మొన్న కేంద్ర‌మంత్రి.. నిన్న ఎస్సీ క‌మిష‌న్‌.. జ‌గ‌న్‌తో అంట‌కాగుతున్నారా?

వాళ్లు వ‌చ్చిన ప‌నేంటి? చేస్తున్న‌ది ఏంటి? వాళ్ల‌ను ఏపీకి ర‌ప్పించింది ఎందుకు? రాష్ట్రానికి వ‌చ్చి వాళ్లు ఏం మెసేజ్ ఇస్తున్న‌ట్టు? ఏపీ బీజేపీ బాధ‌లు అన్నీఇన్నీ కావు. రాష్ట్రాంలో వైసీపీతో వార్‌కు దిగుతున్నారు. త‌మ‌కు మ‌ద్ద‌తుగా కేంద్రం నుంచి స‌హాయం కోరుతున్నారు. ఢిల్లీ నుంచి ప‌లువురు పెద్ద‌ల‌ను ర‌ప్పిస్తున్నారు. తీరా వ‌చ్చాక‌.. మేముమేము ఒక్క‌టే అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో రాష్ట్ర బీజేపీ కంగుతింటోంది. వ‌రుస ప‌రిణామాలు ఏపీ బీజేపీకి త‌ల‌నొప్పిగా మారుతున్నాయి.  మొన్న కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి ఏపీలో జ‌న ఆశీర్వాద యాత్ర చేశారు. దాని ల‌క్ష్యం కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను, ప‌నితీరును వివ‌రిస్తూ ఏపీలో బీజేపీని బ‌లోపేతం చేయ‌డం.. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను దెబ్బ‌కొట్ట‌డం. పెద్ద టార్గెటే పెట్టుకొని వ‌చ్చిన కిష‌న్‌రెడ్డి.. చిన్న ప్ర‌భావం కూడా చూపెట్ట‌లేక‌పోయార‌ని అంటున్నారు. ఏపీ స‌ర్కారును పైపైన విమ‌ర్శ‌లు చేసి.. అంత‌లోనే ఏపీ సీఎం జ‌గ‌న్‌రెడ్డి ఇంటికి కుటుంబ స‌మేతంగా వెళ్లి.. క‌డుపునిండా భోంచేయ‌డం విమ‌ర్శ‌ల పాలైంది. బీజేపీ మంత్రి, వైసీపీ ముఖ్య‌మంత్రి ఆతిథ్యం స్వీక‌రించాక‌.. ఇక బీజేపీ-వైసీపీ దొందు దొందేన‌నే ప్ర‌చారం జ‌రిగిపోయింది. ఇంత మాత్రానికి జ‌న ఆశీర్వాద యాత్రతో కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి గానీ, బీజేపీ గానీ సాధించింది ఏముంద‌ని అంటున్నారు. అదే తెలంగాణ‌లో మాత్రం కిష‌న్‌రెడ్డి సీఎం కేసీఆర్‌పై విరుచుకుప‌డ‌టం.. ఏపీలో మాత్రం సీఎం జ‌గ‌న్ ఆతిథ్యం స్వీక‌రించ‌డం.. రెండిటినీ పోలిస్తే వైసీపీతో బీజేపీ అంట‌కాగుతోంద‌నే విష‌యం అర్థ‌మైపోతోంది. తాజాగా, ఏపీలో జాతీయ ఎస్సీ క‌మిష‌న్ ప‌ర్య‌ట‌న సైతం అలానే జ‌రిగిందంటున్నారు. ర‌మ్య మ‌ర్డ‌ర్‌పై బీజేపీ నేత‌ల ఫిర్యాదు మేర‌కే క‌మిష‌న్ ఏపీలో ప‌ర్య‌టించింది. సాధార‌ణంగా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్ర‌భుత్వం వారికి అనుకూలంగా ఉన్న‌వారినే ఇలాంటి క‌మిష‌న్ల‌లో నియ‌మిస్తుంద‌ని అంటారు. కొంద‌రి విష‌యంలో ఇలాంటివి పున‌రావాస కేంద్రాలుగా మారాయ‌నే ఆరోప‌ణ కూడా ఉంది. ఆ విష‌యం ప‌క్క‌న‌పెడితే.. తాజాగా జాతీయ ఎస్సీ క‌మిష‌న్ స‌భ్యులు ర‌మ్య ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు వ‌చ్చారు. అంటే, ఈ కేసులో ప్ర‌భుత్వ స్పంద‌న‌, తీసుకున్న చ‌ర్య‌లపైనా ఎంక్వైరీ జ‌రుగుతుంది. ఏపీ పోలీసుల డైరెక్ష‌న్‌లో విచార‌ణ పూర్తి చేసేసి.. స‌ర్కారుకు క్లీన్‌చీట్  ఇచ్చేసి.. పోలీసుల ప‌నితీరుకు ప్ర‌శంస‌లు కూడా ఇచ్చారు క‌మిష‌న్ స‌భ్యులు. ఆ త‌ర్వాత సీఎం జ‌గ‌న్‌ను క‌లిసి.. శాలువా క‌ప్పించుకున్నారు. ఇక్క‌డే తేడా వ‌స్తోంది. ఇదే జాతీయ ఎస్సీ క‌మిష‌న్ అంత‌కుముందు రోజు తెలంగాణ‌లోనూ ప‌ర్య‌టించింది. ఎమ్మెల్యే మైనంప‌ల్లి ద‌ళిత బీజేపీ మ‌హిళా నాయ‌కుల‌పై దాడి చేశార‌నే ఆరోప‌ణ‌పై విచారించింది. గాంధీ ఆసుప‌త్రిలోనూ ఎంక్వైరీ చేసింది. కానీ, ప్ర‌గ‌తిభ‌వ‌న్ వెళ్లి సీఎం కేసీఆర్‌ను క‌ల‌వ‌లేదు. ఏపీలో మాత్రం అందుకు విరుద్దంగా తాడేప‌ల్లి వెళ్లి సీఎం జ‌గ‌న్‌ను క‌లిసింది ఇదే జాతీయ ఎస్సీ క‌మిష‌న్‌.  మొన్న కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి.. నిన్న జాతీయ ఎస్సీ క‌మిష‌న్‌.. ఢిల్లీ నుంచి వ‌చ్చిన ప్ర‌ముఖులంతా సీఎం జ‌గ‌న్ ఆతిథ్యం స్వీక‌రించ‌డాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కేంద్రం ఏపీ స‌ర్కారుతో అంట‌కాగుతోంద‌నుకోవాలా? రాష్ట్ర బీజేపీ వైసీపీతో ఉత్తుత్తి పోరాటం చేస్తుంటే.. జాతీయ స్థాయిలో బీజేపీ వైసీపీకి ద‌న్నుగా నిలుస్తోంద‌ని భావించాలా? వ‌రుస ప‌రిణామాలు దేనికి సంకేతం? ఏదో తేడాగా ఉందంటున్నారు విశ్లేష‌కులు.   

ఏపీలో ‘రివర్స్ బడ్జెటింగ్’.. లంక దిన‌క‌ర్ సంచ‌ల‌న‌ ఆరోప‌ణ‌లు...

లంక దిన‌క‌ర్‌. ప్ర‌ముఖ చార్టెడ్ అకౌంటెంట్‌. లెక్క‌ల్లో ఎక్స్‌ప‌ర్ట్‌. మాట‌ల్లో ప‌ర్‌ఫెక్ట్‌. ఆయ‌న ఆరోపించారంటే.. అందులో వాస్త‌వం ఉండే ఉంటుంది. ఏపీ స‌ర్కారు బ‌డ్జెట్ లెక్క‌ల్లో లొసుగులు ఉన్నాయ‌ని ఆయ‌న చెప్పారంటే.. ఉన్నాయ‌న్న‌ట్టే. అంత ప‌క్కాగా ఉంటాయి లంక లెక్క‌లు. అంతే సూటిగా, ఘాటుగా కూడా ఉంటాయి ఆరోప‌ణ‌లు. తాజాగా ఆయ‌న ఏపీలో "రివర్స్ బడ్జెటింగ్"  గురించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసి.. కొత్త చ‌ర్చ లేవ‌నెత్తారు. ఏపీలో ఆర్థిక నిర్వాహణ "రివర్స్ బడ్జెటింగ్" లా ఉందని బీజేపీ నేత లంకా దినకర్ ఆరోపించారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్ నుండి కార్పొరేషన్లకి కేటాయింపులుంటాయని.. కానీ, ఏపీలో కార్పొరేషన్ అప్పుల నుంచి బడ్జెట్‌లో పేర్కొన్న వ్యయానికి ఖర్చు చేస్తున్నారని అన్నారు.  కార్పొరేషన్ అప్పులను బడ్జెట్ కేటాయింపుల వ్యయం కోసం చెల్లింపులు చేయడం ఆర్థిక మౌలిక సూత్రాలకు వ్యతిరేకమని లంక దిన‌క‌ర్‌ తెలిపారు. బడ్జెట్ వ్యయాన్ని బడ్జెట్ వసూళ్ల నుండి మాత్రమే కన్సలిడేటెడ్ ఫండ్ ద్వారా చెల్లింపులు చేయాలన్నారు. బడ్జెట్ అప్పులు ఎఫ్.ఆర్.బి.ఎం పరిధిలో చేయాలని.. కాని కార్పొరేషన్‌లో బడ్జెట్‌లో ఆదాయాన్ని చూపి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చి ఫండ్ డైవర్షన్ చేస్తోందని మండిపడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో కార్పొరేషన్ అప్పులు కూడా బడ్జెట్‌లోని అప్పులకు కలిపి ఎఫ్.ఆర్.బి.ఎం పరిధిలో ఉన్నాయో లేదో చూడాలని లంకా దినకర్ అన్నారు.   

రేవంత్‌రెడ్డి ‘రచ్చబండ’.. మూడుచింతలపల్లిలో ముచ్చ‌ట‌..

సీఎం కేసీఆర్ ద‌త్త‌త గ్రామాన్నే ఎంచుకున్నారు. నేరుగా కేసీఆర్‌నే టార్గెట్ చేస్తున్నారు. ముఖ్య‌మంత్రి మాట‌ల‌కు, చేత‌ల‌కు అస‌లేమాత్రం సంబంధం ఉండ‌ద‌ని నిరూపిస్తున్నారు. ఎక్క‌డో గాంధీభ‌వ‌న్‌లో ఉండి ఆ విష‌యం చెబితే ప్ర‌జ‌ల్లోకి స‌రిగ్గా వెళ్ల‌క‌పోవ‌చ్చు. అందుకే, నేరుగా స‌మ‌స్య ఉన్న‌చోటికి వెళ్లారు. సీఎం కేసీఆర్ ద‌త్త గ్రామం మూడుచింత‌ల‌ప‌ల్లిలో పీసీసీ చీఫ్ రెండు రోజులుగా మ‌కాం వేశారు. కేసీఆర్ చెప్పిన క‌ల్ల‌బొల్లి మాట‌ల‌కు.. వాస్త‌వ దుస్థితికి ఎంత తేడా ఉందో ప్ర‌త్య‌క్షంగా ప‌రిశీలించారు. యావ‌త్ తెలంగాణ‌కు ఆ సంగ‌తి తెలిసొచ్చేలా చేశారు. మంగ‌ళ‌వారం మూడుచింత‌ల‌ప‌ల్లిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష చేప‌ట్టారు. దీక్ష అనంత‌రం స‌భ నిర్వ‌హించి కేసీఆర్ స‌ర్కారుపై విరుచుకుప‌డ్డారు. గ్రామంలోని ఇండ్ల‌న్నీ కూల్చేసి.. గ్రామ‌స్తుల‌కు నిలువ‌నీడ లేకుండా చేశార‌ని మండిప‌డ్డారు. క‌ట్టిస్తాన‌న్న‌ డ‌బుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ఏమ‌య్యాయ‌ని నిల‌దీశారు. ఆ సంద‌ర్భంగా అక్క‌డి వారి అవ‌స్థ‌ల‌కు క‌న్నీళ్లు కూడా పెట్టారు రేవంత్‌రెడ్డి. ఫైర్‌బ్రాండ్ లీడ‌ర్‌గా గుర్తింపు ఉన్న రేవంత్‌రెడ్డి.. అలా క‌న్నీళ్లు పెట్ట‌డం మూడుచింత‌ల‌ప‌ల్లిలోని దారుణ ప‌రిస్థితులకు నిద‌ర్శ‌ణం.  మంగ‌ళ‌వారం రాత్రి అదే గ్రామంలోని ద‌ళితవాడ‌లో నిద్ర చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సింప్లిసిటీకి స్థానికులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇక బుధ‌వారం మూడుచింతలపల్లిలో కాంగ్రెస్‌ దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష రెండో రోజుకు చేరింది. రెండో రోజు ఉదయం రచ్చబండ నిర్వహించారు. దళితవాడలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తొలుత కాలనీ అంతా కలియ తిరిగి అక్కడికి పరిస్థితులను పరిశీలించారు. పలువురు దళితులు తమ గ్రామ సమస్యలను రేవంత్‌రెడ్డి ముందు ఏక‌రువు పెట్టారు. ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు.    ఇందిరమ్మ కాలనీలో ఇళ్లలోకి వర్షపు నీరు వస్తోందని.. కాలనీలో రోడ్డు ఎత్తుగా వేయడం వల్లే ఈ సమస్య ఏర్పడిందని కాలనీవాసులు రేవంత్‌ దృష్టికి తీసుకెళ్లారు. పింఛన్లు, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, మూడెకరాల భూమి, ఉద్యోగాలు, పట్టాదారు పాసు పుస్తకాలు తదితర అంశాలపై ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం మేడ్చల్‌ మల్కాజిగిరి కలెక్టర్‌ హరీశ్‌కు ఫోన్‌ చేసి మూడుచింతలపల్లి స్థానిక సమస్యలను వివరించారు. తక్షణమే సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని రేవంత్‌రెడ్డి కోరారు.  

