బతికుండగానే చంపేశారు.. బీమా‌ కాజేశారు

డబ్బుల కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తున్నారు. కొంత మంది అధికారులు అక్కడ ఇక్కడ అని కాదు ఎక్కడ డబ్బులు  దొరికితే అక్కడ నోకేస్తున్నారు. చివరికి వారికి  దేశానికి అన్నం పెట్టె రైతన్నలు కూడా బలవుతున్నారు. రైతులు అకాల మరణం తో చనిపోయిన వారి  కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశం లో ఎక్కడ లేని విధంగా రైతు భీమా పథకాన్ని తీసుతుకువచ్చారు. ఆ డబ్బుల కోసం కొంత మంది అధికారులు  గోతికాది నక్కలా ఎదురుచూస్తున్నారు.  బతికి ఉన్న రైతు పేరిట రైతుభీమా మంజూరైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసి సంచలనంగా మారింది. చివరికి ఇలా కూడా  అధికారులు మోసాలకు పాలుపడుతున్నారు. చనిపోయాక వచ్చే డబ్బుల కోసం చివరికి ప్రతికి ఉన్న మనుషులను చనిపోయారని పత్రాలు ద్రువీకరిస్తున్నారు.  తాజాగా వికారాబాద్ లో  బీమా కోసం జరిగిన ఓ ఘరానా మోసం వికారాబాద్‌ జిల్లాలో వెలుగు చూసింది. అయితే తాజాగా ఆమె చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ రావడం ఆశ్చర్యపరిచింది. ఎందుకు ఆమెను చంపేశారు అంటే.. రైతు భీమా పథకం కింద వచ్చే ఐదు లక్షలు కోసం. మృతిచెందిన రైతుల  కుటుంబానికి సహాయపడడానికి ప్రభుత్వం రైతుబీమా పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకంలోని లొసుగులను అడ్డుపెట్టుకొని కొంతమంది అధికారులు చంద్రమ్మ బతికుండగానే చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ సృష్టించి రైతు భీమాకు దరఖాస్తు చేశారు. బీమా సొమ్ము కోసం మహిళ చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించారు. ఈ ఘటన కుల్కచర్ల మండలం పుట్టాపహాడ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పుట్టాపహాడ్‌కు చెందిన చంద్రమ్మ (58) చనిపోయినట్లు ధ్రువపత్రాన్ని సృష్టించారు. ఆమె పేరున వచ్చిన రూ.5లక్షల బీమా సొమ్మును రైతుబంధు సమన్వయకర్త రాఘవేందర్‌రెడ్డి కాజేశారు. తమకు రైతుబంధు రావడం లేదంటూ చంద్రమ్మ కుమారుడు బాలయ్య అధికారులను కలవడంతో ఈ విషయం బయటకు వచ్చింది.  చంద్రమ్మ కుమారుడు బాలయ్యకు మాయమాటలు చెప్పి ఐదు లక్షలు కాజేశారు. తల్లి రైతుబంధు పడడం లేదని వ్యవసాయ అధికారులను బాలయ్య ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. మీ అమ్మ చనిపోయింది.. అందుకుగాను ఐదు లక్షల రైతు భీమా నీ అకౌంట్లో పడిందన్న వ్యవసాయ అధికారుల మాటలకు షాక్ అయిన కొడుకు, తన తల్లి బతికేవుందని తెలపడంతో వీరి గుట్టురట్టు అయ్యింది.  ఈ ఘటనపై పై అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

వ‌ర‌ద‌ల్లో ఎమ్మెల్యే రెస్క్యూ ఆప‌రేష‌న్‌.. ఏం జ‌రిగిందంటే...

తెలుగురాష్ట్రాల్లో రెండు రోజులుగా భారీ వ‌ర్షాలు. మ‌రో రెండు రోజులూ వాన‌లు ఇలానే కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు. ఎగువ రాష్ట్రాల్లో కూడా వ‌ర్షాలు కుమ్మేస్తున్నాయి. పైనుంచి వ‌ద‌ర వెల్లువెత్తుతోంది. ఇక్క‌డ కురిసిన వాన‌, పైనుంచి వ‌స్తున్న వ‌ర‌ద‌.. రెండూ క‌లిసి అనేక జిల్లాల‌ను నిండా ముంచేశాయి. ఏపీకంటే తెలంగాణ‌లో వాన‌, వ‌ర‌ద ఉధృతి మ‌రింత ఎక్కువగా ఉంది. తెలంగాణ‌లో 16 జిల్లాల్లో ప‌రిస్థితి అల్ల‌క‌ల్లోలంగా ఉంది. ప‌లు చోట్ల రెడ్‌, ఆరేంజ్ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న వారిని ర‌క్షించేందుకు ప్ర‌భుత్వ యంత్రాంగం నిర్విరామంగా ప‌ని చేస్తోంది.  వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నేనుసైత‌మంటూ నీళ్ల‌లో దిగారు రామ‌గుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద‌ర్‌. ఎల్లంపల్లి గేట్లు ఎత్తడం, సుందిళ్ల బ్యారేజ్ వల్ల నీరు ఒత్తిడిగి గురవ‌డంతో.. గోదావ‌రిఖ‌ని సమీపంలోని గంగానగర్‌కు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. వ‌ర‌ద చుట్టుముట్ట‌డంతో లారీ యార్డులో ఉన్నలారీలు నీటిలో చిక్కుకపోయాయి. స్థానికులు కూడా వరద నీటిలోని ఉండిపోవడంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఆ స‌హాయ‌క చ‌ర్య‌ల్లో రామగుండం ఎమ్మెల్యే చందర్ పాల్గొన్నారు. వ‌ర‌ద‌లో చిక్కుకుపోయిన ఓ చిన్నారిని భుజాన ఎత్తుకొని బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. ఎమ్మెల్యే సైతం స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొన‌డాన్ని స్థానికులు అభినందిస్తున్నారు. అయితే, ప‌క్క‌నే అంత‌మంది సిబ్బంది ఉండ‌గా, ఆ పిల్లాడిని తానే భుజాన ఎత్తుకొని రావ‌డం.. మీడియా క‌వ‌రేజ్ కోస‌మేన‌ని కొంద‌రు పెద‌వి విరుస్తున్నారు. చేత‌నైతే వ‌ర‌ద‌ బాధితుల‌కు న‌ష్ట‌ప‌రిహారం ఇప్పించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.   

దళిత బంధు స్కీమా.. చాట్ల తవుడు స్కీమా..?

ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో మాట్లాడుతున్నారా... లేక హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలిచి తీరాలన్న ఆరాటంలో తప్పులో కాలేస్తున్నారా.. అన్న అనుమానాలు టీఆర్ఎస్ నేతలను పట్టి పీడిస్తున్నాయి. హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా భావిస్తున్న పాడి కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్ లో చేర్చుకున్న సందర్భంగా కేసీఆర్ మాట్లాడిన మాటలు ఆ పార్టీ నేతలను గందరగోళంలో పడేశాయి. ప్రజలే ఓట్లేస్తున్నరు.. మమ్మల్ని గెలిపిస్తున్నరు..  మేమేమన్న గుంజుకుంటున్నమా... అంటూ అమాయకంగా ప్రశ్నించిన కేసీఆర్... దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్టుగా చేపడతామని చెప్పడంతో.. వివిధ సామాజికవర్గాల తేనెతుట్టెను కదిలించినట్టయిందని ఆ పార్టీ నేతలే ఆందోళన చెందుతున్నారు. దళిత బంధు పథకం కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వంద మందిని ఎంపిక చేసి, ఒక్కొక్కరికి పది లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేయడం, వారి కుటుంబాల సమగ్ర అభివృద్ధికి తోడ్పాటునందించడం ఈ పథకం లక్ష్యం. అయితే ఆ పథకానికి ఇంకా మార్గదర్శకాలు కూడా రూపొందించకముందే హుజూరాబాద్ లో దళితబంధు పైలట్ ప్రాజెక్టు చేపడతామని, అందుకు రూ. 2 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించడంతో వివిధ సామాజికవర్గాల మధ్య కుల పంచాయతీ మొదలయ్యే ప్రమాదం ఉందని టీఆర్ఎస్ నేతలంతా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హుజూరాబాద్ లో సామాజికవర్గాలవారీ ఓటర్ల సంఖ్య సుమారుగా ఈ విధంగా ఉంది. రెడ్లు - 22,600 మున్నూరు కాపు - 29,100 పద్మశాలి - 26,350 గౌడ - 24,200 ముదిరాజ్ - 23,220 యాదవ - - 22,150 మాల - 11,100 మాదిగ - 35,600 విశ్వబ్రాహ్మణులు - 10,500 ఎస్టీలు - 4,220 రజకులు - 7,600 మైనారిటీలు - 5,100 ఇతరులు - 1550 నాయీబ్రాహ్మణులు - 3,300 పైన పేర్కొన్న ప్రకారం దళితబంధును హుజూరాబాద్ లో తక్షణమే అమలు చేస్తే ఎస్సీల్లోని (మాలలు, మాదిగలు కలుపుకొని) 46 వేల పైబడ్డ ఓటర్లకు వర్తింపజేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి రూ. 10 లక్షల వంతున చూసుకుంటే రూ. 4,600 కోట్లు అవుతుంది. హుజూరాబాద్ నుంచే దళిత బంధు మొదలు పెడతానని కేసీఆర్ క్లారిటీ ఇవ్వడంతో ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఎక్కణ్నుంచి తెస్తారు.. మరోవైపు దళిత బంధు కింద హుజూరాబాద్ లో రూ. 2 వేల కోట్లు ఖర్చు చేస్తామని కూడా చెప్పారు. అంటే దళితుల్లో కూడా అందరికీ ఇవ్వడం సాధ్యం కాదన్నమాట. ఒకవేళ ఆ రూ. 2 వేల కోట్లే అయినా కేవలం దళితులకే ఇస్తే మిగతావర్గాలవారు కేసీఆర్ కు ఎందుకు ఓటేస్తారు... ఒకే ఊళ్లో తమ పక్కనున్న వ్యక్తికి రూ. 10 లక్షలు ఇచ్చి తమకు మొండిచేయి చూపిస్తే మిగతా ప్రజలు కేసీఆర్ ను ఏవిధంగా తమవాడిగా చూస్తారని సొంతపార్టీ నేతలే లాజిక్ పాయింట్లు లాగుతున్నారు. ఈటల రాజేందర్ బీసీ కావడంతో పాటు ఈ మధ్య కాలంలో మన ఓటు మనకే అంటూ బీసీల నుంచి కొత్త నినాదం పుట్టుకొచ్చింది. ఆ విధంగా దళితుల్ని మినహాయిస్తే ఇతర బీసీ వర్గాల నుంచి 1,47,970 మంది ఓటర్లున్నారు. కాబట్టి ఒకేసారి ఇంత పెద్దఎత్తున జనాభా నుంచి వ్యతిరేకత వెల్లువెత్తే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. ఒక్కరికి పెడితే మిగతావాళ్ల వ్యతిరేకతను ఏ విధంగా కేసీఆర్ ఎదుర్కొంటారని వారిలోవారే ప్రశ్నించుకుంటున్నారు.  మరోవైపు 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో దళితుల జనాభా 54 లక్షలకు పైగా నమోదైంది. అంటే సుమారు 10 లక్షల కుటుంబాలు ఉంటాయన్నమాట. దళిత బంధు పథకం కింద కుటుంబానికి 10 లక్షల చొప్పున వేసుకున్నా లక్ష కోట్లు అవుతుంది. అంటే దళితబందు పథకాన్ని దళితులందరికీ ఇవ్వడం కుదరదని కేసీఆర్ ప్రకటనే స్పష్టం చేస్తోంది. అందువల్ల ఈ పథకం కూడా దళిత కుటుంబాలకు 3 ఎకరాలు ఇస్తానన్న స్కీమ్ లాంటిదేనని టీఆర్ఎస్ దళిత నేతలే అంచనా వేస్తున్నారు. ఇలాంటి తరుణంలో కనీసం దళిత టీఆర్ఎస్ నేతలైనా హుజారాబాద్ ఓటర్లను ఏ విధంగా మెప్పిస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. మరో సమస్య ఏంటంటే... దళిత బంధు పథకాన్ని నియోజకవర్గానికి 100 కుటుంబాలకు ఇచ్చి మిగితా కుటుంబాలకు వర్తింపజేయకుంటే లబ్ధి పొందని దళిత కుటుంబాలతోపాటు మిగతా సామాజికవర్గాలు కూడా తీవ్రమైన టీఆర్ఎస్ వ్యతిరేక వర్గాలుగా మారిపోవడం ఖాయమన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవేళ ఏటా వంద కుటుంబాలకు ఇచ్చుకుంటూ పోయినా వందేళ్ల సమయం పడుతుందంటున్నారు. మొత్తానికి  కేసీఆర్ ఈ పథకాన్ని ఆపత్కాలంగా హుజూరాబాద్ ఎన్నికల్లో వాడుకొని ఆ తరువాత అటకెక్కించడం ఖాయమన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అందుకు ఉదాహరణగా గతేడాది జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా వరద బాధితులకు అందిస్తానన్న రూ. 10 వేల సాయాన్ని గుర్తు చేస్తున్నారు. ఎన్నికలు అయ్యాక ఇప్పటికి కూడా ఆ రూ. 10 వేల సాయం అందకపోవడంపై గ్రేటర్ ప్రజల్లో టీఆర్ఎస్ మీద వ్యతిరేకత గూడు కట్టుకునే ఉందని.. హుజూరాబాద్ లో కూడా కేసీఆర్ సర్కారు అలాగే వ్యవహరిస్తుందన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.

