ లో ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో ఏమో కానీ, అక్కడ అన్ని పార్టీలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఎన్నికల  ప్రచారం సాగిస్తున్నాయి. మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్ధి  ఈటల రాజేందర్‌ కొద్ది రోజులుగా హుజూరాబాద్‌లో ఎన్నికల పాద యాత్ర నిర్వహిస్తున్నరు. ఆయన వెంట పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు పాల్గొంటున్నారు. కరీంనగర్‌ జిల్లాల్లో నమోదయ్యే  కేసుల్లో 30 శాతం హుజూరాబాద్‌ నుంచే వస్తున్నాయి, అంటే ఈటల పాదయాత్ర ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చును. ఇదలా ఉంటే బీజీపే అధ్యక్షడు బండి సంజయ్,కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల, తీన్ మార్ మల్లన్న ... ఇలా చాలా మంది నాయకులు  పాద యాత్రలకు సిద్ధమువుతున్నారు.  నిజానికి, ఈ ఏడాది అక్టోబరు-నవంబరు నాటికి థర్డ్‌ వేవ్‌ వస్తుందని వైద్య శాఖ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొంది. అయితే  పరిస్థితులు ఇలాగే ఉంటే అందాక ఆగదని,  మరో వారం పదిరోజుల్లోనే థర్డ్‌వేవ్‌ తలుపులు తడుతుందని  వైద్యులు, అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవంక బోనాల పండగ సందర్భంగా ఆదివారాలు జనాలు  గుమిగూడుతున్నారు. భక్తుల్లో ఎక్కువ శాతం మంది మాస్క్‌లు ధరించడం లేదు. ఇక మార్కెట్ల విషయం అయితే చెప్పనే అక్కరలేదు. నిజానికి రాష్ట్రంలో గత వరమా పదిరోజులుగా ఆస్పత్రుల్లో కొవిడ్‌ ఇన్‌పేషెంట్లు పెరుగుతున్నాయని గణాంకాలు సూచిస్తున్నాయి. ప్రభుత్వ బులెటిన్‌ ప్రకారమే ఆస్పత్రుల్లో శనివారం ఆక్సిజన్‌పై 1,728 మంది రోగులుండగా, ఆదివారం సాయంత్రానికి ఆ సంఖ్య 1,746కు పెరిగింది. ఐసీయూ పై ఉన్నవారి సంఖ్య 1,324 నుంచి 1,328కి చేరింది. హైదరాబాద్‌లోని అధిక శాతం కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో 15-20 మంది చికిత్స పొందుతున్నారు.కొన్ని ఆసుపత్రులలో ఆ సఖ్య 80 వరకు కూడా ఉందని సమాచారం.  గాంధీ ఆస్పత్రిలో ఈ రోజుకు కూడా రోజుకు 20-30 కొత్త కేసులు నమోదవుతున్నాయి. సో...మహమ్మారి పోలేదు. కాబట్టి  ప్రభుత్వమే కాదు, ప్రజలు కూడా  తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ..థర్డ్ వేవ్ ఇంకెంతో దూరంలో లేదు ... తస్మాత్ జాగ్రత్త అని అధికారాలు హెచ్చరిస్తున్నారు.

టీడీపీకి కొత్త బాస్‌.. ఒక‌రుపోతే ఇంకొక‌రు.. నేత‌ల గ్యారేజ్‌

టీడీపీ. ఇదొక పార్టీ కాదు ఫ్యాక్ట‌రీ. నాయ‌కుల‌ను త‌యారు చేసే కార్ఖానా. నేత‌ల గ్యారేజ్‌. తెలుగుదేశంలో నాయ‌కుల‌కు గానీ, కార్య‌క‌ర్త‌ల‌కు గానీ, అభిమానుల‌కు గానీ కొద‌వేలేదు. పార్టీ నిండా స‌మ‌ర్థ‌వంతులైన నాయ‌కులే. చంద్ర‌బాబు నుంచి గ్రామ టీడీపీ అధ్య‌క్షుని వ‌ర‌కూ.. అంతా నిఖార్సైన నేత‌లే. పార్టీకి లీడ‌ర్ల కొర‌త లేనేలేదు. ఒక‌రు పోతే ఇంకెక‌రు రెడీగా ఉంటారు. అంద‌రూ హేమాహేమీల్లాంటి వారే. ఎవ‌రు ఎవ‌రికీ త‌క్కువేం కాదు. తాజాగా, టీటీడీపీ అధ్య‌క్షుడు ఎల్‌.ర‌మ‌ణ గులాబీ గూటికి చేర‌డంతో.. ఆ వెంట‌నే నేనంటే నేనంటూ టీటీడీపీ ప‌గ్గాల కోసం చాలామంది నాయ‌కులు ప్ర‌య‌త్నించారు. రేసులో ఐదుగురు టాప్ లీడ‌ర్లు నిలిచారు. తెలంగాణ వ్యాప్తంగా ఇంకా టీడీపీకి బ‌ల‌మైన ఓటుబ్యాంక్‌, కేడ‌ర్ ఉంది కాబ‌ట్టే.. ఆ ప‌ద‌వికి అంత డిమాండ్‌. రావుల చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి నుంచి న‌న్నూరి న‌ర్సిరెడ్డి వ‌ర‌కూ చాలా మంది బ‌డా నేత‌లే బ‌రిలో నిలిచారు. చివ‌రాఖ‌రికి పార్టీ అధినేత చంద్ర‌బాబు విస్తృత క‌స‌రత్తు చేసి.. ఓ ద‌ళిత నేత‌కు టీటీడీపీ ప‌గ్గాలు అప్ప‌గించి.. అస‌లైన నాయ‌కుడిగా నిలిచారు. బీసీలు, ద‌ళితుల‌కు టీడీపీనే స‌రైన వేదిక అని నిరూపించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులును నియ‌మించారు పార్టీ జాతీయ అధ్య‌క్షులు చంద్ర‌బాబునాయుడు.  మాదిగ సామాజికవర్గానికి చెందిన బక్కని న‌ర్సింహులు 1994-99లో షాద్‌నగర్‌ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఏళ్లుగా పార్టీని న‌మ్ముకొని ఉన్నారు. పార్టీ అభివృద్ధికి త‌న‌వంతు కృషి చేశారు. ఆయ‌న న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌కుండా.. ద‌ళితుడైన బ‌క్క‌నిని టీటీడీపీ అధ్య‌క్షుడిని చేశారు చంద్ర‌బాబు. పార్టీ కోసం చిత్త‌శుద్ధిగా ప‌ని చేసే ఎలాంటి నాయ‌కుడికైనా ఏదో ఒక రోజు మంచి ప‌ద‌వులు ఖాయ‌మ‌నే మెసేజ్ ఇచ్చారు.  తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించినందుకు చంద్రబాబుకు బక్కని నర్సింహులు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైన సందర్భంగా బక్కని నర్సింహులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నర్సింహులును అభినందించిన లోకేష్.. సమస్యల పరిష్కారం కోసం ప్రజల పక్షాన పోరాటం చేయాలని పిలుపిచ్చారు. 