జైలా? బెయిలా? జ‌గ‌న్-ర‌ఘురామ‌ కేసులో ఇవాళే తీర్పు..

ఉత్కంఠ‌. న‌రాలు తెగే ఉత్కంఠ‌. మునుపెన్న‌డూ లేనంత ఉత్కంఠ‌. ఏం జ‌రగ‌బోతోంది? ఇవాళ్టి సీబీఐ కోర్టు తీర్పు ఎలా ఉండ‌బోతోంది? ర‌ఘురామ కోరిన‌ట్టు బెయిల్ ర‌ద్దు అవుతుందా? సీబీఐ.. కోర్టు విచ‌క్ష‌ణ‌కే నిర్ణ‌యాన్ని వ‌దిలేయ‌డంతో.. జైలు త‌ప్ప‌దా? ఇన్నాళ్లూ నిర్మించుకున్న అధికార సౌధం నేటితో కుప్ప‌కూలిపోతుందా? బెయిల్‌పై స్వేచ్ఛగా విహ‌రిస్తున్న తాను ఇక‌ రెక్క‌లు విరిగి నేల కూలిపోతానా? ఇలా సీఎం జ‌గ‌న్‌లో ఉండ‌బ‌ట్ట‌లేని ఉత్కంఠ‌. కేసు అలాంటిది మ‌రి. పిటిష‌న్ అలాంటివాడు మ‌రి. ఎంపీ ర‌ఘురామ ప‌క్కా ఆధారాల‌తో, వాద‌న‌లతో సీబీఐ కోర్టులో గ‌ట్టిగా వాదించ‌డం.. సీబీఐ సైతం జ‌గ‌న్‌కు స‌హ‌క‌రించ‌కుండా బెయిల్ ర‌ద్దు వ‌ద్దు అన‌కుండా త‌ట‌స్థంగా ఉండ‌టం.. జ‌గ‌న్‌లో భ‌యానికి కార‌ణం. వాద‌న‌లు జ‌రిగిన తీరు చూస్తుంటే.. బెయిల్ ర‌ద్దు త‌ప్పేలా లేదంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే సీఎం జ‌గ‌న్‌తో పాటు వైసీపీ నేత‌ల్లో క‌ల‌వ‌రానికి కార‌ణం అవుతోంది. నిన్న రాత్రి.. జ‌గ‌న్‌కు నిద్ర‌లేని రాత్రిగా మారింద‌ట‌. ఉద‌యం నుంచీ సీబీఐ కోర్టు తీర్పు ఎలా ఉంటుందోన‌నే ఆందోళ‌న‌తో ముచ్చెమ‌ట‌లు ప‌డుతున్నాయ‌ట‌. తాడేప‌ల్లి ప్యాలెస్‌లో ఇప్పుడంతా పిన్‌డ్రాప్ సైలెన్స్‌..అట‌. ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై సీబీఐ కోర్టు ఇవాళ (బుధవారం) తీర్పు వెలువరించనుంది. వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలుచేసిన ఈ పిటిషన్‌పై జూలై ఆఖరులో వాదనలు ముగిశాయి. తీర్పును అప్పటినుంచి కోర్టు రిజర్వు చేసింది.  ముఖ్యమంత్రిగా తనకుండే అధికారాలను ఉపయోగించి.. జగన్‌ బెయిల్‌ షరతులు ఉల్లంఘిస్తున్నారని రఘురామ ఏప్రిల్‌ మొదటి వారంలో దాఖలు చేసిన పిటిషన్‌లో ఆరోపించారు. బెయిల్‌ రద్దుచేసి ఆయనపై ఉన్న కేసులను శరవేగంగా విచారించాలని కోరారు. సీఎం హోదాలో జగన్‌ వివిధ కారణాలు చెబుతూ, కోర్టుకు హాజరు కాకుండా డుమ్మా కొడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ విష‌యంలో సీబీఐ ఎలాంటి నిర్ణ‌యం తెల‌ప‌కుండా కోర్టు విచ‌క్ష‌ణ‌కే వ‌దిలేయ‌డం మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారింది. వాద‌న‌లు ముగియ‌డంతో.. తుదితీర్పుకు వేళైంది. సీఎం జ‌గ‌న్‌లో గుండెద‌డ పెరిగిపోయింది.   

అధికారులలో పెరుగుతున్నఅసంతృప్తి.. మరో తెలంగాణ ఉద్యమం తప్పదా? 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఏడేళ్ళలో ఎన్నో  అద్భుతాలు చేసింది. ప్రాజెక్టులు కట్టింది. పరిశ్రమలు తీసుకొచ్చింది. పుట్టిన క్షణం నుంచి ఆఖరి మజిలీ వరకు వరకు ప్రజలకు పెన్నిధిగా నిలిచే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది.అటు అభివృద్ధిలో ఇటు సంక్షేమంలో నెంబర్ వన్ స్టేట్’గా  తెలంగాణ నిలిచింది.. మంత్రులు ఎవరిని అడిగినా  ఇదే కథ వినిపిస్తారు.  ఇంత చేసిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ప్రజలు బ్రహ్మరథం పట్టాలి. మళ్ళీ మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి కావాలని కోరుకోవాలి. ఏ ఎన్నికల్లో అయినా, ఆయన ఏ పూచిక పుల్లను నిలబెట్టినా, ఆయన గడప దాటవలసిన అవసం లేకుండానే గెలిపించి పంపించాలి. కానీ ఒకే ఒక్క అసెంబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నికలో గెలుపు కోసం ముఖ్యమంత్రి ఎంతగా ఆగమావుతున్నారో చూస్తున్నాం.అంటే ఆయన పాలన జన రంజకంగా ఉందో, జన కంటకంగా ఉందో  ఇంకెవరో చెప్పవలసిన అవసరం లేకుండా ఆయనే చూపిస్తున్నారు.  అందుకే  ముఖ్యమంత్రి పాలన అంత గొప్పగా ఉంది కాబట్టే,  ఇండియా టుడే, మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో, ఏకంగా 86 శాతం మంది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తెరాసకు ఓటేయం, ఓడిస్తాం అని శపథం చేశారు. నిజంగా తెరాస ప్రభుత్వం పట్ల ముఖ్యమంత్రి పట్ల జనంలో ఇంత వ్యతిరేకత ఉందా అంటే, హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో ఆయన పడుతున్న హైరానా ఒక సమాధానం అయితే, ఇండియా టుడే సర్వే మరో జవాబు.  అదలా ఉంటే  ప్రభుత్వ లోగుట్లు పక్కగా తెలిసిన ఐఏఎస్, ఐపీఎస్ సహా ఉన్నతాదికారులు, ఉద్యోగాలను వదులుకుని మరీ తెరాస ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ మీద దండయాత్రకు సిద్దమవుతున్నారు. ఇది గమనిస్తే, ముఖ్యమంత్రి సాగిస్తున్న పాలనకు నాలుగు కోట్ల ప్రజలు కోరుకున్న పాలనకు మధ్య ఉండవలసిన పేగుబంధం తెగిపోయిందని మాత్రం చెప్పవచ్చును. ప్రస్తుతం ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణవాది ఆకునూరి మురళీ అయితే, కేసీఆర్ పాలనను ఏకంగా పిచ్చిపాలన అంటున్నారు. కేసీఆర్ పాలన వలన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారని అవేదనతో కూడిన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.  ఒక నెలరోజుల క్రితం ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ కుమార్, ఆరేళ్ళ సర్వీస్ వదులుకుని ఉద్యోగానికి రాజీనామా చేసి బీఎస్పీలో చేరారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై దండయాత్ర చేస్తున్నారు.దొరల గడీలు పగల గొడతామని గర్జన చేస్తున్నారు. దళిత అజెండాతో ముందుకు వెళుతున్న ప్రవీణ్ కుమార్, తెరాస ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన దళిత బంధు పథకాన్ని దగాకోరు పధకంగా పేర్కొన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే ముఖ్యమంత్రి దళితుల పట్ల కపట ప్రేమ చుపుతున్నారని ప్రవీణ్ కుమార్ తీవ్రంగా ప్రభుత్వాన్ని దుయ్య బడుతున్నారు  ఇప్పడు మరో  మాజీ పోలీసు అధికారి జైళ్ళ శాఖ మాజీ డీజీ, పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు వినయ్‌కుమార్‌ సింగ్‌, తెరాస ప్రభుత్వ వైఫల్యాలను బయటపెట్టేందుకు  త్వరలో సద్భావన యాత్ర చేస్తానని ప్రకటించారు. జన సేన సంఘ్ పేరిట స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేసిన ఆయన.. మహా పరివర్తన్‌ ఆందోళన్‌ పేరుతో ప్రజల ముందుకు వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో పని చేయడం ఇష్టం లేకనే బ్యూరోక్రాట్లు వీఆర్‌ఎస్‌ తీసుకుంటున్నారని అన్నారు.  నిజానికి, పైకి కనిపిస్తున్నవి, వినిపిస్తున్నవీ కొద్ది పేర్లే అయినా, ప్రభుత్వ యంతంగంలో కింది నుంచిపై వరకు అనేక మందిలో ఇదే అభిప్రాయం ఉంది. ఒక విధమైన నిరాశ, నిర్లిప్తత, ఇంకా గట్టిగా చెప్పాలంటే, ఆత్మ న్యూనత భావం వ్యక్తమవుతునాయి. ముఖ్యంగా తెలంగాణ  ఉద్యమంలో కీలక పాటను పోషించిన టీఎన్జీఓ నాయకులు, ఉద్యమంలో  పాల్గొన్న ఉద్యోగులు చాలా వరకు కేసీఆర్ పాలన పట్ల అసంతృప్తితోనే ఉన్నారు. ఆందోళన చెందుతున్నారు. ఈ నేపధ్యంలోనే మరో తెలంగాణ ఉద్యమానికి ఉద్యోగులు, మేథావులు సిద్దమవుతున్నారా అంటే అవుననే అంటున్నారు. 

తాలిబాన్ల దగ్గర భారీగా ఆయుధాలు.. భారత్ కు పెను ముప్పేనా? 

ఆఫ్ఘనిస్థాన్ నుంచి రోజుకో దిమ్మతిరిగే వార్త వినిపిస్తోంది. అక్కడ తాలిబాన్లు ఏ అరాచకం చేసినా, ఏ బ్రేకింగ్ లేదా షాకింగ్ న్యూస్ క్రియేట్ చేసినా... అది నేరుగా భారత్ లోనే భయకంపం రేపుతోంది. ఆఫ్ఘనిస్థాన్ నుంచి నాటో దళాలు వెనక్కి వెళ్లిన తరువాత అందరికన్నా ముందుగా సంతోషం వ్యక్తం చేసింది పాకిస్తానే కావడం గమనార్హం. అదీగాక ఐఎస్ఐ మాజీ అధికారి ఒకరు చేసిన ప్రకటన కూడా భారత్ వైపు నుంచి ఆందోళనలకు కారణమవుతోంది. తాజాగా భారీ ఎత్తున ఆయుధాలు డంప్ చేసిన భారీ కంటెయినర్ ముందు కాపలా కాస్తున్న తాలిబాన్ల ఫొటో అనేక అనుమానాలకు తావిస్తోంది. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలెలా ఉంటాయన్న వణుకు పుట్టిస్తోంది.  అమెరికాకు చెందిన వందలాది ఆయుధాలకు పహరా కాస్తున్న తాలిబాన్ల ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ కంటెయినర్లో ఎం-16, ఆర్పీజీ, ఇన్సాస్ వంటి శక్తిమంతమైన ఆయుధాలున్నాయి. వాటిని ఎవరూ ఎత్తుకుపోకుండా సాయుధులైన తాలిబాన్లు, గన్ మెన్లు కాపలా కాస్తున్నారు. ఇటీవలే పంజ్ షీర్ లో తాలిబాన్లకు ఎదురుదెబ్బ తగలడంతో వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాళ్ల అధీనంలో ఉన్న ఆయుధాలను ఎవరూ ఎత్తుకుపోకుండా, ముఖ్యంగా తాలిబాన్ల అరాచకాలను సాగనివ్వమంటూ బహిరంగ సవాల్ విసురుతున్నవారి చేతికి ఆయుధాలు దక్కకుండా చూసేందుకు భారీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  అయితే నెటిజన్ల కామెంట్లు అన్నీ కూడా ఆ ఆయుధాలు అక్కడ ఎందుకున్నాయి.. అనే విషయం చుట్టూ తిరుగుతుండడం విశేషం. అమెరికా, నాటో దళాలు పోతూపోతూ ఈ మారణాయుధాలను ఎందుకు తీసుకెళ్లలేదు? కావాలనే వ్యూహాత్మకంగా తాలిబాన్లకు వదిలేసి వెళ్లిపోయారా? పాకిస్థాన్ కు పరోక్షంగా సహకరించాలన్న ఉద్దేశంతోనే ఆయుధాలు వదిలేసి పోయారా.. అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. 20 ఏళ్లకు పైగా తాలిబాన్లను ఆఫ్ఘనిస్థాన్ లోకి అడుగు పెట్టకుండా చేసిన అమెరికా... ఒప్పందం కుదుర్చుకొని మరీ వెళ్లాల్సిన అగత్యమేంటి? అసలు ఎప్పుడూ అమెరికా మీద విషం చిమ్మే తాలిబాన్లు అమెరికా సైనికులను ఎవిరినీ ఏమీ అనకపోవడంలో మర్మమేంటి.. అల్ ఖైదా నాయకుడు బిన్ లాడెన్ ను తుదముట్టించిన కోపం తాలిబాన్లకు ఉండదంటే నమ్మెదెలా.. మరలాంటప్పుడు అమెరికా వదిలేసిన ఆయుధాలు భవిష్యత్తులో ఎవరిమీదికి ఎక్కుపెడతారు.. లేక నిజంగానే పాకిస్తాన్ ను దారికి తెచ్చుకోవడంలో విఫలం కావడం వల్లే అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో చేతులెత్తేసిందా... ఇలా పరిపరి విధాలా అనుమానాలు బలపడుతున్నాయి. ఈ అనుమానాలే నిజమైతే... అమెరికా భారత్ కు మిత్రదేశంగా ఉండి చేసింది శూన్యమే కదా అన్న వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి.  పలువురు ఇండియన్ పొలిటీషియన్లు తాలిబాన్లను స్వాగతిస్తుండగా... కొందరైతే తాలిబాన్లతో చర్చలు జరపాలంటూ డిమాండ్లు చేస్తుండడం అటు పాకిస్థాన్ కు కలిసొచ్చే అంశంగా మారుతోంది. అంటే ఇకపై పాకిస్థాన్ సైన్యం, అది ఎగదోస్తున్న టెర్రరిస్టులు.. ఇకపై పాక్ భూభాగం నుంచి కాకుండా ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అటు అమెరికా తాలిబాన్లకు సాయం నిలిపివేయవచ్చు కానీ... పాకిస్తాన్ కు చేయి అందిస్తూనే ఉంది. ఇప్పటికీ పాక్ ను వ్యూహాత్మక మిత్రదేశంగానే చెబుతోంది. ఓ మాజీ ఐఎస్ఐ అధికారి మీడియా డిబేట్ లో మాట్లాడుతూ వెల్లడించిన అంశాలు పాక్-అమెరికా మైత్రిని కన్ఫామ్ చేస్తున్నాయి. ఉగ్రవాదుల్ని తుదముట్టించేందుకు అమెరికా బిలియన్ల డాలర్లు విడుదల చేసిందని, కానీ తాము మాత్రం ఆ డబ్బును అందుకోసం ఉపయోగించలేదని అసలు గుట్టు విప్పడం దీంతో పాక్ ఇకపై ఆఫ్ఘన్ భూభూగాన్ని భారత్ పై యుద్ధానికి ఉపయోగించుకోవడం ఖాయమన్న అభిప్రాయాలకు తావిస్తోంది.  ఆఫ్ఘనిస్థాన్ లో పరిణామాలపై అందరికన్ ఎక్కువగా భారతీయులే రియాక్టవుతున్నారు. భారత్ కు ఇప్పుడు శత్రుదేశాల సంఖ్య పెరిగిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆఫ్ఘన్లో పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలించడమే కాక పాక్ పోకడలకు తగినట్టు, అంతర్జాతీయ సమాజం మెప్పు పొందేలా భారత్ వైఖరి ఉండాలంటున్నారు. లేకపోతే రానున్న రోజుల్లో భారత్ భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందన్న భయాందోళనలు వినిపిస్తున్నాయి

అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు రిజ‌ర్వేష‌న్లు.. నెర‌వేరిన చిర‌కాల డిమాండు...

పేద‌రికానికి కులం-మ‌తం అనే తేడా ఉండ‌దు. ఏ కులంలోనైనా పేద‌లు ఉంటారు. కేవ‌లం పుట్ట‌క‌తో అగ్ర‌వ‌ర్ణం అయినంత మాత్రాన ఇక వారు సంప‌న్నులే అని భావించ‌లేం. వారిని ధ‌న‌వంతుల జాబితాలో క‌లిపేసి ప‌ట్టించుకోక‌పోతే ఆ కుటుంబాలు ఎప్పటికీ పేద‌రికం నుంచి బ‌య‌ట‌ప‌డ‌లేదు. అందుకే, దేశ‌వ్యాప్తంగా అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు రిజ‌ర్వేష‌న్లు- ఈడ‌బ్ల్యూఎస్ కోసం ఏళ్లుగా పోరాటాలు జ‌రుగుతూనే ఉన్నాయి. తాజాగా, తెలంగాణ స‌ర్కారు వారికి గుడ్‌న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుపై ఉత్తర్వులు జారీ చేసింది.  ఇక‌పై ప్రభుత్వ నియామకాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయనుంది తెలంగాణ స‌ర్కారు. 8 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న వారికి ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు వర్తించని వారికి ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమ‌ల‌వుతాయి. ఆదాయ ధ్రువపత్రం ఆధారంగా రిజర్వేషన్లకు అర్హత నిర్ణయిస్తారు. ధ్రువపత్రం తప్పుగా తేలితే సర్వీసు రద్దు, చట్టపరమైన చర్యలు ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈడబ్ల్యూఎస్‌ కోటాలో భర్తీ కాకపోతే తదుపరి ఏడాదికి ఖాళీలు బదిలీ చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.   ఈడబ్ల్యూఎస్‌ నియామకాల్లోనూ మహిళలకు 33.33 శాతం కోటా అమలు చేయనున్నారు. ఈడబ్ల్యూఎస్‌ వారికి నియామకాల్లో ఐదేళ్ల వయోపరిమితి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ తరహాలో పరీక్ష రుసుముల్లో మినహాయింపు ఉంటుంది. ఈడబ్ల్యూఎస్‌ కోటాకు అనుగుణంగా విద్యాసంస్థల్లో సీట్ల సంఖ్యను పెంచనున్నారు. నియామకాల్లో రోస్టర్‌ పాయింట్లను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం 50వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు ఉత్తర్వులు జారీచేయడం అగ్ర‌వ‌ర్ణ పేద‌ నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. ఈడబ్ల్యూఎస్ ఎన్నో ద‌శాబ్దాలుగా వినిపిస్తున్న డిమాండ్ నెర‌వేరిన‌ట్టే. అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు ఎంతో ప్ర‌యోజ‌నం చేకూరిన‌ట్టే.  

బంగాళాఖాతంలో భూకంపం.. కాకినాడలో ప్రకంపనలు! తీరంలో డేంజర్ బెల్స్..

బంగాళాఖాతంలో  భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై 5.1తీవ్రతతో భూకంపం రాగా.. చెన్నైలో స్వల్పంగా ప్రకంపనలు నమోదయ్యాయి. మధ్యాహ్నం 12.23 గంటల ప్రాంతంలో భూమి కంపించిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతాల్లోనూ స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ సమీపంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. భూకంపం ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతంలో భూమి కంపించగా.. జనాలు భయాందోళనకు గురయ్యారు. పలు చోట్ల ప్రకంపనలు వచ్చాయని సోషల్ మీడియాలో ట్వీట్లు వెల్లువెత్తాయి. తిరువన్మియూర్ఆళ్వార్‌పేట్, చెన్నైలోని సుముద్ర తీర ప్రాంతానికి దగ్గరలో ప్రకంపనలు వచ్చాయని వచ్చినట్లు ట్వీట్లలో పేర్కొన్నారు. భూకంపంతోనే ప్రకంపనలు వచ్చినట్లు ఐఎండీ చెన్నై శాఖ ధ్రువీకరించింది. ప్రకంపనలపై అధ్యయనం చేస్తున్నామని చెప్పింది. భూకంపం కాకినాడకు ఆగ్నేయంగా 296 కిలోమీటర్లు, చెన్నైకి ఈశాన్యంగా 320 కిలోమీటర్ల భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. అయితే, సముద్ర అలలను పరిశీలిస్తున్నామని.. ముందస్తుగా సునామీపై అంచనా వేయలేమని తెలిపింది. ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం లేదని ఏపీ అధికారులు తెలిపారు. సునామీ వస్తుందని వాట్సప్ ద్వారా జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు.

సీఎం కేసీఆర్ పై మూడు సీబీఐ కేసులు? 

తెలంగాణ కాంగ్రెస్ నేతలు మరింత స్పీడ్ పెంచారు. సీఎం కేసీఆర్ టార్గెట్ గా వరుస కార్యక్రమాలు నిర్వహిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన మేడ్చల్ జిల్లా మూడు చింతల పల్లిలో ఆయన దీక్షకు దిగారు. రేవంత్ దీక్షకు కాంగ్రెస్ ముఖ్య నేతలంతా హాజరయ్యారు. సీఎం కేసీఆర్ పై ఘాటైన విమర్శలు చేశారు. కేసీఆర్ ను అవినీతిని వెలికి తీస్తామని కొంత కాలంగా చెబుతున్న కాంగ్రెస్ నేతలు.. ఈ విషయంలో మరింత దూకుడుగా వెళుతున్నారు. మూడు చింతలపల్లి దీక్షలో మాట్లాడిన నేతలు కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసి కాక రాజేశారు.  కొడంగల్ నియోజకవర్గంలో కుట్రలు కుతంత్రాలు చేసి కేసీఆర్ తనను ఓడించారని చెప్పారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కొడంగల్ లో కాంగ్రెస్ ను ఓడిస్తే.. అక్రమాలకు అడ్డు అదుపు ఉండదని భావించారన్నారు .దత్తత ముసుగులో  గజ్వేల్ ప్రాంతాన్ని కేసీఆర్  వంచిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దత్తత తీసుకున్న గ్రామాల్లో 57 ఏళ్లకే ఫించన్లు, మూడెకరాల భూమి , ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం అమలు చేసినట్లు నిరూపిస్తే.. ముక్కు నేలకు రాస్తానని చెప్పారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అంటున్న.. కేసీఆర్ మేడ్చల్ జిల్లా లో ఒక్క డిగ్రీ కాలేజ్ పెట్టలేదన్నారు రేవంత్ రెడ్డి. ధనిక రాష్ట్రంగా తెలంగాణను ఇస్తే అప్పుల ఊబిలోకి నెట్టారన్నారు.  తెలంగాణ ఉద్యమ ముసుగులో కేసీఆర్ కుటుంబం దోచుకుంటుందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు బాధితులకు పదివేల పరిహారం అని చెప్పి పక్కన పెట్టారని విమర్శించారు. హైదరాబాద్ మాదిరిగా హుజురాబాద్ లో కూడా మోసం చేస్తారన్నారు. పదివేలు ఇవ్వలేని వ్యక్తి.. పది లక్షల రూపాయలు ఇస్తడా అని రేవంత్ ప్రశ్నించారు. ధనిక రాష్ట్రమని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. హుజురాబాద్ ఉపఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు లబ్ధిదారుల జాబితా కొనసాగుతుందన్నారు రేవంత్ రెడ్డి. ఓట్లు వేస్తే.. పది లక్షల అని లిటిగేషన్స్ పెడతారన్నారు. గజ్వేల్ కు ఎట్ల వస్తరని అంటున్నారు.. వస్తా వచ్చే నెల గజ్వేల్ వచ్చి తీరుతానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దామోదర రాజనర్సింహ గజ్వేల్ సభ తేదీ రెండు రోజుల్లో చెబుతాడు.. వచ్చి తీరుతానన్నారు. అడ్డం ఎవడు వస్తే.. వాన్ని తొక్కుకుంటా వెళ్తా.. లేకపోతే నేను గుండు కొట్టించుకుంటానని రేవంత్ శపథం చేశారు.   రేవంత్ వచ్చాక కాంగ్రెస్ కు కొత్త ఉత్సహం వచ్చిందన్నారు పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య. దత్తత అంటే.. ఊరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని.. కాంగ్రెస్ హయాంలో చాలా గ్రామాలూ అలా చేసి చూపించామన్నారు. ఒక్క వర్గానికి డబ్బులిస్తాం అని చెప్పడం అవివేకమన్నారు పొన్నాల. తాము లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని.. కేసీఆర్.. డబుల్ బెడ్ రూమ్ లు ఎక్కడ ఇచ్చావో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ నువ్వు చేసిన ద్రోహాలకు  పురుగులో పడి చస్తావ్ అంటూ శాపనార్ధాలు పెట్టారు పొన్నాల లక్ష్మయ్య. కేసీఆర్ చేసిన పూజలు కూడా ఆయనను కాపాడలేవన్నారు. కేసీఆర్ పై మూడు కేసులున్నాయని 2014లోనే సీబీఐ  ప్రకటించిందని పొన్నాల చెప్పారు. రానున్న రోజుల్లో కేసీఆర్ కు  జైలు జీవితం ఖాయమన్నారు. తన కోసమే వరంగల్ లో  కొత్త జైలు కేసీఆర్ కట్టుకుంటున్నారని పొన్నాల సెటైర్లు వేశారు. సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నది మూడు చింతలపల్లి గ్రామాన్ని కాదు.. మంత్రి మల్లారెడ్డిని అని పీసీసీ ప్రచార కమిటి చైర్మెన్ మధు యాష్కీ గౌడ్ అన్నారు.  దత్తత గ్రామంలోనే దళితులకు మూడెకరాల భూమి, డబల్ బెడ్రూమ్ లు లేవన్నారు. దగా, మోసం తో దళితులకు కేసీఆర్  మరోసారి మోసం చేస్తున్నారని మధు యాష్కి విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన శ్రీకాంతాచారి తల్లికి ఎమ్మెల్సీ ఇవ్వలేదు కాని.. ఉద్యమంలో రాళ్లు వేసిన కౌశిక్ రెడ్డి కి ఇచ్చాడన్నారు. టీఆర్ఎస్ , బీజేపీ లు ఒకే నాణేనికి బొమ్మ, బొలుసు లాంటివన్నారు. ఒకరు రాష్ట్రంలో విలువైన భూములు అమ్ముతుంటే.. కేంద్రంలో ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారని  మధు యాష్కి మండిపడ్డారు. 

కంటతడి పెట్టిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. 