రాయ్‌గఢ్‌లో కొండచరియలు విరిగిపడి.. 36 మంది మృతి

తెలుగు రాష్ట్రంలోనే కాదు. దేశంలో కూడా  భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలుఅదే పనిగా వర్షాలు కురవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షాల విలయానికి వంతెనలు కొండ చెరియలు కూడా కూలిపోతున్నాయి. వర్షపు నీటిలో కార్లు.. మనుషులు కొట్టుకుపోతున్నారు.. తెలంగాణాలో ములుగు నిర్మల్ లోని బైంసా లో ఇళ్ల మట్టానికి వర్షపు నీళ్లు వచ్చాయి.. ఆ నీళ్లు ఇంటికి రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా  వరదలతో తీర రాష్ట్రం మహారాష్ట్ర అతలాకుతలమవుతోంది. రాయ్‌గఢ్‌, రత్నగిరి, కొల్హాపూర్‌ సహా పలు జిల్లాల్లో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. రాయ్‌గఢ్‌లో పలు చోట్ల కొండచరియలు విరిగిపడి 36 మంది ప్రాణాలు కోల్పోయారు.    అయితే రాయ్‌గఢ్‌లోని మహద్‌తలై సహా మూడు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో స్థానికంగా ఉన్న   ఇల్లు ధ్వంసమై పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రాణాలు చేతిలో పట్టుకుని బిక్కుబిక్కకుమని బతుకుతున్నారు. ఈ సంఘటనపై  సమాచారమందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌, నేవీ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ఈ ఘటనల్లో ఒక్కటి కాదు రెండు కాదు ఇప్పటివరకు ఏకంగా 32 మంది మరణించినట్లు రాయ్‌గఢ్‌ కలెక్టర్‌ తెలిపారు. మరో 30 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.   మరోవైపు కొండచరియలు విరిగిపడటంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ జాం అయింది ముంబై -గోవా హైవేపై కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. వెనక్కి రాలేక ముందుకు పోలేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.  అటు కొల్హాపూర్‌లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. భారీ వర్షాలకు ముంబయి- బెంగళూరు హైవే ఓ చోట కుంగిపోయింది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. రత్నగిరి జిల్లాలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. వర్షాల ధాటికి తీర ప్రాంతాలు అల్లాడిపోతున్నాయి.  

ముందు విలీనం.. తర్వాత ఆస్తుల వేలం! ఆర్టీసీపై జగన్ బాటలోనే కేసీఆర్ స్కెచ్? 

ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆర్థిక వ్యవహారాలు వింత విచిత్రంగా సాగుతున్నాయి. ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తున్నామని చెప్పుకుంటున్నాయి. అందులో కొంత నిజముంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అప్పులు చేసి మరీ ఉచిత పందారాలు సాగిస్తోంది. ఎంతవరకు నిజముందో ఏమో గానీ, ఏపీలో ఐదు ఓట్లున్న ప్రతి ఫ్యామిలీకి సంవత్సరానికి లక్ష రూపాయలకు తక్కువలేకుండా ఉచిత వరాల రూపంలో వచ్చి పడుతున్నాయని అంటున్నారు. తెలంగాణలోనూ అదే పరిస్థితి. అదలా ఉంటే ఉభయ రాష్ట్రాలు అందిన కాడికి అప్పులు చేసేందుకు ఏ మాత్రం వెనకాడడం లేదు. అప్పుల ఉబిలో కురుకు పోయాయి.  ప్రతి తెలుగు వాడి నెత్తిన లక్ష నుంచి లక్షన్నర వరకు అప్పుందని ఆర్ధిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాలు  ప్రభుత్వ భూములు, ఇతర ఆస్తులు అమ్మి సొమ్ము చేసుకుంటున్నాయి. అదేమంటే కబ్జాల నుంచి కాపాడలేక పోతున్నామని సాకులు చుపుతున్నారు. అందుకే భూములు అమ్మేసి  అలా వచ్చిన సొమ్ములను  ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నామని సమర్ధించుకోవడం జరుగుతోంది.ఇటీవలనే, తెలంగాణ ప్రభుత్వం కోకాపేట భూములను, బిట్లు బిట్లుగావేలం వేసి, కోట్లలో సొమ్ము చేసుకుంది. చిత్రం ఏమంటే అప్పులు, ఆస్తుల అమ్మకాలను తెలుగు ప్రభుత్వాలు  ప్రధాన ఆదాయ వనరుగా చూస్తున్నాయి.  తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు, ఆర్టీసీఆస్తుల మీద కన్నేసిందని తెలుస్తోంది. ఆర్టీసీ ఆస్తులను, భూములను అమ్మేసేందుకు పావులు కడుపుతోందని సమాచారం. ఇందులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చూపిన మార్గంలో ముందుగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకునే ప్రణాళిక సిద్దమవుతోందని అంటున్నారు. ఒక సారి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటే.. భూములు, ఇతర ఆస్తుల విక్రయానికి యూనియన్ల నుంచి, ఉద్యోగుల నుంచి ఎలాంటి వ్యతిరేకత అడ్డంకులు రావని ప్రభుత్వం  భావిస్తోందని బస్‌‌ భవన్‌‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి రూ.56 వేల కోట్లకు పైగా విలువచేసే ఆస్తులు, భూములు ఉన్నాయి. జీహెచ్‌‌ఎంసీ పరిధిలోని ప్రైమ్‌‌ ఏరియాల్లోనే పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయి. ఇప్పటికే  సంస్థ ఆస్తుల లిస్ట్‌‌, ఇతర వివరాలతో కూడిన నివేదికను ఉన్నతాధికారులు ప్రభుత్వానికి అందజేశారని తెలుస్తోంది.  రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్ ఆర్టీసీకి చాలా విలువైన భూములు, డిపోలు, రీజియన్, డివిజన్ కార్యాలయాలు. జోనల్‌‌ వర్క్ షాపులు , బస్‌‌ బాడీ యూనిట్‌‌, ఇంకా ఇతర కార్యాలయాలు,ఆసుపత్రులు, ప్రింటింగ్‌‌ ప్రెస్‌‌ ఇలా ప్రతి ఉమ్మడి జల్లాలో తక్కువలో తక్కువ వంద ఎకరాలకుపైనే భూములున్నాయి.అత్యధికంగా రంగారెడ్డిలో 250 ఎకరాలు, కరీంనగర్‌‌ జిల్లాలో 194  ఎకరాల భూమి ఉంది. ఈ మొత్తం ఆస్తులు, భూముల విలువ సుమారు రూ.50 వేల కోట్లకు పైగా ఉంటుందని ప్రభుత్వఅంచనా. ఈ భుములు,ఆస్తులను అమ్మేసే, ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది ఇటీవల వివిధ డిపార్ట్‌‌మెంట్ల ఆస్తుల వివరాలను సేకరించిన ప్రభుత్వం.. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను, ఆస్తులను అమ్మేస్తోంది. ఇదే క్రమంలో ఆర్టీసీలోని ఆస్తులను అమ్మేందుకు స్పీడ్ బ్రేకర్ల అడ్డును తొలిగించే పని ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రైమ్‌‌ ఏరియాల్లో ఖాళీగా ఉన్న, అంతగా  ఉపయోగం లేని భూములను ముందుగ అమ్మాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్క జీహెచ్‌‌ఎంసీ పరిధిలోనే 29 డిపోలు ఉన్నాయి. వీటిలో తక్కువ  బస్సులున్న డిపోలను మెర్జ్‌‌ చేస్తున్నారు. ఇటీవల పికెట్‌‌ డిపోను ఖాళీ చేసి, అందులోని బస్సులను దగ్గరలోని కంటోన్మెంట్‌‌, మియాపూర్‌‌, యాదగిరిగుట్ట డిపోలకు తరలించారు. భవిష్యత్‌‌లో మరికొన్నిడిపోలను కూడా మెర్జ్‌‌ చేసే చాన్స్‌‌ ఉంది. ఇలా డిపోల పరిధిలోని భూములను అమ్మడం లేదా లీజ్‌‌కు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. జిల్లాల్లో ఆర్టీసీ పరిధిలో ఉన్న వందల ఎకరాల భూములను కూడా అమ్మేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఆస్తులకు ఎక్కాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. 