పార్లమెంట్ కు వెళ్లకుండా కేసీఆర్ కుట్ర.. స్పీకర్ కు రేవంత్ రెడ్డి ఫిర్యాదు

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం హౌజ్ అరెస్ట్ చేయడం దుమారం రేపుతోంది. తనను హౌజ్ అరెస్ట్ చేయడంపై లోక్‌సభ స్పీకర్‌కు ఎంపీ రేవంత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాకుండా అడ్డుకుని తన హక్కులకు భంగం కలిగించారంటూ ఆయన  ఫిర్యాదు చేశారు.  రంగారెడ్డి జిల్లా కోకాపేట భూములకు ఇటీవల తెలంగాణ సర్కార్ నిర్వహించిన వేలం తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. సీఎం కేసీఆర్ తన బినామీలకు ఖరీదైన  భూములను చవక ధరకే కట్టబెట్టేందుకే వేలం నిర్వహించారని ఆరోపిస్తోంది కాంగ్రెస్.కోకాపేట భూముల విషయంలో జరిగిన అక్రమాలపై పార్లమెంట్ తొలి సమావేశంలో ప్రభుత్వ అక్రమాలపై ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రభుత్వ భూములు అమ్మకాలల్లో వెయ్యి కోట్లు అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావ్, సీఎస్ సోమేశ్ కుమార్, సిద్దిపేట కలెక్టర్ లపై ఫిర్యాదు చేస్తానని చెప్పారు.  ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి తొలి రోజు పార్లమెంట్ కు వెళ్లకుండా ఇంటిముందు పోలీసులు అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. పార్లమెంట్ లో కేసీఆర్ అవినీతిని భయటపెడతారనే భయంతోనే ఢిల్లీకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని మండిపడుతున్నారు. దీనిపైనే లోక్ సభ స్పీకర్ కు రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. భూముల వేలంలో జరిగిన అక్రమాలను లోక్ సభలో ప్రస్తావిస్తానని చెప్పడం వల్లే తనను అడ్డుకుంటున్నారని చెప్పారు. లోక్ సభ సభ్యుడిగా తనకున్న హక్కులను తెలంగాణ సర్కార్ హరిస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.  తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద ఈ తెల్లవారుజామున మూడు గంటల నుంచి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. భారీగా రేవంత్ ఇంటి దగ్గరకు చేరుకున్న పోలీసులు.. ఆయన్ను  గృహ నిర్బంధం చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి నుంచి ఎవరూ కదలకుండా అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క‌, పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్ గౌడ్, రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు నరసింహారెడ్డి తదితరులను కూడా పోలీసులు గృహనిర్బంధం చేశారు.

రేవంత్‌రెడ్డి ఖ‌త‌ర్నాక్ స్కెచ్‌.. కేసీఆర్‌కు దిమ్మ‌తిరిగే షాక్‌..

టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. ఆయ‌న ఏం మాట్లాడినా, ఏం చేసినా.. దానికో లెక్కుంటుంది. దాని వెన‌క కేసీఆర్‌ను ఇర‌కాటంలో ప‌డేసే స్కెచ్ ఉంటుంది. రేవంత్ మాట‌లు, చేష్ట‌లూ అన్నీ వ్యూహాత్మ‌క‌మే. కేసీఆర్ ఊహ‌ల‌కు అతీత‌మే. తాజాగా, తెలంగాణ స‌ర్కారును ఇర‌కాటంలో ప‌డేసేలా మ‌రో ఉచ్చు ప‌న్నారు ఎంపీ రేవంత్‌రెడ్డి. పోలీసులు వ‌చ్చి స‌రిగ్గా ఆ ఉచ్చులో చిక్కారు. ఇప్పుడు లాక్కోలేక‌, గింజుకోలేక గిల‌గిల్లాడుతున్నారు. స‌రైన స‌మ‌యం, సంద‌ర్భం చూసి రేవంత్ ప‌న్నిన ఆ ప‌న్నాగంలో చిక్కుకోవ‌డంతో తెలంగాణ స‌ర్కారుకు మైండ్ బ్లాంక్ అవుతోంది. రంగారెడ్డి జిల్లా కోకాపేట భూముల వేలంలో వెయ్యి కోట్ల స్కాం జ‌రిగిందంటూ రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వంలో కాంగ్రెస్ పార్టీ ఆందోళ‌న‌లు చేస్తోంది. సీఎం కేసీఆర్ తన బినామీలకు వేలంలో ఖరీదైన  భూములను చవక ధరకే కట్టబెట్టారంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో కోకాపేటలో ధర్నాకు పిలుపిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు కాంగ్రెస్ నేతల ముందస్తు హౌజ్ అరెస్టుల‌కు దిగారు. ఇందులో భాగంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని సైతం జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంట్లో గృహ నిర్భందం చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఇలా జ‌రుగుతుంద‌ని రేవంత్‌రెడ్డికి ముందే తెలుసు. అందుకే, ఆయ‌న వ్యూహాత్మ‌కంగా పార్ల‌మెంట్ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యే రోజునే.. కోకాపేటలోఉ ధ‌ర్నాకు పిలుపిచ్చారు. పోలీసులు త‌న‌ను హౌజ్ అరెస్ట్ చేయ‌డంతో.. తాను పార్ల‌మెంట్ స‌మావేశాల‌కు వెల్ల‌కుండా తెలంగాణ‌ పోలీసులు త‌న‌ను అడ్డుకున్నారంటూ ఢిల్లీ స్థాయికి స‌ర్కారును ఇర‌కాటంలో ప‌డేశారు.  తనను హౌజ్ అరెస్ట్ చేయడంపై లోక్‌సభ స్పీకర్‌కు ఎంపీ రేవంత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాకుండా అడ్డుకుని తన హక్కులకు భంగం కలిగించారంటూ రేవంత్ ఆరోపించారు. ఆ మేర‌కు లోక్‌స‌భ స్పీక‌ర్ ఓంబిర్లాకు లేఖ రాశారు ఎంపీ రేవంత్‌రెడ్డి. ఇదేమీ చిన్న విష‌యం కాదు. ఒక ఎంపీని పార్ల‌మెంట్‌కి రాకుండా అడ్డుకోవ‌డ‌మంటే.. అది పార్ల‌మెంట్‌పై జ‌రిగిన దాడిగానే భావిస్తారు. ఈ ఘ‌ట‌న‌ను చాలా సీరియ‌స్‌గా తీసుకుంటారు. ఈ విష‌యం ఆల‌స్యంగా గుర్తించిన కేసీఆర్ స‌ర్కారు ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచ‌ని ప‌రిస్థితిలో ప‌డిపోయింది. ఎక్క‌డ పార్ల‌మెంట్ ముందు దోషిగా నిల‌బ‌డాల్సి వ‌స్తుందోన‌ని తెగ ఇదైపోతోంది.  రేవంత్‌రెడ్డిని హౌజ్ అరెస్ట్ చేయ‌క‌పోతే కోకాపేటలో ధ‌ర్నాకు దిగి స‌ర్కారును ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తారు.. ఆయ‌న కోకాపేట వెళ్ల‌కుండా గృహ నిర్బంధం చేస్తే.. త‌న‌ను పార్ల‌మెంట్ స‌మావేశాల‌కు వెళ్ల‌కుండా అడ్డుకున్నారంటూ నేరుగా స్పీక‌ర్‌కే ఫిర్యాదు చేశారు. ఇలా ఎలాగైనా స‌ర్కారును ఇర‌కాటంలో ప‌డేసేలా.. రేవంత్‌రెడ్డి వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. అర‌క‌త్త‌ర‌లో పోక‌చెక్క మాదిరి త‌యారైంది ప్ర‌భుత్వ ప‌రిస్థితి. రేవంత్‌రెడ్డి దెబ్బ‌కు దిమ్మ‌తిరిగి మైండ్‌బ్లాంక్ అవుతోంది.    

బీజేపీ మంత్రి సెల్ఫీల వ్యాపారం.. సెల్ఫీ కి వంద.. 