తెలంగాణ పీసీసీ చీఫ్ ,ఫైర్ బ్రాండ్ లీడర్ రేవంత్ రెడ్డి కంట తడి పెట్టారు. పంచ్ డైలాగులతో ప్రత్యర్థులకు సవాల్ విసిరే రేవంత్ రెడ్డి కంట తడి పెట్టడం ఏంటనీ అనుకుంటున్నారా.. కాని ఇది నిజం. నిరుపేదల కుటుంబాలకు సీఎం కేసీఆర్ చేసిన మోసం తెలిసి ఆయన కంట తడి పెట్టుకున్నారట. కేసీఆర్ దత్తత గ్రామమైన మేడ్చ్ జిల్లా మూడు చింతలపల్లిలో దీక్ష చేపట్టిన రేవంత్ రెడ్డి.. దీక్షా స్థలి వేదికపైనే కన్నీళ్లు కార్చారు.  గతంలో సీఎం కేసీఆర్ చిన్న ముల్కనూర్ ను దత్తత తీసుకున్నారు. అందరికీ ఇండ్లు కట్టిస్తానని చెప్పి, ఇండ్లన్నీ కూల్చివేశాడు. అయితే ఇప్పటివరకు అక్కడ ఇండ్లు కట్టలేదు. దీంతో చిన్న ముల్కనూరును సందర్శించారు రేవంత్ రెడ్డి. అక్కడ తనకు ఎదురైన అనుభవాలను చెబుతూ కన్నీరు కార్చారు. సీఎం కేసీఆర్ అదేశాలతో ఇండ్లు కూల్చివేయడంతో చిన్న ముల్కనూరులో ఆడపిల్లలు స్నానం చేసేందుకు కూడా సౌకర్యం లేని పరిస్థితి కల్పించాడన్నారు. తాను చిన్న ముల్కనూర్​కు వెళ్లినప్పుడు సీఎం కేసీఆర్​ హామీతో ఇంటిని కూల్చివేసిన కుటుంబం బాధ నన్ను కలిచి వేసిందని రేవంత్​రెడ్డి  వివరించారు. ఆ కుటుంబం చిన్న గుడిసె వేసుకుని బతుకుతుందని, ముగ్గురు ఆడపిల్లలు స్నానాలు చేసేందుకు బాత్రూంలు లేక గుడిసె పక్కన నాలుగు తడకలు వేసుకుని స్నానాలు చేస్తుంటే పక్కపొంటి ఇండ్ల మగ పొరగాళ్లు చూస్తూ ఎగతాళి చేశారని, ఈ విషయం తనకు చెప్పుతుంటే కండ్లలో నీళ్లు తిరిగాయని రేవంత్​రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. వీటన్నింటికీ బాధ్యుడు కేసీఆర్​ అని, కేసీఆర్​ను వంగపెట్టి చెప్పుతో కొట్టాలని ఆగ్రహంతో మాట్లాడారు రేవంత్ రెడ్డి.  గజ్వేల్​పై కాంగ్రెస్​జెండా ఎగురవేయాలని రేవంత్​రెడ్డి పిలుపునిచ్చారు. మూడు చింతలపల్లి గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నా ఇక్కడ కాంగ్రెస్​నేతలు స్థానిక సంస్థల్లో గెలిచారని గుర్తు చేశారు. సీఎం దత్తత గ్రామాల్లో ఒక్క సమస్య కూడా తీర్చలేదని విమర్శించాకర మూడుచింతలపల్లి, లక్ష్మాపూర్​, కేశవాపూర్​ గ్రామాలను సీఎం దత్తత తీసుకున్నా కాంగ్రెస్​ కార్యకర్తలు గెలిచారంటే ఎంత మేరకు అభివృద్ధి చేశారో అర్థమవుతుందన్నారు. కేసీఆర్​ఎర్రవల్లి ఫాంహౌస్​కు వెళ్లేందుకు రోడ్డు వేసుకునేందుకే ఈ మూడు గ్రామాలను దత్తత తీసుకున్నాడని ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలు పింఛన్లు ఇచ్చారంటూ చెప్పుతున్నారని, కానీ ఈ గ్రామాల్లో ఎంత మందికి పింఛన్లు ఇచ్చారో తెలుపాలని సవాల్​విసిరారు. ఈ రెండు రోజులు ఇక్కడే ఉంటానని, ఎంత మందికి పథకాలు అందుతున్నాయో ఇంటింటికీ వెళ్లి చూద్దామన్నారు. మూడు చింతలపల్లిలో "దళిత, గిరిజన ఆత్మ గౌరవ దీక్ష " పేరుతో  రేవంత్ రెడ్డి దీక్ష చేపట్టారు. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు ఇది  జరగనుంది. దీక్షా శిబిరంలో రేవంత్ రెడ్డి కి ఇరువైపులా దళిత, గిరిజన నాయకులు కూర్చున్నారు. పీసీసీ నేతలంతా హాజరయ్యారు. దళిత బస్తీలో రాత్రి బస చేయనున్నారు  రేవంత రెడ్డి. బుధవారం ఉదయం కాంగ్రెస్ నేతలతో కలిసి దళిత వాడలలో పర్యటించనున్నారు. దళిత వాడలోని కుటుంబాలతో నేరుగా మాట్లాడనున్నారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం చేపట్టిన దళిత బంధుపైనా అభిప్రాయాలను తెలుసుకోనున్నారు.  సీఎం దత్తత గ్రామానికే కెసిఆర్ ఏమీ చేయలేదు , అలాంటిది రాష్ట్రానికి ఏం చేస్తారనే చర్చ పెట్టనున్నారు. 

తాలిబన్లను ఏకాకుల్ని చేసే కిటుకు ఇదే..ప్రపంచానికి పెద్ద గండమే?

తాలిబన్ల దురాగతాలతో ప్రపంచ ప్రజలు వణికిపోతున్నారు. మహిళలతో మర్యాదగా వ్యవహరిస్తామన్న వారి వాగ్దానం అమలు ఎక్కడా కనిపించడం లేదు. జర్నలిస్టులను సైతం చంపేస్తున్నారు. తాజాగా అమెరికా-నాటో దళాల సైనికులకూ ప్రాణహాని ఉందన్న ఆందోళన పెరుగుతోంది. వారిదగ్గరున్న ఆధునిక వెపన్స్ లాక్కొని భారీ ఎత్తున పరేడ్ నిర్వహించడం ప్రపంచ దేశాల నేతల్లో వణుకు పుట్టిస్తోంది. ఆఫ్ఘనిస్థాన్లోని జబుల్ ప్రావిన్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఈ సంస్కృతి ఆఫ్ఘనిస్థాన్ అంతటా విస్తరిస్తుందని, ఆఫ్ఘనిస్థాన్ ను అహర్నిశలూ కాపాడిన విదేశీ దళాల్ని వెంటాడే ప్రక్రియ మొదలైందన్న ఆందోళన అన్ని దేశాల్లో విస్తరిస్తోంది. కరోనా వైరస్ కంటే ప్రమాదకరంగా జిహాద్ అనే వైరస్ ప్రపంచమంతటా పాకిపోయిందని, దాన్నుంచి బయటపడాలంటే ప్రపంచ దేశాలన్నీ సరిహద్దు భేదాలు విస్మరించి ఐక్యంగా కదలాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి. అందుకున్న ఏకైక మార్గం తాలిబన్లను ఏకాకుల్ని చేయడమేనంటున్నారు. తాలిబన్లు కేవలం గల్ఫ్, ఇస్లామిక్ దేశాల్లోనే గాక అమెరికా, కెనడా, అన్ని యూరోప్ దేశాల్లో బలంగా పాతుకొని పోయారు. అక్కడ శిక్షణా శిబిరాలు కూడా నిర్వహిస్తున్నామని, వారిని ఆఫ్ఘనిస్థాన్లో పైలట్లుగా, సైనికులుగా రిక్రూట్ చేసుకుంటామని తాలిబన్ సుప్రీమ్ లీడర్ హైబతుల్లా అఖుంద్జాదా అంతర్జాతీయ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. టర్కీ, జర్మనీ, ఇంగ్లాండ్ దేశాల నుంచి తాము వెంటనే రిక్రూట్ మెంట్లు ప్రారంభిస్తామన్నారు. అయితే ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ వంటి పలు యూరోప్ దేశాలు ఇస్లామిక్ టెర్రరిస్టులను కట్టడి చేసేందుకు ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాయి. అయినా చాపకింద నీరులా, ఎవరి కంటికీ కనిపించకుండా అనేక రూపాల్లో ఇస్లామిక్ టెర్రరిజం విస్తరిస్తోంది. ఈ విషయమే ఇప్పుడు ప్రపంచ దేశాధినేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తక్షణమే ఈ మహమ్మారికి బ్రేకులు వేయకపోతే కరోనా కంటే వేగంగా మానవాళికి నష్టం కలుగుతుందన్న ఆందోళన పెరుగుతోంది.  తాజాగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రపంచం ముందు సరికొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు మరింత దీక్షగా పని చేయాల్సి ఉందని, నూతన మార్గాలు అన్వేషించాల్సి ఉందని కూడా అన్నారు. అలాగే అధునాతనమైన, సృజనాత్మకమైన ఆయుధాలను కూడా రూపొందించాలని, ఇందుకోసం ప్రైవేటు సంస్థలు ముందుకు రావాలని ఆయన అభిప్రాయపడటం... సమస్య తీవ్రతను తెలియజేస్తోంది.  అయితే ఇలా ఏ దేశానికి ఆ దేశం విడివిడిగా ఆయుధాలు సమకూర్చుకోవడం, కొత్త తరహా ఆయుధాలను సేకరించుకోవడం తప్పేమీ కాదని.. కానీ అంతకన్నా కీలకమైన అంశం మరోటి ఉందని, ఆ దిశగా చర్యలు చేపడితే తాలిబన్ల దూకుడుకు శాశ్వతంగా కళ్లెం వేయొచ్చని పలువురు ఎకాలజిస్టులు, ఎకాలజీలో పరిశోధనలు చేస్తున్న సైంటిస్టులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సముద్ర తీరాన్ని ఆనుకొని ఉన్న అన్ని దేశాలూ కూడబలుక్కొని తక్షణమే ఆ చర్యలు చేపట్టాలని వారు సూచిస్తున్నారు.  ఆల్గేతో ఆయిల్ ఉత్పత్తి చేస్తే తాలిబన్లు భూస్థాపితమే.. అదెలాగంటే!సముద్రంలో తయారయ్యే నాచును ఆల్గే అంటారు. ఈ ఆల్గేతో ఎన్నో రకాల లాభాలున్నాయని శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రయోగపూర్వకంగా రుజువు చేశారు. అమెరికాలోని టెక్సాస్ ప్రయోగశాలల్లో దీన్నుంచి విజయవంతంగా బయో ఫ్యూయెల్ ను ఉత్పత్తి చేసి ఔరా అనిపించుకున్నారు. ఆల్గే క్రూడాయిల్ నుంచి అన్ని రకాల పెట్రో ఉత్పత్తులూ తీయవచ్చని రుజువైంది. డీజిల్, పెట్రోల్, విమానాల్లో ఉపయోగించే పెట్రోల్, కిరోసిన్.. ఇలా అన్ని రకాల ఫ్యూయెల్స్ తయారు చేయవచ్చు. అయితే ప్రపంచ దేశాలన్నీ చమురు కోసం గల్ఫ్ దేశాల మీదే ఎందుకు ఆధారపడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థంతా చమురు చుట్టూనే తిరుగుతున్న విషయం ప్రపంచ ప్రజలందరికీ తెలిసిందే. అగ్రరాజ్యాలన్నీ పోటీ పడుతూ గల్ఫ్ దేశాలతో కొన్ని లోపాయికారీగా, మరికొన్ని డైరెక్టుగా చెట్టపట్టాలేసుకొని ప్రయాణిస్తున్నాయి. అయితే తాలిబన్ ముప్పును దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఆయా అగ్రదేశాలు అదే చమురు కోసం ఇప్పటికే ప్రయోగపూర్వకంగా రుజువైన ఆల్గే చమురు మీద దృష్టి సారించాలని, తక్షణమే ఆల్గే చమురు ఉత్పత్తుల యూనిట్లను సముద్ర తీరంలో ఉన్న అన్ని దేశాలూ ఏకకాలంలో ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు.  ఆల్గే ఫ్యూయల్ ఇలా తయారవుతుంది ఈ నాచు కేవలం సముద్రంలోనే తయారవుతుంది కాబట్టి తీరదేశాలకు అతిగొప్ప అడ్వాంటేజీ అవుతుంది. తీరం నుంచి దాదాపు 20 కి.మీ. వరకు ఉండే అన్ని గ్రామాలకు, పట్టణాలకు, నివాస ప్రాంతాలకు సముద్ర జలాలను పైప్ లైన్స్ ద్వారా సరఫరా చేయాలి. ఆ నీటిని ఇళ్ల మీద, డాబాల మీద లేదా ప్రత్యేకంగా కట్టిన ట్యాంకుల మీదికి కనెక్ట్ చేయాలి. పైన ట్రాన్స్ పరెంట్ టబ్స్ ను ఏర్పాటు చేసి, ఆ టబ్బుల్లోకి సీ వాటర్ పంపాలి. అందులో ఆల్గే సీడ్ ను వేయాలని... ఆ సీడ్ త్వరితంగా, నాణ్యంగా పెరగడానికి, స్వచ్ఛమైన బయో ఫ్యూయల్ రావడానికి దేశీయ ఆవు-పేడల మిశ్రమాన్ని కలపాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల నాలుగైదు వారాల్లోనే ఆల్గే అద్భుతంగా ఎదుగుతుంది. ఆ తరువాత దాన్ని నీడలో పూర్తిగా ఆరబెట్టాలి. పూర్తిగా ఆరిపోయి గలగలలాడుతున్న నాచును మిషన్స్ ద్వారా ప్రెస్సర్స్ లోకి పంపిస్తే దాన్నుంచి నాణ్యమైన క్రూడాయిల్ ఉత్పత్తి అవుతుంది. ఆ క్రూడాయిల్ నుంచే పెట్రోల్, డీజిల్, కిరోసిన్, విమానాల్లో వాడే పెట్రోల్, వాహనాల ఇంజిన్లలో వాడే ఆయిల్.. ఇలా అనేక రకాల ఉత్పత్తులు, ఉపఉత్పత్తులను తీసుకోవచ్చు. ప్రభుత్వమే పూనుకొని ప్రతి ఇంటి మీద కూడా దీన్ని పెంచేలా ప్రోత్సహిస్తే ప్రపంచవ్యాప్తంగా ఇదో అతిపెద్ద కుటీర పరిశ్రమగా ఏర్పడుతుందని వారు సూచిస్తున్నారు. కొత్త స్టార్టప్స్ కి ఇంతకన్నా గొప్ప అవకాశమే ఉండదని కూడా వారంటున్నారు. దీనిద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయంటున్నారు. ఫ్యూయల్ తో పాటు పిప్పి (ఆల్గే కేక్స్) ని అనేక రకాల ఆహారపదార్థాలుగా వాడుతున్నారంటున్నారు. జపాన్ లో ఇప్పటికే ఆల్గేతో వినూత్నరీతిలో ఫుడ్ ప్రోడక్ట్స్ తయారుచేసి లాభాలు గడిస్తున్నారు. పలు ఇతర దేశాల్లో కూడా ఆల్గే ఫుడ్ కు డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు గల్ఫ్ దేశాలను వెనుకనుండి శాసిస్తున్న బడా చమురు వ్యాపారులకు తీవ్రమైన ఎఫెక్ట్ పడుతుందని, ఫలితంగా తాలిబన్లకు సహాయ సహకారాలు అందించే శక్తులు నిర్వీర్యమైపోతాయని అంటున్నారు. దానివల్ల తాలిబన్లకు భారీఎత్తున వెళ్లే విరాళాలకు బ్రేక్ పడుతుందని, శిక్షణ శిబిరాలు, ఆయుధ సరఫరా ఆగిపోతాయని అంటున్నారు.  ఆల్గే చమురుతో అదనపు లాభాలు ఆల్గే నాచు పంట కోసం దేశీయ ఆవుపేడ, మూత్రం వాడాల్సి ఉంటుంది కాబట్టి.. గోరక్షణకు సహకరిస్తుంది. వాటి నుంచి వచ్చే ఇతర ఉత్పత్తులతో ప్రజారోగ్యం పరిఢవిల్లుతుంది. ఆవుల కోసం గడ్డి కావాలి కాబట్టి అందుకోసం వరి పంట వేయాల్సి వస్తుంది. దీంతో ఈ పంట కూడా ఆటోమేటిగ్గా వృద్ధి చెందుతుంది. ఆవు నుంచి వచ్చే ఇంకా ఇతర ఉత్పత్తులన్నీ మరింత సులువుగా ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. అన్నింటికన్నా ముఖ్యంగా పర్యావరణానికి ఏమాత్రం హాని చేయని అసలు సిసలైన బయో ఫ్యూయల్ తయారవుతుంది. దీనిద్వారా రోజుకు కొన్ని వేల కోట్ల టన్నుల వ్యర్థ పదార్థాలు, కర్బన ఉద్గారాలు పర్యావరణంలోకి కట్టుదిట్టంగా చెక్ పడుతుంది. ప్రపంచ దేశాలన్నీ పర్యావరణం కోసం ప్రతియేటా కేటాయించే నిధుల్లో కోత పడి ఆర్థిక వృద్ధి మరింత వేగం పుంజుకుంటుంది. ప్రజలకు ఎకో సెస్ బాధ తప్పుతుంది.  మరి ఇప్పటిదాకా ఇండియా ఏం చేసింది? ఒక వినూత్నమైన ప్రయోగం గానీ, ప్రోడక్ట్ గానీ వస్తుందంటే అందరికన్నా ముందు బ్రేకులు పడేది ఇండియాలోనేననే నానుడి అందిరికీ తెలిసిందే. ఇండియాలోని చాలా మంది ఎకాలజిస్టులకు, శాస్త్రవేత్తలకు ఈ విషయం తెలిసినా.. ఆ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడానికి బ్యూరోక్రాట్లే అడ్డుకుంటున్నారని, ఇంతకుముందుకంటే ఇప్పుడు కాస్త పీపుల్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ వచ్చినా కూడా... వటవృక్షంలా వేళ్లూనుకున్న జాతీయ, అంతర్జాతీయ రాజకీయ ఒత్తిళ్లు, లంచగొండితనం వంటి కారణాల వల్ల ఈ విషయం ఢిల్లీ బాసుల దృష్టికి వెళ్లడం లేదని భారతీయ ఎకాలజిస్టులు వాపోతున్నారు. గత సెప్టెంబర్ లో భారత ప్రధాని నరేంద్రమోడీ హోస్టన్ లో పర్యటించినప్పుడు ఎన్నారై వ్యాపారవేత్తలను కలిశారు. అయితే  ఆ సందర్భంగా ఆల్గే బయో ఫ్యూయల్ పై చర్చించాల్సి ఉండగా.. అప్పుడు కూడా ఈ అంశం ప్రస్తావనకు రాలేదని విశ్వసనీయ సమాచారం. ఒకవేళ కచ్చితంగా అక్కడే ఈ విషయం చర్చకు వచ్చినట్టయితే దాని ఫలితం మరోలా ఉండి ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  ఏమైనా ప్రపంచమంతా ఇప్పుడు ఉమ్మడిగా ప్రమాదంలో చిక్కుకున్న తరుణంలోనైనా సముద్ర తీర దేశాలన్నీ ఒక్కటిగా ఆలోచించి ప్రపంచ శత్రువును తుదముట్టిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ( టి.రమేశ్ బాబు, సీనియర్ జర్నలిస్టు)