తెలంగాణ‌పై రాహుల్ ట్వీట్‌.. రేవంత్‌కి ఫుల్ స‌పోర్ట్‌.. ట‌చ్‌లో ఉంటా..!

తెలంగాణ‌లో అతిభారీ వ‌ర్షాలు. నీట మునిగిన 16 జిల్లాలు. ప‌లుచోట్ల రెడ్‌, ఆరేంజ్ హెచ్చ‌రిక‌లు. ఇంత వ‌ర‌ద బీభ‌త్సం కొన‌సాగుతున్నా.. ప్ర‌ధాని మోదీ ఇంకా స్పందించ‌నే లేదు, ఆలోగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ మాత్రం తెలంగాణ ప్ర‌జ‌లు సుర‌క్షితంగా, అప్ర‌మ‌త్తంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొనాల‌ని పిలుపిచ్చారు. రాహుల్‌గాంధీ ట్వీట్‌తో కాంగ్రెస్ కేడ‌ర్ రెస్క్యూ ఆప‌రేష‌న్స్‌లో త‌మ‌వంతు సాయం చేస్తున్నారు.  పైపైన చూస్తే ఇది జ‌స్ట్ వ‌ర‌ద న్యూస్‌లానే ఉన్నా.. లోతుగా విశ్లేషిస్తే ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు క‌నిపిస్తున్నాయి. తెలంగాణ‌లో భీక‌ర వ‌ర్షాలు కురిసిన రోజే.. కేంద్ర ప్ర‌భుత్వానికంటే వేగంగా రాహుల్‌గాంధీ స్పందించ‌డాన్ని మామూలు విష‌యంగా చూడ‌లేమంటున్నారు. ఆయ‌న నుంచి ఇలాంటి ఇమ్మిడియేట్ రెస్పాన్స్ ఇంత‌కుముందెప్పుడూ చూడ‌లేదు. పోనీ, ఆయ‌నేమీ జాతీయ‌ కాంగ్రెస్ అధ్య‌క్షుడూ కాదు. జ‌స్ట్, కేర‌ళ నుంచి గెలిచిన కాంగ్రెస్‌ ఎంపీ మాత్ర‌మే. అయినా, తెలంగాణ‌పై అంత ఫోక‌స్డ్‌గా ఉండ‌టానికి కార‌ణం.. రేవంత్‌రెడ్డే అంటున్నారు. రేవంత్ నాయ‌క‌త్వం వ‌ల్లే రాహుల్ గాంధీకి తెలంగాణ‌పై ఇంట్రెస్ట్ పెరిగింద‌ని చెబుతున్నారు.  ప్ర‌స్తుతం రాహుల్ కేవ‌లం ఎంపీ మాత్ర‌మే అయినా.. కాంగ్రెస్‌కు కాబోయే ప్ర‌ధాని అభ్య‌ర్థి అనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. అధ్య‌క్షుడిగా లేకున్నా.. ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే పార్టీ న‌డుస్తుంద‌ని అంటారు. ఉత్త‌రాది విష‌యం ప‌క్క‌నపెడితే.. ద‌క్షిణ భార‌తంలో ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రాగ‌ల అవ‌కాశం అధికంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ‌నే అనేది రాహుల్ అంచ‌నా. అందుకే, తెలంగాణ‌ను మ‌రోసారి ఎలాగైనా చేజిక్కించుకోడానికి.. స్వ‌యంగా రాహులే రాష్ట్ర పార్టీ వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని చెబుతున్నారు. పీసీసీ చీఫ్ ప‌ద‌వి కేటాయింపులోనూ రాహుల్ జోక్యం వ‌ల్లే రేవంత్‌రెడ్డికి ప‌గ్గాలు ద‌క్కాయ‌ని అంటారు. పీసీసీ కోసం ప‌లువురు సీనియ‌ర్లు ఢిల్లీలో బాగా ఫైట్ చేశారు. సోనియా చెవిలో రేవంత్‌కు వ్య‌తిరేకంగా చాడీలు నూరిపోశారు. ఓ ద‌శ‌లో.. రేవంత్‌ను పీసీసీ చీఫ్ చేస్తే త‌మ దారి తాము చూసుకుంటామంటూ బ్లాక్ మెయిల్ కూడా చేశారంటారు. అందుకే, సోనియా కాస్త సందిగ్థంలో ప‌డ‌గా.. రాహుల్‌గాంధీ మాత్రం రేవంత్‌రెడ్డికి ఫుల్ స‌పోర్ట్‌గా నిలిచార‌ని చెబుతారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తాను తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా ప‌ర్య‌టించాన‌ని.. ప్ర‌జ‌ల్లో రేవంత్‌రెడ్డికి ఉన్న ఇమేజ్‌ను క‌ళ్లారా చూశాన‌ని.. ఆయ‌న నాయ‌కత్వ ల‌క్ష‌ణాలు త‌న‌కు తెలుస‌ని.. రేవంత్‌కు పీసీసీ ప‌గ్గాలు అప్ప‌గిస్తేనే.. తెలంగాణ‌లో కాంగ్రెస్‌కు మ‌నుగ‌డ సాధ్య‌మంటూ రాహుల్‌గాంధీ సోనియాకు గ‌ట్టిగా చెప్పార‌ట‌. దీంతో, రాహుల్ ప‌ర్స‌న‌ల్ ఇంట్రెస్ట్ మేర‌కే.. సీనియ‌ర్ల‌ను కాద‌ని మ‌రీ, రేవంత్‌రెడ్డికి పీసీసీ ప్రెసిడెంట్ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టార‌ని అంటారు.  ఇక‌, రేవంత్‌రెడ్డి ఎంట్రీతో తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీకి పున‌ర్ వైభ‌వం సాధ్య‌మ‌ని రాహుల్‌గాంధీ బ‌లంగా న‌మ్ముతున్నారు. అందుకే, ఈ రాష్ట్రంపై ఆయ‌న ప్ర‌త్యేక దృష్టి సాధించారు. కాస్త గట్టిగా ట్రై చేస్తే.. ఈజీగా అధికారంలోకి రాగ‌ల‌మ‌ని విశ్వ‌సిస్తున్నారు. అందుకే, తెలంగాణ విష‌యాల్లో ఎప్ప‌టిక‌ప్పుడు ట‌చ్‌లో ఉండాల‌ని రాహుల్‌గాంధీ భావిస్తున్నారు. అందులో భాగంగానే, తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు కుర‌వ‌డంతో.. 16 జిల్లాలు నీట మున‌గాయ‌నే న్యూస్ తెలిసి.. వెంట‌నే స్పందించారు. కేంద్ర ప్ర‌భుత్వం కంటే ముందే రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ శ్రేణుల‌ను స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొనాల‌ని మెసేజ్ ఇచ్చారు. త‌న వంతు ఎంక‌రేజ్ ఇస్తే.. ఇక మిగ‌తా వ్య‌వ‌హార‌మంతా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చూసుకుంటార‌ని.. కాంగ్రెస్ ప్రాభ‌వాన్ని మ‌రింత పెంచుతార‌నే న‌మ్మ‌కం రాహుల్‌గాంధీలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. ఇక మీద‌టా తెలంగాణ విష‌యాల‌పై రాహుల్ స్పంద‌న కంటిన్యూ అవుతుంద‌ని ఆశిస్తున్నారు.   

జగన్ సర్కార్ కు ఎన్జీటీ షాక్.. ఏపీ రైతులకు గండమేనా? 

కృష్ణా జలాల వివాదంలో ఆంధ్రప్రదేశ్ జగన్ రెడ్డి ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ లో మరోసారి చుక్కెదురయ్యింది. ఏపీ ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రాజెక్టు పనులను పరిశీలించి రావాల్సిందిగా కృష్ణా బోర్డును ఎన్జీటీ ఆదేశించింది. ఆ తర్వాత దానిపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ఆదేశాలిచ్చింది.  రాయలసీమ ఎత్తిపోతల పథకంపై గవినోళ్ల శ్రీనివాస్ అనే రైతు, తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ధిక్కరణ పిటిషన్లను నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై ధర్మాసనం విచారించింది. జస్టిస్‌ రామకృష్ణన్‌ నేతృత్వంలోని ఎన్జీటీ బెంచ్‌లో ఈ విచారణ జరిగింది. ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘించి ఏపీ ప్రభుత్వం పనులు చేస్తోందని పిటిషనర్‌ వాదించారు.  ప్రాజెక్టును సందర్శించి పనులను పరిశీలించి రావాలన్న ఎన్జీటీ ఆదేశాలపై కృష్ణా బోర్డు అఫిడవిట్ వేసింది. ప్రాజెక్టు సందర్శన కోసం ఏపీ తమకు సహకరించడం లేదని అందులో పేర్కొంది. కేంద్ర పర్యావరణ శాఖ నుంచి మాత్రం స్పందన రాలేదు.  ఇక తాము ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘించనేలేదంటూ ధిక్కరణ పిటిషన్లకు ఏపీ సమాధానమిచ్చింది. ప్రాజెక్టు సమగ్ర నివేదికకు సంబంధించిన అధ్యయనాల పనులను మాత్రమే చేస్తున్నామని స్పష్టం చేసింది. ప్రాజెక్టు సందర్శనకు పంపించాల్సిన అవసరం లేదని చెప్పిన ఏపీ ప్రభుత్వం.. తామే అక్కడి పరిస్థితులను వివరిస్తూ సమాధానం ఇస్తామని స్పష్టం చేసింది. అంతేకాదు డీపీఆర్‌ తయారీకి అధ్యయనం మాత్రమే చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం వివరించింది. కేంద్ర పర్యవరణ శాఖ, జలసంఘం అడిగిన అంశాలపై అధ్యయనం చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.  రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల పరిశీలనపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించడం లేదని, కాబట్టి ఎన్జీటీనే స్వయంగా వచ్చి ప్రాజెక్టును పరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. అందుకు హెలికాప్టర్ సహా అన్ని సదుపాయాలనూ తామే కల్పిస్తామని తెలిపింది. అన్ని పక్షాల వాదనలను విన్న ట్రైబ్యునల్.. ఏపీతో సంబంధం లేకుండా తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని కేఆర్‌ఎంబీకి ఆదేశాలు జారీ చేసింది. కృష్ణా బోర్డు నివేదిక ఆధారంగానే చర్యలు ఉంటాయని.. నిబంధనలు ఉల్లంఘించి పనులు జరుపుతారని భావించట్లేదని ఎన్జీటీ తెలిపింది. ఏపీ ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్జీటీ హెచ్చరించింది. రాయలసీమ ఎత్తిపోతలపై తదుపరి విచారణను ఆగస్టు9కి ఎన్జీటీ వాయిదా వేసింది.    