దేశంలో అన్ని రాజకీయ పార్టీల విధానాలు వేరుగా ఉంటాయి.. వాటి సిద్ధాంతాలు వేరు.. వారి వారి నినాదాలు వేరు.. ఇలా ఎవరి విధానాలు, ఎవరి సిద్ధాంతాలు, ఎవరి పంచాయితీలు వేరైతే.. వాటన్నింటికి వ్యతిరేకంగా బీజేపీ పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి. బీజేపీ నాయకులు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో తెలియదు గానీ మినిమమ్ అవగాహనా లేకుండా చేస్తారు.. అమ్మాయిలకు బాల్యవివాహాలు చెయ్యాలి.. ఈ దేశంలో ఉండాలంటే వందేమాతరం పడాల్సిందే అని మాట్లాడుతారు చివరికి వాళ్ళకే పడడానికి రాదు. ఇక దళితులు మనుషులు కాదు అన్నట్లు మాట్లాడుతారు.. ఇలాంటి కామెంట్స్ చేయడం ఒక్క బీజేపీకి మాత్రమే చెల్లుతుంది.  ఇక తాజాగా ఒక బీజేపీ మహిళా మంత్రి ఒక వినుతన మైన విధానానికి తెరలేపింది. అదేంటో తెలుకుసోవాలనుకున్నారా.. అయితే పదండి బీజేపీ నాయకుల వింత పోకడలు చూద్దాం..  ఎక్కడైనా, ఎప్పుడైనా  ప్రముఖులు, నాయకులు ఎవరైనా కనిపిస్తే.. చాలామంది వారితో ఫొటోలు, సెల్ఫీలు దిగడం కామన్.. ఇలాంటి సందర్భాల్లో అది వాళ్ళు కూడా స్వాగతిస్తారు. ఈమె బీజేపీ పార్టీ మంత్రి కదా కొంచం కాస్ట్ ఎక్కువ.. మనం వంద రూపాయలు వస్తువు కొంటే అనవసరంగా మన చేతి నుండి కట్టించుకునే జీఎస్టీ ఫైన్ లాగా  ఇంకా చెప్పాలంటే ఇప్పుడు పెరిగిన పెట్రోల్ ధరల లాగే..బీజేపీ నాయకులు చాలా కాస్ట్..   అయితే ఇలాంటి సందర్భాల్లో నాయకులు కొన్ని గంటల సమయం కూడా వెచ్చించాల్సి ఉంటుంది. అయితే.. తరచూ ఇలాంటి సమస్య ఎదురవుతుందని మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వంలోని మహిళా మంత్రి కొంచెం వినూత్నంగా ఆలోచించి అభిమానులు, పార్టీ కార్యకర్తలకు షాకిచ్చారు. రూ.100 ఇచ్చి తనతో సెల్ఫీ దిగవచ్చంటూ ఆమె పేర్కొన్నారు.  ఈ మేరకు శనివారం మధ్యప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి ఉషా ఠాకూర్ బహిరంగ ప్రకటన చేశారు. ఈ మేరకు ఉషా ఖండ్వాలో మీడియాతో మాట్లాడారు. సెల్ఫీలు తీసుకోవడానికి చాలా సమయం తీసుకుంటుందంటూ ఆమె పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు గంటల కొద్ది ఆలస్యం అవుతుండటంతో.. పార్టీ పరంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చానని పేర్కొన్నారు. ఎవరైతే సెల్ఫీలు తీసుకుంటారో వారు స్థానిక పార్టీ యూనిట్‌ కోశాధికారికి రూ.100 జమ చేయాలంటూ పేర్కొన్నారు. ఇలా సమకూరిన నగదును పార్టీ పనుల కోసం వినియోగించుకోవచ్చని ఆమె వెల్లడించారు. దీంతోపాటు తనను బహిరంగ కార్యక్రమాలకు పిలిచే వారు పుష్పగుచ్ఛాలకు బదులు పుస్తకాలు ఇవ్వాలని మంత్రి ఉషా ప్రజలకు సూచించారు. అలా అందిన పుస్తకాలతో పార్టీ కార్యాలయంలో లైబ్రరీని ఏర్పాటు చేయవచ్చంటూ అభిప్రాయపడ్డారు. కాగా.. ఈ బీజేపీ మంత్రి ఇటీవల పలు సంచలన వ్యాఖ్యలు సైతం చేశారు. రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ప్రజలు పీఎం కేర్స్‌ నిధి కోసం రూ.500 విరాళంగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రజల దగ్గర పన్నుల రూపంలో తీసుకుంటున్నది చాలదు అన్నట్లు.. మళ్ళీ కొత్త అవతారం ఎత్తారు మంత్రి గారు.. నియోజకవర్గానికి వచ్చే ఫండ్ తో కూడా చేయవచ్చు.. ఆమె ఆలా అన్నది అంటే నియోజక వర్గానికి వచ్చే ఫండ్స్ ఎక్కడికి పోతున్నట్లు.. 

జ‌గ‌న్‌కు నిరుద్యోగ సెగ‌.. తాడేప‌ల్లి ప్యాలెస్ ముట్ట‌డితో ఉద్రిక్త‌త‌..

క‌రోనా కేసులు త‌గ్గాయి. ఆంక్ష‌లు స‌డ‌లిపోయాయి. ఇప్పుడిక సీఎం జ‌గ‌న్‌పై ప్ర‌జ‌ల్లో ఉన్న ఆగ్ర‌హ‌జ్వాల ఎగిసిప‌డుతుంది. ఇన్నాళ్లూ క‌రోనా భ‌యంతో ప్ర‌జ‌లు రోడ్ల మీద‌కు రాలేదు. జ‌గ‌న్ స‌ర్కారుపై ఉద్య‌మాలు చేయ‌లేదు. అదంతా త‌మ ప్ర‌భుత్వ గొప్ప‌త‌న‌మంటూ గొప్ప‌లు పోయింది గ‌వ‌ర్న‌మెంట్‌. క‌రోనా భ‌యం పోవ‌డంతో.. ఇప్పుడిక అస‌లైన ప్ర‌జాగ్ర‌హం వెల్లువెత్తుతోంది. గ‌డిచిన కొన్ని రోజులుగా నిత్యం ఏదో ఒక అంశంపై ఆంధ్ర‌ప్రదేశ్ వ్యాప్తంగా ఆందోళ‌న‌లు ర‌గులుతూనే ఉన్నాయి.  తాజాగా జాబ్ క్యాలెండ‌ర్‌పై విద్యార్థి సంఘాలు ఏకంగా సీఎం జ‌గ‌న్ నివాసాన్నే చుట్టుముట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌ను నిరసిస్తూ వివిధ యువజన, విద్యార్థి సంఘాలు చేపట్టిన ‘చలో తాడేపల్లి’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. తాడేపల్లి పాత టోల్‌గేట్‌ కూడలి ద‌గ్గ‌ర‌ ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఇరువ‌ర్గాల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జ‌రిగింది.  జాబ్‌ క్యాలెండర్‌లో ఉద్యోగాల సంఖ్యను పెంచాలంటూ విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.   విద్యార్థి సంఘాల నేత‌ల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిరసనకారులను గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిరుద్యోగుల ఆందోళన నేపథ్యంలో సీఎం నివాసానికి వెళ్లే మార్గంలో ముగ్గురు ఎస్పీలు, డీఎస్పీలు సహా సుమారు వెయ్యి మంది పోలీసులు మోహరించారు. సీఎం ఇంటి వైపు వెళ్లే అన్ని మార్గాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.     ‘చలో తాడేపల్లి’ కార్యక్రమానికి అనుమతి నిరాకరించిన పోలీసులు.. ఆదివారం నుంచే రాష్ట్ర‌వ్యాప్తంగా అరెస్టుల ప‌ర్వానికి తెర‌తీశారు. చ‌లో తాడేప‌ల్లికి అమరావతి దళిత ఐకాస‌ మద్దతు తెలిపడంతో.. జేఏసీ నేతలను ఇళ్లలోనే నిర్బంధించారు పోలీసులు. డ్రోన్‌ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు.   

అప్పుకు ఇంటికి వెళ్లిన మహిళపై..

అప్పు అనే మాట బలవంతుడికి మరింత బలాన్ని చేకూరిస్తే.. బలహీనుండి మరింత బలహీనుడ్ని చేస్తుంది. అప్పు ఎప్పటికి ముప్పే అంటారు. అది నిజమే ఎక్కడి నుండి వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియని అలలాంటిది అప్పు అనేది. ఈ సమాజం లో కొంత మంది దుండగులు ఇచ్చిన అప్పును అడ్డు పెట్టుకుని ఆడవాళ్ళను కమిట్ మెంట్ కూడా అడుగుతుంటారు. వాడి వాంఛ తీరిస్తేనే అప్పులు పడుతుంది లేదంటే పస్తులు తప్పవు.. తాజాగా అప్పు అడిగిన యువతిపై దారుణంగా ప్రవర్తించాడో కామాంధుడు. అప్పుకోసం ఇంటికి వచ్చిన యువతిపై అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. ఆ యువతి ప్రతిఘటించడంతో రెచ్చిపోయాడు. అద్దు అదుపులేకుండా ప్రవర్తించాడు. కోపంతో ఆమె ముఖాన్ని గోడకేసి కొట్టాడు. ఆ అమ్మాయి అరవడంతో స్థానికులు వస్తారని ముందే ప్రసిగట్టిన ఆ గుంట నక్క చివరిగా ఆమె కంఠం కొరికి అక్కడి నుండి  పరారయ్యాడు. యువతి కేకలు విన్న స్థానికులు కుటుంబ సభ్యులకు తెలపడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి కుడికన్ను పూర్తిగా దెబ్బతింది. ఈ దారుణ ఘటన తూర్పుగోదావరి జిల్లా కరపలో చోటు చేసుకుంది. ఈనెల 13న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కరప మండలానికి చెందిన ఓ యువతి తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటుంది. పొట్టకూటి కోసం స్థానికంగా దుకాణం నడుపుతుంది.   అవసరం ఎంత పని అయినా చేయిస్తాడు అన్నట్లు. ఈనెల 13న స్థానికంగా ఉండే విత్తనాల రమేష్‌ను రూ.2 వేలు అప్పు అడిగింది. అదే అదునుగా చేసుకుని రమేష్ కాసేపటి తరువాత రమ్మని చెప్పడంతో తెలిసిన వ్యక్తే అని వెళ్లింది. రాత్రి ఇంటికి వెళ్లిన ఆమెపై అత్యాచారయత్నానికి యత్నించగా తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో కోపోద్రిక్తుడైన రమేశ్ కోపంతో ఆమె పీక నొక్కి గోడకు అదిమి విచక్షణారహితంగా కొట్టాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో ఎడమ చేతిని విరిచి కంఠాన్ని కొరికాడు. చివరకు మెడ పట్టుకుని ముఖాన్ని గోడకు బలంగా కొట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం బాధితురాలు అపస్మారకస్థితిలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుడి కన్ను పూర్తిగా దెబ్బతిందని చెప్పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు కరప ఎస్సై డి.రమేష్‌బాబు తెలిపారు. సహాయం అని వస్తే గాయాలు చేద్దాం అనే ఇలాంటి సమాజంలో బతుకుతున్నందుకు చాలా సిగ్గుపడాలి. 

ప్రేమ పేరుతో  బ్లాక్ మెయిల్.. 