కేంద్ర‌మంత్రి అరెస్ట్‌.. బీజేపీకి శివ‌సేన‌ దిమ్మ‌తిరిగే షాక్‌...

మ‌రాఠా టైగ‌ర్‌తో పెట్టుకుంటే అంతే. కేంద్రంలో అధికారంలో ఉన్నాం క‌దా అని.. పులి ముందు తోక జాడిస్తే ఊరుకుంటుందా? వెంటాడి..వేటాడేస్త‌ది. మ‌హారాష్ట్ర‌లో ఇప్పుడు అదే జ‌రుగుతోంది. కేంద్ర‌మంత్రి అయ్యాన‌నే జోరులో నారాయ‌ణ రాణే మ‌హారాష్ట్ర సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేపై నోరు పారేసుకున్నారు. నోటికి ప‌ని చెప్ప‌డం.. దాడులు చేయ‌డం.. జ‌న్మ‌హ‌క్కుగా భావించే శివ‌సేన అధినాయ‌కుడినే చెంప ప‌గ‌ల‌గొడ‌తాన‌న‌డంతో ర‌చ్చ మొద‌లైంది. శివ‌సైనికులు క‌మ‌ల‌నాథుల‌పై రెచ్చిపోయారు. వెంట‌నే  పోలీసులు యాక్ష‌న్‌లోకి దిగిపోయారు. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారంటూ కేంద్ర‌మంత్రి నారాయ‌ణ రాణేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ విష‌యం ముందే గ్ర‌హించి.. ముంద‌స్తు బెయిల్ కోసం కేంద్ర‌మంత్రి కోర్టును ఆశ్ర‌యించినా ఉప‌యోగం లేకుండా పోయింది. నారాయ‌ణ రాణే అరెస్టులో మ‌హారాష్ట్ర‌లో బీజేపీ వ‌ర్సెస్ శివ‌సేన వివాదం.. జ‌గ‌డంగా మారింది.  మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేపై కేంద్రమంత్రి నారాయణ రాణే అనుచిత వ్యాఖ్యలు చేశారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా కేంద్రమంత్రి నారాయణ రాణే రాయ్‌గఢ్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఆగస్టు 15న సీఎం ఠాక్రే చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ముఖ్యమంత్రికి స్వాత్రంత్యం ఎప్పుడు వచ్చిందో కూడా తెలియకపోవడం సిగ్గుచేటు. స్వాత్రంత్య దినోత్సవం నాడు రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఠాక్రే.. మధ్యలో వెనక్కి తిరిగి స్వాత్రంత్యం వచ్చి ఎన్నేళ్లయిందని ఆయన సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆ రోజు నేను అక్కడ ఉంటేనా.. ఆయన చెంప పగలగొట్టేవాడిని’’ అని రాణే తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. కేంద్రమంత్రిపై శివసేన నేతలు మండిపడుతున్నారు. తానేం తప్పూ చేయలేదంటూ తన వ్యాఖ్యలను మరోసారి సమర్థించుకున్నారు నారాయ‌ణ రాణే.     సీఎంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగానూ కేంద్రమంత్రిపై త‌క్ష‌ణ‌మే చర్యలు తీసుకోవాలంటూ నాసిక్‌ పోలీస్‌ కమిషనర్ త‌న సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉదయం నాసిక్‌ పోలీసుల బృందం రత్నగిరి వెళ్లింది. కేంద్ర‌మంత్రిని అదుపులోకి తీసుకొని.. అరెస్ట్ చేయ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. బీజేపీ, శివ‌సేన‌ల గొడ‌వ ఎక్క‌డికి దారి తీస్తుందోన‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. మరోవైపు కేంద్రమంత్రి వ్యాఖ్యలతో ముంబయిలో భాజపా, శివసేన కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గాలు వీధుల్లో పరస్పరం దాడులకు దిగారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. ముంబయిలోని రాణే నివాసం ముందు శివసేన కార్యకర్తలు నిరసనకు దిగారు. ఆయన నివాసానికి పోలీసులు భద్రత పెంచారు.   కేంద్ర‌మంత్రి నారాయ‌ణ రాణే అరెస్టుపై బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మండిప‌డ్డారు. బీజేపీ కార్యాలయాలపై శివ‌సైనికులు దాడి చేస్తే సహించబోమన్నారు. హింసపై తమకు నమ్మకం లేదని చెప్పారు. దాడులు చేసి తమను బెదిరించలేరని, తాము మౌనంగా ఉండబోమని హెచ్చ‌రించారు. పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలన్నారు దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌.

కేటీఆర్ కు సీఎం యోగం లేనట్లేనా? అడ్డుకుంటున్నది వాళ్లేనా? 

అంతేనా ఇక కేటీఆర్’కు ఇప్పట్లో  ముఖ్యమంత్రి యోగం లేనట్లేనా, హుజూరాబాద్’ ఎపిసోడ్’ ప్రారంభానికి ముందు మిణుకు మిణుకు అంటున్న ఆశలు ఇప్పుడు పూర్తిగా ఆవిరై పోయినట్లేనా? అంటే, అంతేగా’ అనే సమాధానమే వస్తోంది. ఇప్పుడున్న పరిస్థితులలో  ‘నా పార్టీ .. నా ఇష్టం’ అనే పరిస్థితిలో ముఖ్యమంత్రి కేసీఆర్ లేరు. అలా అనుకునే  కేటీఆర్  పట్టాభిషేకానికి, అవరోధంగా ఉన్నారన్న ఉద్దేశంతో, ఈటల పై వేటు  వేశారు. అయితే, అది ఎవరి అదృష్టమో, ఇంకెవరి దురదృష్టమో కానీ, ఈటల పై వేసిన వేటు, కేటీఆర్, రహదారిని పూర్తిగా బ్లాకు చేసేసింది. ఇప్పుడు, కేటీఆర్ ముఖ్యమంత్రి కుర్చీ చేరుకోవాలనే, అరడుగుల బులెట్ ను దాటుకుని ముందుకు పోవాలి.. అది అయ్యే పని కాదు. ఇప్పడు  హరీష్ రావును కాదని ముఖ్యమంత్రి ముందుగు  వేసే పరిస్థితి లేదంటున్నారు అంతర్గత విశ్లేషకులు.    సో.. ముఖ్యమత్రి కుర్చీలో కూర్చునేందుకు కేటీఅర్ కనీసం మరో రెండున్నర సంవత్సరాల పాటు ఆగక తప్పదు. అంతవరకు ముఖ్యమంత్రి కుర్చీ వైపు దూరం నుంచి  చూస్తూ ఉండడమే కాని, కూర్చునే ఛాన్స్ మాత్రం లేదని, అయన సన్నిహిత వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. అంతే కాదు, అందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటినుంచే వ్యూహరచన చేస్తునారని కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. గత (2018) అసెంబ్లీ ఎన్నిల్లో ఎక్కడ బీరపోకుండా సిట్టింగులు అందరికీ, టిక్కెట్ ఇచ్చిన కేసీఆర్, ఈసారి, కొద్ది మంది పూర్ణ విధేయులకు తప్పించి, మిగిలిన అన్ని సీట్లలోనూ, కేటీఆర్ నాయకత్వానికి జై కొట్టే, ‘యువత’ కు అవకాశం ఇస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  ఇటీవలనే రాజకీయ అరంగేట్రం చేసి, బీఎస్పీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఐపీఎస్ అధికార ప్రవీణ్ కుమార్, ద్వారా బీఎస్పీతో పొత్తు పెట్టుకుని దళిత ఓటుపై పట్టు పెంచుకునేందుకు  కూడా ఇప్పటినుంచే వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. ఈ అన్నిటినీ మించి  హుజూరాబాద్ గండం గట్టెక్కిన తర్వాత, హరీష్ రావును రాజ్య సభకు పంపి, ప్రధాన అడ్డంకిని తొలిగించుకుంటారనీ అంటున్నారు. అయితే, అప్పటికి రాజేవరో, రెడ్దేవరో పరిస్థితులు ఎలా మరాతాయో ఇప్పుడే ఉహించడం కష్టం. రాజకీయాలు డైనమిక్ గా, మారిపోతుంటాయి.  తప్ప నిశ్చల చిత్రాల్లా కదలని బొమ్మలా ఉడి పోవు, కాబట్టి రేపటి కథ రేపు అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు.  అయితే ఎవరికి ఇష్టం ఉన్నా, ఎవరికీ లేకున్నా, ప్రాంతీయ ,కుటుంబ పార్టీలలో నాయకుడి సంతానమే వారసుడు అవుతారు. ఇందులో ఎలాంటి అనుమానాలు, మినహాయింపులు ఉండవు. దేశానికి ఆ కొసనున్న జమ్మూ కశ్మీర్, ఈ కొసనున్న తమిళ నాడు వరకు  ఇదే ‘సంప్రదాయం’ కొనసాగుతోంది. ఇందుకు తెలంగాణ, తెరాస మినహాయింపు కాదు. అయితే, ఎంత కుటుంబ పార్టీనే అయినా, కొన్ని కొన్ని సందర్బాలలో కుటుంబంలోనే వారసత్వ తగవు తలెగరేస్తుంది. ఉత్తర ప్రదేశ్’లో సమాజవాదీ పార్టీలో, ములాయం వారసత్వం కోసం, అయన కుమారడు అఖిలేష్ యాదవ్, సొదరుడు శివపాల్ యాదవ్ మధ్య కొంత ఘర్షణ చోటు చేసుకుంది. అఖిలేష్ అంతిమ విజేత అయ్యారు. అలాగే, తమిళనాడులో కరుణానిధి కుమారులు స్టాలిన్, అలిగిరి, కుమార్తె కణిమోళీ మధ్య కొంత కాలం  ముక్కోణ పోటీ, ఇంకొంత కాలం బ్రదర్స్ ఇద్దరి మధ్య ముఖాముఖి పోరాటం సాగింది. స్టాలిన సక్సెస్ మాత్రమే కాదు,  సక్సెసర్ కూడా అయ్యారు.  అలాగే, బీహార్’లో లాలూ  కుమారులు  తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్’ల వారసత్వ వార్ నడిచింది. తేజస్వి గెలిచారు ... అయితే, ఎక్కడైనా, “జో జీతేగా ఓయీ సికిందర్’ అన్నట్లు, గెలిచిన వారే  యువ రాజయ్యారు. రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకు పోయారు. పోతున్నారు. ప్రస్తుతం కల్వకుట్ల ఫ్యామిలీ పార్టీ తెరాస వారసత్వం కోసం కూడా ద్విముఖ, త్రిముఖ కాదు ఏకంగా  చతుర్ముఖ పోటీ జరుగుతోందని అంటున్నారు.. ఇక్కడైనా అంతే జో జీతేగా వోయీ సికిందర్. అది కేటీఅర్ కావచ్చు, హరీష్ కావచ్చు, కవిత, సంతోష్ ఎవరైన కావచ్చును, ఇది ప్రగతి భవన్ గేటు లోపలి మాట.