అధికార పార్టీ ఎమ్మెల్యేకు షాక్‌.. వ‌ర్షంలో 2 గంట‌ల పాటు ఘోరావ్‌..

రాక రాక వ‌చ్చిండు ఆ ఎమ్మెల్యే. రండి బాబు రండి.. అంటూ ఘ‌న స్వాగ‌తం ప‌ల‌క‌లేదు ఆ గ్రామ ప్ర‌జ‌లు. ఇన్నేళ్ల‌కి ఇప్పుడు గుర్తొచ్చామా అంటూ నిల‌దీశారు. మా స‌మ‌స్య‌లు ఇప్ప‌టికిప్పుడే తీర్చాలంటూ ప‌ట్టుబ‌ట్టారు. ఓ వైపు జోరున వ‌ర్షం ప‌డుతోంది.. అయినా, వ‌ద‌ల్లేదు జ‌నాలు. మా ఊరు సంగ‌తి తేల్చాల్సిందేనంటూ దాదాపు 2 గంట‌ల పాటు ఆ ఎమ్మెల్యేను చుట్టుముట్టి ప్రశ్న‌ల‌తో ఉక్కిరిబిక్కిరి చేశారు.   భైంసా మండలంలో నీట మునిగిన గుండేగాం గ్రామాన్ని సందర్శించిన ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. గత పదేళ్లుగా తమ గ్రామానికి శాశ్వత పరిష్కారం ఎందుకు చూపడం లేదంటూ ఎమ్మెల్యేపై గ్రామస్తులు విరుచుకుపడ్డారు. ఆర్ఆర్ ప్యాకేజీ ప్రకటించే వరకు ఊరు విడిచి వెళ్ళొద్దంటూ చుట్టుముట్టారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  ఎవరూ ఎలాంటి ఆందోళన చెందవద్దంటూ వారిని శాంతింప‌జేసే ప్ర‌య‌త్నం చేశారు ఎమ్మెల్యే విఠ‌ల్‌రెడ్డి, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పల్సికర్ రంగారావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో గుండేగాం నీట మునిగింది. ఈ ఘటనలో సుమారు 300 ఇళ్లు నీట మునిగాయి. గ్రామస్తులు నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. పాపం.. ప్ర‌జ‌ల‌ను ప‌రామ‌ర్శించి.. ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షిద్దామ‌ని వెళ్లిన ఎమ్మెల్యే విఠ‌ల్‌రెడ్డికి ఇలాంటి చేదు అనుభ‌వం ఎదుర‌వ‌డంతో.. వెనుదిరిగి వ‌చ్చేశారు.    

తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్.. సీనియర్ నేత జంప్

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజులుగా నేతల వలసలతో రాజకీయాలు వేడెక్కగా.. అత్యంత కీలకంగా మారిన హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికకు ముందు బీజేపీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. సీనియర్ నేత కమలం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. రాజీనామా చేయడమే కాదు తెలంగాణ బీజేపీ పెద్దలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆ సీనియర్ నేత.  తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బీజేపీకి రాజీనామా చేశారు. ఏడాది క్రితమే ఆయన కమలం పార్టీలో చేరారు. కొన్ని రోజులుగా బీజేపీ కార్యక్రమాల్లో అంతగా పాల్గొనడం లేదు.  మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరినప్పటి నుంచి ఆయన తన అసమ్మతిని బహిరంగంగానే చెబుతూ వస్తున్నారు. ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా సంచలన ఆరోపణలు కూడా చేశారు. తర్వాత ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన దళిత నేతల సమావేశానికి హాజరయ్యారు. ఆ సమావేశాన్ని బీజేపీ బాయ్ కాట్ చేసినా.. పార్టీ ఆదేశాలను పట్టించుకోకుండా హాజరై షాకిచ్చారు మోత్కుపల్లి. అప్పటి నుంచే ఆయన పార్టీకి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా శుక్రవారం అధికారికంగా మోత్కుపల్లి బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.  రాజీనామా ప్రకటిస్తూ బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు నర్సింహులు. తన అనుభవానికి బీజేపీ లో గుర్తింపు లేదన్నారు. ఈటెల ను పార్టీలో చేర్చుకునే విషయం లో తనకు ఒక్క మాట కూడా చెప్పలేదని విమర్శించారు. ఈటెలకు వేల కోట్ల ఆస్తులు ఎక్కడివని మోత్కుపల్లి ప్రశ్నించారు. చూస్తే చాలా అమాయకంగా ఉంటాడు కాని రాజేందర్ అతిపెద్ద అవినీతి పరుడున్నారు దళిత భూములు వాపస్ ఇవ్వాలని బీజేపీ నేతలకు తాను గతంలోనే స్పష్టం చేశానని చెప్పారు. హుజురాబాద్ లో పోటీ చేసే అర్హత ఈటలకు లేదన్నారు మోత్కుపల్లి. తన ఆస్తులు పెంచుకోవడం తప్ప పేదలకు ఆయన చేసిందేమి లేదన్నారు.  బీజేపీని టార్గెట్ చేస్తూనే సీఎం కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు మోత్కుపల్లి నర్సింహులు. దళిత సాధికారత గొప్ప నిర్ణయమన్నారు. కేసీఆర్ స్వయంగా నాకు ఫోన్ చేసి తనతో చర్చించారన్నారు. ఎన్టీఆర్ హయాంలో లో ప్రజలు ఎంత సంతోష పడ్డారో ఇప్పుడు.. ఈ దళిత సాధికారత వల్ల కూడా అంతే హ్యాపీగా ఉంటారని తెలిపారు. సీఎం కెసిఆర్ దళితులు తల ఎత్తుకునేలా చేస్తున్నారని చెప్పారు. ఒక్కో కుటుంబానికి 10 లక్షలు అంటే చాలా గొప్ప నిర్ణయమన్నారు మోత్కుపల్లి.  ఏ సీఎం కు ఇంత దమ్ము లేదన్నారు. దళిత బంధును దళిత జాతి తరుపున స్వాగతిస్తున్నానని చెప్పారు.  2 వేల కోట్లు దళిత జాతి అభివృద్ధి కోసం కేటాయిస్తున్నారని.. ఆర్థికంగా భారం అయినా కూడా సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని మోత్కుపల్లి తెలిపారు. మొత్తం 70 లక్షల దళిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందన్నారు మోత్కుపల్లి. బీజేపీకి రాజీనామా చేసిన మోత్కుపల్లి నర్సింహులు.. సీఎం కేసీఆర్ ను ఆకాశానికెత్తడంతో ఆయన అధికార పార్టీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. త్వరలోనే ఆయన కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకుంటారని చెబుతున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో మోత్కుపల్లిని ఉపయోగించుకునేలా కేసీఆర్ స్కెచ్ వేస్తారని అంటున్నారు. మోత్కుపల్లికి కీలక పదవి ఇచ్చే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. 

రవి శంకర్ ఉద్వాసనకు అదేనా అసలు కారణం?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన మంత్రి వర్గ విస్తరణ వ్యవహరం మొత్తం ఒకెత్తు అయితే, మంత్రి మండలి నుంచి 12 మందికి ఉద్వాసన పలకడం, అందులో న్యాయ, ఐటీ శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్, కూడా ఉండడం ఒక్కటీ ఒకెత్తుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నిజమే, రవిశంకర్’ ప్రసాద్’తో పాటుగా ప్రభుత్వంలో పార్టీలో అంతే ప్రాధాన్యత ఉన్న ప్రకాష్ జవదేకర్, హర్ష వర్ధన్’కు కూడా మోడీ షా జోడీ బయటకు దారి చూపించారు.  జవదేకర్, హర్ష వర్ధన్ ఉద్వాసనకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కొవిడ్ సెకండ్ వేవ్ కొంత కారణమని అనుకున్నా, పార్టీలో సీనియర్, ప్రధాని మోడీకి అత్యంత సన్నహితుడు అయిన రవిశంకర్ ప్రసాద్ ను అది కూడా.. అంత అన్సెర్మొనియస్ గా అవమానకరంగా ఎందుకు బయటకు పంపారు, ఆయన చేసిన నేరమేమిటి? అంటే, ఎవరికీ సమాధానం చిక్కడం లేదు.  అందుకే ఆ చర్చ ఇప్పటికీ, పార్టీ వర్గాల్లో వినవస్తూనే ఉంది. అంతేకాదు ఆరోజు నుంచి ఈ రోజు వరకు రవి శంకర్ ప్రసాద్ కు ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా అప్పాయింట్మెంట్ కూడ దొరకలేదు. అంటే ఆయన ఉద్వాసనకు ఎదో బలమైన  కారణమే ఉండి ఉంటుందని పార్టీ వర్గాలు గుసగుసలు పోతున్నాయి. అయితే ఆ బలమైన కారణం ఏమిటో మాత్రం ఎవరు చెప్పలేకుండా ఉన్నారు. అందుకే ప్రసాద్ ఉద్వాసనకు ట్విట్టర్ వివాదం కారణమని,  అదనీ, ఇదనీ కథనాలు వస్తున్నాయి.     అయితే అందులో ఏదీ నిజం కాదు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రవి శంకర్ ప్రసాద్ ఉద్వాసనకు సీబీఐ చీఫ్ నియామక ప్రక్రియలో న్యాయశాఖ పరంగా జరిగిన తప్పిదాలే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఐటీ శాఖకు ఇందులో ప్రమేయం లేదు. వివరాలలోకి వెళితే, సీబీఐ చీఫ్ ఎన్నిక ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ సెక్షన్ 4 ఏ (1) ప్రకారం జరుగుతుంది. ఈ చట్టం ప్రకారం, ప్రధాని, పతిపక్ష నాయకుడు,లేదా ప్రతిపక్ష పార్టీల ప్రతినిథి, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన త్రిసభ్య కమిటీ సీబీఐ చీఫ్’ ని మెజారిటీ అభిప్రాయం మేరకు ఎంపిక చేస్తుంది. ఈ సాంకేతిక అంశాలను అలా ఉంచి, అసలు విషయంలోకి వస్తే, ఈ సారి సీబీఐ చీఫ్ ఎంపిక న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మెడకు చుట్టుకొంది.సీబీఐ చీఫ్ ఎంపిక కోసం చాలా పెద్ద జాబితానే సిద్దం చేశారు. ఆ జాబితాలో  ఉన్న 109 పేర్ల నుంచి న్యాయ శాఖ పది మంది పేర్లతో షార్ట్ లిస్టు సిద్ధం చేసి మే 25 కమిటీ ముందుంచింది. ఈ జాబితాలో గుజరాత్ క్యాడర్ కు చెందిన వై.సి.మోడీ,లేదా రాకేష్ ఆస్థానా సీబీఐ చీఫ్ అవుతారని అనుకున్నారు.ప్రధాని మోఢీ కూడా గుజరాత్ అధికారి వైసి మోడీ ను సీబీఐ చీఫ్ గా తీసుకు రావాలని భావించారు.అయితే , ఇక్కడే రవి ప్రసాద్ పదవికి ఉచ్చు బిగిసింది.  మే 25 జరిగిన భేటీలో ప్రధాని మోడీ,ప్రధాన ప్రతిపక్షం తరపున అధిర్ రాజన్ చౌదరి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ ఎన్. వి.రమణ సుమారు 90 నిముషాల పాటు భేటీ అయ్యారు.ఈ భేటీలో 6 నెలలు మాత్రమే సర్వీస్ ఉన్న అధికారులు ఈ పదవి ఎంపికకు అర్హులు కాదంటూ ప్రధానన్యాయ మూర్తి ప్రస్తావన తీసుకు రావడం, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అధిర్ రాజన్ చౌదరి దానిని సమర్దించడంతో సమావేశంలో ప్రధాని మోడీ ఒంటరి అయ్యారు.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మూర్తి మరో జాబితా కోరడంతో అప్పటికప్పుడు మరో జాబితా ప్రధాన మంత్రి కార్యాలయం రూపొందించాల్సి వచ్చింది.ఈ నేపధ్యంలోనే మహారాష్ట్ర క్యాడర్ కు చెందిన సుబోధ్ కుమార్ జైస్వాల్ ఎంపికకు ప్రధాని అయిష్టంగా ఆమోదించవలసి వచ్చింది. ఈ నేపద్యంలో 6 నెలల రిటైర్మెంట్ రూల్ తన దృష్టికి ఎందుకు తీసుకు రాలేదని ప్రధాని, రవిశంకర్ ప్రసాద్ ని ప్రశ్నించారు. ఆయన సమాధానం చెప్పలేక ఇరుక్కు పోయారు. ఆ పరిణామ పర్యవసానంగానే రవిశంకర్ ప్రసాద్ ఉద్యోగం ఉదిందని,విశ్వసనీయ వర్గాల సమాచారం. రవిశంకర్ ప్రసాద్ తో పాటుగా ప్రకాష్ జవదేకర్, హర్ష వర్ధన సహా మరి కొందరి ఉద్వాసనకు పార్టీ అవసరాలు కారణమని, త్వరలోనే వారికీ పార్టీలో కీలక  బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. అయినా, రవిశంకర్ ఉదంతం.. ఓ చిన్న తప్పు ఎంత పెద్ద ఉపద్రవానికి దారితీస్తుందనేదానికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది.

జామ్ జామ్‌గా జొమాటో.. మార్కెట్లో లిస్టింగ్ అదుర్స్‌...

జొమాటోలో ఫుడ్ ఆర్డ‌ర్ పెడితే.. 50శాతం వ‌ర‌కూ డిస్కౌంట్ వ‌స్తుంది. అదే జొమాటో ఐపీవోకు అప్లై చేస్తే.. 50శాతానికిపైగా ప్రాఫిట్ వ‌చ్చింది. ఇలా ఎలా చూసినా.. జొమాటోను న‌మ్ముకున్న వారికి లాభాలే లాభాలు. అవును, స్టాక్ మార్కెట్లో జొమాటో లిస్టింగ్ అదిరిపోయింది. అనూహ్య స్పంద‌నతో భారీ లాభాల‌తో స్టాక్ న‌మోదైంది. తొలిసారి స్టాక్‌ఎక్స్ఛేంజీల్లో లిస్టయిన జొమాటో లిమిటెడ్‌ షేర్లు అందరూ ఊహించినట్లుగానే శుభారంభం చేశాయి. షేరు ధర బీఎస్‌ఈలో రూ.115 వద్ద ప్రారంభమైంది. ఐపీఓ ధర రూ.76తో పోలిస్తే 51.32 శాతం ప్రీమియంతో నమోదైంది.  నేష‌న‌ల్ స్టాక్ ఎక్సేంజ్‌లో 53 శాతం ప్రీమియంతో రూ.116 వద్ద లిస్టయ్యింది. లిస్టింగ్‌ సమయంలో జొమాటో మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.90,219.57 కోట్లకు చేరింది. లిస్టింగ్ అయిన వెంట‌నే బీఎస్‌ఈలో 42 లక్షల షేర్లు చేతులు మారాయి. ఎన్‌ఎస్‌ఈలో 19.41 లక్షల షేర్లు ట్రేడింగ్ జ‌రిగింది.  రూపాయి ఫేస్ వ్యాల్యూ కలిగిన షేరును రూ.75 ప్రీమియంతో రూ.76 చొప్పున కంపెనీ కేటాయించింది. జులై 16న ముగిసిన జొమాటో ఐపీఓకు 40.38 రెట్ల స్పందన లభించింది. దాఖలైన బిడ్ల విలువ రూ.2.13 లక్షల కోట్లు కాగా, 11 ఏళ్ల మార్కెట్‌ చరిత్రలోనే ఇదే అత్య‌ధికం.  లిస్టింగ్‌కి కొన్ని నిమిషాల ముందు జొమాటో వ్యవస్థాపకుడు వాటాదార్లకు లేఖ రాశారు. సంస్థ భవిష్యత్తు మనుగడపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. జొమాటోతో పాటు మరో ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ ప్రపంచస్థాయి సంస్థలుగా ఎదగనున్నాయని ధీమా వ్యక్తం చేశారు. భారతదేశ వృద్ధిపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. భారత్‌ వంటి క్లిష్టమైన మార్కెట్లలో నిరూపించుకుంటే తిరుగే ఉండదని అభిప్రాయపడ్డారు. స్వల్పకాల లాభాలపై దృష్టి పెట్టకుండా దీర్ఘకాల విజయం కోసం కృషి చేస్తామన్నారు.  జొమాటో ఐపీవోకు అప్లై చేసి.. షేర్లు అలాట్ అయిన‌వారంతా ఇప్పుడు భారీ లాభాల‌తో పండ‌గ చేసుకుంటున్నారు. ఆ సెల‌బ్రేష‌న్స్‌కు కావ‌ల‌సిన స్టఫ్‌ను సైతం జొమాటోలోనే ఆర్డ‌ర్ పెడుతున్నారు. ఇది నా కంపెనీ.. ఇందులో నా వాటా ఉందంటూ.. షేర్లు కొన్న‌వాళ్లంతా ఉద‌యం నుంచి జొమాటోలో తెగ ఆర్డ‌ర్లు పెట్టేస్తున్నార‌ట‌.  

ప్రవీణ్ కుమార్ పార్టీ ఖాయమే? హుజురాబాద్ లో వాళ్లకు గండమే? 

తనకు ఇంకా అరేండ్ల సర్వీస్ ఉండగానే ఐపీఎస్ కు వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించిన ప్రవీణ్ కుమార్ భవిష్యత్ కార్యాచరణపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ప్రవీణ్ కుమార్ ఏం చేయబోతున్నారన్న దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. స్వచ్ఛంద పదవి విరమణ చేశాకా ఆయన వేస్తున్న అడుగులను బట్టి సోషల్ మీడియాలో, ప్రధాన మీడియాలోనూ పలు ప్రచారాలు జరుగుతున్నాయి. ప్రవీణ్ కుమార్ రాజకీయ అరంగ్రేటం చేస్తారనే వాదనే ఎక్కువగా వినిపిస్తోంది. రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలను ప్రవీణ్ కుమార్ ఖండించకపోవడంతో.. ఆయన పొలిటికల్ ఎంట్రీ ఖాయమనే తెలుస్తోంది.  రాజకీయాల్లోకి వస్తే కొత్త పార్టీ పెడతారా లేక ఇప్పుడున్న పార్టీల్లోనూ ఏదో ఒక దాంట్లో చేరతారా అన్న చర్చ జరుగుతోంది. కేసీఆర్ ఆదేశాలతోనే ప్రవీణ్ కుమార్ రాజీనామా చేసాడని కొందరంటే చెబుతున్నారు.  ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగడానికే తన ఐపిఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశారనే ప్రచారం జరిగినా... ఈ వాదనను ప్రవీణ్ కుమార్ కొట్టిపారేశారు.  బీఎస్పీ అధినేత్రి మాయావతితో ఇటీవలే ఆయన చర్చలు జరిపారని, రాష్ట్రంలో బీఎస్పీని ఆయన లీడ్ చేయబోతున్నారని కొందరు చెబుతున్నారు. తాను ఏర్పాటు చేస్తున్న స్వేరోను రాజకీయ పార్టీగా మార్చే యోచనలో ప్రవీణ్ కుమార్ ఉన్నారని కూడా చర్చ సాగుతోంది. తన రాజకీయ ప్రవేశంపై రకరకాల చర్చలు జరుగుతున్న సమయంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కొంత క్లారిటీ ఇచ్చారు. ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో తన రాజకీయ ప్రస్థానంపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రవీణ్ కుమార్.  బహుజనులే కేంద్ర బిందువుగా ఒక నూతన రాజకీయ పార్టీ ఏర్పడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బహుజనులకు న్యాయం జరగలేదని బహుజనులకు న్యాయం చేసేందుకే తాను బయటకు వచ్చానని ప్రవీణ్ కుమార్ అన్నారు. . కేవలం 1 శాతం మంది దగ్గరే సంపద నిక్షిప్తమై ఉందని ప్రభుత్వ పథకాల కోసం ఎదురు చూస్తున్న మిగిలిన 99 శాతం మంది బహుజనుల కోసమే తాను ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రాదల్చుకున్నట్టు చెప్పారు. తన పొలిటికల్ ఎంట్రీ గురించి మరింత క్లారిటీ ఇస్తూ  తాను రాజకీయాల్లోకి రావడం ఖాయమే అని కానీ అదెప్పుడు జరుగుతుందో మాత్రం ఇప్పుడే చెప్పలేనని ప్రవీణ్ కుమార్ చెప్పారు.తనకింకా ఆరేళ్ల సర్వీస్ మిగిలి ఉన్నప్పటికీ దాన్ని వదులుకొని తాను రాజీనామా చేసానని ఈ సమయాన్ని వృధా చేయదల్చుకోవడం లేదని తెలిపారు. దళితులకు మూడెకరాలు పేదలకు ఇండ్లు ఇవి కాదు చేయాల్సిందని వారిని జీవితంలో ఉన్నత స్థితికి తీసుకురావడమే తన ముందున్న తదుపరి లక్ష్యమని ఆయన అన్నారు. ఇప్పటివరకు ఒక అధికారిగా తనకున్న పరిమితులకు లోబడి మాత్రమే పనిచేశానని ఇక ఇప్పుడు బహుజనుల అభ్యున్నతి కోసం ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నట్టు ప్రకటించారు. సాంఘీక సంక్షేమ గురుకులాల్లో అన్యాయానికి అక్రమాలకు తావు లేదని ఒకవేళ తానెక్కడైనా అక్రమాలకు పాల్పడినట్టు రుజువైతే ఉరికంబం ఎక్కేందుకు కూడా తాను సిద్ధమే అని తెలిపారు ప్రవీణ్ కుమార్. తనను ఒకే పోస్టులో ఏడేండ్లు కొనసాగించారంటూ కొందరు చేస్తున్న ఆరోపణలను ఖండించారు ప్రవీణ్ కుమార్. గతంలో చాలా మంది ఇంత కంటే ఎక్కువ కాలం ఒకే పదవిలో ఉన్నారని చెప్పారు. రిటైర్ అయిన వాళ్లు కూడా ఏండ్లకు ఏండ్లకు కీలక పదవులు నిర్వహిస్తున్నారని ప్రవీణ్ కుమార్ చెప్పారు.   ప్రవీణ్ కుమార్ తాజా వ్యాఖ్యలను బట్టి ఆయన రాజకీయ రంగ ప్రవేశం ఖాయమని తెలుస్తోంది. బహుజనులే కేంద్ర బిందువుగా పార్టీ ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు కాబట్టి.. బడుగుల లక్ష్యంగానే పార్టీ ఏర్పాటు చేయవచ్చని సమాచారం. తనకు మద్దతుగా ఉన్న స్వేరో సభ్యుల సహకారంతోనే ఆయన ముందుకు వెళ్లవచ్చని అంటున్నారు. ఇక ప్రవీణ్ కుమార్ భవిష్యత్ అడుగులు త్వరలో జరగనున్న హుజురాబాద్ నియోజకవర్గంలోనూ ప్రభావితం చూపే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. హుజురాబాద్ లో దాదాపు 45 వేల దళిత ఓటర్లున్నారు. ప్రవీణ్ కుమార్ ప్రభావం వాళ్లపై ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేసీఆర్ సర్కార్ తలపెట్టిన దళిత బంధు స్కీమ్ పైనా ప్రవీణ్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేయడం కూడా ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంగా ప్రవీణ్ కుమార్ రాజకీయ అడుగులు ఏ పార్టీకి నష్టం కలిగించబోతుందన్నది ఆసక్తిగా మారింది. 

20 మంది పోలీసులను కాపాడిన ప్రజలు..

ప్రజలకు ఏదైనా ఆపద వస్తే పోలీసులు కాపాడుతారు..మరి పోలీసులకు ఆపద వస్తే ఎవరు కాపాడాలి..?  ప్రజలే కదా.. అవును తాజాగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 పోలీసులను ప్రాణాలతో కాపాడారు ప్రజలు..  ఏఎస్పీ కిరణ్ ఖారే ఆధ్వర్యంలో కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్‌లో 20 మంది పోలీసులతోపాటు, బైంసా యువత సైతం అంటూ ముందుకు వచ్చి  ఎంతో సాయం అందించింది. బాధితులను బైంసాలోని ఎస్సీ హస్టల్ పునరావాస కేంద్రానికి అధికారులు తరలించారు. తెలంగాణలో ఆగకుండా కురుస్తున్న వానలకు నిర్మల్‌తో పాటు బైంసా నీటిలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆటో నగర్‌లో సహాయక కార్యక్రమాలు సాగుతున్నాయి. అయితే, ఈ వరద నీటిలో భైంసా ఎన్‌.ఆర్‌.గార్డెన్‌లో బస చేసిన 20 మంది పోలీసులు వరద నీటిలో చిక్కుకుపోయారు. దీంతో 12 మంది గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి బోట్ల సాయంతో  సాహసం చేసి మరి పోలీసులను రక్షించారు. అంతేకాక, ప్రజల్ని కూడా కాపాడారు. రెండు నాటు పడవల్లో 4 గంటలు శ్రమించి 60 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఏఎస్పీ కిరణ్ ఖారే ఆధ్వర్యంలో కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్‌లో 20 మంది పోలీసులతోపాటు, బైంసా యువత సైతం ఎంతో సాయం అందించింది. బాధితులను బైంసాలోని ఎస్సీ హస్టల్ పునరావాస కేంద్రానికి అధికారులు తరలించారు. భైంసా సమీపంలో గడ్డెన్నవాగు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వస్తుండడంతో అధికారులు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తేశారు. దీంతో భైంసా ఆటోనగర్‌లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. గ‌డిచిన 24 గంట‌ల్లో నిర్మల్ జిల్లాలో వాన దంచికొట్టింది. జిల్లాలోని న‌ర్సాపూర్‌లో అత్యధికంగా 245 మిల్లీ మీటర్ల వాన పడింది. తెలంగాణ వ్యాప్తంగా సరాసరిన 44.2 మి.మీ. వ‌ర్షపాతం న‌మోదు కాగా, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అత్యధికంగా 115.5 మి.మీ. వ‌ర్షపాతం న‌మోదైంది. ఒక్క నిర్మల్ జిల్లాలోనే 204 మి.మీ. వ‌ర్షపాతం న‌మోదైంది. జూన్ 1వ తేదీ నుంచి జులై 22 వ‌ర‌కు రాష్ర్ట వ్యాప్తంగా 474.3 మి.మీ. వ‌ర్షపాతం న‌మోదైంది. రాష్ట్ర వ్యాపితంగా వర్షాలు ఆగకుండా కుండపోతగా పాడడం వల్ల ప్రజల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి.. హైదరాబాద్ లాంటి ముఖ్య సిటీలో ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ ఎదురవుతున్నాయి..

వైఎస్ వివేకా మర్డర్ కేసులో కీలక మలుపు.. 

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో కీలక ములుపు చోటు చేసుకుంది. విచారణ పర్యవేక్షణ అధికారిని సీబీఐ మార్చేసింది. డీఐజీ సుధాసింగ్‌ నుంచి ఎస్పీ రాంకుమార్‌కు కేసు బదిలీ అయ్యింది. వివేకా హత్య కేసులో ఇప్పటికే 44 రోజుల పాటు విచారణ కొనసాగింది. కీలక సమాచారాన్ని సీబీఐ రాబట్టింది. ఇంతలోనే పర్యవేక్షణ అధికారి మార్పు చర్చనీయాశంగా మారింది.  వివేకానంద రెడ్డి హత్య కేసులో కేంద్ర ద‌ర్యాప్తు బృందం కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో విచార‌ణ కొనసాగిస్తోంది. కొన్ని రోజులుగా అక్క‌డే సీబీఐ అధికారులు అనుమానితుల‌ను ప్ర‌శ్నిస్తున్నారు.  ఈ కేసులో మ‌రిన్ని వివ‌రాల‌ను రాబ‌ట్టేందుకు అధికారులు ప్ర‌య‌త్నిస్తున్నారు. 

బీటెక్ విద్యార్థిని సూసైడ్.. 

చదువుకునే పరిస్థితి పోయింది.. చదువునుకొనే పరిస్థితి వచ్చింది.. ఉన్నోడికి చదువు.. లేనోడికి లేదిక బతుకుదెరువు.. ప్రభుత్వాల చేతగాని తనం ప్రైవేట్ సంస్థలకు ఆసరాగా మారింది.. వాళ్లకు ఇష్టమొచ్చినట్లు ఫీజులు వసూలు చేస్తున్నారు.. ఫీజులు కట్టని వాళ్ళను వేధిస్తున్నారు.. ముందు మా కాలేజీ లో చేరండి అని వల్లే విద్యార్థులు దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళ కాలేజీ లో జాయిన్ అయ్యాక విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రైవేట్ కాలేజెస్ యాజమాన్యం కూడా రాజకీయ నాయకుల బాట నడుస్తున్నారు. ఎన్నికల ముందు రాజకీయ నాయకులూ వాగ్దానాలు చేసినట్లు.. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యం కూడా వాగ్దానాలు చేస్తున్నారు. చివరికి విద్యార్థులను ఫీజులు కట్టాలని వేధిస్తున్నారు. తాజాగా  ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జోడిమెట్ల ప్రిన్స్‌స్టన్ కళాశాల యాజమాన్యం వేధింపులు భరించలేక విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. ఫీజు చెల్లించాలని కాలేజీ యాజమాన్యం ఒత్తిడికి చేయడంతో లావణ్య(18).. ఫీజు చెల్లించలేక, తల్లితండ్రులకు భారం కాలేక సెల్ఫీ వీడియో తీసుకొని, ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. వనపర్తి గాంధీ నగర్‌కు చెందిన లావణ్య.. ఘాట్‌కేసర్‌లోని ప్రిన్స్‌స్టన్ ఇంజనీరింగ్ మహిళ కళాశాలలో ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతోంది. తండ్రి వృత్తి రీత్యా వాచ్ మెన్, తల్లి దినసరి కూలిగా పని చేస్తూ వాళ్ళ జీవితం వెల్లడిస్తున్నారు. అయితే చాలీచాలని జీవితాలు వాళ్ళవి అయితే, కళాశాల యాజమాన్యం ఫీజు కట్టాలని వేధింపులకు గురిచేయడంతో 25వేల ఫీజు చెల్లించలేక.. మసస్తాపంతో సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కళాశాల ముందు విద్యార్ధి సంఘాలు ధర్నా  లావణ్య ఆత్మహత్యకు కారణమైన ప్రిన్స్‌స్టన్ కళాశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గురువారం విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో కళాశాల ముందు ధర్నాకి దిగారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు కళాశాలకు చేరుకొని సమస్యను పరిష్కరించారు. ప్రైవేట్ కాలేజీ ఫీజులు నియంత్రణలు ఉంచాలని.. లావణ్యకు జరిగిన అన్యాయం మరో విద్యార్థికి జరగకూడదని విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేశాయి. భార్య, కూతురిని నరికి చంపిన కిరాతకుడు.. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యతో పాటు కన్న కూతురిని ఓ కిరాతకుడు గొడ్డలితో నరికి చంపాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. బోధన్ మండలం పెద్ద మావందికి చెందిన మల్లీశ్వరితో రుద్రూర్‌కు చెందిన గంగాధర్‌తో వివాహం జరిగింది. వీరికి రుత్విక అనే(13)ఏళ్ల కూతురు ఉంది. గంగాధర్ గత కొంతకాలంగా వివాహేతర సంబంధం పెట్టుకున్నదని భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో తరచూ భార్యతో గొడవ పడేవాడు. ఇటీవల పెద్దల సమక్షంలో పంచాయతీ సైతం జరిగింది. అయినా గంగాధర్ అనుమానంతో గురువారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న భార్య మల్లీశ్వరి(30), కూతురు రుత్విక (13)ని దారుణంగా గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం రుద్రూర్ పోలీస్ స్టేషన్‌కి వచ్చి లొంగిపోయాడు. ఘటనా స్థలాన్ని రుద్రూర్ సీఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ రవీందర్‌లు పరిశీలించి కేసు నమోదు చేశారు.

ఉండేది రెండు రోజులు.. మరెందుకీ హంగామా! విశాఖ నుంచి పాలన ఉత్తదేనా? 

అమరావతి ఒక అవినీతి కథ అన్నాడు. విశాఖపట్నం రెడీమేడ్ రాజధాని అన్నాడు. హైదరాబాద్ ఎలాగో మనకు విశాఖ అలాగా అన్నాడు. హైకోర్టు బ్రేకులతో ఆగాడే తప్ప.. లేదంటే అక్కడికి వెళ్లడం కోసం క్షణక్షణం తహతహలాడుతున్నాడు. ముహూర్తాలు పెట్టుకోవడం.. మళ్లీ కుదరక వాయిదా వేసుకోవడం కామన్ అయిపోయింది. ఎంపీగా ఉన్న ఆయన సహచరుడు అయితే విశాఖకు ఆయన వచ్చి తీరతాడు.. ఇక్కడ రాజధాని ఏర్పాటు చేసి తీరతామంటూ తొడగొట్టి చెప్పినట్లే ఇప్పటికి పదిసార్లు చెప్పాడు. క్యాంప్ ఆఫీసు పేరుతోనైనా వచ్చి కూర్చుంటాడని.. అధికార పార్టీ నేతలే చెప్పారు. మరి ఎన్నికల ముందు ఇక్కడే ఉంటానంటూ ఇల్లు కొనుక్కుని తాడేపల్లిలో సెటిల్ అయిన జగన్మోహన్ రెడ్డి.. దానినే ఆఫీసుగా నడిపిస్తున్నారు. ఏ మీటింగు అయినా దాదాపు అన్నీ అక్కడే జరుగుతున్నాయి. ఏ అధికారి కలవాలన్నా, ఏ ఎమ్మెల్యే, నేతలు కలవాలన్నా అక్కడే కలవడం. అటు వైసీపీ సెంట్రల్ ఆఫీసులోకి జగన్ అడుగు పెట్టరు.. ఇటు సచివాలయంలోని సీఎం ఆఫీసులోకి చాలా రేర్ గానే అడుగు పెడుతున్నారు. అంతా తాడేపల్లి నుంచే నడిపిస్తున్నారు. మరి రేపు విశాఖకు వెళ్లిపోతే ఇది కేవలం ఒక క్యాంప్ ఆఫీసుగానే మిగిలిపోతుంది. అలాంటి క్యాంప్ ఆఫీసు కోసం కాలవగట్టు మీద ... సార్ కోట పక్కనే ఉన్న పేదల వందలాది గుడిసెలను పీకేయడం దేనికి? ఇదే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నారు కొందరు. ఒక బాధితురాలు తనకు పరిహారం అందలేదంటూ పవన్ కల్యాణ్ ని కలవడంతోనే.. అరెస్టు చేసి స్టేషన్ లో పెట్టారు. ఆమెను అలా స్టేషన్ నుంచి వదిలిపెట్టి..అర్ధరాత్రి ఆమె ఇల్లు కూల్చేశారు. అలా మొత్తం క్లియర్ చేసేసుకుంటున్నారు. మరి సీఎం గారు విశాఖకు వెళ్లి పాలన చేసేటట్లయితే.. ఇక్కడ కేవలం క్యాంప్ ఆఫీసు మాత్రమే నడిచేటట్లయితే... ఇంత హంగామా దేనికి... ఆ కోట పరిధిని పెంచుకోవడం దేనికి? అక్కడుండే వారి ఉసురు పోసుకోవడడం దేనికి? ఇదే ఎవరికీ అర్ధం కావడం లేదు. మధ్యలో కొన్నాళ్లు స్లో అయిన ఆ పనులు ఇప్పుడు మళ్లీ వేగం పుంజుకున్నాయి. అంటే ఇప్పుడప్పుడే విశాఖకు వెళ్లడం కుదరదని ఫిక్స్ అయిపోయారా? లేక ఉండేది నెలకు రెండురోజులైనా సరే.. మన బెంగళూరు ప్రాసాదంలాగా.. ఇక్కడ కూడా అంతా మన చేతిలోనే ఉండాలి... ఉండేది నలుగురు మనుషులైనా సరే.. కోట లెక్క ఉండాలనే కోరికను తీర్చుకుంటున్నారా? లేక కాబోయే సీఎం అని చెప్పబడుతున్న భారతి మేడమ్ ఇక్కడే ఉండదల్చుకున్నారా? ఇలా రకరకాల చర్చలు నడుస్తూ ఉన్నాయి. బహుశా మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఇదే క్యాంప్ ఆఫీసును కట్టించి ఉంటే.. ఇక్కడ అడుగు కూడా పెట్టేవారు కాదేమో జగన్మోహన్ రెడ్డి. అప్పుడు కట్ట మీద ఉన్న పేదలకు ఈ ముప్పు కూడా వచ్చి ఉండేది కాదు. ఆయన కట్టాడని ప్రజావేదికను కూల్చేశారు... సెక్రటేరియట్ వాడటానికి ఇష్టపడటం లేదు..అసలు అమరావతిలోనే ఉండటానికే ఇబ్బంది పడుతున్నారు. పాతకాలం రాజుల కథల్లో ఇలాంటి మనస్తత్వాలను మనం చూశాం.. మళ్లీ ఇప్పుడే చూస్తున్నామని కొందరు కామెంట్ చేస్తున్నారు. 

రాజీనామాకు యడ్డీ రెడీ.. ఏపీ గవర్నర్ ఆయనేనా ? 

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, ముఖ్యమంత్రి గద్దె దిగేందుకు సిద్దమయ్యారు. ఈ నెల (జులై) 26 తేదీతో ఆయన చివరిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రెండు సంవత్సరాలు పుతవుతాయి.ఆ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఇతర నాయకులకు విందు లాంటి కార్యక్రమం ఏదో ఏర్పాటు చేశారు.ఆ తర్వాత పార్టీ అధిష్ఠానం ఎప్పుడంటే అప్పుడు రాజీనామా చేస్తానని ఆయన స్పష్టమైన సంకేతాలను ఇచ్చారు. జులై 26 తర్వాత పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అయన  ప్రకటించారు.  తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని,, పార్టీ అభివృద్ధే కోసం పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని యడ్యూరప్ప స్పష్టం చేశారు. అంతేకాకుండా, 75 సంవత్సరాల వయసు నిండిన ఎవ్వరినీ  దేశంలో ఎక్కడా అధికారంలో కొనసాగనీయ లేదని, తనకు మాత్రమే ఆ అవకాశం దక్కిందని యడ్యూరప్ప(77) మోడీ, షా, నడ్డా నాయక త్రయానికి కృతజ్ఞతలు కూడా చెప్పారు. అయితే పార్టీ అధిష్ఠానం ఆయనకు, పార్టీ బాధ్యతలు అప్పగిస్తుందా, ఏపీ రాజ్ భవన్’కు పంపుతుందా అనేది ఇంకా తేలవలసి వుంది. యద్యూరప్పను సగౌరవంగా సాగనంపేందుకు, చాలా చాలా చెమటోడ్చిన బీజేపీ అధిష్ఠానం, ఆయన వారసుని ఎన్నికకు కూడా అంతే కష్టపడవలసి ఉంటుందని పార్టీ నాయకులు అంటున్నారు. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా, యడ్యూరప్ప నిస్సందేహంగా రాష్ట్రంలో ప్రజాదరణ ఉన్న పెద్ద నాయకుడు. అంతే కాదు, దక్షిణాదిలో బీజేపీని అధికారంలోకి తెచ్చిన ఘనత కూడా నిస్సందేహంగా యద్యూరప్పకే దక్కుతుందని, ఆస్థాయి నాయకుడు ఇంకెవరు లేరని పార్టీ నాయకులు అంగీకరిస్తున్నారు.  పార్టీ అధిష్ఠానం కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని భావిస్తోందని, అయితే, రాష్ట్ర జనాభాలో 16 శాతం ఉన్న, బీజేపీ ప్రధాన ఓటు బ్యాంక్, యడ్యూరప్పకు పూర్తి పట్టున్న.  లింగాయత్ కమ్యూనిటీని కాదనే పరిస్థితి లేదన్న మాట కూడా వినవస్తోంది. యడ్యూరప్ప, తాను తన వారసుని ఎంపిక  చేయనని, ముఖ్యమంత్రి పదవికి ఎవరి పేరును తాను సూచించనని అన్నారు. అయితే,పార్టీ పునాదులైన లింగాయత్ కమ్యూనిటీపై పూర్తి పట్టున్న ఆయన్ని కాదని బీజేపీ కొత్త ప్రయోగం చేస్తుందా అనేది అనుమానమే అంటున్నారు. అయితే పార్టీ ఢిల్లీ పెద్దలు, ‘సర్ప్రైజ్’ అభ్యర్ధిని తెరమీదకు తెస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. మరోవంక పార్టీ అధినాయకత్వం మాత్రం మూడవ కంటికి తెలియకుండా వారసుని ఎంపిక కసరత్తును చాలా గోప్యంగా సాగిస్తోంది.  కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి వీరే అంటూ చాలా పేర్లే వినిపిస్తున్నాయి. అయితే  విశ్వసనీయ సమాచారం మేరకు, కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషి (బ్రాహ్మణ),బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి (వక్కలింగ) పేర్లు ముందువరసలో ఉన్నాయి. ఈ ఇద్దరు కాకుండా, అనుకోకుండా, ఎంపీ, ఆశించకుండా బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు అయి కూర్చున్న తేజస్వీ సూర్య సహా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బీఎల్ సంతోష్, అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే, గనుల శాఖ మంత్రి మురుగేశ్ నిరానీ, ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ పేర్లు వినిపిస్తున్నాయి. అదలా ఉంటే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న వారు, తమ పేరు మీడియాలో వస్తే సర్ప్రైజ్ ఎలిమెంట్ తప్పిపోయి, ఛాన్స్ మిస్ అవుతామని తమ పేరు మీడియాలో రాకూడదని కోరుకుంటున్నారని, రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీని బట్టి చూస్తే, ఉత్తరప్రదేశ్, అస్సాం,ఉత్తరాఖండ్’ తరహాలలో బీజీపీ అధిష్ఠానం నిజంగానే ఇంతవరకు వినిపించని పేరును పైకి తీసినా ఆశ్చర్య పోనవసరం లేదని ... విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మరోవైపు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జాతీయ కార్యదర్శి సీటీ రవి కార్యాలయం గురువారం సందడిగా కనిపించింది. కర్ణాటక నాయకులు అనేక మంది ఆయనను కలిశారు. దీంతో ఆయనే కాబోయే కర్ణాటక సీఎం అన్న పుకారు జోరుగా షికారు చేసింది. అలాగే కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషి కార్యలయంలోనూ సందడి కనిపించింది. అయితే, ఇందుకు సంబంధించి మీడియా అడిగినప్పుడు రవి , జోషి ఇద్దరూ అలాంటిదేమీ లేదని ముక్తసరిగా చెప్పేసి తప్పించుకున్నారు. అయితే కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నది తేలాలంటే, ఇంకొంత నిరీక్షణ తప్పదంటున్నారు. అంతేకాదు, కాదు .. యడ్యూరప్ప మరోసారి ఢిల్లీ వెళ్లోచ్చిన తర్వాతనే, ఆయన భవిష్యత్ (పార్టీ బాధ్యతా, గవర్నర్ పోస్ట్), అదే విధంగా  రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరన్నది తేలుతుందని .. అంతవరకు కర్నాటకం నడుస్తూనే ఉంటుందని అంటున్నారు.

256 మంది.. కోటీశ్వరులు అయ్యారు.. 

ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయి అనే సామెత వినే ఉంటారు.. కాలం కలిసి వస్తే కటిక పేదవాడు కూడా పెద్ద కోటీశ్వరుడు అవ్వొచ్చు.. అదే కాలం కలిసి రాకుంటే కోటీశ్వరుడు పేదవాడు అవ్వొచ్చు.. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే.. మనకు రోడ్డు మీద కనిపించే చాట్ బండి, టిఫిన్ సెంటర్ ని చూస్తే ఛీ ఇక్కడ ఎవరు తింటారు అని అంటుంటారు.. చిరు వ్యాపారం అంటే అందరికి చిన్నచూపు ఉంటుంది.. కానీ ఈ వార్త విన్న తరువాత మీకు వాళ్లంటే గౌరవం పెరుగుతుంది.. ఒకరు ఛాయ్‌ - సమోసా అమ్ముకునే వ్యక్తి.. మరొకరు ఛాట్‌ బండితో బతుకు బండి లాగిస్తున్న మనిషి.. ఇంకొకరు పండ్లమ్ముకుంటూ పొట్టనింపుకుంటున్న పేదవాడు..! ఇదంతా కేవలం పైకి కన్పించేదే. రోడ్ల పక్కన ఏళ్ల తరబడి చిరువ్యాపారాలు సాగిస్తున్న వీరి ఆదాయం లక్షలు, కోట్లలో ఉంది. అదేంటి అని అనుకుంటున్నారా.. ? అంతే మరి వాళ్ళు ఇతరులకు చూడడానికి పెద్దవాళ్ళు గా అనుకుంటారు గాని వాళ్ళు చాలా రిచ్..  కొందరి వద్ద ఒకటి కంటే ఎక్కువ కార్లు ఉండగా.. మరికొందరికి వందల ఎకరాల్లో సాగు భూమి ఉంది. పేదలుగా పరిగణిస్తున్న చిరువ్యాపారులపై ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు జరపగా.. దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ 250 మందికి పైగా చిరువ్యాపారుల కోటీశ్వరులేనని తేలింది. ఈ మధ్య జీఎస్టీ వచ్చాక హోటల్స్ లో రెస్టారెంట్స్ లో తినడం తగ్గిందనే చెప్పుకోవాలి.. ఎందుకంటే బిల్ ఒక్క ఎత్తు ఐతే జీఎస్టీ పన్ను మరో ఎత్తు అవుతుంది..    వాళ్ళు  రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారిలో కోటీశ్వరులున్నట్లు తరచూ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. అయితే, తాజాగా ఒక చోట ఏకంగా 256 మంది చిరువ్యాపారులకు కోట్ల రూపాయాల్లో ఆస్తిపాస్తులున్నట్లు ఐటీ శాఖ దర్యాప్తులో వెల్లడైంది. వీరంతా ఆదాయపు పన్నులు చెల్లించడం లేదు సరికదా.. జీఎస్‌టీ పరిధిలో లేకపోవడం గమనార్హం. కాన్పూర్‌లోని కొందరు స్క్రాప్‌ డీలర్ల వద్ద మూడేసి కార్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక లాల్‌బంగ్లా ప్రాంతంలోని ఓ స్క్రాప్‌ డీలర్‌, బెకోన్‌గంజ్‌ ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు గత రెండేళ్లలో రూ.10కోట్ల విలువైన ఆస్తులు కొనుగోలు చేసినట్లు తెలిసింది.    ఈ వ్యాపారులు జీఎస్‌టీలో నమోదు చేసుకోలేదు సరికదా.. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించలేదని అధికారులు గుర్తించారు. ఈ 256 మంది చిరు వ్యాపారులు గత నాలుగేళ్లలో ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా  రూ.375 కోట్ల విలువైన ఆస్తులు కొనుగోలు చేసినట్లు అధికారులు దర్యాప్తులో తెలిపారు. ఆర్యనగర్‌, స్వరూప్‌ నగర్‌, బృహానా రోడ్డు వంటి ఖరీదైన కమర్షియల్‌ ప్రాంతాల్లోనే ఈ ఆస్తులు ఉన్నట్లు తెలిసింది. కరోనా మహమ్మారితో యావత్‌ భారతం విలవిల్లాడుతున్న సమయంలో ఆర్యనగర్‌ ప్రాంతానికి చెందిన ఇద్దరు పాన్‌ షాపు యజమానులు, స్వరూప్‌ నగర్‌లో ఒక పాన్‌ దుకాణాదారుడు రూ.5కోట్ల విలువైన ఆస్తులు కొన్నట్లు గుర్తించారు. మాల్‌రోడ్డు ప్రాంతంలో ఓ చిరుతిళ్ల వ్యాపారి పలు ప్రాంతాల్లోని తన బండ్లకు నెలకు రూ. 1.25లక్షల అద్దె చెల్లిస్తున్నట్లు తేలింది. ఓ ఛాట్‌ వ్యాపారికి పెద్ద ఎత్తున భూములు ఉన్నట్లు తెలిసింది.  వాళ్ళు చూడడానికి చిరువ్యాపారులు గాని సంపాదించేది కోట్లల్లో ఉంటుందని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం కన్నుకప్పడానికి కొందరు చిరువ్యాపారులు సహకార బ్యాంకులు, చిన్న మొత్తాల పథకాల సాయం తీసుకుంటున్నారని, మరికొందరు తమ బంధువుల పేర్లతో బినామీల పేరుమీద ఆస్తులు కొనుగోలు చేస్తున్నారని ఐటీ శాఖ దర్యాప్తులో తేలింది. అయితే, వీరి పాన్‌ కార్డులు, ఆధార్‌ కార్డులను పరిశీలించగా.. ఈ ఆస్తుల చిట్టా బయటపడింది. ఉత్తరప్రదేశ్‌లో గతంలోనూ ఇలాంటి కోటీశ్వరులైన ‘పేదవాళ్లు’ గురించి పలుమార్లు కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఇది ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన సంఘటన..  

ఎమ్మెల్యే పదవికి రాజీనామా బలవంతమా? ఈటల భయపడ్డారా?  

తెలంగాణ రాజకీయాలకు ప్రస్తుతం కేంద్రంగా మారిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో ట్విస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజా దీవెన యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ రోజుకో సంచలన ప్రకటన చేస్తూ కాక రేపుతున్నారు. కొన్ని రోజులుగా కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ సర్కార్ పై ఘాటు విమర్శలు చేస్తున్న ఈటల రాజేందర్.. గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేసి రాజకీయ వర్గాల్లో చర్చకు తావిచ్చారు.  ఈటలను తన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు కేసీఆర్. ఆయన నుంచి కనీసం వివరణ కూడా తీసుకోలేదు. కేసీఆర్ తీరుతో రాజేందర్ వెంటనే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తారని అంతా భావించారు. కాని ఈటల మాత్రం చాలా సమయం తీసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత టీఆర్ఎస్ కు , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాని పార్టీకి గుడ్ బై చెప్పారు కాని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. ప్రకటన చేసిన 10 రోజుల తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించారు. ఆ సమయంలో వివిధ పార్టీలు, సంఘాల నేతలతో సమావేశమయ్యారు. తన అనుచరులతోనూ చర్చించారు. ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతో మాట్లాడారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఆలస్యం కావడంతో.. ఆయన రాజీనామా చేయడం లేదనే ప్రచారం కూడా జరిగింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఈటలకు ఇష్టం లేదన్న కథనాలు కూడా బయటికి వచ్చాయి. చివరకి మాత్రం ఈటల రాజీనామా సమర్పించారు. అయితే తాజాగా ఎమ్మెల్యే పదవికి ఈటవ రాజీనామాకు సంబంధించి కీలక అంశాలు బయటికి వస్తున్నాయి. ఈటల రాజేందరే సంచలన విషయాలు చెప్పారు. ఇల్లంతకుంట మండలంలోని మర్రివానిపల్లె సీతంపేట ప్రజలతో మాట్లాడిన ఈటల.. కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ప్రశ్నించే వాళ్లు ఉండొద్దనే తనపై నిందలు వేసి బయటకు పంపించారని అన్నారు. తనంతట తానుగా.. హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదని ఈటల వెల్లడించారు.  టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తేనే.. తాను చేసినట్టు చెప్పారు. అంతేకాదు.. టీఆర్ఎస్ పార్టీని తాను వదలలేదని వదిలేలా వాళ్లే చేశారని చెప్పారు. అయినవాళ్లకు ఆకుల్లో.. కానివాళ్లకు కంచాల్లో పెట్టే కేసీఆర్.. నిజాయితీగా ఉన్నందుకు ప్రశ్నించినందుకే తనను బయటకు పంపించారని అన్నారు. తన రాజీనామాకు సంబంధించి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయవద్దని ఈటల ఎందుకు అనుకున్నారన్నది చర్చగా మారింది. ఉప ఎన్నికలో కేసీఆర్ వ్యూహాలను తట్టుకోలేమని తెలుసు కాబట్టే వద్దనుకున్నారా లేక మరేదైనా వ్యూహం ఉందా అన్న సందేహాలు వస్తున్నాయి. ఎమ్మెల్యే పదవికి తనతో బలవంతంగా రాజీనామా చేయించారని చెప్పడం వల్ల ఈటలలో గెలుపుపై పూర్తి ధీమా లేదని తెలుస్తుందని మరికొందరు చెబుతున్నారు. మొత్తానికి తన రాజీనామాపై ఈటల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.