ప్రేమ అనేది ఒక్కపుడు పెద్ద ఆయుధం.. ప్రేమ ఉంటే ఏదైనా జయిచొచ్చు అనే నమ్మకం ఉండేది ఒకప్పుడు .. ఇప్పుడు అదే ప్రేమ ఆయుధం చెడుకు వాడడానికి ఉపయోగించుకుంటున్నారు నేటి తరం యువత. ప్రేమ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ప్రేమ పేరుతో ఓ బాలికకు మాయమాటలు చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించాడు. అక్కడితో ఆగక ఆమె పై  పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడితో ఆగకుండా వాళ్ళు ఏకాంతంగా గడిపిన సమయంలో వీడియోలను చిత్రీకరించాడు. ఆ తర్వాత తల్లిదండ్రులకు చూపించి లక్షలు వసూళ్లు చేశాడు. అనంతరం అక్కను మభ్యపెట్టి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిలకలూరిపేటకు చెందిన ఓ బాలిక రెండేళ్ల క్రితం చేబ్రోలులో ఉంటున్న తమ బంధువుల ఇంటికి వెళ్లింది. అదే గ్రామానికి చెందిన వేములపల్లి జోష్‌బాబు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ప్రేమ పేరుతో ముగ్గులోకి దించాడు.  ఆమెకు మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బయట పెడితే చంపేస్తానని ఆమెను బెదిరించాడు. అంతేకాదు ఆమెతో ఏకాంతంగా ఉన్న ఫోటోలు, వీడియోలను అడ్డుగా పెట్టుకుని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆమె కుటుంబ సభ్యులకు చూపించి బ్లాక్‌మెయిల్ చేశాడు. తనకు డబ్బులు ఇవ్వకపోతే వీడియోలు బయటపెడతానని బెదిరించి రూ.3.30 లక్షలు వసూళ్లు చేశాడు. అంతటితో ఆగకుండా ఆ బాలిక అక్కను మభ్యపెట్టి రహస్యంగా పెళ్లిచేసుకున్నాడు. మభ్యపెట్టి పెళ్లి చేసుకున్న విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడికోసం గాలిస్తున్నారు. ఇకపోతే నిందితుడు జోష్‌బాబు పొన్నూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నట్లు ఎస్ఐ కోటేశ్వరరావు తెలిపారు.

కెప్టెన్ కాదన్నా సిద్దూకే పగ్గాలు.. రేవంత్ రెడ్డిని ఫాలో అవుతారా..

కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మరో కీలక, సాహసోపేత  నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పంజాబ్ పీసీసీ అధ్యక్షునిగా మాజీ క్రికెటర్‌, మాజీ మంత్రి  నవజోత్‌సింగ్‌ సిద్ధూ నియమించారు. అలాగే,త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, అన్నివర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా  నలుగురు వర్కింగ్‌ ప్రెసిడెంట్లను కూడా అప్పాయింట్ చేశారు. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ వర్గం చివరి క్షణం వరకూ సిద్దూ నియామకాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. పది మంది ఎమ్మెల్యేలు సిద్ధూ వద్దంటూ బహిరంగ ప్రకటన  చేశారు. అంతే కాదు, పంజాబ్ నుంచి ఎన్నకైన 11 ఎంపీలలో తొమ్మింది మంది, మాజీ  పీసీసీ అధ్యక్షుడు ప్రతాప్ సింగ్ బజ్వా నివాసంలో కలిసి, సిద్ధూ ఎందుకు వద్దో వివరించేందుకు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అప్పాయింట్మెంట్ కోరారు. అలాగే, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు సునీల్ ఝాకర్,  అధిష్ఠానం పంజాబ్ పీసీసీ అధ్యక్షునిగా ఎవరిని నియమించినా అభ్యంతరం లేదని, అయితే కొత్త అధ్యక్షుడు అందరికీ అమోదయోగ్య వ్యక్తీ అయి ఉండాలని తీర్మానం చేసే ఉద్దేశంతో  సోమవారం పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ పరిణామాలను గమనించిన అధిష్టానం ఇంకా జాప్యంచేయడం మంచిది కాదని, ఆలస్య జరిగిన కొద్దీ అనర్ధాలను కొని తెచ్చుకోవడమే అవుతుందని నిర్ణయాన్ని ప్రకటించింది.  అందుకే సిద్దూ వ్యతిరేక శిబిరం తమ ప్రయత్నాలలో తాముండగానే,  కాంగ్రెస్ అధిష్ఠానం, ‘తాంబూలాలు ఇచ్చేశాంతన్నుకు చావండి’ అన్న రీతిలో సిద్దూను పంజాబ్ పీసీసీ చీఫ్ గా ప్రకటించింది. అయితే, ముఖ్యమంత్రి మొదలు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు వరకు మెజారిటీ నాయకులు  వ్యతిరేకించినా కాంగ్రెస్ అధినాయకత్వం సిద్దూను పీసీసీ చీఫ్’గా నియమించడం రాజకీయ వర్గాల్లో ఒక రకంగా విస్మయాన్ని కలుగ చేసింది. అయితే, సిద్దూకు రాహుల్ గాంధీ ఇచ్చిన హమీ మేరకే, ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.  ఒక విధంగా చూస్తే, తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించడంలో అనుసరించిన ఫార్ములానే పంజాబ్ విషయంలోనూ కాంగ్రెస్ అధిష్ఠానం అనిసరించిందని పరిశీలకులు భావిస్తున్నారు. ఎప్పుడొచ్చారు అనేది కాదు, కొత్త రక్తంతో  పార్టీలో జవసత్వాలు నింపడమే ప్రధానంగా రాహుల్ గాంధీ భావిస్తున్నారని అందుకే,  దూకుడుగా పార్టీని ముందుకు తీసుకు పోయేశక్తి సామర్ధ్యాలున్న రేవంత్ రెడ్డి, సిద్దూలాంటి ఉండుకు రక్తానికి ప్రాధాన్యత  ఇస్తున్నారని అంటున్నారు.  రేవంత్ రెడ్డి దూకుడుగా వెళుతూనే పార్టీ సీనియర్లను కలుపుకు పోయేందుకు, ప్రయత్నించారు, చాల వరకు సఫలమయ్యారు. రేవత్ నియామకాన్ని బహిరంగంగా వ్యతిరేకించిన వీహెచ్ వంటి నాయకులు కూడా ఇప్పుడు కూల్ అయి పోయారు.  సొంతపార్టీలోని సేనియర్ నాయకులనే కాకుండా ఇతర పార్టీలలో ఉన్న దేవేందర్ గౌడ్ వంటి అనుభవజ్ఞులను కూడా రేవంత్ కలుపుకు పోయే ప్రయత్నం చేస్తున్నారు. మరి సిద్దూ కూడా రేవంత్’ను ఫాలో అవుతారా, ముఖ్యమంత్రి మరీందర్  సింగ్ ఆయన వర్గాన్ని కలుపుకు పోతారా? అలాగే, అమరీందర్ సింగ్ వర్గం, గతం గతః, అయిపోయిందేదో అయి పోయిందని ... సిద్దూతో చేతులు కలుపుతారా? చూడవలసి వుంది. అయితే, కాంగ్రెస్ పార్టీలో ఎంతగా కొట్టుకుంటే అంతగా కలిసిపోయే కల్చర్ ఎప్పటి నుంచో వుంది . సో .. తెలంగాణలో రేవంత్ లానే పంజాబ్ లో సిద్దూ సక్సెస్ అవుతారని అనుకోవచ్చును.

వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెడితే ఎన్ కౌంటర్?

కృష్ణా జిల్లాలో అధికార వైసీపీ నేతలు రెచ్చిపోయారు. సోషల్‌ మీడియాలో వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారంటూ  దళిత యువకులపై అరాచకానికి దిగారు. వైసీపీ నేతలు దౌర్జాన్యానికి దిగినా.. పోలీసులు పట్టించుకోలేదని, బాధితుడినే డీఎస్పీ హెచ్చరించారనే ఆరోపణలు వస్తున్నాయి. నూజివీడులో వెలుగులోనికి వచ్చిన ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది.  సోషల్‌ మీడియాలో తమకు  వ్యతిరేకంగా పోస్టులు పెట్టారంటూ నూజివీడుకు చెందిన దళిత యువకులను వైసీపీ నేతలు కిడ్నాప్‌ చేసి, విచక్షణారహితంగా కొట్టారు. బాధితుల ఫిర్యాదును పట్టించుకోని పోలీసులు... వైసీపీ నేతల మాట మేరకు బాధిత దళిత యువకులపైనే కేసు పెట్టేందుకు సిద్ధమయ్యారు.  ఎంపీ రఘురామకృష్ణం రాజును కస్టడీలో కొట్టారంటూ హ్యూమన్ రైట్స్ కి ఫిర్యాదు చేసిన దళిత యువకుడు మణిరత్నంను దొంగ కేసులు పెట్టి, మళ్ళీ ఫోన్ పట్టుకుంటే ఎన్ కౌంటర్ చేస్తానని నూజివీడు DSP బెదిరించారని చెబుతున్నారు.  నూజివీడు మండలం బోర్వంచకు చెందిన బేతమాల మణిరత్నం... ఎంపీ రఘురామకృష్ణరాజుపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన విషయంపై ఎన్‌హెచ్‌ఆర్సీకి మే 14న ఫిర్యాదు చేశాడు. ఎంపీ రఘురామ కృష్ణంరాజు కస్టడీలో ఉన్నప్పుడు కొట్టారు.. ఒక ఎంపీకే ఈ పరిస్థితి ఉంటే సామాన్యుని పరిస్తితి ఏంటి అని తన ఫిర్యాదులో ప్రస్తావించారు. మణిరత్నం ఫిర్యాదుపై వెంటనే స్పందించిన కమిషన్‌... రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. వెంటనే కంగుతిన్న పోలీసులు ఈ కంప్లెయింట్ ఇచ్చింది ఎవరా అని అరా తీసి నూజివీడుకు చెందిన మణిరత్నం అని తెలుసుకున్నారు. అప్పటి నుంచి వైసీపీ శ్రేణులు మణిరత్నంపై బెదిరింపులకు దిగాయి.  శనివారం రాత్రి నూజివీడు టీడీపీ పార్టీ కార్యాలయం నుంచి ఇంటికి వెళ్తున్న దళిత యువకుడు మణిరత్నం, అతడి స్నేహితుడు నాగబాబుని వైసీపీకి చెందిన పిళ్లా చరణ్‌, నత్తా నాగేశ్వరరావు, మరి కొందరు కార్యకర్తలు కిడ్నాప్‌ చేశారు. నూజివీడులోని నెహ్రూపేట తీసుకువెళ్లి విచక్షణా రహితంగా కొట్టినట్టు బాధితులు ఆరోపించారు. దీనిపై బాధితులు స్థానిక టీడీపీ నేతలు పోలీసులకు సమాచారం అందించారు. అయితే స్థానిక పోలీసులు కూడా వైసీపీ నేతలకు వత్తాసు పలికారని బాధితులు ఆరోపించారు. దీంతో విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో అదుపులోకి తీసుకున్న టీడీపీ కార్యకర్తలను స్టేషన్‌ బెయిల్‌పై వదిలేశారు.అయితే దాడికి పాల్పడిన వైసీపీ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వైసీపీ ముష్కరులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. నూజివీడులో టీడీపీ కార్యకర్తలు మణి, నాగబాబులపై వైసీపీ గూండాలు దాడి చేశారని ఆరోపించారు. నూజివీడు ఘటనలో నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.   

రేవంత్ రెడ్డి హౌజ్ అరెస్ట్.. కోకాపేట భూములపై ఫైట్.. 

రంగారెడ్డి జిల్లా కోకాపేట భూముల వేలం తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. సీఎం కేసీఆర్ తన బినామీలకు ఖరీదైన  భూములను చవక ధరకే కట్టబెట్టేందుకే వేలం నిర్వహించారని ఆరోపిస్తున్న కాంగ్రెస్.. కోకాపేటలో ధర్నాకు పిలుపిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు కాంగ్రెస్ నేతలను ముందస్తుగా హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని గృహ నిర్భందం చేయడంతో జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.  తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద ఈ తెల్లవారుజామున మూడు గంటల నుంచి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రేవంత్‌ను గృహ నిర్బంధం చేసిన పోలీసులు ఆయన ఇంటి వద్ద భారీగా మోహరించారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి నుంచి ఎవరూ కదలకుండా అడ్డుకుంటున్నారు. పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్ గౌడ్, రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు నరసింహారెడ్డి తదితరులు కూడా కోకాపేట భూముల సంద్శనకు వెళ్లడానికి సమాయత్తమయ్యారు.  భూముల సందర్శనకు వెళ్లే నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు పోలీసులు.  కోకాపేట భూముల విషయంలో జరిగిన అక్రమాలపై పార్లమెంట్ తొలి సమావేశంలో ప్రభుత్వ అక్రమాలపై ఫిర్యాదు చేస్తానని ఇటీవల ప్రకటించారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వ భూములు అమ్మకాలల్లో వెయ్యి కోట్లు అక్రమాలు జరిగాయని..  ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావ్, సీఎస్ సోమేశ్ కుమార్, సిద్దిపేట కలెక్టర్ లపై ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి తొలి రోజు పార్లమెంట్ కు వెళ్లకుండా ఇంటిముందు పోలీసులు అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

హుజురాబాద్ లో కేసీఆర్ సూపర్ స్కెచ్.. 

తెలంగాణ రాజకీయాలన్ని ప్రస్తుతం హుజారాబాద్ కేంద్రంగానే సాగుతున్నాయి. టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఈటల రాజేందర్ ను తన సొంత నియోజకవర్గంలో గెలిచి కేసీఆర్ కు షాకివ్వాలని భావిస్తున్నారు. ఈటలను ఓడించేందుకు గులాబీ బాస్ వ్యూహాలు రచిస్తున్నారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకంలో కాంగ్రెస్ కూడా రేసులోకి వచ్చింది. మూడు ప్రధాన పార్టీల ఫోకస్ అంతా ఇక్కడే ఉండటంతో హుజురాబాద్ రాజకీయ సమీకరణలు రోజురోజుకు మారిపోతున్నాయి. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో విజేతగా నిలబడే పార్టీనే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక అత్యంత కీలకం కావడంతో సీఎం కేసీఆర్ సూపర్ స్కెచ్ వేశారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయబోతున్న దళిత సాధికారత పథకానికి.. "తెలంగాణ దళిత బంధు" అనే పేరును ఖరారు చేసిన కేసీఆర్.. ఆ పథకాన్ని మొదటగా  పైలట్ ప్రాజెక్టు కింద హుజురాబాద్ నియోజకవర్గంలో అమలు చేయాలని నిర్ణయించారు.  ప్రాంరంభోత్సవ తేదీని త్వరలో ప్రకటించనున్నారు. కేసీఆరే హుజురాబాద్ లో ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు.  దళిత బంధు అమలు కోసం హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్నిమండలాల్లోని దళిత కుటుంబాల  వివరాల స్థితి గతులను తెలుసుకుంటారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని హుజూరాబాద్ మండలంలోని 5,323 దళిత కుటుంబాలు, కమలాపూర్ మండలంలోని  4346 కుటుంబాలు, వీణవంక మండలం లో 3678 కుటుంబాలు, జమ్మికుంట మండలంలో 4996 కుటుంబాలు , ఇల్లంతకుంట మండలం లో 2586 కుటుంబాలు ఉన్నాయి.  మొత్తంగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని 20,929 దళిత కుటుంబాలనుంచి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఎంపిక చేయబడిన లబ్ధిదారు కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని పరిపూర్ణస్థాయిలో వర్తింప చేస్తారు.   దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ నుంచి ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించడంపై విపక్షాలు విమర్శలు చేస్తున్నారు. హుజారాబాద్ లో గెలవడం కష్టమని తేలడంతో కొత్త ఎత్తులు వేస్తున్నారని చెబుతున్నారు. హుజురాబాద్ లో కొన్ని కుటుంబాలకు సాయం చేసి ఓట్లు దండుకుంటారని, తర్వాత ఆ స్కీంను ఆపివేస్తారని అంటున్నారు. గతంలో దళితులకు మూడు ఎకరాల భూపంపిణి విషయంలోనూ ఇదే జరిగిందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. దళితకు కొత్త పథకం ప్రకటించినప్పుడే తాము హుజురాబాద్ కోసమే ప్రకటించారని చెప్పామని, ఇదే ఇప్పుడు నిజమైందని అంటున్నారు.  మరోవైపు టీఆర్ఎస్ నేతలు మాత్రం విపక్షాల ఆరోపణలను ఖండిస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో అనేక కార్యక్రమాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లానుంచే ప్రారంభించారని చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమానికి నాందిగా నిర్వహించిన సింహగర్జన సభ మొదలుకొని, తాను ఎంతగానో అభిమానించిన రైతు బీమా పథకం దాకా కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభించారని అంటున్నారు. ప్రతిష్టాత్మకమైన రైతుబంధు పథకం హుజూరాబాద్ కేంద్రంగానే మొదలైందని...అదే ఆనవాయితీని సిఎం  కొనసాగిస్తూ ‘తెలంగాణ దళిత బంధు’ పథకాన్ని కూడా హుజూరాబాద్ నుంచే ప్రారంభించాలని నిర్ణయించారని స్పష్టం చేస్తున్నారు గులాబీ నేతలు.