ఆదాయం సరే అప్పుల మాటేంటీ! జీతాలకు కటకటేంటీ హరీష్..  

నిజమే కావచ్చు తెలంగాణ  రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు చెప్పుకున్నట్లుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెలిగి పోతున్నది నిజమే కావచ్చును. ఆర్థిక వృద్ధి రేటులలో, తలసరి ఆదాయం, అన్నిటినీ మించి అప్పులు చేయడంలో, చేసిన అప్పులను సద్వినియోగం చేసుకోవడంలో, ఆర్థిక క్రమశిక్షణ పాటించడంలో, దేశానికే కాదు, ప్రపంచానికే  తెలంగాణ ప్రభుత్వం ఆదర్శం నిలిచిన మాట నిజమే కావచ్చును.అలాగే, విపక్షాలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి కాదు, ప్రజల నాతని నుంచి వస్తున్న మాటనే, ప్రతిపక్ష పార్టీల నాయకులు మీడియా ముఖంగా వినిపిస్తున్నారు. సర్కార్ చెవిన వేస్తున్నారు ప్రతిపక్షాలు అడిగాయనో, ఆరోపించాయనో కాకుండా, ఏది నిజం , ఏది కాదు అనే ఆత్మపరిశీలన చేసుకోవడం ప్రభుత్వానికి మరీ ముఖ్యంగా, ఆర్థిక మంత్రి  హరీష్ రావుకు అవసరం.   నిజానికి, రాష్ట్ర ఆర్థిక పరిస్థతి మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థ కూడా అంతే అద్వాన్నంగానే ఉంది, నిరర్ధక అస్తులనే బిళ్ళను మెడలో వేసి, ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టాలనే ఆలోచనకు కేంద్రం వచ్చిందంటే మోడీ ప్రభుత్వం ఆర్థిక స్థితి ఎంత ‘అందం’ గా వుందో వేరే చెప్పనక్కరలేదు. అయితే, ఇందుకు పూర్తిగా ప్రభుత్వాల విధానాలే కారణమని చెప్పడం కుదరదు.  సుమారు 18 నెలలకు పైగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కొవిడ్ మహమ్మారి, అన్ని దేశాలతోపాటు, మన దేశాన్ని, మన ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బ తీసింది. అసలే, అంతత మాత్రంగా ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ, కొవిడ్ దెబ్బకు మరింతగా కుదేలైంది. ఇదే పరిస్థితి రాష్ట్రంలోనూ ఉంది. రాష్ట్రంలో ఉన్న పరిస్థితే దేశంలో ఉంది దేశంలో ఉన్న పరిస్థితే ప్రపంచంలో ఉంది.  అయితే, అధికార పార్టీలో వచ్చిన అంతర్గత విబేధాలు, కుటుంబ పార్టీలో వచ్చిన కుటుంబ కలహాల కారణంగా ఒకే ఒక్కఅసెంబ్లీ స్థానానికి వచ్చిన ఉప ఎన్నిక కోసం, వేల కోట్ల రూపాయలు కుమ్మరించడం, దానిని కప్పిపుచ్చుకునేందుకు, ధనిక రాష్ట్రమని జబ్బలు చరుచుకోవడం అవసరమా అన్నదే ఇక్కడ ప్రశ్న. కాదు, నిజంగానే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్భుతంగా, అమోఘంగా ఉందని అనుకుంటే,  ప్రతిపక్ష పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు చేసిన సవాలును ఆర్థిక మంత్రి హరీష్ రావు స్వీకరింఛి చర్చకు వస్తే హుందాగా ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  ఆర్థిక మంత్రి హరీష్ రావు చెప్పుకున్న గొప్పలను ఒప్పుకుంటూనే, బీజీపీ దుబ్బాక ఎమ్మెల్యే  రఘునందన్ రావు కొన్ని నిర్దిష్ట ఆరోపణలు చేశారు. అఫ్కోర్స్, రఘునందన రావు చెప్పిందంతా సత్యమని కాదు, కానీ, ఆయన ప్రస్తావించిన  విషయాలు చాలావరకు బహిరంగ రహస్యాలే. ప్రతి రోజు పత్రికలలో పతాక శీర్షికలలో వస్తున్న వార్తలే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలు, పన్నుల వాటాలు, పంకాలు వంటి సామాన్య ప్రజలకు అంతగా అర్థంకాని, విషయాలను పక్కన పెట్టినా, పబ్లిక్ డొమైన్ లో ఉన్న విషయాలకు అయినా సమాధానాలు చెప్పవలసిన అవసరం, రాష్ట్ర్ర ప్రభుత్వం మంత్రి హరీష్ పై ఉందని  అంటున్నారు.  తెలంగాణ ధనిక రాష్ట్రమే అయితే.. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తారీఖున ఇవ్వాల్సిన జీతాలు, వారం, పది రోజులు ఆలస్యంగా ఎందుకిస్తున్నారు, అలాగే, ఉద్యోగుల పీఆర్సీ అమలులో ఎందుకు జాప్యం జరిగింది?  కేజీబీవీ, మోడల్ స్కూళ్ల టీచర్లకు సంవత్సరం పైగా  జీతాలు ఎందుకు ఇవ్వడం లేదు,  జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లకు బిల్లులు ఎందుకు చెల్లించడం లేదు, చివరకు ఏకగ్రీవం అయిన గ్రామ పంచాయతీలకు ఇస్తామన్న పది లక్షల నజరానా ఇవ్వక పోవడం వలన, అప్పులు చేసి పనులు చేసిన  సర్పంచ్లు సెక్యూరిటీ గార్డ్ లుగా, కూలీలుగా  ఎందుకు మారుతున్నారు.. బతకడానికి  వేరే రాష్ట్రాలకూ ఎందుకు వెళ్తున్నరు, పంచాయతీ సెక్రటరీలు, రైతులు ఎందుకు  ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఇవే రఘునందన అడిగిన,  హరీశ్ సమాధానం చెప్పవలసిన ప్రశ్నలు.అదే విధంగా 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసిన ‘నిరుద్యోగ భృతి’ అవసరం ఏమిటని కాదు, ఎందుకు ఇవ్వలేదని  మాత్రమే రఘునందన రావు ప్రశ్నించారు. నిజానకి బీజేపీ ఎమ్మెల్యే  ప్రస్తావించిన అంశాలు, కొత్తవేమీ కాదు, పత్రికలలో పతాక శీర్షికలలో వచ్చిన అంశాలనే ఆయన ప్రస్తావించారు.   తెలంగాణలో ఆర్థిక క్రమక్షణ లోపించిందని కాగ్ చెప్పిన విషయాన్ని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలెండర్ ధరలలో, రాష్ట్ర ఖజానాకు ఎంత మొత్తం చేరుతుందో  హరీష్ రావు చెప్పారు. ఆయన, చెప్పిన దాట్లో అసత్యం ఉంటే హరీష్ రావు బహిరంగ చర్చకు రావాలని లేదంటే, ప్రభుత్వ ప్రతిష్ట, ముఖ్యమంత్రి ప్రతిష్ట దిగజారతాయని తెరాస నాయకులు కూడా లోలోన మదన పడుతున్నారు. అన్నిటినీ మించి తెలంగాణ ప్రభుత్వం , ఆర్థిక రంగంలో ఎదుర్కుంటున్న ప్రధాన ఆరోపణ, అప్పులు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారనేది కామన్ ఆరోపణ, అయితే హరీష్ రావు, తెలంగాణ ఆదాయం గురించి గొప్పగా చెప్పుకున్నారే, అప్పుల విషయం ఎందుకు చెప్పలేదు, విలేకరులు అడిగినా జవాబు ఎందుకు దాటవేశారు? అయితే, ఇటు రాష్ట్రం అయినా అటు కేంద్రమే అయినా, రాజకీయ ప్రయోజన్ల  కోసం, రాష్ర్గ, దేశ  ప్రయోజనాలను విస్మరించడం, పరస్పర నిందలతో దేశ ప్రతిష్టను దిగజార్చే స్థితికి  తాము దిగజారడం, మంచిది కాదు, గౌరవం కాదు. ముఖ్యంగా, ప్రస్తుత పరిస్తులలో అసలే కాదు.

బాబు బ‌స్సుయాత్ర‌, లోకేశ్ పాద‌యాత్ర‌, బాల‌య్య సైకిల్‌యాత్ర‌.. జ‌గ‌న్‌పై ముప్పేట దాడి?

టీడీపీలో స‌ర్వేల జోష్ మామూలుగా లేదు. తెలుగు త‌మ్ముళ్ల‌లో రెట్టించిన ఉత్సాహం క‌నిపిస్తోంది. సీఎం జ‌గ‌న్ గ్రాఫ్ ఢ‌మాల్ అవ‌డంతో టీడీపీలో కొత్త ఆశ‌లు చిగురిస్తున్నాయి. ఇటు ఇండియా టుడే స‌ర్వే.. అటు లోక‌ల్ యాప్ పోల్‌తో.. జ‌గ‌న్‌పై ఉన్న ప్ర‌జావ్య‌తిరేక‌త స్ప‌ష్ట‌మైంది. మూడ్ ఆఫ్ ది నేష‌న్ స‌ర్వేలో ఏకంగా జ‌గ‌న్ ర్యాంక్ 11వ స్థానానికి ప‌త‌నం అవ‌డం.. కేవ‌లం 6 శాతం మంది మాత్ర‌మే జ‌గ‌న్ బెస్ట్ సీఎం అని అభిప్రాయ‌ప‌డ‌టం వైసీపీని క‌ల‌వ‌రానికి గురి చేస్తే.. టీడీపీలో క‌ద‌నోత్సాహం నెల‌కొంది. ఇదే మంచి స‌మ‌యంగా భావిస్తున్న తెలుగుద‌ళం.. జ‌గ‌న్‌పై దూకుడు మ‌రింత పెంచేలా వ్యూహాలు రెడీ చేస్తోంది.  ఇప్ప‌టికే టీడీపీ అధినేత చంద్ర‌బాబు జూమ్ మీటింగ్స్‌లో ఫుల్ యాక్టివ్‌గా ఉన్నారు. ఇక టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ దూకుడు మామూలుగా లేదు. బాడీ లాంగ్వేజ్‌తో పాటు పొలిటిక‌ల్ లాంగ్వేజ్ కూడా అమాంతం మార్చేశారు లోకేశ్‌. ఫుల్ ఫిట్‌గా మారి.. షార్ప్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఎక్క‌డ ఏ స‌మ‌స్య వ‌చ్చినా.. ఎక్క‌డ ఎవ‌రికి ఏ క‌ష్ట‌మొచ్చినా.. రెక్క‌లు క‌ట్టుకొని వాలిపోతున్నారు. జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు ఆగ‌డాల‌ను ట్వీట్ల‌తో కుళ్ల‌బొడుస్తున్నారు. అందుకే, వైసీపీ గ్రాఫ్ ఎంత‌లా ప‌డిపోతోందో.. టీడీపీ ఇమేజ్ అంత‌లా పెరిగిపోతోంది. స‌ర్వేల్లో ఆ విష‌యం స్ప‌ష్టం కావ‌డంతో టీడీపీలో హుషారు మామూలుగా లేదు.  ఇదే జోరును కంటిన్యూ చేసేతా.. పార్టీ పెద్ద‌లు వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నార‌ని తెలుస్తోంది. జ‌గ‌న్ ప్ర‌భుత్వ పాల‌న‌ను జ‌నంలో ఎండ‌గ‌ట్టేలా ఎత్తుగ‌డ‌లు ర‌చిస్తున్నార‌ట‌. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు మ‌రో రెండున్న‌రేళ్లు స‌మ‌యం ఉన్నా.. ఈలోగా ఏ సీబీఐ కేసులోనే జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు అయి జైలుకు వెళితే.. ప్ర‌భుత్వం కుప్ప‌కూలిపోయి ఏ క్ష‌ణంలోనైనా ఎన్నిక‌లు వ‌చ్చే ఛాన్స్ ఉండ‌టంతో టీడీపీ శ్రేణులు అల‌ర్ట్ అవుతున్నారు. స‌మ‌యం లేదు త‌మ్ముళ్లూ అంటూ చంద్ర‌బాబు స‌మ‌రోత్సాహంతో దూకుడు పెంచుతున్నారు. అందులో భాగంగా.. మ‌రోసారి నేరుగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లే ఆలోచ‌న చేస్తున్న‌ట్టు స‌మాచారం.  గ‌తంలో సుదీర్ఘ పాద‌యాత్ర చేసి విజ‌యకేత‌నం ఎగ‌ర‌వేశారు చంద్ర‌బాబు. అయితే, ప్ర‌స్తుతం ఆయ‌న వ‌య‌సు పాద‌యాత్ర‌కు స‌హ‌క‌రించ‌లేక‌పోవ‌చ్చు. అందుకే, బ‌స్సుయాత్ర చేస్తే ఎలా ఉంటుంద‌ని ఆలోచ‌న చేస్తున్నార‌ని తెలుస్తోంది. త‌న‌తో పాటు త‌న రాజ‌కీయ వార‌సుడినీ ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర చేసేలా.. నారా లోకేశ్‌తో పాద‌యాత్ర చేయించాల‌ని చూస్తున్నార‌ట‌. అంత‌ర్గ‌తంగా జ‌రుగుతున్న ఈ చ‌ర్చ బాల‌కృష్ణ దృష్టికి కూడా వ‌చ్చింద‌ట‌. నేనుసైత‌మంటూ బాల‌య్య సైతం యాత్ర‌కు సై అంటూ తొడ‌గొట్టార‌ని అంటున్నారు. బావ బ‌స్సుయాత్ర‌.. అల్లుడు పాద‌యాత్ర చేస్తే.. తాను సైకిల్ యాత్ర చేయాల‌ని భావిస్తున్నార‌ట‌.  యాత్ర‌ల‌తో పాటు ఎవ‌రెవ‌రు ఏయే ప్రాంతాల్లో ప‌ర్య‌టించాల‌నే దానిపైనా ఓ అవ‌గాహ‌న‌కు వ‌చ్చార‌ని అంటున్నారు. అమ‌రావ‌తి కేంద్రంగా.. తాడేప‌ల్లి ప్యాలెస్ టార్గెట్‌గా.. ఆంధ్రా రీజియ‌న్‌లో నారా లోకేశ్ పాద‌యాత్ర చేస్తార‌ట‌. విజ‌య‌సాయిరెడ్డి ఏలుబ‌డిలో ఉన్న‌ ఉత్త‌రాంధ్ర‌లో టీడీపీకి ఊపు తెచ్చేందుకు స్వ‌యంగా చంద్ర‌బాబే రంగంలోకి దిగి బ‌స్సు యాత్ర నిర్వ‌హిస్తార‌ని తెలుస్తోంది. ఇక‌.. సీమ సింహంలా బాల‌కృష్ణ మీసాలు మెలేసి.. రాయ‌ల‌సీమ‌ను సైకిలెక్కి చుట్టేస్తార‌ట‌. ఇలా ఆ ముగ్గురు.. మూడు ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తూ.. ప్ర‌జ‌ల‌ను సమీకృతం చేస్తూ.. టీడీపీని బ‌లోపేతం చేస్తూ.. జ‌గ‌న్‌రెడ్డిపై ముప్పేట దాడికి సిద్ద‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది. ప‌రిస్థితుల‌ను చూస్తుంటే.. టీడీపీలో స‌ర్వేలో జోష్ మామూలుగా లేదనిపిస్తోంది. ఇక‌, ముగ్గురు మొన‌గాళ్ల యాత్ర‌లతో జ‌గ‌న్‌రెడ్డికి ద‌బిడి దిబిడే...అంటున్నారు.    

తెలంగాణకు కొత్త గవర్నర్? కేసీఆర్ కు ఇక చుక్కలేనా? 

తెలంగాణ గవర్నర్ మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలోనూ గవర్నర్ ను మార్చుతున్నారని ప్రచారం జరిగినా అది జరగలేదు. తాజాగా మాత్రం గవర్నర్ మార్పుతో పాటు కొత్తగా ఎవరూ వస్తారన్నది ప్రచారం సాగుతోంది. తెలంగాణపై స్పెషల్ ఫోకస్ చేసిన బీజేపీ.. సీఎం కేసీఆర్ కు చుక్కలు చూపించాలని డిసైడ్ అయిందని అంటున్నారు. అందులో భాగంగానే కొత్త గవర్నర్ ను నియమించబోతున్నారని చెబుతున్నారు. కొత్తగా వచ్చే గవర్నర్ తో కేసీఆర్ ఇబ్బందులు తప్పవనే చర్చ కూడా బీజేపీ వర్గాల్లో సాగుతోంది.  తెలంగాణకు ప్రస్తుతం తమిళి సై గవర్నర్ గా ఉన్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన తమిళి సై..  2019 సెప్టెంబర్ 8న తెలంగాణ గవర్నర్ గా  బాధ్యతలు చేపట్టారు. గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఆమె పని చేశారు. తమిళనాడులో బీజేపీ బలోపేతానికి కృషి చేయడంతో అమె పనితీరును గుర్తించిన కేంద్రం ఆమెకు తెలంగాణ గవర్నర్ గా అవకాశం ఇచ్చింది. తమిళ సై  ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతమైన పుదిచ్చేరి కి కూడా ఇన్ చార్జి గవర్నర్ గా కొనసాగుతున్నారు. కొన్ని రోజులుగా తమిళి సై హైదరాబాద్ కంటే పుదిచ్చేరిలోనే ఎక్కువగా ఉంటున్నారు. దీంతో ఆమెకు అక్కడే పూర్తి బాధ్యతలు అప్పగించనున్నారని..  తెలంగాణకు కొత్త గవర్నర్ గా  యడ్యూరప్పను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి ఇటీవలే రాజీనామా చేశారు. 75 సంవత్సరాల దాటిన తరువాత అధికారంలో కొనసాగొద్దనే నిబంధనతో ఆయన సీఎం పదవి నుంచి తప్పుకొన్నారు. దీంతో ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని కేంద్రం అప్పుడే మాటిచ్చింది. అనుకున్నట్లుగానే అయనకు తెలంగాణ గవర్నర్ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఆర్ఎస్ఎస్ విభాగానికి చెందిన యడ్యూరప్ప 1970 లో విద్యార్థి దశ నుంచే పనిచేస్తున్నారు. అక్కడి నుంచి పార్టీలో వివిధ కీలక బాధ్యతలు నిర్వహించి సీఎం స్థాయికి ఎదిగారు. కర్ణాటకకు నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మూడుసార్లు విపక్ష నేతగా కొనసాగారు. కొన్నాళ్ల కిందట బీజేపీ నుంచి బయటకు వెళ్లిన ఆయన సొంత పార్టీ పెట్టారు. అది సక్సెస్ కాకపోవడంతో తిరిగొ సొంత గూటికి చేరుకున్నారు.  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత పనిచేసిన గవర్నర్లు  నరసింహం తమిళ సై ఇద్దరూ  తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారే. ఇప్పుడు యడ్యూరప్ప కూడా తెలంగాణతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారే. నాలుగు సార్లు సీఎంగా చేసిన వ్యక్తికి తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు అప్పగిస్తుండడంపై ఆసక్తి చర్చ సాగుతోంది. గత గవర్నర్లు నరసింహన్, తమిళి సైలతో సీఎం కేసీఆర్ మంచి సంబంధాలు కొనసాగించారు. కాని యడియూరప్పతో అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చని అంటున్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ.. తమ రాజకీయ ఎత్తుగడలో భాగంగానే యడియూరప్పను నియమించాలని డిసైడ్ అయిందని అంటున్నారు. యడియూరప్ప గవర్నర్ గా వస్తే సీఎం కేసీఆర్ కు కొన్ని ఇబ్బందులు తప్పవనే చర్చ సాగుతోంది.  గతంలో పుదిచ్చేరి, పశ్చిన బెంగాల్ లో అధికారం కోసం ప్రయత్నాలు చేసిన బీజేపీ.. అక్కడ పవర్ ఫుల్ గవర్నర్లను నియమించింది. బెంగాల్ గవర్నర్ ... అక్కడి సీఎం మమతతో యుద్ధమే చేశారు. పుదిచ్చేరిలోనూ గవర్నర్ కిరణ్ బేడీకి అక్కడి కాంగ్రెస్ సీఎంతో నిత్యం గొడవలే జరుగుతూ ఉండేవి. ఇటీవలే పుదిచ్చేరిలో బీజేపీ కూటమి అధికారంలోకి రాగా. బెంగాల్ లో గట్టి పోటీ ఇచ్చినా పవర్ లోకి రాలేకపోయింది. ఇప్పుడు తెలంగాణలోనూ అలాంటి రాజకీయ గేమ్ బీజేపీ ఆడనుందని తెలుస్తోంది. అందులో భాగంగానే గవర్నర్ గా యడియూరప్పను నియమించాలని డిసైడ్ అయిందని అంటున్నారు.

ఇప్పుడు జీవోలు.. ఉపఎన్నిక తర్వాతే నిధులు? ఓట్లే లక్ష్యంగా కేసీఆర్ దళిత బంధు ప్లాన్...

తెలంగాణలో ఇప్పుడు దళిత బంధు పథకమే హాట్ టాపిక్. దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటోంది కేసీఆర్ సర్కార్. ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల సాయం అందించడం ద్వారా ఆ కుటుంబం దశ మారుతుందని చెబుతోంది. దళితులందరిని లక్షాదికారులను చేయడమే తమ లక్ష్యమంటున్నారు సీఎం కేసీఆర్. విపక్షాలు మాత్రం దళిత బంధు పేరుతో కేసీఆర్ డ్రామాలు చేస్తున్నారని విమర్శిస్తున్నాయి. హుజురాబాద్  ఉప ఎన్నికలో దళితుల ఓట్ల కోసమే.. ఆ నియోజకవర్గంలో పైలెటు ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. దళితులకు మూడెకరాల భూ పంపిణి లాగానే.. దళిత బంధు స్కీం కూడా ముందుకు సాగదని చెబుతున్నాయి ప్రతిపక్షాలు. దళిత బంధుపై విపక్షాల విమర్శలు ఎలా ఉన్నా... దూకుడుగానే వెళుతోంది కేసీఆర్ సర్కార్. తొలి విడతగా గతంలో 5 వందల కోట్లు విడుదల చేస్తూ జీవో ఇవ్వగా...  సోమావరం మరో ఐదు వందల కోట్లు విడుదల చేస్తూ జీవో ఇచ్చింది. దీంతో ఇప్పటివరకు దళిత బంధు కోసం ప్రభుత్వ వెయ్యి కోట్లు రీలీజ్ చేసినట్లైంది. వెయ్యి కోట్లతో హుజురాబాద్ నియోజకవర్గంలోని వెయ్యి దళిత కుటుంబాలకు దళిత బంధు అమలు చేయవచ్చు. హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్ని దళిత కుటుంబాలకు పథకం వర్తిస్తుందని కేసీఆర్ చెప్పారు. 15 మందికి చెక్కులు కూడా ఇచ్చారు. మిగితా వారికి విడతల వారీగా రెండు నెలల్లోనే అందిరికిఅందిస్తామని చెప్పారు ముఖ్యమంత్రి. ఇంతవరకు బాగానే ఉన్నా... ఇక్కడే కేసీఆర్ అసలు డ్రామా ఉందనే విమర్శలు వస్తున్నాయి.  దళిత బంధు కోసం నిధులు విడుదల చేసినట్లు జీవోలు ఇస్తున్నారు కాని.. బ్యాంకులకు నిధులు రిలీజ్ చేయడం లేదని తెలుస్తోంది. దళిత బంధు పథకాన్ని మరింత ఆలస్యం చేసే యోచనలో కేసీఆర్ సర్కార్ ఉన్నట్లు సమాచారం. అందుకే నిధులు ఇస్తున్నట్లు జీవో ఇస్తూ ... డబ్బులను మాత్రం బ్యాంకులకు అందివ్వడం లేదని అంటున్నారు. దళిత బంధు అర్హుల ఎంపిక పేరుతో రెండు, మూడు నెలలు కాలాయపణ చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. దళిత బంధు అర్హుల ఎంపికలో స్థానిక అధికారులతో పాటు బ్యాంకర్లను భాగస్వామ్యం చేశారట. బ్యాంకర్లు దళిత కుటుంబాల ఇండ్లకు వెళ్లి పరిశీలించాలట. 10 లక్షలతో ఏ వ్యాపారం చేస్తారు.. ఎలా ముందుకు వెళతారు అన్న విషయాలు ఆరా తీయాలని సర్కార్ సూచించిదట. బ్యాంకర్లు వాళ్ల పరిస్థితిపై పూర్తి నివేదిక ఇచ్చాకే  డబ్బులకు సంబంధించిన ప్రాసెస్ మొదలవుతుందట. ఇదంతా జరగటానికి చాలా సమయం పడుతుందని చెబుతున్నారు. అంతవరకు తమకు దళిత బంధు పథకం వచ్చిందని మురిసిపోవడమో తప్ప.. లబ్దిదారుల చేతికి చిల్లిగవ్వ కూడా వచ్చే పరిస్థితి లేదట. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే కేసీఆర్ ఇలా కొత్త ఎత్తులు వేస్తున్నారని అంటున్నారు. ఉప ఎన్నిక ఇప్పట్లో జరిగే అవకాశం లేకపోవడంతో... దళిత బంధు కాలాయపణ కోసం సర్వేలు పేరుతో డ్రామాలు చేస్తున్నారని అంటున్నారు. దళిత బంధు పథకం వచ్చిందని చెబుతూ వాళ్లను బుట్టలో వేసుకుంటున్నారట. మీరు ఏం చేస్తారు.. డబ్బులను ఎలా ఉపయోగించుకుంటారు వంటి విషయాలతోనే రెండు, మూడు నెలలు గడిపేస్తారట. ఈ లోపే హుజురాబాద్ ఉప ఎన్నిక వస్తుందని భావిస్తున్నారట. ఉప ఎన్నికకు ముందే దళిత కుటుంబాలకు పథకం వచ్చినట్లు లెటర్ వస్తుందని కాని డబ్బుకు అకౌంట్ లోకి రావు. ఎన్నికల తర్వాతే ఆ ప్రాసెస్ ఉంటుంది. ఈ లోపు ఉప ఎన్నికలో అధికార పార్టీకి వ్యతిరేక ఫలితం వస్తే సర్కార్ ఆలోచన మారవచ్చని అంటున్నారు. దళిత కుటుంబాలు కూడా తమకు దళిత బంధు డబ్బులు రావాలంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలవాలలని కోరకుంటాయి. అందుకే వాళ్లంతా గంపగుత్తగా తమకు ఓటేస్తారని గులాబీ బాస్ వ్యూహమట. ఇలా 50 వేల దళిత ఓట్లను కొల్లగొట్టేందుకు దళిత బంధు పేరుతో కేసీఆర్ డ్రామాలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కేసీఆర్ సర్కార్ పై వస్తున్న విమర్శలకు బలం చేకూరేలానే చర్యలు జరుగుతున్నాయి. కేసీఆర్ చేతుల మీదుగా చెక్కులు అందుకున్న 15 కుటుంబాలకు కూడా ఇంకా డబ్బులు అందలేదు. స్మార్ట్ కార్డులు చూసి మురిచిపోవడం తప్ప వాళ్లకు ఏమి అందలేదట. ముఖ్యమంత్రి ప్రకటించిన లబ్దిదారుల పరిస్థితే ఇలా ఉంటే.. మిగితా వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. ఇప్పుడు విపక్షాలు కూడా ఇదే అంశాన్ని జనంలోకి తీసుకెళుతున్నాయి. దళితుల అభ్యున్నతిపై  కేసీఆర్ సర్కార్ కు నిజంగా చిత్తశుద్ది ఉంటే.. వెంటనే లబ్దిదారులకు నిధులు అందించాలని డిమాండ్ చేస్తున్నాయి. పథకం వచ్చింది కాని నిధుల కోసం కొంత కాలం ఆగాలాంటూ మభ్య పెట్టడం ఏంటని దళిత సంఘాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. ఓట్ల కోణంలో కాకుండా దళిత సంక్షేమం కోసం ఆలోచించాలని కోరుతున్నాయి. 

ఎమ్మెల్సీలు వ‌ద్దు.. స్కూళ్లు కావాలా?.. కేసీఆర్ డ‌బుల్ గేమ్‌కు రీజ‌నేంటి?

జ‌స్ట్ 119 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే ఓటింగ్‌లో పాల్గొంటారు. ఎమ్మెల్సీల‌ను ఎన్నుకుంటారు. త‌క్కువ మందే కాబట్టి ప‌క్కా ఏర్పాట్లు చేయొచ్చు. చాలా సింపుల్‌గా, సుర‌క్షితంగా ఎమ్మెల్సీ ఎన్నిక‌లు పూర్తి చేయొచ్చు. కానీ, అందుకే కేసీఆర్ స‌ర్కారు స‌సేమిరా అంటోంది. ఈసీ ప్ర‌భుత్వ అభిప్రాయం కోరితే.. నాట్ పాజిబుల్ అంటూ రిప్లై ఇచ్చింది. క‌రోనానే అందుకు సాకుగా చూపించింది. కేవ‌లం 119 మంది విష‌యంలోనే కొవిడ్ భ‌య ఉందంటే.. మ‌రి ల‌క్ష‌లాది విద్యార్థులు హాజ‌ర‌య్యే స్కూల్స్, కాలేజెస్‌ను తెర‌వ‌డానికి ఎందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు? ఒకే గ‌దిలో ప‌దుల సంఖ్య‌లో కూర్చొనే విద్యార్థుల‌కు లేని ముప్పు.. ఎమ్మెల్సీ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డానికి ఏముంటుంది? ఇదంతా కేసీఆర్ ఆడుతున్న రాజ‌కీయ డ్రామానా? లేక‌, గులాబీ బాస్‌కు హుజురాబాద్ గుబులా? అనే చ‌ర్చ మ‌రోసారి ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది.  సెప్టెంబ‌ర్ 1 నుంచి తెలంగాణ‌లో అన్ని ర‌కాల విద్యాసంస్థ‌లు రీఓపెన్ కానున్నాయి. అందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. హ‌మ్మ‌య్యా.. అంటూ త‌ల్లిదండ్రులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇంట్లో పిల్ల‌ల పోరు ప‌డ‌లేక‌.. స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయ‌నే మాట విన‌గానే సంబ‌ర‌ప‌డిపోతున్నారు. ఇక ల‌క్ష‌లాది మంది స్టూడెంట్స్ ఇళ్లు విడిచి స్కూల్స్‌కి, కాలేజీల‌కు క్యూ క‌ట్ట‌నున్నారు. అయితే, తాజాగా సెప్టెంబ‌ర్‌లోనే థ‌ర్డ్ వేవ్ ముంచుకువ‌స్తుంద‌ని.. రోజుకు 5 ల‌క్ష‌ల వ‌ర‌కూ కేసులు వ‌స్తాయ‌ని.. కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌లైన‌ నీతి ఆయోగ్‌, ఎన్ఐఎమ్‌డీలు గ‌ట్టిగానే హెచ్చ‌రిస్తున్నాయి. ఈసారి పిల్ల‌ల‌పైనే అధిక ప్ర‌భావం ఉంటుంద‌ని చెబుతున్నారు. స్టూడెంట్స్‌లో ఒక్క‌రు కొవిడ్ బారిన ప‌డితే.. వైర‌స్ వేగంగా అంద‌రినీ చుట్టేసే ప్ర‌మాదం పొంచిఉంది. స్కూల్స్‌లో సానిటైజేష‌న్‌, సోష‌ల్ డిస్టాన్సింగ్ అంత ఈజీ కాక‌పోవ‌చ్చు. ఇలా థ‌ర్డ్ వేవ్ ముప్పు ఇంత ప‌క్కాగా క‌నిపిస్తున్నా.. కేసీఆర్ స‌ర్కారు మాత్రం ఇప్ప‌టికిప్పుడు అర్జెంటుగా సెప్టెంబ‌ర్‌లోనే స్కూల్స్‌, కాలేజేస్ తెర‌వ‌డంపై ఆందోళ‌న సైతం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రో నెల వ‌ర‌కూ వేచి చూసి అప్పుడు నిర్ణ‌యం తీసుకుంటే బాగుండేద‌నే నిపుణుల‌ అభిప్రాయం.   మ‌రోవైపు.. కొవిడ్‌తో కేసీఆర్ ఆడుతున్న పొలిటిక‌ల్ గేమ్ సైతం విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న‌ ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నిక‌ల‌కు క‌రోనాను కార‌ణంగా చూపి మోకాలొడ్డుతుండ‌టాన్ని అంతా త‌ప్పుబ‌డుతున్నారు. టీఆర్ఎస్‌లో ఎమ్మెల్సీ ఆశావ‌హులు, అసంతృప్తులు చాలా మంది ఉండ‌టం వ‌ల్లే.. ఒక‌రికిస్తే మ‌రొక‌రు పార్టీ వీడే ప్ర‌మాదం ఉండ‌టం వ‌ల్లే.. ఎమ్మెల్సీ ఎల‌క్ష‌న్స్‌కి కొవిడ్ కొర్రీలు పెడుతున్నార‌ని మండిప‌డుతున్నారు. ఎమ్మెల్సీ అసంతృప్తులు పార్టీని వీడితే.. ఆ ప్ర‌భావం హుజురాబాద్ ఎన్నిక‌ల మీద ప‌డుతుంద‌ని ఆ భ‌యంతోనే కేసీఆర్ అలా చేస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. ఇక‌, ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రిపితే.. ఆ వెంట‌నే హుజురాబాద్ ఎల‌క్ష‌న్ కూడా నిర్వ‌హించేందుకు ఈసీ రెడీ అవుతుంది. ఇప్ప‌టికిప్పుడు హుజురాబాద్‌లో ఉప పోరు జ‌రిగితే ఈట‌ల రాజేంద‌ర్‌దే గెలుప‌ని కేసీఆర్ చేయించిన‌ స‌ర్వేలు చెబుతున్నాయి. హుజురాబాద్ వార్ ఎంత ఆల‌స్యం అయితే అంత టీఆర్ఎస్ లాభ‌మ‌ని.. అందుకే ఆ ఎన్నిక‌ల‌ను ఆల‌స్యం చేయ‌డానికే ఎమ్మెల్సీ ఎల‌క్ష‌న్ నిర్వ‌హించ‌లేమంటూ ఈసీకి లేఖ రాసిన‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి సీఎం కేసీఆర్‌కు.. ఈట‌ల రాజేంద‌ర్ భ‌యం బాగానే ప‌ట్టుకున్న‌ట్టుంది. ఆయ‌న గెలుపును ఆల‌స్యం చేయ‌డానికే ఎమ్మెల్సీ కిరికిరి పెడుతున్నార‌ని అంటున్నారు. 119 ఎమ్మెల్యేలు ఓటేస్తేనే ప్ర‌మాదం అన్న‌ప్పుడు.. ల‌క్ష‌లాది మంది విద్యార్థులు హాజ‌ర‌య్యే విద్యాసంస్థ‌ల‌కు కొవిడ్ వ‌ర్రీ ఉండ‌దా? స్కూల్స్‌, కాలేజేస్ రీఓపెన్‌కి ఎలా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారో కేసీఆర్‌కే తెలియాలి. ఎమ్మెల్యేల‌కు ఓ రూల్‌? స్టూడెంట్స్‌కు ఇంకో రూలా?

సీఎం ఇంటి పక్కన భరతమాత విగ్రహం తొలగింపు.. ఏపీలో తాలిబన్లను మించిన అరాచకమా? 

ఆంధ్రప్రదేశ్ లో అధికారుల నిర్వాకం మరో వివాదానికి కారణమైంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం వద్ద ఉన్న భరతమాత విగ్రహాన్ని అధికారులు తొలగించడం తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి ఇంటికి భద్రత, రోడ్డు విస్తరణ పేరుతో ఈ విగ్రహాన్ని సోమవారం అర్దరాత్రి అధికారులు తొలగించారు. భారీ క్రేన్ సహాయంతో తొలగించారు. ట్రాక్టర్ ద్వారా తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. భరతమాత విగ్రహం తొలగింపుతో తాడేపల్లిలో ఉద్రిక్తత నెలకొంది.  ఈ విగ్రహం తాడేపల్లికి ప్రధాన ఆకర్షణగా ఉండేది 15 ఏళ్ల క్రితం ఈ భరతమాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తొలుత ఇది మూడు అడుగులు ఉండేది. అయితే 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ విగ్రహం స్థానంలో 15 అడుగుల భరతమాత విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ప్రతి ఏటా స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. సీఎం ఇంటికి భద్రత పేరుతో విగ్రహాన్ని తొలగించాల్సి వచ్చిందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. బకింగ్ హామ్ కెనాల్ నుంచి నూతక్కి వరకు రోడ్డును విస్తరించాలని అధికారులు తెలిపారు. రోడ్డు విస్తరణ పూర్తయిన వెంటనే విగ్రహాన్ని యథాస్థానంలో పెడతామని చెప్పారు.  భరతమాత విగ్రహాన్ని తొలగించడంపై  స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల తీరుపై మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ వైకాపాబన్లు... అరాచకాలలో ఆప్ఘనిస్థాన్ తాలిబన్లను మించిపోయారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వ్యాఖ్యానించారు. తన తాడేపల్లి ప్యాలస్ పక్కన ఎవ్వరూ ఉండటానికి వీల్లేదని, నిరుపేదల ఇళ్లు కూల్చేశారు జగన్ రెడ్డి అని...ఇప్పుడు భద్రత పేరుతో భరతమాత గుండెలపై గునపం దింపారని మండిపడ్డారు. తనకి 2 కోట్లతో గుడి కట్టించుకున్న జగన్ రెడ్డి... తన ఇంటి దగ్గర భరతమాత విగ్రహాన్ని తొలగించడం ఆయన నిరంకుశ, ఫ్యాక్షన్ బుద్ధికి నిదర్శనమని అన్నారు.  ప్రొక్లయినర్లతో పెకలించిన భరత మాత విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని... చేసిన మూర్ఖపుపనికి క్షమాపణలు చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు.