కంటతడి పెట్టిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. 

తెలంగాణ పీసీసీ చీఫ్ ,ఫైర్ బ్రాండ్ లీడర్ రేవంత్ రెడ్డి కంట తడి పెట్టారు. పంచ్ డైలాగులతో ప్రత్యర్థులకు సవాల్ విసిరే రేవంత్ రెడ్డి కంట తడి పెట్టడం ఏంటనీ అనుకుంటున్నారా.. కాని ఇది నిజం. నిరుపేదల కుటుంబాలకు సీఎం కేసీఆర్ చేసిన మోసం తెలిసి ఆయన కంట తడి పెట్టుకున్నారట. కేసీఆర్ దత్తత గ్రామమైన మేడ్చ్ జిల్లా మూడు చింతలపల్లిలో దీక్ష చేపట్టిన రేవంత్ రెడ్డి.. దీక్షా స్థలి వేదికపైనే కన్నీళ్లు కార్చారు.  గతంలో సీఎం కేసీఆర్ చిన్న ముల్కనూర్ ను దత్తత తీసుకున్నారు. అందరికీ ఇండ్లు కట్టిస్తానని చెప్పి, ఇండ్లన్నీ కూల్చివేశాడు. అయితే ఇప్పటివరకు అక్కడ ఇండ్లు కట్టలేదు. దీంతో చిన్న ముల్కనూరును సందర్శించారు రేవంత్ రెడ్డి. అక్కడ తనకు ఎదురైన అనుభవాలను చెబుతూ కన్నీరు కార్చారు. సీఎం కేసీఆర్ అదేశాలతో ఇండ్లు కూల్చివేయడంతో చిన్న ముల్కనూరులో ఆడపిల్లలు స్నానం చేసేందుకు కూడా సౌకర్యం లేని పరిస్థితి కల్పించాడన్నారు. తాను చిన్న ముల్కనూర్​కు వెళ్లినప్పుడు సీఎం కేసీఆర్​ హామీతో ఇంటిని కూల్చివేసిన కుటుంబం బాధ నన్ను కలిచి వేసిందని రేవంత్​రెడ్డి  వివరించారు. ఆ కుటుంబం చిన్న గుడిసె వేసుకుని బతుకుతుందని, ముగ్గురు ఆడపిల్లలు స్నానాలు చేసేందుకు బాత్రూంలు లేక గుడిసె పక్కన నాలుగు తడకలు వేసుకుని స్నానాలు చేస్తుంటే పక్కపొంటి ఇండ్ల మగ పొరగాళ్లు చూస్తూ ఎగతాళి చేశారని, ఈ విషయం తనకు చెప్పుతుంటే కండ్లలో నీళ్లు తిరిగాయని రేవంత్​రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. వీటన్నింటికీ బాధ్యుడు కేసీఆర్​ అని, కేసీఆర్​ను వంగపెట్టి చెప్పుతో కొట్టాలని ఆగ్రహంతో మాట్లాడారు రేవంత్ రెడ్డి.  గజ్వేల్​పై కాంగ్రెస్​జెండా ఎగురవేయాలని రేవంత్​రెడ్డి పిలుపునిచ్చారు. మూడు చింతలపల్లి గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నా ఇక్కడ కాంగ్రెస్​నేతలు స్థానిక సంస్థల్లో గెలిచారని గుర్తు చేశారు. సీఎం దత్తత గ్రామాల్లో ఒక్క సమస్య కూడా తీర్చలేదని విమర్శించాకర మూడుచింతలపల్లి, లక్ష్మాపూర్​, కేశవాపూర్​ గ్రామాలను సీఎం దత్తత తీసుకున్నా కాంగ్రెస్​ కార్యకర్తలు గెలిచారంటే ఎంత మేరకు అభివృద్ధి చేశారో అర్థమవుతుందన్నారు. కేసీఆర్​ఎర్రవల్లి ఫాంహౌస్​కు వెళ్లేందుకు రోడ్డు వేసుకునేందుకే ఈ మూడు గ్రామాలను దత్తత తీసుకున్నాడని ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలు పింఛన్లు ఇచ్చారంటూ చెప్పుతున్నారని, కానీ ఈ గ్రామాల్లో ఎంత మందికి పింఛన్లు ఇచ్చారో తెలుపాలని సవాల్​విసిరారు. ఈ రెండు రోజులు ఇక్కడే ఉంటానని, ఎంత మందికి పథకాలు అందుతున్నాయో ఇంటింటికీ వెళ్లి చూద్దామన్నారు. మూడు చింతలపల్లిలో "దళిత, గిరిజన ఆత్మ గౌరవ దీక్ష " పేరుతో  రేవంత్ రెడ్డి దీక్ష చేపట్టారు. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు ఇది  జరగనుంది. దీక్షా శిబిరంలో రేవంత్ రెడ్డి కి ఇరువైపులా దళిత, గిరిజన నాయకులు కూర్చున్నారు. పీసీసీ నేతలంతా హాజరయ్యారు. దళిత బస్తీలో రాత్రి బస చేయనున్నారు  రేవంత రెడ్డి. బుధవారం ఉదయం కాంగ్రెస్ నేతలతో కలిసి దళిత వాడలలో పర్యటించనున్నారు. దళిత వాడలోని కుటుంబాలతో నేరుగా మాట్లాడనున్నారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం చేపట్టిన దళిత బంధుపైనా అభిప్రాయాలను తెలుసుకోనున్నారు.  సీఎం దత్తత గ్రామానికే కెసిఆర్ ఏమీ చేయలేదు , అలాంటిది రాష్ట్రానికి ఏం చేస్తారనే చర్చ పెట్టనున్నారు. 

తాలిబన్లను ఏకాకుల్ని చేసే కిటుకు ఇదే..ప్రపంచానికి పెద్ద గండమే?

తాలిబన్ల దురాగతాలతో ప్రపంచ ప్రజలు వణికిపోతున్నారు. మహిళలతో మర్యాదగా వ్యవహరిస్తామన్న వారి వాగ్దానం అమలు ఎక్కడా కనిపించడం లేదు. జర్నలిస్టులను సైతం చంపేస్తున్నారు. తాజాగా అమెరికా-నాటో దళాల సైనికులకూ ప్రాణహాని ఉందన్న ఆందోళన పెరుగుతోంది. వారిదగ్గరున్న ఆధునిక వెపన్స్ లాక్కొని భారీ ఎత్తున పరేడ్ నిర్వహించడం ప్రపంచ దేశాల నేతల్లో వణుకు పుట్టిస్తోంది. ఆఫ్ఘనిస్థాన్లోని జబుల్ ప్రావిన్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఈ సంస్కృతి ఆఫ్ఘనిస్థాన్ అంతటా విస్తరిస్తుందని, ఆఫ్ఘనిస్థాన్ ను అహర్నిశలూ కాపాడిన విదేశీ దళాల్ని వెంటాడే ప్రక్రియ మొదలైందన్న ఆందోళన అన్ని దేశాల్లో విస్తరిస్తోంది. కరోనా వైరస్ కంటే ప్రమాదకరంగా జిహాద్ అనే వైరస్ ప్రపంచమంతటా పాకిపోయిందని, దాన్నుంచి బయటపడాలంటే ప్రపంచ దేశాలన్నీ సరిహద్దు భేదాలు విస్మరించి ఐక్యంగా కదలాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి. అందుకున్న ఏకైక మార్గం తాలిబన్లను ఏకాకుల్ని చేయడమేనంటున్నారు. తాలిబన్లు కేవలం గల్ఫ్, ఇస్లామిక్ దేశాల్లోనే గాక అమెరికా, కెనడా, అన్ని యూరోప్ దేశాల్లో బలంగా పాతుకొని పోయారు. అక్కడ శిక్షణా శిబిరాలు కూడా నిర్వహిస్తున్నామని, వారిని ఆఫ్ఘనిస్థాన్లో పైలట్లుగా, సైనికులుగా రిక్రూట్ చేసుకుంటామని తాలిబన్ సుప్రీమ్ లీడర్ హైబతుల్లా అఖుంద్జాదా అంతర్జాతీయ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. టర్కీ, జర్మనీ, ఇంగ్లాండ్ దేశాల నుంచి తాము వెంటనే రిక్రూట్ మెంట్లు ప్రారంభిస్తామన్నారు. అయితే ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ వంటి పలు యూరోప్ దేశాలు ఇస్లామిక్ టెర్రరిస్టులను కట్టడి చేసేందుకు ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాయి. అయినా చాపకింద నీరులా, ఎవరి కంటికీ కనిపించకుండా అనేక రూపాల్లో ఇస్లామిక్ టెర్రరిజం విస్తరిస్తోంది. ఈ విషయమే ఇప్పుడు ప్రపంచ దేశాధినేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తక్షణమే ఈ మహమ్మారికి బ్రేకులు వేయకపోతే కరోనా కంటే వేగంగా మానవాళికి నష్టం కలుగుతుందన్న ఆందోళన పెరుగుతోంది.  తాజాగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రపంచం ముందు సరికొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు మరింత దీక్షగా పని చేయాల్సి ఉందని, నూతన మార్గాలు అన్వేషించాల్సి ఉందని కూడా అన్నారు. అలాగే అధునాతనమైన, సృజనాత్మకమైన ఆయుధాలను కూడా రూపొందించాలని, ఇందుకోసం ప్రైవేటు సంస్థలు ముందుకు రావాలని ఆయన అభిప్రాయపడటం... సమస్య తీవ్రతను తెలియజేస్తోంది.  అయితే ఇలా ఏ దేశానికి ఆ దేశం విడివిడిగా ఆయుధాలు సమకూర్చుకోవడం, కొత్త తరహా ఆయుధాలను సేకరించుకోవడం తప్పేమీ కాదని.. కానీ అంతకన్నా కీలకమైన అంశం మరోటి ఉందని, ఆ దిశగా చర్యలు చేపడితే తాలిబన్ల దూకుడుకు శాశ్వతంగా కళ్లెం వేయొచ్చని పలువురు ఎకాలజిస్టులు, ఎకాలజీలో పరిశోధనలు చేస్తున్న సైంటిస్టులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సముద్ర తీరాన్ని ఆనుకొని ఉన్న అన్ని దేశాలూ కూడబలుక్కొని తక్షణమే ఆ చర్యలు చేపట్టాలని వారు సూచిస్తున్నారు.  ఆల్గేతో ఆయిల్ ఉత్పత్తి చేస్తే తాలిబన్లు భూస్థాపితమే.. అదెలాగంటే!సముద్రంలో తయారయ్యే నాచును ఆల్గే అంటారు. ఈ ఆల్గేతో ఎన్నో రకాల లాభాలున్నాయని శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రయోగపూర్వకంగా రుజువు చేశారు. అమెరికాలోని టెక్సాస్ ప్రయోగశాలల్లో దీన్నుంచి విజయవంతంగా బయో ఫ్యూయెల్ ను ఉత్పత్తి చేసి ఔరా అనిపించుకున్నారు. ఆల్గే క్రూడాయిల్ నుంచి అన్ని రకాల పెట్రో ఉత్పత్తులూ తీయవచ్చని రుజువైంది. డీజిల్, పెట్రోల్, విమానాల్లో ఉపయోగించే పెట్రోల్, కిరోసిన్.. ఇలా అన్ని రకాల ఫ్యూయెల్స్ తయారు చేయవచ్చు. అయితే ప్రపంచ దేశాలన్నీ చమురు కోసం గల్ఫ్ దేశాల మీదే ఎందుకు ఆధారపడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థంతా చమురు చుట్టూనే తిరుగుతున్న విషయం ప్రపంచ ప్రజలందరికీ తెలిసిందే. అగ్రరాజ్యాలన్నీ పోటీ పడుతూ గల్ఫ్ దేశాలతో కొన్ని లోపాయికారీగా, మరికొన్ని డైరెక్టుగా చెట్టపట్టాలేసుకొని ప్రయాణిస్తున్నాయి. అయితే తాలిబన్ ముప్పును దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఆయా అగ్రదేశాలు అదే చమురు కోసం ఇప్పటికే ప్రయోగపూర్వకంగా రుజువైన ఆల్గే చమురు మీద దృష్టి సారించాలని, తక్షణమే ఆల్గే చమురు ఉత్పత్తుల యూనిట్లను సముద్ర తీరంలో ఉన్న అన్ని దేశాలూ ఏకకాలంలో ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు.  ఆల్గే ఫ్యూయల్ ఇలా తయారవుతుంది ఈ నాచు కేవలం సముద్రంలోనే తయారవుతుంది కాబట్టి తీరదేశాలకు అతిగొప్ప అడ్వాంటేజీ అవుతుంది. తీరం నుంచి దాదాపు 20 కి.మీ. వరకు ఉండే అన్ని గ్రామాలకు, పట్టణాలకు, నివాస ప్రాంతాలకు సముద్ర జలాలను పైప్ లైన్స్ ద్వారా సరఫరా చేయాలి. ఆ నీటిని ఇళ్ల మీద, డాబాల మీద లేదా ప్రత్యేకంగా కట్టిన ట్యాంకుల మీదికి కనెక్ట్ చేయాలి. పైన ట్రాన్స్ పరెంట్ టబ్స్ ను ఏర్పాటు చేసి, ఆ టబ్బుల్లోకి సీ వాటర్ పంపాలి. అందులో ఆల్గే సీడ్ ను వేయాలని... ఆ సీడ్ త్వరితంగా, నాణ్యంగా పెరగడానికి, స్వచ్ఛమైన బయో ఫ్యూయల్ రావడానికి దేశీయ ఆవు-పేడల మిశ్రమాన్ని కలపాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల నాలుగైదు వారాల్లోనే ఆల్గే అద్భుతంగా ఎదుగుతుంది. ఆ తరువాత దాన్ని నీడలో పూర్తిగా ఆరబెట్టాలి. పూర్తిగా ఆరిపోయి గలగలలాడుతున్న నాచును మిషన్స్ ద్వారా ప్రెస్సర్స్ లోకి పంపిస్తే దాన్నుంచి నాణ్యమైన క్రూడాయిల్ ఉత్పత్తి అవుతుంది. ఆ క్రూడాయిల్ నుంచే పెట్రోల్, డీజిల్, కిరోసిన్, విమానాల్లో వాడే పెట్రోల్, వాహనాల ఇంజిన్లలో వాడే ఆయిల్.. ఇలా అనేక రకాల ఉత్పత్తులు, ఉపఉత్పత్తులను తీసుకోవచ్చు. ప్రభుత్వమే పూనుకొని ప్రతి ఇంటి మీద కూడా దీన్ని పెంచేలా ప్రోత్సహిస్తే ప్రపంచవ్యాప్తంగా ఇదో అతిపెద్ద కుటీర పరిశ్రమగా ఏర్పడుతుందని వారు సూచిస్తున్నారు. కొత్త స్టార్టప్స్ కి ఇంతకన్నా గొప్ప అవకాశమే ఉండదని కూడా వారంటున్నారు. దీనిద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయంటున్నారు. ఫ్యూయల్ తో పాటు పిప్పి (ఆల్గే కేక్స్) ని అనేక రకాల ఆహారపదార్థాలుగా వాడుతున్నారంటున్నారు. జపాన్ లో ఇప్పటికే ఆల్గేతో వినూత్నరీతిలో ఫుడ్ ప్రోడక్ట్స్ తయారుచేసి లాభాలు గడిస్తున్నారు. పలు ఇతర దేశాల్లో కూడా ఆల్గే ఫుడ్ కు డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు గల్ఫ్ దేశాలను వెనుకనుండి శాసిస్తున్న బడా చమురు వ్యాపారులకు తీవ్రమైన ఎఫెక్ట్ పడుతుందని, ఫలితంగా తాలిబన్లకు సహాయ సహకారాలు అందించే శక్తులు నిర్వీర్యమైపోతాయని అంటున్నారు. దానివల్ల తాలిబన్లకు భారీఎత్తున వెళ్లే విరాళాలకు బ్రేక్ పడుతుందని, శిక్షణ శిబిరాలు, ఆయుధ సరఫరా ఆగిపోతాయని అంటున్నారు.  ఆల్గే చమురుతో అదనపు లాభాలు ఆల్గే నాచు పంట కోసం దేశీయ ఆవుపేడ, మూత్రం వాడాల్సి ఉంటుంది కాబట్టి.. గోరక్షణకు సహకరిస్తుంది. వాటి నుంచి వచ్చే ఇతర ఉత్పత్తులతో ప్రజారోగ్యం పరిఢవిల్లుతుంది. ఆవుల కోసం గడ్డి కావాలి కాబట్టి అందుకోసం వరి పంట వేయాల్సి వస్తుంది. దీంతో ఈ పంట కూడా ఆటోమేటిగ్గా వృద్ధి చెందుతుంది. ఆవు నుంచి వచ్చే ఇంకా ఇతర ఉత్పత్తులన్నీ మరింత సులువుగా ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. అన్నింటికన్నా ముఖ్యంగా పర్యావరణానికి ఏమాత్రం హాని చేయని అసలు సిసలైన బయో ఫ్యూయల్ తయారవుతుంది. దీనిద్వారా రోజుకు కొన్ని వేల కోట్ల టన్నుల వ్యర్థ పదార్థాలు, కర్బన ఉద్గారాలు పర్యావరణంలోకి కట్టుదిట్టంగా చెక్ పడుతుంది. ప్రపంచ దేశాలన్నీ పర్యావరణం కోసం ప్రతియేటా కేటాయించే నిధుల్లో కోత పడి ఆర్థిక వృద్ధి మరింత వేగం పుంజుకుంటుంది. ప్రజలకు ఎకో సెస్ బాధ తప్పుతుంది.  మరి ఇప్పటిదాకా ఇండియా ఏం చేసింది? ఒక వినూత్నమైన ప్రయోగం గానీ, ప్రోడక్ట్ గానీ వస్తుందంటే అందరికన్నా ముందు బ్రేకులు పడేది ఇండియాలోనేననే నానుడి అందిరికీ తెలిసిందే. ఇండియాలోని చాలా మంది ఎకాలజిస్టులకు, శాస్త్రవేత్తలకు ఈ విషయం తెలిసినా.. ఆ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడానికి బ్యూరోక్రాట్లే అడ్డుకుంటున్నారని, ఇంతకుముందుకంటే ఇప్పుడు కాస్త పీపుల్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ వచ్చినా కూడా... వటవృక్షంలా వేళ్లూనుకున్న జాతీయ, అంతర్జాతీయ రాజకీయ ఒత్తిళ్లు, లంచగొండితనం వంటి కారణాల వల్ల ఈ విషయం ఢిల్లీ బాసుల దృష్టికి వెళ్లడం లేదని భారతీయ ఎకాలజిస్టులు వాపోతున్నారు. గత సెప్టెంబర్ లో భారత ప్రధాని నరేంద్రమోడీ హోస్టన్ లో పర్యటించినప్పుడు ఎన్నారై వ్యాపారవేత్తలను కలిశారు. అయితే  ఆ సందర్భంగా ఆల్గే బయో ఫ్యూయల్ పై చర్చించాల్సి ఉండగా.. అప్పుడు కూడా ఈ అంశం ప్రస్తావనకు రాలేదని విశ్వసనీయ సమాచారం. ఒకవేళ కచ్చితంగా అక్కడే ఈ విషయం చర్చకు వచ్చినట్టయితే దాని ఫలితం మరోలా ఉండి ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  ఏమైనా ప్రపంచమంతా ఇప్పుడు ఉమ్మడిగా ప్రమాదంలో చిక్కుకున్న తరుణంలోనైనా సముద్ర తీర దేశాలన్నీ ఒక్కటిగా ఆలోచించి ప్రపంచ శత్రువును తుదముట్టిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ( టి.రమేశ్ బాబు, సీనియర్ జర్నలిస్టు)

కేంద్ర‌మంత్రి అరెస్ట్‌.. బీజేపీకి శివ‌సేన‌ దిమ్మ‌తిరిగే షాక్‌...

మ‌రాఠా టైగ‌ర్‌తో పెట్టుకుంటే అంతే. కేంద్రంలో అధికారంలో ఉన్నాం క‌దా అని.. పులి ముందు తోక జాడిస్తే ఊరుకుంటుందా? వెంటాడి..వేటాడేస్త‌ది. మ‌హారాష్ట్ర‌లో ఇప్పుడు అదే జ‌రుగుతోంది. కేంద్ర‌మంత్రి అయ్యాన‌నే జోరులో నారాయ‌ణ రాణే మ‌హారాష్ట్ర సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేపై నోరు పారేసుకున్నారు. నోటికి ప‌ని చెప్ప‌డం.. దాడులు చేయ‌డం.. జ‌న్మ‌హ‌క్కుగా భావించే శివ‌సేన అధినాయ‌కుడినే చెంప ప‌గ‌ల‌గొడ‌తాన‌న‌డంతో ర‌చ్చ మొద‌లైంది. శివ‌సైనికులు క‌మ‌ల‌నాథుల‌పై రెచ్చిపోయారు. వెంట‌నే  పోలీసులు యాక్ష‌న్‌లోకి దిగిపోయారు. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారంటూ కేంద్ర‌మంత్రి నారాయ‌ణ రాణేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ విష‌యం ముందే గ్ర‌హించి.. ముంద‌స్తు బెయిల్ కోసం కేంద్ర‌మంత్రి కోర్టును ఆశ్ర‌యించినా ఉప‌యోగం లేకుండా పోయింది. నారాయ‌ణ రాణే అరెస్టులో మ‌హారాష్ట్ర‌లో బీజేపీ వ‌ర్సెస్ శివ‌సేన వివాదం.. జ‌గ‌డంగా మారింది.  మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేపై కేంద్రమంత్రి నారాయణ రాణే అనుచిత వ్యాఖ్యలు చేశారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా కేంద్రమంత్రి నారాయణ రాణే రాయ్‌గఢ్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఆగస్టు 15న సీఎం ఠాక్రే చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ముఖ్యమంత్రికి స్వాత్రంత్యం ఎప్పుడు వచ్చిందో కూడా తెలియకపోవడం సిగ్గుచేటు. స్వాత్రంత్య దినోత్సవం నాడు రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఠాక్రే.. మధ్యలో వెనక్కి తిరిగి స్వాత్రంత్యం వచ్చి ఎన్నేళ్లయిందని ఆయన సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆ రోజు నేను అక్కడ ఉంటేనా.. ఆయన చెంప పగలగొట్టేవాడిని’’ అని రాణే తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. కేంద్రమంత్రిపై శివసేన నేతలు మండిపడుతున్నారు. తానేం తప్పూ చేయలేదంటూ తన వ్యాఖ్యలను మరోసారి సమర్థించుకున్నారు నారాయ‌ణ రాణే.     సీఎంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగానూ కేంద్రమంత్రిపై త‌క్ష‌ణ‌మే చర్యలు తీసుకోవాలంటూ నాసిక్‌ పోలీస్‌ కమిషనర్ త‌న సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉదయం నాసిక్‌ పోలీసుల బృందం రత్నగిరి వెళ్లింది. కేంద్ర‌మంత్రిని అదుపులోకి తీసుకొని.. అరెస్ట్ చేయ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. బీజేపీ, శివ‌సేన‌ల గొడ‌వ ఎక్క‌డికి దారి తీస్తుందోన‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. మరోవైపు కేంద్రమంత్రి వ్యాఖ్యలతో ముంబయిలో భాజపా, శివసేన కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గాలు వీధుల్లో పరస్పరం దాడులకు దిగారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. ముంబయిలోని రాణే నివాసం ముందు శివసేన కార్యకర్తలు నిరసనకు దిగారు. ఆయన నివాసానికి పోలీసులు భద్రత పెంచారు.   కేంద్ర‌మంత్రి నారాయ‌ణ రాణే అరెస్టుపై బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మండిప‌డ్డారు. బీజేపీ కార్యాలయాలపై శివ‌సైనికులు దాడి చేస్తే సహించబోమన్నారు. హింసపై తమకు నమ్మకం లేదని చెప్పారు. దాడులు చేసి తమను బెదిరించలేరని, తాము మౌనంగా ఉండబోమని హెచ్చ‌రించారు. పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలన్నారు దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌.

కేటీఆర్ కు సీఎం యోగం లేనట్లేనా? అడ్డుకుంటున్నది వాళ్లేనా? 

అంతేనా ఇక కేటీఆర్’కు ఇప్పట్లో  ముఖ్యమంత్రి యోగం లేనట్లేనా, హుజూరాబాద్’ ఎపిసోడ్’ ప్రారంభానికి ముందు మిణుకు మిణుకు అంటున్న ఆశలు ఇప్పుడు పూర్తిగా ఆవిరై పోయినట్లేనా? అంటే, అంతేగా’ అనే సమాధానమే వస్తోంది. ఇప్పుడున్న పరిస్థితులలో  ‘నా పార్టీ .. నా ఇష్టం’ అనే పరిస్థితిలో ముఖ్యమంత్రి కేసీఆర్ లేరు. అలా అనుకునే  కేటీఆర్  పట్టాభిషేకానికి, అవరోధంగా ఉన్నారన్న ఉద్దేశంతో, ఈటల పై వేటు  వేశారు. అయితే, అది ఎవరి అదృష్టమో, ఇంకెవరి దురదృష్టమో కానీ, ఈటల పై వేసిన వేటు, కేటీఆర్, రహదారిని పూర్తిగా బ్లాకు చేసేసింది. ఇప్పుడు, కేటీఆర్ ముఖ్యమంత్రి కుర్చీ చేరుకోవాలనే, అరడుగుల బులెట్ ను దాటుకుని ముందుకు పోవాలి.. అది అయ్యే పని కాదు. ఇప్పడు  హరీష్ రావును కాదని ముఖ్యమంత్రి ముందుగు  వేసే పరిస్థితి లేదంటున్నారు అంతర్గత విశ్లేషకులు.    సో.. ముఖ్యమత్రి కుర్చీలో కూర్చునేందుకు కేటీఅర్ కనీసం మరో రెండున్నర సంవత్సరాల పాటు ఆగక తప్పదు. అంతవరకు ముఖ్యమంత్రి కుర్చీ వైపు దూరం నుంచి  చూస్తూ ఉండడమే కాని, కూర్చునే ఛాన్స్ మాత్రం లేదని, అయన సన్నిహిత వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. అంతే కాదు, అందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటినుంచే వ్యూహరచన చేస్తునారని కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. గత (2018) అసెంబ్లీ ఎన్నిల్లో ఎక్కడ బీరపోకుండా సిట్టింగులు అందరికీ, టిక్కెట్ ఇచ్చిన కేసీఆర్, ఈసారి, కొద్ది మంది పూర్ణ విధేయులకు తప్పించి, మిగిలిన అన్ని సీట్లలోనూ, కేటీఆర్ నాయకత్వానికి జై కొట్టే, ‘యువత’ కు అవకాశం ఇస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  ఇటీవలనే రాజకీయ అరంగేట్రం చేసి, బీఎస్పీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఐపీఎస్ అధికార ప్రవీణ్ కుమార్, ద్వారా బీఎస్పీతో పొత్తు పెట్టుకుని దళిత ఓటుపై పట్టు పెంచుకునేందుకు  కూడా ఇప్పటినుంచే వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. ఈ అన్నిటినీ మించి  హుజూరాబాద్ గండం గట్టెక్కిన తర్వాత, హరీష్ రావును రాజ్య సభకు పంపి, ప్రధాన అడ్డంకిని తొలిగించుకుంటారనీ అంటున్నారు. అయితే, అప్పటికి రాజేవరో, రెడ్దేవరో పరిస్థితులు ఎలా మరాతాయో ఇప్పుడే ఉహించడం కష్టం. రాజకీయాలు డైనమిక్ గా, మారిపోతుంటాయి.  తప్ప నిశ్చల చిత్రాల్లా కదలని బొమ్మలా ఉడి పోవు, కాబట్టి రేపటి కథ రేపు అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు.  అయితే ఎవరికి ఇష్టం ఉన్నా, ఎవరికీ లేకున్నా, ప్రాంతీయ ,కుటుంబ పార్టీలలో నాయకుడి సంతానమే వారసుడు అవుతారు. ఇందులో ఎలాంటి అనుమానాలు, మినహాయింపులు ఉండవు. దేశానికి ఆ కొసనున్న జమ్మూ కశ్మీర్, ఈ కొసనున్న తమిళ నాడు వరకు  ఇదే ‘సంప్రదాయం’ కొనసాగుతోంది. ఇందుకు తెలంగాణ, తెరాస మినహాయింపు కాదు. అయితే, ఎంత కుటుంబ పార్టీనే అయినా, కొన్ని కొన్ని సందర్బాలలో కుటుంబంలోనే వారసత్వ తగవు తలెగరేస్తుంది. ఉత్తర ప్రదేశ్’లో సమాజవాదీ పార్టీలో, ములాయం వారసత్వం కోసం, అయన కుమారడు అఖిలేష్ యాదవ్, సొదరుడు శివపాల్ యాదవ్ మధ్య కొంత ఘర్షణ చోటు చేసుకుంది. అఖిలేష్ అంతిమ విజేత అయ్యారు. అలాగే, తమిళనాడులో కరుణానిధి కుమారులు స్టాలిన్, అలిగిరి, కుమార్తె కణిమోళీ మధ్య కొంత కాలం  ముక్కోణ పోటీ, ఇంకొంత కాలం బ్రదర్స్ ఇద్దరి మధ్య ముఖాముఖి పోరాటం సాగింది. స్టాలిన సక్సెస్ మాత్రమే కాదు,  సక్సెసర్ కూడా అయ్యారు.  అలాగే, బీహార్’లో లాలూ  కుమారులు  తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్’ల వారసత్వ వార్ నడిచింది. తేజస్వి గెలిచారు ... అయితే, ఎక్కడైనా, “జో జీతేగా ఓయీ సికిందర్’ అన్నట్లు, గెలిచిన వారే  యువ రాజయ్యారు. రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకు పోయారు. పోతున్నారు. ప్రస్తుతం కల్వకుట్ల ఫ్యామిలీ పార్టీ తెరాస వారసత్వం కోసం కూడా ద్విముఖ, త్రిముఖ కాదు ఏకంగా  చతుర్ముఖ పోటీ జరుగుతోందని అంటున్నారు.. ఇక్కడైనా అంతే జో జీతేగా వోయీ సికిందర్. అది కేటీఅర్ కావచ్చు, హరీష్ కావచ్చు, కవిత, సంతోష్ ఎవరైన కావచ్చును, ఇది ప్రగతి భవన్ గేటు లోపలి మాట.

ఆదాయం సరే అప్పుల మాటేంటీ! జీతాలకు కటకటేంటీ హరీష్..  

నిజమే కావచ్చు తెలంగాణ  రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు చెప్పుకున్నట్లుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెలిగి పోతున్నది నిజమే కావచ్చును. ఆర్థిక వృద్ధి రేటులలో, తలసరి ఆదాయం, అన్నిటినీ మించి అప్పులు చేయడంలో, చేసిన అప్పులను సద్వినియోగం చేసుకోవడంలో, ఆర్థిక క్రమశిక్షణ పాటించడంలో, దేశానికే కాదు, ప్రపంచానికే  తెలంగాణ ప్రభుత్వం ఆదర్శం నిలిచిన మాట నిజమే కావచ్చును.అలాగే, విపక్షాలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి కాదు, ప్రజల నాతని నుంచి వస్తున్న మాటనే, ప్రతిపక్ష పార్టీల నాయకులు మీడియా ముఖంగా వినిపిస్తున్నారు. సర్కార్ చెవిన వేస్తున్నారు ప్రతిపక్షాలు అడిగాయనో, ఆరోపించాయనో కాకుండా, ఏది నిజం , ఏది కాదు అనే ఆత్మపరిశీలన చేసుకోవడం ప్రభుత్వానికి మరీ ముఖ్యంగా, ఆర్థిక మంత్రి  హరీష్ రావుకు అవసరం.   నిజానికి, రాష్ట్ర ఆర్థిక పరిస్థతి మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థ కూడా అంతే అద్వాన్నంగానే ఉంది, నిరర్ధక అస్తులనే బిళ్ళను మెడలో వేసి, ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టాలనే ఆలోచనకు కేంద్రం వచ్చిందంటే మోడీ ప్రభుత్వం ఆర్థిక స్థితి ఎంత ‘అందం’ గా వుందో వేరే చెప్పనక్కరలేదు. అయితే, ఇందుకు పూర్తిగా ప్రభుత్వాల విధానాలే కారణమని చెప్పడం కుదరదు.  సుమారు 18 నెలలకు పైగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కొవిడ్ మహమ్మారి, అన్ని దేశాలతోపాటు, మన దేశాన్ని, మన ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బ తీసింది. అసలే, అంతత మాత్రంగా ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ, కొవిడ్ దెబ్బకు మరింతగా కుదేలైంది. ఇదే పరిస్థితి రాష్ట్రంలోనూ ఉంది. రాష్ట్రంలో ఉన్న పరిస్థితే దేశంలో ఉంది దేశంలో ఉన్న పరిస్థితే ప్రపంచంలో ఉంది.  అయితే, అధికార పార్టీలో వచ్చిన అంతర్గత విబేధాలు, కుటుంబ పార్టీలో వచ్చిన కుటుంబ కలహాల కారణంగా ఒకే ఒక్కఅసెంబ్లీ స్థానానికి వచ్చిన ఉప ఎన్నిక కోసం, వేల కోట్ల రూపాయలు కుమ్మరించడం, దానిని కప్పిపుచ్చుకునేందుకు, ధనిక రాష్ట్రమని జబ్బలు చరుచుకోవడం అవసరమా అన్నదే ఇక్కడ ప్రశ్న. కాదు, నిజంగానే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్భుతంగా, అమోఘంగా ఉందని అనుకుంటే,  ప్రతిపక్ష పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు చేసిన సవాలును ఆర్థిక మంత్రి హరీష్ రావు స్వీకరింఛి చర్చకు వస్తే హుందాగా ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  ఆర్థిక మంత్రి హరీష్ రావు చెప్పుకున్న గొప్పలను ఒప్పుకుంటూనే, బీజీపీ దుబ్బాక ఎమ్మెల్యే  రఘునందన్ రావు కొన్ని నిర్దిష్ట ఆరోపణలు చేశారు. అఫ్కోర్స్, రఘునందన రావు చెప్పిందంతా సత్యమని కాదు, కానీ, ఆయన ప్రస్తావించిన  విషయాలు చాలావరకు బహిరంగ రహస్యాలే. ప్రతి రోజు పత్రికలలో పతాక శీర్షికలలో వస్తున్న వార్తలే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలు, పన్నుల వాటాలు, పంకాలు వంటి సామాన్య ప్రజలకు అంతగా అర్థంకాని, విషయాలను పక్కన పెట్టినా, పబ్లిక్ డొమైన్ లో ఉన్న విషయాలకు అయినా సమాధానాలు చెప్పవలసిన అవసరం, రాష్ట్ర్ర ప్రభుత్వం మంత్రి హరీష్ పై ఉందని  అంటున్నారు.  తెలంగాణ ధనిక రాష్ట్రమే అయితే.. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తారీఖున ఇవ్వాల్సిన జీతాలు, వారం, పది రోజులు ఆలస్యంగా ఎందుకిస్తున్నారు, అలాగే, ఉద్యోగుల పీఆర్సీ అమలులో ఎందుకు జాప్యం జరిగింది?  కేజీబీవీ, మోడల్ స్కూళ్ల టీచర్లకు సంవత్సరం పైగా  జీతాలు ఎందుకు ఇవ్వడం లేదు,  జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లకు బిల్లులు ఎందుకు చెల్లించడం లేదు, చివరకు ఏకగ్రీవం అయిన గ్రామ పంచాయతీలకు ఇస్తామన్న పది లక్షల నజరానా ఇవ్వక పోవడం వలన, అప్పులు చేసి పనులు చేసిన  సర్పంచ్లు సెక్యూరిటీ గార్డ్ లుగా, కూలీలుగా  ఎందుకు మారుతున్నారు.. బతకడానికి  వేరే రాష్ట్రాలకూ ఎందుకు వెళ్తున్నరు, పంచాయతీ సెక్రటరీలు, రైతులు ఎందుకు  ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఇవే రఘునందన అడిగిన,  హరీశ్ సమాధానం చెప్పవలసిన ప్రశ్నలు.అదే విధంగా 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసిన ‘నిరుద్యోగ భృతి’ అవసరం ఏమిటని కాదు, ఎందుకు ఇవ్వలేదని  మాత్రమే రఘునందన రావు ప్రశ్నించారు. నిజానకి బీజేపీ ఎమ్మెల్యే  ప్రస్తావించిన అంశాలు, కొత్తవేమీ కాదు, పత్రికలలో పతాక శీర్షికలలో వచ్చిన అంశాలనే ఆయన ప్రస్తావించారు.   తెలంగాణలో ఆర్థిక క్రమక్షణ లోపించిందని కాగ్ చెప్పిన విషయాన్ని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలెండర్ ధరలలో, రాష్ట్ర ఖజానాకు ఎంత మొత్తం చేరుతుందో  హరీష్ రావు చెప్పారు. ఆయన, చెప్పిన దాట్లో అసత్యం ఉంటే హరీష్ రావు బహిరంగ చర్చకు రావాలని లేదంటే, ప్రభుత్వ ప్రతిష్ట, ముఖ్యమంత్రి ప్రతిష్ట దిగజారతాయని తెరాస నాయకులు కూడా లోలోన మదన పడుతున్నారు. అన్నిటినీ మించి తెలంగాణ ప్రభుత్వం , ఆర్థిక రంగంలో ఎదుర్కుంటున్న ప్రధాన ఆరోపణ, అప్పులు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారనేది కామన్ ఆరోపణ, అయితే హరీష్ రావు, తెలంగాణ ఆదాయం గురించి గొప్పగా చెప్పుకున్నారే, అప్పుల విషయం ఎందుకు చెప్పలేదు, విలేకరులు అడిగినా జవాబు ఎందుకు దాటవేశారు? అయితే, ఇటు రాష్ట్రం అయినా అటు కేంద్రమే అయినా, రాజకీయ ప్రయోజన్ల  కోసం, రాష్ర్గ, దేశ  ప్రయోజనాలను విస్మరించడం, పరస్పర నిందలతో దేశ ప్రతిష్టను దిగజార్చే స్థితికి  తాము దిగజారడం, మంచిది కాదు, గౌరవం కాదు. ముఖ్యంగా, ప్రస్తుత పరిస్తులలో అసలే కాదు.

బాబు బ‌స్సుయాత్ర‌, లోకేశ్ పాద‌యాత్ర‌, బాల‌య్య సైకిల్‌యాత్ర‌.. జ‌గ‌న్‌పై ముప్పేట దాడి?

టీడీపీలో స‌ర్వేల జోష్ మామూలుగా లేదు. తెలుగు త‌మ్ముళ్ల‌లో రెట్టించిన ఉత్సాహం క‌నిపిస్తోంది. సీఎం జ‌గ‌న్ గ్రాఫ్ ఢ‌మాల్ అవ‌డంతో టీడీపీలో కొత్త ఆశ‌లు చిగురిస్తున్నాయి. ఇటు ఇండియా టుడే స‌ర్వే.. అటు లోక‌ల్ యాప్ పోల్‌తో.. జ‌గ‌న్‌పై ఉన్న ప్ర‌జావ్య‌తిరేక‌త స్ప‌ష్ట‌మైంది. మూడ్ ఆఫ్ ది నేష‌న్ స‌ర్వేలో ఏకంగా జ‌గ‌న్ ర్యాంక్ 11వ స్థానానికి ప‌త‌నం అవ‌డం.. కేవ‌లం 6 శాతం మంది మాత్ర‌మే జ‌గ‌న్ బెస్ట్ సీఎం అని అభిప్రాయ‌ప‌డ‌టం వైసీపీని క‌ల‌వ‌రానికి గురి చేస్తే.. టీడీపీలో క‌ద‌నోత్సాహం నెల‌కొంది. ఇదే మంచి స‌మ‌యంగా భావిస్తున్న తెలుగుద‌ళం.. జ‌గ‌న్‌పై దూకుడు మ‌రింత పెంచేలా వ్యూహాలు రెడీ చేస్తోంది.  ఇప్ప‌టికే టీడీపీ అధినేత చంద్ర‌బాబు జూమ్ మీటింగ్స్‌లో ఫుల్ యాక్టివ్‌గా ఉన్నారు. ఇక టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ దూకుడు మామూలుగా లేదు. బాడీ లాంగ్వేజ్‌తో పాటు పొలిటిక‌ల్ లాంగ్వేజ్ కూడా అమాంతం మార్చేశారు లోకేశ్‌. ఫుల్ ఫిట్‌గా మారి.. షార్ప్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఎక్క‌డ ఏ స‌మ‌స్య వ‌చ్చినా.. ఎక్క‌డ ఎవ‌రికి ఏ క‌ష్ట‌మొచ్చినా.. రెక్క‌లు క‌ట్టుకొని వాలిపోతున్నారు. జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు ఆగ‌డాల‌ను ట్వీట్ల‌తో కుళ్ల‌బొడుస్తున్నారు. అందుకే, వైసీపీ గ్రాఫ్ ఎంత‌లా ప‌డిపోతోందో.. టీడీపీ ఇమేజ్ అంత‌లా పెరిగిపోతోంది. స‌ర్వేల్లో ఆ విష‌యం స్ప‌ష్టం కావ‌డంతో టీడీపీలో హుషారు మామూలుగా లేదు.  ఇదే జోరును కంటిన్యూ చేసేతా.. పార్టీ పెద్ద‌లు వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నార‌ని తెలుస్తోంది. జ‌గ‌న్ ప్ర‌భుత్వ పాల‌న‌ను జ‌నంలో ఎండ‌గ‌ట్టేలా ఎత్తుగ‌డ‌లు ర‌చిస్తున్నార‌ట‌. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు మ‌రో రెండున్న‌రేళ్లు స‌మ‌యం ఉన్నా.. ఈలోగా ఏ సీబీఐ కేసులోనే జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు అయి జైలుకు వెళితే.. ప్ర‌భుత్వం కుప్ప‌కూలిపోయి ఏ క్ష‌ణంలోనైనా ఎన్నిక‌లు వ‌చ్చే ఛాన్స్ ఉండ‌టంతో టీడీపీ శ్రేణులు అల‌ర్ట్ అవుతున్నారు. స‌మ‌యం లేదు త‌మ్ముళ్లూ అంటూ చంద్ర‌బాబు స‌మ‌రోత్సాహంతో దూకుడు పెంచుతున్నారు. అందులో భాగంగా.. మ‌రోసారి నేరుగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లే ఆలోచ‌న చేస్తున్న‌ట్టు స‌మాచారం.  గ‌తంలో సుదీర్ఘ పాద‌యాత్ర చేసి విజ‌యకేత‌నం ఎగ‌ర‌వేశారు చంద్ర‌బాబు. అయితే, ప్ర‌స్తుతం ఆయ‌న వ‌య‌సు పాద‌యాత్ర‌కు స‌హ‌క‌రించ‌లేక‌పోవ‌చ్చు. అందుకే, బ‌స్సుయాత్ర చేస్తే ఎలా ఉంటుంద‌ని ఆలోచ‌న చేస్తున్నార‌ని తెలుస్తోంది. త‌న‌తో పాటు త‌న రాజ‌కీయ వార‌సుడినీ ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర చేసేలా.. నారా లోకేశ్‌తో పాద‌యాత్ర చేయించాల‌ని చూస్తున్నార‌ట‌. అంత‌ర్గ‌తంగా జ‌రుగుతున్న ఈ చ‌ర్చ బాల‌కృష్ణ దృష్టికి కూడా వ‌చ్చింద‌ట‌. నేనుసైత‌మంటూ బాల‌య్య సైతం యాత్ర‌కు సై అంటూ తొడ‌గొట్టార‌ని అంటున్నారు. బావ బ‌స్సుయాత్ర‌.. అల్లుడు పాద‌యాత్ర చేస్తే.. తాను సైకిల్ యాత్ర చేయాల‌ని భావిస్తున్నార‌ట‌.  యాత్ర‌ల‌తో పాటు ఎవ‌రెవ‌రు ఏయే ప్రాంతాల్లో ప‌ర్య‌టించాల‌నే దానిపైనా ఓ అవ‌గాహ‌న‌కు వ‌చ్చార‌ని అంటున్నారు. అమ‌రావ‌తి కేంద్రంగా.. తాడేప‌ల్లి ప్యాలెస్ టార్గెట్‌గా.. ఆంధ్రా రీజియ‌న్‌లో నారా లోకేశ్ పాద‌యాత్ర చేస్తార‌ట‌. విజ‌య‌సాయిరెడ్డి ఏలుబ‌డిలో ఉన్న‌ ఉత్త‌రాంధ్ర‌లో టీడీపీకి ఊపు తెచ్చేందుకు స్వ‌యంగా చంద్ర‌బాబే రంగంలోకి దిగి బ‌స్సు యాత్ర నిర్వ‌హిస్తార‌ని తెలుస్తోంది. ఇక‌.. సీమ సింహంలా బాల‌కృష్ణ మీసాలు మెలేసి.. రాయ‌ల‌సీమ‌ను సైకిలెక్కి చుట్టేస్తార‌ట‌. ఇలా ఆ ముగ్గురు.. మూడు ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తూ.. ప్ర‌జ‌ల‌ను సమీకృతం చేస్తూ.. టీడీపీని బ‌లోపేతం చేస్తూ.. జ‌గ‌న్‌రెడ్డిపై ముప్పేట దాడికి సిద్ద‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది. ప‌రిస్థితుల‌ను చూస్తుంటే.. టీడీపీలో స‌ర్వేలో జోష్ మామూలుగా లేదనిపిస్తోంది. ఇక‌, ముగ్గురు మొన‌గాళ్ల యాత్ర‌లతో జ‌గ‌న్‌రెడ్డికి ద‌బిడి దిబిడే...అంటున్నారు.    

తెలంగాణకు కొత్త గవర్నర్? కేసీఆర్ కు ఇక చుక్కలేనా? 

తెలంగాణ గవర్నర్ మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలోనూ గవర్నర్ ను మార్చుతున్నారని ప్రచారం జరిగినా అది జరగలేదు. తాజాగా మాత్రం గవర్నర్ మార్పుతో పాటు కొత్తగా ఎవరూ వస్తారన్నది ప్రచారం సాగుతోంది. తెలంగాణపై స్పెషల్ ఫోకస్ చేసిన బీజేపీ.. సీఎం కేసీఆర్ కు చుక్కలు చూపించాలని డిసైడ్ అయిందని అంటున్నారు. అందులో భాగంగానే కొత్త గవర్నర్ ను నియమించబోతున్నారని చెబుతున్నారు. కొత్తగా వచ్చే గవర్నర్ తో కేసీఆర్ ఇబ్బందులు తప్పవనే చర్చ కూడా బీజేపీ వర్గాల్లో సాగుతోంది.  తెలంగాణకు ప్రస్తుతం తమిళి సై గవర్నర్ గా ఉన్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన తమిళి సై..  2019 సెప్టెంబర్ 8న తెలంగాణ గవర్నర్ గా  బాధ్యతలు చేపట్టారు. గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఆమె పని చేశారు. తమిళనాడులో బీజేపీ బలోపేతానికి కృషి చేయడంతో అమె పనితీరును గుర్తించిన కేంద్రం ఆమెకు తెలంగాణ గవర్నర్ గా అవకాశం ఇచ్చింది. తమిళ సై  ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతమైన పుదిచ్చేరి కి కూడా ఇన్ చార్జి గవర్నర్ గా కొనసాగుతున్నారు. కొన్ని రోజులుగా తమిళి సై హైదరాబాద్ కంటే పుదిచ్చేరిలోనే ఎక్కువగా ఉంటున్నారు. దీంతో ఆమెకు అక్కడే పూర్తి బాధ్యతలు అప్పగించనున్నారని..  తెలంగాణకు కొత్త గవర్నర్ గా  యడ్యూరప్పను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి ఇటీవలే రాజీనామా చేశారు. 75 సంవత్సరాల దాటిన తరువాత అధికారంలో కొనసాగొద్దనే నిబంధనతో ఆయన సీఎం పదవి నుంచి తప్పుకొన్నారు. దీంతో ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని కేంద్రం అప్పుడే మాటిచ్చింది. అనుకున్నట్లుగానే అయనకు తెలంగాణ గవర్నర్ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఆర్ఎస్ఎస్ విభాగానికి చెందిన యడ్యూరప్ప 1970 లో విద్యార్థి దశ నుంచే పనిచేస్తున్నారు. అక్కడి నుంచి పార్టీలో వివిధ కీలక బాధ్యతలు నిర్వహించి సీఎం స్థాయికి ఎదిగారు. కర్ణాటకకు నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మూడుసార్లు విపక్ష నేతగా కొనసాగారు. కొన్నాళ్ల కిందట బీజేపీ నుంచి బయటకు వెళ్లిన ఆయన సొంత పార్టీ పెట్టారు. అది సక్సెస్ కాకపోవడంతో తిరిగొ సొంత గూటికి చేరుకున్నారు.  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత పనిచేసిన గవర్నర్లు  నరసింహం తమిళ సై ఇద్దరూ  తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారే. ఇప్పుడు యడ్యూరప్ప కూడా తెలంగాణతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారే. నాలుగు సార్లు సీఎంగా చేసిన వ్యక్తికి తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు అప్పగిస్తుండడంపై ఆసక్తి చర్చ సాగుతోంది. గత గవర్నర్లు నరసింహన్, తమిళి సైలతో సీఎం కేసీఆర్ మంచి సంబంధాలు కొనసాగించారు. కాని యడియూరప్పతో అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చని అంటున్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ.. తమ రాజకీయ ఎత్తుగడలో భాగంగానే యడియూరప్పను నియమించాలని డిసైడ్ అయిందని అంటున్నారు. యడియూరప్ప గవర్నర్ గా వస్తే సీఎం కేసీఆర్ కు కొన్ని ఇబ్బందులు తప్పవనే చర్చ సాగుతోంది.  గతంలో పుదిచ్చేరి, పశ్చిన బెంగాల్ లో అధికారం కోసం ప్రయత్నాలు చేసిన బీజేపీ.. అక్కడ పవర్ ఫుల్ గవర్నర్లను నియమించింది. బెంగాల్ గవర్నర్ ... అక్కడి సీఎం మమతతో యుద్ధమే చేశారు. పుదిచ్చేరిలోనూ గవర్నర్ కిరణ్ బేడీకి అక్కడి కాంగ్రెస్ సీఎంతో నిత్యం గొడవలే జరుగుతూ ఉండేవి. ఇటీవలే పుదిచ్చేరిలో బీజేపీ కూటమి అధికారంలోకి రాగా. బెంగాల్ లో గట్టి పోటీ ఇచ్చినా పవర్ లోకి రాలేకపోయింది. ఇప్పుడు తెలంగాణలోనూ అలాంటి రాజకీయ గేమ్ బీజేపీ ఆడనుందని తెలుస్తోంది. అందులో భాగంగానే గవర్నర్ గా యడియూరప్పను నియమించాలని డిసైడ్ అయిందని అంటున్నారు.

ఇప్పుడు జీవోలు.. ఉపఎన్నిక తర్వాతే నిధులు? ఓట్లే లక్ష్యంగా కేసీఆర్ దళిత బంధు ప్లాన్...

తెలంగాణలో ఇప్పుడు దళిత బంధు పథకమే హాట్ టాపిక్. దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటోంది కేసీఆర్ సర్కార్. ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల సాయం అందించడం ద్వారా ఆ కుటుంబం దశ మారుతుందని చెబుతోంది. దళితులందరిని లక్షాదికారులను చేయడమే తమ లక్ష్యమంటున్నారు సీఎం కేసీఆర్. విపక్షాలు మాత్రం దళిత బంధు పేరుతో కేసీఆర్ డ్రామాలు చేస్తున్నారని విమర్శిస్తున్నాయి. హుజురాబాద్  ఉప ఎన్నికలో దళితుల ఓట్ల కోసమే.. ఆ నియోజకవర్గంలో పైలెటు ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. దళితులకు మూడెకరాల భూ పంపిణి లాగానే.. దళిత బంధు స్కీం కూడా ముందుకు సాగదని చెబుతున్నాయి ప్రతిపక్షాలు. దళిత బంధుపై విపక్షాల విమర్శలు ఎలా ఉన్నా... దూకుడుగానే వెళుతోంది కేసీఆర్ సర్కార్. తొలి విడతగా గతంలో 5 వందల కోట్లు విడుదల చేస్తూ జీవో ఇవ్వగా...  సోమావరం మరో ఐదు వందల కోట్లు విడుదల చేస్తూ జీవో ఇచ్చింది. దీంతో ఇప్పటివరకు దళిత బంధు కోసం ప్రభుత్వ వెయ్యి కోట్లు రీలీజ్ చేసినట్లైంది. వెయ్యి కోట్లతో హుజురాబాద్ నియోజకవర్గంలోని వెయ్యి దళిత కుటుంబాలకు దళిత బంధు అమలు చేయవచ్చు. హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్ని దళిత కుటుంబాలకు పథకం వర్తిస్తుందని కేసీఆర్ చెప్పారు. 15 మందికి చెక్కులు కూడా ఇచ్చారు. మిగితా వారికి విడతల వారీగా రెండు నెలల్లోనే అందిరికిఅందిస్తామని చెప్పారు ముఖ్యమంత్రి. ఇంతవరకు బాగానే ఉన్నా... ఇక్కడే కేసీఆర్ అసలు డ్రామా ఉందనే విమర్శలు వస్తున్నాయి.  దళిత బంధు కోసం నిధులు విడుదల చేసినట్లు జీవోలు ఇస్తున్నారు కాని.. బ్యాంకులకు నిధులు రిలీజ్ చేయడం లేదని తెలుస్తోంది. దళిత బంధు పథకాన్ని మరింత ఆలస్యం చేసే యోచనలో కేసీఆర్ సర్కార్ ఉన్నట్లు సమాచారం. అందుకే నిధులు ఇస్తున్నట్లు జీవో ఇస్తూ ... డబ్బులను మాత్రం బ్యాంకులకు అందివ్వడం లేదని అంటున్నారు. దళిత బంధు అర్హుల ఎంపిక పేరుతో రెండు, మూడు నెలలు కాలాయపణ చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. దళిత బంధు అర్హుల ఎంపికలో స్థానిక అధికారులతో పాటు బ్యాంకర్లను భాగస్వామ్యం చేశారట. బ్యాంకర్లు దళిత కుటుంబాల ఇండ్లకు వెళ్లి పరిశీలించాలట. 10 లక్షలతో ఏ వ్యాపారం చేస్తారు.. ఎలా ముందుకు వెళతారు అన్న విషయాలు ఆరా తీయాలని సర్కార్ సూచించిదట. బ్యాంకర్లు వాళ్ల పరిస్థితిపై పూర్తి నివేదిక ఇచ్చాకే  డబ్బులకు సంబంధించిన ప్రాసెస్ మొదలవుతుందట. ఇదంతా జరగటానికి చాలా సమయం పడుతుందని చెబుతున్నారు. అంతవరకు తమకు దళిత బంధు పథకం వచ్చిందని మురిసిపోవడమో తప్ప.. లబ్దిదారుల చేతికి చిల్లిగవ్వ కూడా వచ్చే పరిస్థితి లేదట. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే కేసీఆర్ ఇలా కొత్త ఎత్తులు వేస్తున్నారని అంటున్నారు. ఉప ఎన్నిక ఇప్పట్లో జరిగే అవకాశం లేకపోవడంతో... దళిత బంధు కాలాయపణ కోసం సర్వేలు పేరుతో డ్రామాలు చేస్తున్నారని అంటున్నారు. దళిత బంధు పథకం వచ్చిందని చెబుతూ వాళ్లను బుట్టలో వేసుకుంటున్నారట. మీరు ఏం చేస్తారు.. డబ్బులను ఎలా ఉపయోగించుకుంటారు వంటి విషయాలతోనే రెండు, మూడు నెలలు గడిపేస్తారట. ఈ లోపే హుజురాబాద్ ఉప ఎన్నిక వస్తుందని భావిస్తున్నారట. ఉప ఎన్నికకు ముందే దళిత కుటుంబాలకు పథకం వచ్చినట్లు లెటర్ వస్తుందని కాని డబ్బుకు అకౌంట్ లోకి రావు. ఎన్నికల తర్వాతే ఆ ప్రాసెస్ ఉంటుంది. ఈ లోపు ఉప ఎన్నికలో అధికార పార్టీకి వ్యతిరేక ఫలితం వస్తే సర్కార్ ఆలోచన మారవచ్చని అంటున్నారు. దళిత కుటుంబాలు కూడా తమకు దళిత బంధు డబ్బులు రావాలంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలవాలలని కోరకుంటాయి. అందుకే వాళ్లంతా గంపగుత్తగా తమకు ఓటేస్తారని గులాబీ బాస్ వ్యూహమట. ఇలా 50 వేల దళిత ఓట్లను కొల్లగొట్టేందుకు దళిత బంధు పేరుతో కేసీఆర్ డ్రామాలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కేసీఆర్ సర్కార్ పై వస్తున్న విమర్శలకు బలం చేకూరేలానే చర్యలు జరుగుతున్నాయి. కేసీఆర్ చేతుల మీదుగా చెక్కులు అందుకున్న 15 కుటుంబాలకు కూడా ఇంకా డబ్బులు అందలేదు. స్మార్ట్ కార్డులు చూసి మురిచిపోవడం తప్ప వాళ్లకు ఏమి అందలేదట. ముఖ్యమంత్రి ప్రకటించిన లబ్దిదారుల పరిస్థితే ఇలా ఉంటే.. మిగితా వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. ఇప్పుడు విపక్షాలు కూడా ఇదే అంశాన్ని జనంలోకి తీసుకెళుతున్నాయి. దళితుల అభ్యున్నతిపై  కేసీఆర్ సర్కార్ కు నిజంగా చిత్తశుద్ది ఉంటే.. వెంటనే లబ్దిదారులకు నిధులు అందించాలని డిమాండ్ చేస్తున్నాయి. పథకం వచ్చింది కాని నిధుల కోసం కొంత కాలం ఆగాలాంటూ మభ్య పెట్టడం ఏంటని దళిత సంఘాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. ఓట్ల కోణంలో కాకుండా దళిత సంక్షేమం కోసం ఆలోచించాలని కోరుతున్నాయి. 

ఎమ్మెల్సీలు వ‌ద్దు.. స్కూళ్లు కావాలా?.. కేసీఆర్ డ‌బుల్ గేమ్‌కు రీజ‌నేంటి?

జ‌స్ట్ 119 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే ఓటింగ్‌లో పాల్గొంటారు. ఎమ్మెల్సీల‌ను ఎన్నుకుంటారు. త‌క్కువ మందే కాబట్టి ప‌క్కా ఏర్పాట్లు చేయొచ్చు. చాలా సింపుల్‌గా, సుర‌క్షితంగా ఎమ్మెల్సీ ఎన్నిక‌లు పూర్తి చేయొచ్చు. కానీ, అందుకే కేసీఆర్ స‌ర్కారు స‌సేమిరా అంటోంది. ఈసీ ప్ర‌భుత్వ అభిప్రాయం కోరితే.. నాట్ పాజిబుల్ అంటూ రిప్లై ఇచ్చింది. క‌రోనానే అందుకు సాకుగా చూపించింది. కేవ‌లం 119 మంది విష‌యంలోనే కొవిడ్ భ‌య ఉందంటే.. మ‌రి ల‌క్ష‌లాది విద్యార్థులు హాజ‌ర‌య్యే స్కూల్స్, కాలేజెస్‌ను తెర‌వ‌డానికి ఎందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు? ఒకే గ‌దిలో ప‌దుల సంఖ్య‌లో కూర్చొనే విద్యార్థుల‌కు లేని ముప్పు.. ఎమ్మెల్సీ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డానికి ఏముంటుంది? ఇదంతా కేసీఆర్ ఆడుతున్న రాజ‌కీయ డ్రామానా? లేక‌, గులాబీ బాస్‌కు హుజురాబాద్ గుబులా? అనే చ‌ర్చ మ‌రోసారి ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది.  సెప్టెంబ‌ర్ 1 నుంచి తెలంగాణ‌లో అన్ని ర‌కాల విద్యాసంస్థ‌లు రీఓపెన్ కానున్నాయి. అందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. హ‌మ్మ‌య్యా.. అంటూ త‌ల్లిదండ్రులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇంట్లో పిల్ల‌ల పోరు ప‌డ‌లేక‌.. స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయ‌నే మాట విన‌గానే సంబ‌ర‌ప‌డిపోతున్నారు. ఇక ల‌క్ష‌లాది మంది స్టూడెంట్స్ ఇళ్లు విడిచి స్కూల్స్‌కి, కాలేజీల‌కు క్యూ క‌ట్ట‌నున్నారు. అయితే, తాజాగా సెప్టెంబ‌ర్‌లోనే థ‌ర్డ్ వేవ్ ముంచుకువ‌స్తుంద‌ని.. రోజుకు 5 ల‌క్ష‌ల వ‌ర‌కూ కేసులు వ‌స్తాయ‌ని.. కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌లైన‌ నీతి ఆయోగ్‌, ఎన్ఐఎమ్‌డీలు గ‌ట్టిగానే హెచ్చ‌రిస్తున్నాయి. ఈసారి పిల్ల‌ల‌పైనే అధిక ప్ర‌భావం ఉంటుంద‌ని చెబుతున్నారు. స్టూడెంట్స్‌లో ఒక్క‌రు కొవిడ్ బారిన ప‌డితే.. వైర‌స్ వేగంగా అంద‌రినీ చుట్టేసే ప్ర‌మాదం పొంచిఉంది. స్కూల్స్‌లో సానిటైజేష‌న్‌, సోష‌ల్ డిస్టాన్సింగ్ అంత ఈజీ కాక‌పోవ‌చ్చు. ఇలా థ‌ర్డ్ వేవ్ ముప్పు ఇంత ప‌క్కాగా క‌నిపిస్తున్నా.. కేసీఆర్ స‌ర్కారు మాత్రం ఇప్ప‌టికిప్పుడు అర్జెంటుగా సెప్టెంబ‌ర్‌లోనే స్కూల్స్‌, కాలేజేస్ తెర‌వ‌డంపై ఆందోళ‌న సైతం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రో నెల వ‌ర‌కూ వేచి చూసి అప్పుడు నిర్ణ‌యం తీసుకుంటే బాగుండేద‌నే నిపుణుల‌ అభిప్రాయం.   మ‌రోవైపు.. కొవిడ్‌తో కేసీఆర్ ఆడుతున్న పొలిటిక‌ల్ గేమ్ సైతం విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న‌ ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నిక‌ల‌కు క‌రోనాను కార‌ణంగా చూపి మోకాలొడ్డుతుండ‌టాన్ని అంతా త‌ప్పుబ‌డుతున్నారు. టీఆర్ఎస్‌లో ఎమ్మెల్సీ ఆశావ‌హులు, అసంతృప్తులు చాలా మంది ఉండ‌టం వ‌ల్లే.. ఒక‌రికిస్తే మ‌రొక‌రు పార్టీ వీడే ప్ర‌మాదం ఉండ‌టం వ‌ల్లే.. ఎమ్మెల్సీ ఎల‌క్ష‌న్స్‌కి కొవిడ్ కొర్రీలు పెడుతున్నార‌ని మండిప‌డుతున్నారు. ఎమ్మెల్సీ అసంతృప్తులు పార్టీని వీడితే.. ఆ ప్ర‌భావం హుజురాబాద్ ఎన్నిక‌ల మీద ప‌డుతుంద‌ని ఆ భ‌యంతోనే కేసీఆర్ అలా చేస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. ఇక‌, ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రిపితే.. ఆ వెంట‌నే హుజురాబాద్ ఎల‌క్ష‌న్ కూడా నిర్వ‌హించేందుకు ఈసీ రెడీ అవుతుంది. ఇప్ప‌టికిప్పుడు హుజురాబాద్‌లో ఉప పోరు జ‌రిగితే ఈట‌ల రాజేంద‌ర్‌దే గెలుప‌ని కేసీఆర్ చేయించిన‌ స‌ర్వేలు చెబుతున్నాయి. హుజురాబాద్ వార్ ఎంత ఆల‌స్యం అయితే అంత టీఆర్ఎస్ లాభ‌మ‌ని.. అందుకే ఆ ఎన్నిక‌ల‌ను ఆల‌స్యం చేయ‌డానికే ఎమ్మెల్సీ ఎల‌క్ష‌న్ నిర్వ‌హించ‌లేమంటూ ఈసీకి లేఖ రాసిన‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి సీఎం కేసీఆర్‌కు.. ఈట‌ల రాజేంద‌ర్ భ‌యం బాగానే ప‌ట్టుకున్న‌ట్టుంది. ఆయ‌న గెలుపును ఆల‌స్యం చేయ‌డానికే ఎమ్మెల్సీ కిరికిరి పెడుతున్నార‌ని అంటున్నారు. 119 ఎమ్మెల్యేలు ఓటేస్తేనే ప్ర‌మాదం అన్న‌ప్పుడు.. ల‌క్ష‌లాది మంది విద్యార్థులు హాజ‌ర‌య్యే విద్యాసంస్థ‌ల‌కు కొవిడ్ వ‌ర్రీ ఉండ‌దా? స్కూల్స్‌, కాలేజేస్ రీఓపెన్‌కి ఎలా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారో కేసీఆర్‌కే తెలియాలి. ఎమ్మెల్యేల‌కు ఓ రూల్‌? స్టూడెంట్స్‌కు ఇంకో రూలా?

సీఎం ఇంటి పక్కన భరతమాత విగ్రహం తొలగింపు.. ఏపీలో తాలిబన్లను మించిన అరాచకమా? 

ఆంధ్రప్రదేశ్ లో అధికారుల నిర్వాకం మరో వివాదానికి కారణమైంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం వద్ద ఉన్న భరతమాత విగ్రహాన్ని అధికారులు తొలగించడం తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి ఇంటికి భద్రత, రోడ్డు విస్తరణ పేరుతో ఈ విగ్రహాన్ని సోమవారం అర్దరాత్రి అధికారులు తొలగించారు. భారీ క్రేన్ సహాయంతో తొలగించారు. ట్రాక్టర్ ద్వారా తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. భరతమాత విగ్రహం తొలగింపుతో తాడేపల్లిలో ఉద్రిక్తత నెలకొంది.  ఈ విగ్రహం తాడేపల్లికి ప్రధాన ఆకర్షణగా ఉండేది 15 ఏళ్ల క్రితం ఈ భరతమాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తొలుత ఇది మూడు అడుగులు ఉండేది. అయితే 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ విగ్రహం స్థానంలో 15 అడుగుల భరతమాత విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ప్రతి ఏటా స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. సీఎం ఇంటికి భద్రత పేరుతో విగ్రహాన్ని తొలగించాల్సి వచ్చిందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. బకింగ్ హామ్ కెనాల్ నుంచి నూతక్కి వరకు రోడ్డును విస్తరించాలని అధికారులు తెలిపారు. రోడ్డు విస్తరణ పూర్తయిన వెంటనే విగ్రహాన్ని యథాస్థానంలో పెడతామని చెప్పారు.  భరతమాత విగ్రహాన్ని తొలగించడంపై  స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల తీరుపై మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ వైకాపాబన్లు... అరాచకాలలో ఆప్ఘనిస్థాన్ తాలిబన్లను మించిపోయారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వ్యాఖ్యానించారు. తన తాడేపల్లి ప్యాలస్ పక్కన ఎవ్వరూ ఉండటానికి వీల్లేదని, నిరుపేదల ఇళ్లు కూల్చేశారు జగన్ రెడ్డి అని...ఇప్పుడు భద్రత పేరుతో భరతమాత గుండెలపై గునపం దింపారని మండిపడ్డారు. తనకి 2 కోట్లతో గుడి కట్టించుకున్న జగన్ రెడ్డి... తన ఇంటి దగ్గర భరతమాత విగ్రహాన్ని తొలగించడం ఆయన నిరంకుశ, ఫ్యాక్షన్ బుద్ధికి నిదర్శనమని అన్నారు.  ప్రొక్లయినర్లతో పెకలించిన భరత మాత విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని... చేసిన మూర్ఖపుపనికి క్షమాపణలు చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. 

KBCలో 5 కోట్లు గెలిచి.. అంతా పోగొట్టి.. ద‌ళిత‌బంధుకు హెచ్చ‌రిక‌నా?

ద‌ళితబంధు. ఒకేసారి 10 ల‌క్ష‌లు. ఆ డ‌బ్బుతో కావాల్సిన వ్యాపారం చేసుకోవ‌చ్చు. ప్ర‌భుత్వ సాయంతో వారి త‌ల‌రాతలు మారిపోనున్నాయి. ఇక వారి జీవితాల్లో ఇక‌ పేద‌రిక‌మ‌న్న‌దే ఉండ‌దు. సీఎం కేసీఆర్ కాంక్షిస్తున్న‌ స్వ‌ప్నం ఇది. ఈ ల‌క్ష్యం కోస‌మే ద‌ళిత‌బంధు ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్టు ఆర్భాటంగా ప్ర‌క‌టించారు ముఖ్య‌మంత్రి. ఆయ‌న మాట‌లు తెలిసిన‌వే క‌దా. అలానే ఉంటాయి. అర‌చేతిలో స్వ‌ర్గం చూపిస్తారంటారు. ద‌ళిత‌బంధుపై మేధావి వ‌ర్గాలు మొద‌టినుంచీ పెద‌వి విరుస్తున్నాయి. అంతెందుకు, ద‌ళితుడైన మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ సైతం ద‌ళిత‌బంధు వేస్ట్ అంటున్నారు. ఆ సొమ్ముతో మ‌రిన్ని గురుకులాలు ఏర్పాటు చేస్తే.. నిజంగా ద‌ళితుల త‌ల‌రాత మారుతుందంటున్నారు. 10 ల‌క్ష‌ల‌తో పేద‌రికం పోతుందా? 10 ల‌క్ష‌ల‌తో వ్యాపారం చేస్తే.. జీవితాలు బాగుప‌డిన‌ట్టేనా? ఆ అభివృద్ధిని నిలబెట్టుకుంటారా? లాభాలు పోగేయ‌గ‌ల‌రా? మ‌రో గొర్రెల పంపిణీ ప‌థ‌కంలా మార్చేస్తారా? ఇలా అనేక ప్ర‌శ్న‌లు.. అంత‌కుమించి అనుమానాలు.  10 ల‌క్ష‌ల‌తో జీవితాలు మారిపోవ‌చ్చు. అయితే, చాలా జాగ్ర‌త్త‌గా, ప‌ద్ద‌తిగా ముందుకుపోతే మాత్ర‌మే అది సాధ్యం. అంతేగానీ, డ‌బ్బులొచ్చాయి క‌దాని.. ఇష్టారాజ్యంగా చేస్తే అధోగ‌తి త‌ప్ప‌దు. ప్ర‌భుత్వం గొల్ల‌-కురుమ‌ల‌కు గొర్రెలు ఇవ్వ‌గానే.. వెంట‌నే వాటిని అమ్మేసుకొని.. ఆ డ‌బ్బుల‌ను ఖ‌ర్చు చేసేసుకుంటున్న‌ట్టు.. ద‌ళిత‌బంధునూ దుబారా చేసేస్తే.. ఎలాంటి ప్ర‌యోజ‌నం చేకూర‌దు. డ‌బ్బుల విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌నే విష‌యం తెలియ‌చెప్ప‌డానికి తాజాగా ఓ ఉదంతం వెలుగులోకి వ‌చ్చింది. ఆ గెలిచి ఓడిన అదృష్ట‌వంతుడి జీవిత గాథ‌.. అంద‌రికీ ఓ హెచ్చ‌రిక‌... అత‌ను అప్పటిదాకా ఓ మధ్య తరగతి యువ‌కుడు. అంత‌లోనే ఓవర్‌నైట్ 5 కోట్లు వ‌చ్చి ప‌డ్డాయి. రాత్రికి రాత్రే స్టార్‌డమ్ కూడా వ‌చ్చేసింది. ఇంటర్వ్యూలు, కొత్త ప‌రిచ‌యాలు, సెల‌బ్రెటీ స్టేట‌స్‌.. మామూలుగా మారిపోలేదు అత‌ని జీవితం. ఒక్క‌సారే 5 కోట్లు అంటే మాట‌లా? ఆ డ‌బ్బుతో ఎంత ఎత్తుకు ఎదిగిపోవ‌చ్చు. అత‌ని కుటుంబం, జీవితం ఎంతగా మారిపోవ‌చ్చు. కానీ, అలా జ‌ర‌గ‌లేదు. అతడు దారి తప్పాడు. పొగడ్తలు, ప్రశంసలతో మోసపోయాడు. భార్యకు దూరమయ్యాడు. మోసగాళ్ల వలలో చిక్కుకున్నాడు. మద్యం, సిగరెట్లకు బానిసయ్యాడు. డబ్బంతా పోగొట్టుకుని దివాళా తీశాడు. చివరకు మళ్లీ మనిషిగా మారి తన లక్ష్యమేంటో గుర్తెరిగి జీవనాన్ని సాగిస్తున్నాడు. అతనే కౌన్‌బనేగా కరోడ్ పతీ ఐదో సీజన్ విజేత సుశీల్ కుమార్.  ఏకంగా ఐదు కోట్ల రూపాయలను సొంతం చేసుకున్న విజేత. తన జీవితంలో అత్యంత దుర్భరంగా గడిపిన ఉదంతాన్ని తెలుపుతూ ఏడాది క్రితం తన ఫేస్‌బుక్ ఖాతాలో అతడు ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు. అతడి స్టోరీ మళ్లీ ఇప్పుడు కొత్త‌గా వైరల్ అవుతోంది. ఇంత‌కీ ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఏముందో అతడి మాటల్లోనే.... ‘2015-2016.. ఇదే నా జీవితంలో అత్యంత క్లిష్టమైన సమయం. ఏం చేయాలో తెలియని పరిస్థితి. నా అడుగులు ఎటువైపు వెళ్తున్నాయో తెలియని అయోమయం. ఎవరినైనా సలహా అడుగుదమాన్నా నాకు తోడుగా ఎవరూ లేని సమయం. చివరకు నా భార్యతో సహా అంతా నాకు దూరమైన రోజులు అవి. నేను దుర్భర జీవితాన్ని ఎదుర్కొంటున్న సమయానికి సరిగ్గా నాలుగేళ్ల క్రితం. నాదో సెన్సేషన్. రాత్రికి రాత్రే సెలబ్రెటీని అయ్యాను. మీడియా ప్రతినిధులంతా నా ఇంటర్వ్యూ కోసం ఎగబడ్డారు. చుట్టు పక్కల పెళ్లిళ్లు జరిగినా నన్ను పిలిచేవాళ్లు. ఎవరో తెలియని వాళ్లు కూడా నా దగ్గరకు వచ్చి పరిచయం చేసుకునేవాళ్లు. ఇంటికి రమ్మని ఆహ్వానించేవాళ్లు. నన్ను పిలిచి మరీ సన్మానం చేసేవాళ్లు. కారణం.. నేను ఆ ఏడాది కౌన్ బనేగా కరోడ్ పతీ సీజన్ 5 లో ఏకంగా ఐదు కోట్ల రూపాయలను గెలుచుకోవడమే. వాస్తవానికి ఆ షోలో కోటి రూపాయల ప్రశ్న వరకు వెళ్లడమే చాలా కష్టం. కానీ నాకున్న తెలివితేటలతో ఏకంగా ఐదు కోట్ల రూపాయలను గెలుచుకోగలిగాను. అంతే, అప్పటివరకు నాకు ఎవరో తెలియని వాళ్లు కూడా నాకు దగ్గరయ్యారు. నెలలో కనీసం 15 రోజుల పాటు మీటింగులు, సన్మానాలు, పెళ్లిళ్ల వంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికే నాకు సరిపోయేది. అంతకుముందు ప్రైవేటు స్కూల్లో పనిచేస్తూ, ట్యూషన్ చెప్తూ ఇంటి పట్టునే ఉండే నేను.. KBC విన్నర్‌ను అయ్యాక మాత్రం ఇంటి పట్టున ఉండటానికే సమయం దొరికేది కాదు. కనీసం వారానికి ఇద్దరు ముగ్గురయినా మా ఇంటికి వచ్చి కన్నీళ్లు పెట్టుకునేవాళ్లు. వాళ్ల కష్టాలను ఏకరువు పెట్టుకునే వాళ్లు. ఇల్లు గడవడం లేదనో, ఇంట్లో వాళ్లకు అనారోగ్యమనో కారణాలు చెప్పేవాళ్లు. నాకు జాలేసేది. నాకు తోచిన సాయం చేసేవాడిని. అలా నెలకు 50వేల రూపాయల వరకు దానధర్మాలకే పోయేవి. ఓ వైపు ఆదాయం లేదు. మరో వైపు వచ్చిన నగదు బహుమతిని దానధర్మాలకు తగలేస్తున్నావంటూ నా భార్య నన్ను నిందించేది. ‘నిజంగా అవసరం ఉన్న వాళ్లకు ఇస్తే నాకు అభ్యంతరం లేదు. కానీ వాళ్లంతా కల్లబొల్లి కబుర్లు చెప్పి అబద్ధాలతో మోసపుచ్చి మీ దగ్గర డబ్బును లాగేస్తున్నారు. అసలు వాళ్లు చెప్పేవి ఏమీ నిజాలు కావు. అనవసరంగా అలాంటి వాళ్లకు డబ్బను తగలేయకండి’ అని నా భార్య పోరుపెట్టేది. నన్ను నా భార్య సరిగా అర్థం చేసుకోవడం లేదని ఆ సమయంలో నేను తెగ బాధపడేవాడిని. కానీ క్రమక్రమంగా నా భార్య చెప్పిందే నిజమని నాకు తెలిసొచ్చింది. నా సాయం పొందిన చాలా మంది అబద్ధాలు చెప్పిన వాళ్లేనన్న నిజం నాకు తెలిసింది. అయినప్పటికీ ఎవరైనా ఏడుస్తూ నా ముందు చేయి చాస్తే మాత్రం నేను తట్టుకోలేకపోయేవాడిని. నిజమో అబద్ధమో.. వెయ్యో, రెండు వేలో ఇస్తే పోయేదేముంది అని ఇచ్చేసేవాడిని. ఇలా ప్రతి నెలా కనీసం రూ.50వేలు ఇలా దానధర్మాలకే ఖర్చయ్యేవి’ అని చెప్పాడు. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు కూడా పెరిగాయట. ఆయనకు భవిష్యత్తుపై బెంగ లేదని, మంచి చెడు విచక్షణ లేదని భార్య అంటుండేదట. ఇలా వాళ్లిద్దరి మధ్య గొడవలు పెద్దవి అవసాగాయి. ఆ తర్వాత స్నేహితుడితో కలిసి కొన్ని కార్లను కొని ఢిల్లీలో క్యాబ్ సర్వీసుల్లాంటివి స్టార్ట్ చేశాడు. ‘కంపెనీ పనులపై నెలలో కొన్నిరోజులు ఢిల్లీ వచ్చేవాడిని, అక్కడే జేఎన్‌యూ విధ్యార్థులు పరిచయమయ్యారు. వారితో మాట్లాడిన తర్వాత నేను బావిలో కప్పను అనిపించింది. అలా వాళ్లతో కూర్చున్న ప్రతిసారీ సిగరెట్, మందు తప్పనిసరి. అలా అలవాటైన ఈ వ్యసనాలకు బానిసైపోయా. గదిలో కూర్చొని ల్యాప్‌టాప్‌లో సినిమాలు చూస్తూ గడిపేసేవాడిని. ఇది చూసిన ఒకరోజు నా భార్య అరిచేసింది. ఒకే సినిమా చూస్తూ ఉంటే పిచ్చెక్కిపోతుందని, గదిలో కూర్చోవద్దని తిట్టింది. దీంతో చాలా రోజులు ఎవరితో మాట్లాడకుండా ఉండిపోయా. ఆ తర్వాత ఒకసారి ఒక ఇంగ్లీషు జర్నలిస్టు ఫోన్ చేశాడు. ఏదో పిచ్చి ప్రశ్న అడగడంతో కోపం వచ్చేసింది. ఆ కోపంలో నా డబ్బులన్నీ అయిపోయాయని, రెండు ఆవులు పెంచుకుంటున్నానని చెప్పా. వాటి పాలతోనే బతుకుతున్నానని చెప్పా. ఆ తర్వాత ఇది పెద్ద న్యూస్ అయిపోయింది. అప్పటి వరకూ నన్నో సెలబ్రిటీలా చూసిన వాళ్లందరూ ఎవాయిడ్ చేయడం ప్రారంభించారు. పార్టీలకు పిలవడం మానేశారు. ఆ సమయంలోనే భార్య కూడా గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత విడాకుల కోరుతూ నోటీసు పంపింది. దీంతో బంధం నిలబెట్టుకోవాలంటే నేను ఏమైనా సాధించగలనని నిరూపించుకోవాలని అనిపించింది. డైరెక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యి, ఒక మిత్రుడితో మాట్లాడా. అతను ఒక టీవీ కంపెనీలో ఉద్యోగంలో చేర్పించాడు. కానీ కొన్నిరోజులకు అది కూడా బోర్ కొట్టేసింది. వేరే మిత్రుడి గదిలో ఉండి ప్రతిరోజూ ల్యాప్‌టాప్‌లో సినిమాలు చూస్తూ గడిపేశా. ఢిల్లీ బుక్ ఫెయిర్ నుంచి సూట్‌కేసు నిండా పుస్తకాలు తీసుకొచ్చి వాటితో కాలక్షేపం చేయడం ప్రారంభించా’ అని చెప్పాడు. ఉద్యోగం మానేసి ఇంటికి తిరిగొచ్చి, రోజు మొత్తం సిగరెట్లు తాగుతూ కాలక్షేపం చేసేవాడట. ఆ తర్వాత తన పరిస్థితి ఇంతలా దిగజారిందని తెలుసుకొని మళ్లీ ఇంటికి తిరిగొచ్చాడు. అక్కడే టీచర్ ఉద్యోగానికి ప్రిపేర్ అయి, ఉద్యోగం సంపాదించాడు. అనంతరం పర్యావరణం కోసం సేవ చేయడం ప్రారంభించాడు. ఇలా ప్రకృతి ప్రేమలో పడి వ్యసనాలకు దూరమై, కొంత ప్రశాంతంగా గడుపుతున్నానని అతను చెప్పాడు. జీవితాంతం ఇలా పర్యావరణ సేవలో గడిపేస్తే చాలని అంటున్నాడు సుశీల్ కుమార్. తాను చివరిసారిగా మద్య తాగింది 2016 మార్చిలో అని, సిగరెట్ అలవాటు కూడా మానిపోయిందని చెప్పాడు. జీవితంలో అవసరాలకు తగినంత మాత్రమే సంపాదించాలని, ఆ తర్వాత ఏమైనా మిగిలితే పర్యావరణ సేవకు పెట్టుకుంటే చాలని అంటున్నాడు.  2011లో కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 5లో సుశీల్ కుమార్ ఏకంగా 5 కోట్లు గెలిచి.. ఐదేళ్లు గ‌డిచే స‌రికి.. అంతా పోగొట్టి.. జీవితంలో విఫ‌ల‌మైన అత‌ని స్టోరీ.. ద‌ళిత‌బంధు అమ‌లు సందర్భంగా ఓ మంచి హెచ్చ‌రిక‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. ల‌బ్దిదారులు డ‌బ్బు వృధా చేయ‌కుండా.. జాగ్ర‌త్త‌గా పెంపు చేసుకోవాల్సిన అవ‌స‌రాన్ని సుశీల్‌కుమార్ జీవిత గాథ గుర్తు చేస్తోంది.   

50వేలు కాదు 67,820 ఉద్యోగాలు.. నిరుద్యోగుల‌కు ఇక పండ‌గే..

నీళ్లు, నిధులు, నియామ‌కాలు. వీటి కోస‌మే తెలంగాణ సాధించుకుంది. కానీ, ఏడేళ్లు అవుతున్నా వీటిలో ఏ ఒక్క స్వ‌ప్నం నెర‌వేర‌లేదు. కాళేశ్వ‌రం కొన్ని జిల్లాల‌కే ప‌రిమితం. నిధులు క‌ల్వ‌కుంట్ల కుటుంబానికే అనే ఆరోప‌ణ‌. ఇక నియామ‌కాల జాడేలేదు. తెలంగాణ ఏర్ప‌డిన కొత్త‌లో కొన్ని పోలీసు ఉద్యోగాలు భ‌ర్తీ చేసినా.. ఏళ్లుగా అనేక ప్ర‌భుత్వ విభాగాల్లో ఖాళీలు అలానే ఉన్నాయి. ఉన్న‌త విద్యావంతులంతా ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. నోటిఫికేష‌న్లు రాక‌.. ఆ బాధ‌తో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారు. ఇన్నాళ్లూ ఉద్యోగాల ఊసెత్త‌ని కేసీఆర్ స‌ర్కారు.. మారుతున్న రాజ‌కీయ ప‌రిస్థితుల కార‌ణంగా స‌డెన్‌గా ఖాళీల దుమ్ము దులుపుతున్నారు. జాబ్ నోటిఫికేష‌న్ల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. త్వ‌ర‌లోనే 52వేల ప్ర‌భుత్వ ఉద్యోగాలు భ‌ర్తీ చేయాల‌ని ఇటీవ‌లే తెలంగాణ కేబినెట్ నిర్ణ‌యించింది. తాజాగా, ఆ సంఖ్య 67వేలు దాటడంతో నిరుద్యోగుల్లో పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంది. తెలంగాణ‌లోని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలు 67 వేలకు పైగా ఉన్నట్లు ఆర్థిక శాఖ నిర్ధారించింది. ప్రభుత్వానికి సమర్పించేందుకు తుది నివేదిక సిద్ధం చేసింది. ఉద్యోగాల భర్తీలో భాగంగా ప్రభుత్వ ఆదేశాలతో మేలో శాఖల వారీగా వివరాలు సేకరించారు. మొత్తం 52 వేల ఉద్యోగ ఖాళీలున్నట్లు అప్పట్లో మంత్రిమండలికి నివేదించారు. ఆ జాబితా సక్రమంగా లేదని, సమగ్ర సమాచారం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించడంతో ప్రభుత్వ శాఖలు మళ్లీ కసరత్తు చేశాయి.  గత మంత్రిమండలి భేటీలో ముసాయిదా నివేదిక ఇచ్చాయి. ఆ ప్రాతిపదికన వివరాలు ఇవ్వాలని సీఎం అప్పట్లో సూచించడంతో.. అన్ని శాఖలు ప్రక్రియ పూర్తిచేసి గత వారం నివేదిక సమర్పించాయి. అన్నింటినీ క్రోడీకరించగా 67,820 ఖాళీలు తేలాయి. పూర్తి జాబితాను ఈ నెలలో జరిగే మంత్రిమండలి సమావేశంలో సమర్పించనున్నారు. మంత్రివర్గం ఆమోదం అనంతరం నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం సిద్ధ‌మ‌వుతోంది. ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం ఆశ‌గా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల‌కు ఇది శుభ‌వార్తే. అయితే, వివిధ శాఖ‌ల్లో 2 ల‌క్ష‌ల‌కు పైగా ఖాళీలు ఉన్నాయ‌ని.. వాట‌న్నిటినీ భ‌ర్తి చేయాల‌నేది ప్ర‌తిప‌క్షాల డిమాండ్‌. 

జో బైడెన్ తో అమెరికా సర్వనాశనమా..! పదేళ్ల క్రితమే బిన్ లాడెన్ జోస్యం? 

ఆప్ఘనీస్తాన్ లో ప్రస్తుతం తాలిబన్ చేతుల్లోకి వెళ్లింది. 20 ఏండ్ల తర్వాత మళ్లీ ఆప్ఘనీస్తాన్ ను ఆక్రమించుకున్నారు తాలిబన్లు. అప్ఘన్ నుంచి అమెరికా తన బలగాలను ఉప సంహరించుకోవడంతోనే.. ఆపరేషన్ ప్రారంభించిన తాలిబన్లు కొన్ని రోజుల్లోనే కాబుల్ లోకి ఎంటరయ్యారు. తాలిబన్లకు భయపడి అధ్యక్షుడు అఫ్రస్ ఘనీ దేశం విడిచి పారిపోయాడు. దీంతో ఆప్ఘన్ సైన్యం నుంచి ప్రతిఘటన లేకుండానే తాలిబన్లకు అధికారం దక్కింది. అమెరికా వల్లే ఆప్ఘనీస్తాన్ తాలిబన్ల వశం అయిందనే ఆరోపణలు ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తమవుతోంది. యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బైడెన్ తాలిబన్లకు సహకరించారనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి.  తాజాగా అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కు సంబంధించి మరో సంచలన అంశం తెరపైకి వచ్చింది.  బైడెన్ అధ్యక్షుడైతే  అమెరికా సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమని అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ పదేళ్ల క్రితమే చెప్పాడనే విషయం వెలుగులోనికి వచ్చింది. 2011లో అమెరికా బలగాలు లాడెన్‌ను మట్టుబెట్టిన తర్వాత.. లాడెన్  రాసిన 48 పేజీల లేఖ లభ్యమైంది. మే 2010లో తన సోదరుడు అతియా అబ్దుల్ రహ్మాన్‌కు లాడెన్ ఈ లేఖ రాశాడు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, సీఐఏ డైరెక్టర్ డేవిడ్ పెట్రాస్‌ల విమానాలను లక్ష్యంగా చేసుకోవాలని అందులో సూచించిన లాడెన్.. బైడెన్‌ జోలికి వెళ్లొద్దని మాత్రం హెచ్చరించాడు. ఒబామాను చంపేస్తే బైడెన్ అధ్యక్షుడవుతాడని, ఆయన అధ్యక్షుడయ్యాడంటే మన కల నెరవేరినట్టేనని తన లేఖలో బిన్ లాడెన్ చెప్పారు. అధ్యక్ష పదవికి బైడెన్ పూర్తిగా అసమర్థుడని, ఆయన  హయాంలో అమెరికా సంక్షోభంలో కూరుకుపోతుందని, అతడితోనే అమెరికా పతనం ప్రారంభమవుతుందని కూడా ఆ లేఖలో లాడెన్ పేర్కొన్నాడు. కాబట్టి బైడెన్‌కు ఎలాంటి హానీ తలపెట్టవద్దని 48 పేజీలున్న ఈ లేఖలో తన అనుచరులకు సూచించాడు. ఆ లేఖలోని 36వ పేజీలో రెండు హిట్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయాలన్న తన కోరికను లాడెన్ వెల్లడించాడు. అందులో ఒకటి పాకిస్థాన్‌లో, మరోటి ఆఫ్ఘనిస్థాన్‌లో ఏర్పాటు చేయాలన్నాడు. ఈ రెండూ ఒబామా, సీఐఏ డైరెక్టర్‌ల హత్యకు పథక రచన చేయాలని కోరాడు.  బిన్ లాడెన్ రాసిన లేఖ 2012లో తొలిసారి ఈ లేఖ వెలుగులోకి రాగా, ఇప్పుడు ఆఫ్ఘన్ సంక్షోభం నేపథ్యంలో మరోమారు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి అమెరికా సేనలను ఉపసంహరించుకోవడం, ఆప్ఘనీస్తాన్ తాలిబన్ల వశం కావడంతో.. బైడెన్ విషయంలో లాడెన్ చెప్పింది నిజం కాబోతోందా? అన్న చర్చ జరుగుతోంది.  

కవిత, సీతక్క పోరులో గెలుపెవరిది? రేవంత్ ఎంట్రీతో మారిన సీన్..

తెలంగాణ రాజకీయాల్లో ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. గత ఏడేండ్లుగా తమకు ఎదురే లేకుండా ముందుకు సాగుతున్న అధికార టీఆర్ఎస్ పార్టీకి.. ప్రస్తుతం గడ్డుకాలం మొదలైనట్లు కనిపిస్తోంది. కేసీఆర్ పాలనపై తీవ్ర ప్రజా వ్యతిరేకత కనిపిస్తోంది. ఇదే అదనగా విపక్షాలు దూకుడు పెంచడంతో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోతున్నాయి. కొన్ని రోజుల వరకు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పరిస్థితి కనిపించగా.. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత సీన్ మారిపోయింది. వరుస కార్యక్రమాలతో రేవంత్ రెడ్డి జనాల్లోకి వెళుతుండటంతో కాంగ్రెస్ గ్రాఫ్ రోజురోజుకు పెరిగిపోతోంది. కాంగ్రెస్ దూకుడుతో గులాబీ పార్టీలో టెన్షన్ నెలకొంది.  హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం ప్రత్యేక వ్యూహం రచించిన రేవంత్ రెడ్డి.. తెలంగాణలో అతిపెద్ద సంస్థ అయిన సింగరేణిపైనా ఫోకస్ చేశారు. త్వరలో సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు జరగనుండటంతో.. అక్కడ పాగా వేసేందుకు పావులు కదుపుతున్నారు. సింగరేణిలో ప్రస్తుతం టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం హవా సాగుతోంది. నాలుగేండ్ల క్రితం జరిగిన సింగరేణి ఎన్నికల్లో టీజీబీకేఎస్ బంపర్ విక్టరీ కొట్టింది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ  కవిత ఉన్నారు. దీంతో ఆమె ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గతంలో గెలిపించారు. ఈసారి కూడా సింగరేణి ఎన్నికలపై కవిత ఫోకస్ చేశారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గెలుపే లక్ష్యంగా పని చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇప్పటికే కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఎన్నికల్లో పోటీకి ఏ విధంగా వెళ్ళాలి. ఎలా చేయాలి. ప్రతిపక్ష నేతలకు ఎలా సమాధానాలు చెప్పాలి అనే దానిపై వ్యూహం రచిస్తున్నట్లు సింగరేణిలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కవిత సారథ్యంలోని టీజీబీకేఎస్ కు షాకిచ్చేలా రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్ రూపొందించారని తెలుస్తోంది. కవిత పోటీగా ఫైర్ బ్రాండ్ లీడర్, ఎమ్మెల్సీ సీతక్కను బరిలోకి దింపుతున్నారట రేవంత్ రెడ్డి. సీతక్క కూడా ఇప్పటికే సింగరేణి ఎన్నికలపై కసరత్తు ప్రారంభించారని తెలుస్తోంది. సింగరేణి ఎన్నికలపై రేవంత్ రెడ్డి సీతక్కతో ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నట్లు  సమాచారం. ఇప్పటికే ఆయా కార్మిక సంఘం నాయకులతో వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తుంది.   సింగరేణి వ్యాప్తంగా 12 సెగ్మెంట్లలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం రానున్న సార్వత్రిక ఎన్నికలకు ప్రభుత్వం బూస్టింగ్ గా భావిస్తుంది. అందుకే  సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గుర్తింపు సంఘం ఎన్నికలలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఓటమి పాలు అయితే రానున్న సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం సింగరేణి వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో పడుతుందనే ఆలోచనలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అధికార పార్టీ నాయకులు ఈ ఎన్నికలను చాలెంజ్ గా తీసుకొని బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ కూడా సింగరేణి ఎన్నికలను సవాల్ గా తీసుకుందని తెలుస్తోంది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పదవి కాలం ముగిసి ఎప్పుడో నిర్వహించాల్సిన కార్మిక సంఘం ఎన్నికలు ప్రతిసారి వాయిదా పడుతూ వస్తున్నాయి. గత రెండు నెలల క్రితమే రావాల్సిన సింగరేణి ఎన్నికల నగరా హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. హుజరాబాద్ లో ఉప ఎన్నిక ముగిసిన వెంటనే నవంబర్ మొదటివారంలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు కాంగ్రెస్ నుంచి సీతక్క రంగంలోకి దిగితే సింగరేణి ఎన్నికలు రాజకీయ వేడి రాజేసే అవకాశాలున్నాయి. సింగరేణి కార్మికుల్లో సీతక్క మంచి గుర్తింపు ఉంది. గతంలో టీడీపీ అనుబంధ కార్మిక సంఘం టీఎన్టీయూసీ అధ్యక్షురాలిగా పని చేశారు సీతక్క. దీంతో ఆమె కార్మికుల సమస్యలపై మంచి అవగాహన ఉంది. కరోనా సమయంలో సీతక్క చేసిన పనులకు జనాల నుంచి ఆమె నీరాజనాలు దక్కాయి.  సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల రంగంలోకి సీతక్క దిగితే.. అధికార పార్టీకి కష్టమేననే చర్చ బొగ్గు గనుల్లో సాగుతోంది. ఎమ్మెల్సీ కవితకు ఈసారి గెలుపు అంతా ఈజీ కాదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.   

వైఎస్సార్ కు జగన్ కు పోలికే లేదా? కేవీపీ నోట షాకింగ్ నిజాలు.. 

కేవీపీ రామచంద్రరావు... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ బంధువు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన నేత. వైఎస్సార్ రాజకీయ ప్రస్థానంలో సలహాదారుడిగా ఆయన వెంట నడిచారు. ముఖ్యమంత్రిగా వైఎస్సార్ తీసుకున్న అన్ని నిర్ణయాల్లోనూ కేవీపీ పాత్ర ఉందని చెబుతారు. కాంగ్రెస్ పార్టీలోనూ ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పారు కేవీపీ. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అటు ప్రభుత్వం, ఇటు పాలనలో నెంబర్ టు స్థానం కేవీపీదే. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన కేవీపీ.. వైఎస్సార్ మరణం తర్వాత జగన్ కు సపోర్ట్ గా నిలిచారు. అయితే కొద్ది రోజులకే జగన్ కు ఆయన దూరమయ్యారు. జగన్ కొత్త పార్టీ పెట్టుకుంటే.. కేవీపీ మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగారు. ఇద్దరి మధ్య తీవ్రమైన విభేదాలు వచ్చాయనే ప్రచారం అప్పట్లో జరిగింది.   కేవీపీ రామచంద్రరావు ప్రస్తుతం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి దూరంగానే ఉంటున్నప్పటికి.. జగన్ గురించి ఆయనకు పూర్తిగా తెలుసుని అంటారు. వైఎస్సార్ ఆత్మ బంధువుగా చిన్నప్పటి నుంచి జగన్ ను దగ్గరగా చూశారు కేవీపీ. అందుకే జగన్ వ్యవహార శైలీ, ఆయన నైజం గురించి కేవీపీకి తెలిసినంతగా మరొవరికి తెలియదంటారు. అలాంటి కేవీపీ.. ఏపీ సీఎం జగన్ గురించి సంచలన విషయాలు బయటపెట్టారు. సాధారణంగా మీడియాకు దూరంగా ఉంటారు కేవీపీ. కాని ఇటీవల ఆయన ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో వైఎస్సార్ తో తన అనుబంధాన్ని పంచుకున్న కేవీపీ.. ఏపీ సీఎం జగన్ వైఖరిపైనా తనకు తెలిసిన విషయాలు బయటపెట్టారు. జగన్ తీరు ఎలా ఉంటుంది, వైఎస్సార్ ఎలా ఉండేవారు, వైఎస్ తో పోల్చితే జగన్ పరిస్థితి ఏంటన్న అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేవీపీ.  ఏపీ సీఎం జగన్ ఎవరి మాట వినరనే అర్ధం వచ్చేలా మాట్లాడారు కేవీపీ. మంత్రివర్గ సమావేశాల్లో కీలక నిర్ణయాల్ని తీసుకోవాల్సిన సమయంలో సీనియర్ మంత్రులు.. సలహాదారులతో సమస్యలపై చర్చించి వైఎస్ నిర్ణయం తీసుకునేవారన్నారు. రోశయ్య లాంటి సీనియర్ల సలహాల్ని వైఎస్ తీసుకునే వారన్న విషయాన్ని కేవీపీ గుర్తు చేశారు. దీంతో  వైఎస్ మంత్రివర్గ సహచరులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే.. జగన్ మాత్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని పరోక్షంగా కేవీపీ చెప్పినట్లైంది. సమస్యల పరిష్కారానికి ముందు చర్చలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ ఎవరి మాట వినరన్న ఆరోపణ.. ఎవరి సలహాలు స్వీకరించే విమర్శలపైనా స్పందించేందుకు కేవీపీ ఇష్టపడలేదు.  2024లో జరిగే ఎన్నికల్లో జగన్  తిరిగి అధికారంలోకి వస్తారా? అన్న ప్రశ్నకు సూటి సమాధానం చెప్పని కేవీపీ.. జగన్ కున్న బలం గురించి ప్రస్తావించారు. ఉమ్మడి రాష్ట్రంలో జగన్ కు మద్దతుగా కాంగ్రెస్ - టీడీపీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలతో ఉప ఎన్నికలు జరిగితే రెండు మినహా అన్ని స్థానాలు జగన్ గెలిచారని చెప్పారు. కడపలో ఆయనకున్న బలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు.  రామచంద్రాపురం.. నర్సాపురం మినహా అన్నింటా జగన్ పార్టీ గెలిచిందని చెప్పారు. నెల్లూరు లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున సుబ్బిరామిరెడ్డిని బరిలోకి దింపితే.. జగన్ తన అభ్యర్థిగా మేకపాటిని దింపి అత్యధిక మెజార్టీతో గెలుపొందారని.. ఆ ఎన్నికల్లో టీడీపీ డిపాజిటివ్ కోల్పోయిందని కేవీపీ తెలిపారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల కాలం ఉన్నందున.. ఎవరు గెలుస్తారో ఇప్పుడే  అంచనా వేయలేమన్నారు. మంత్రులందరిని తీసి వేసి.. అంతా కొత్త వారితో కాబినెట్ ను సిద్ధం చేసుకుంటారన్న ప్రశ్నకు బదులిచ్చిన కేవీపీ.. గతంలోనే జగన్ ఈ విషయాన్ని చెప్పారని.. మంత్రివర్గంలో 90 శాతం మందిని తొలగిస్తానని చెప్పిన వైనాన్ని గుర్తు చేశారు.  వైఎస్ హయాంలో చోటు చేసుకున్న అంశాలతో పాటు.. సీఎం జగన్ తో తనకున్న రిలేషన్ గురించి కేవీపీ సమాధానం ఇచ్చారు. సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనతో తనకు నేరుగా సంబంధాలు లేవన్నారు. జగన్ తాను ఒకే పార్టీలో ఉన్నంత వరకు కష్టనష్టాల్ని.. సమస్యల్ని షేర్ చేసుకునే వాళ్లమని.. పార్టీ నుంచి వేరు పడినతర్వాత తమ మధ్య వ్యక్తిగత సంబంధాలు అలానే ఉన్నా.. అప్పటిలా సమస్యల్ని పంచుకునే విధానం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం జగన్ ఎదుర్కొంటునన విమర్శల్నే గతంలోనూ వైఎస్ ఎదుర్కొనేవారని.. జగన్ వయసు ఉన్నప్పుడు వైఎస్ కు ఇలాంటి సమస్యే ఎదురయ్యేదన్నారు. పాదయాత్ర తరువాత ఆయనలో పూర్తిగా మార్పు వచ్చిందన్నారు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా.. మిత్రుల ద్వారా.. సన్నిహితుల ద్వారా తెలిసిన విషయాల మీదనే తాను స్పందిస్తున్నానని చెప్పారు కేవీపీ. 

హుజురాబాద్ కు మరో కీలక పదవి.. ఈటల చుట్టే కేసీఆర్ రాజకీయమా? 

హుజురాబాద్ ఉప ఎన్నికలో కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందా? సర్వేలన్ని కారు పార్టీకి వ్యతిరేకంగా వస్తున్నాయా? అంటే ప్రభుత్వ వర్గాలు, టీఆర్ఎస్ నేతల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు, గులాబీ నేతల చర్యలు కూడా అలాంటే సంకేతమే ఇస్తున్నాయి. ఈటల రాజేందర్ రాజీనామా చేసినప్పటి నుంచి సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలన్ని హుజురాబాద్ తో సంబంధం ఉండేలానే ఉంటున్నాయి. పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టులు, ప్రభుత్వ పథకాలు కూడా అన్ని హుజురాబాద్ కేంద్రంగానే ఉంటున్నాయి. దీంతో ఈటల రాజేందర్ ను ఓడించడం గులాబీ బాస్ కు పెద్ద పరీక్షగా మారిందనే చర్చ సాగుతోంది. ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన పౌడి కౌశిక్ రెడ్డిని ప్రకటించారు సీఎం కేసీఆర్. ఆయన పార్టీలో చేరిన వెంటనే ఆ పదవి దక్కడం మరో విశేషం. హుజురాబాద్ నియోజకవర్గానికే చెందిన బండ శ్రీనివాస్ ను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. కొత్తగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ నియోజకవర్గంలోనే అమలు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే రూ. 1000 కోట్లు విడుదల చేశారుమూడేండ్లుగా పెండింగులో ఉన్న రెండో విడత గొర్రెల పంపిణి కూడా హుజారాబాద్ లో తిరిగి ప్రారంభించారు. తాజాగా మరో కీలక పదవి హుజారాబాద్ నియోజకవర్గానికే దక్కింది.  తెలంగాణ ప్రభుత్వం బీసీ కమిషన్‌ చైర్మన్‌గా వకుళాభరణం కృష్ణమోహన్‌ను నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వకుళాభరణం కృష్ణమోహన్ గతంలో బీసీ కమిషన్ సభ్యుడిగా పని చేశారు.  కమిషన్ సభ్యులుగా ఉపేంద్ర, కిశోర్ గౌడ్, శుభప్రద్ పాటిల్‌ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది.  వకుళాభరణం కృష్ణమోహన్‌ ది హుజూరాబాద్‌ నియోజకవర్గమే. ఈటల రాజేందర్ ను ఓడించడం లక్ష్యంగానే వకుళాభరణానికి బీసీ కమిషన్ చైర్మన్ పదవి దక్కిందనే ప్రచారం జరుగుతోంది. వకుళాభరణం బీసీ సంఘం తరపున గతంలో చాలా పోరాటాలు చేశారు. బీసీ వర్గాల్లో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. దీంతో ఆయనకు కీలక పదవి ఇవ్వడం ద్వారా బీసీ వర్గాల మద్దతు పొందవచ్చని గులాబీ బాస్ ప్లాన్ చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు కేసీఆర్ నిర్ణయాలు, చర్యలను గమనిస్తున్న వారు.. ఆయనకు హుజారాబాద్ లో ఓటమి భయం పట్టుకుందనే విమర్శలు చేస్తున్నారు. అందుకే పార్టీ పదవులతో పాటు ప్రభుత్వంలోని కీలక పదవులన్ని ఒక్క నియోజకవర్గానికి చెందిన వ్యక్తులకే కట్టబెడుతున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో ఉప ఎన్నికలను కేసీఆర్ అసలు పట్టించుకునే వాడే కాదని... ఇప్పుడు మాత్రం రోజూ ఆయన హుజురాబాద్ జపమే చేస్తున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం చేయిస్తున్న సర్వేల్లోనూ అధికార పార్టీకి వ్యతిరేక ఫలితాలు రావడమే ఇందుకు కారణం అంటున్నారు. నిద్రలోనూ కేసీఆర్ కు హుజురాబాద్ ఉప ఎన్నిక భయపెడుతున్నట్లుందని కొందరు సెటైర్లు వేస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న విషయాన్ని గ్రహించారు కాబట్టే... కేసీఆర్ ఇంతగా ఫోకస్ చేశారనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వస్తోంది. మొత్తానికి ఏది ఏమైనా ఈటల రాజేందర్ ప్రభావంతో హుజురాబాద్ నియోజకవర్గానికి మహార్దశ పెట్టిందనే చర్చ జనాల్లో సాగుతోంది. 

మా ఇంటికి రావొద్దు.. షర్మిలకు దిమ్మతిరిగే షాక్! 

వైఎస్సార్ టీపీ తెలంగాణ అధినేత్రి షర్మిలకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ రాజీనామాతో  కుదేలైన వైఎస్ షర్మిలకు మరో  ఊహించని షాక్ తగిలింది. నిరుద్యోగుల కుటుంబాలకు మద్దతుగా పోరాడుతున్న ఆమెకు.. ఓ నిరుద్యోగి కుటుంబం నుంచే ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్షల్లో భాగంగా ఈ నెల 24న మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం, లింగాపూర్‌లో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టాలని షర్మిల నిర్ణయించారు. అయితే దీక్ష ముందు రోజే దీక్ష కోసం తమ ఇంటికి రావొద్దంటూ నిరుద్యోగి నరేష్‌ తండ్రి.. వైఎస్ షర్మిలకు విజ్ఞప్తి చేయడం కలకలం రేపుతోంది.  మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్‌కు చెందిన నరేష్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. నరేష్ ముగ్గురు అన్నలకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. నరేష్‌కు ఉద్యోగం రాకపోవడంతో వ్యవసాయం చేస్తూ తన తండ్రికి చేదోడుగా ఉన్నాడు. తనకు ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదని మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రతి మంగళవారం చేస్తున్న నిరుద్యోగ దీక్షలో భాగంగా.. లింగాపూర్‌కు చెందిన నరేష్ ఇంటికి వెళ్లాలని ప్లాన్ చేశారు. అందుకోసం  పార్టీ నేతలు ప్రణాళికలు రూపొందించారు. నరేష్ తండ్రి నిర్ణయంతో వైసీపీ నేతలంతా ఆలోచనలో పడ్డారు.  గత మంగళవారం మహబూబాబాద్‌ నియోజకవర్గంలోని గూడూరు మండలం గుండెంగ గ్రామంలో షర్మిల దీక్ష చేశారు. గ్రామ సమీపంలోని సోమ్లా తండాలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి బోడ సునీల్‌ నాయక్‌ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. 

మోడీ ప్రభుత్వానికి మరో తలనొప్పి.. కుల గణన సాధ్యమేనా? 

దేశంలో రాజకీయం వేడెక్కుతోంది. రేపో మాపో ఎన్నికలు జరుగుతాయో  అన్నంతగా రాజకీయ కార్యకలపాలు ఊపందు కుంటున్నాయి. ఇదిలా ఉండగానే మరో  సున్నిత అంశం తెర మీదకు వచ్చింది.  జనగణన కులాలవారీగా జరగాలని, ఇప్పటికే రెండు సార్లు రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసిన బీహార్ రాజకీయ గణం.. ప్రధాని నరేంద్ర మోడీని కలిసి రాష్ట్రంలో కుల గ‌ణ‌న చేప‌ట్టాల‌ని కోరింది. ముఖ్యమత్రి, జేడీయు నేత నితీష్ కుమార్ సారధ్యంలో ప్రధానిని కలిసిన పది పార్టీల ప్రతినిధి బృందంలో, ప్రతిపక్ష నేత, ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్ కూడా ఉన్నారు. ప్ర‌ధానితో భేటీ అయిన‌వారిలో ముఖేశ్ స‌హాని, జిత‌న్ రామ్ మాంజీలు కూడా ఉన్నారు. ఒక విధంగా ఈ ఒక్క విషయంలో ఒక్క బీజేపీ మినహా అన్ని పార్టీలు ఏకమయ్యాయి.  ప్ర‌ధానిని క‌లిసిన త‌ర్వాత బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, అదే విధంగా ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్’ మీడియాతో మాట్లాడారు.అయితే, ఆ ఇద్దరి స్వరంలో మాత్రం స్పష్టమైన మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపించింది. నితీష్ కుమార్, మిత్ర ధర్మాన్నిపాటిస్తూ కావచ్చును, ప్రధానికి చెప్పవలసింది చెప్పాం, ఆయన కూడా చక్కగా విన్నారు.. ఇప్పుడు బంతి మోడీ కోర్టులో వుంది, ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చాద్దాం, అంటూ చేతులెత్తి దండం పెట్టారు. ఒక విధంగా చూస్తే, ఆయన బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టి, చేతులు కడుక్కున్నారు.ఆర్జేడీ నేత తేజ‌స్వి యాద‌వ్’ మాత్రం ఎలాంటి మొహమాటాలు లేకుండా, ఒక్క బీహార్’లో కాదు దేశం అంతటా కుల గణన జరగవలసిందే అని, గట్టిగా డిమాండ్ చేశారు. అంతే కాదు, కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూసి, తమ నిర్ణయం ప్రకటిస్తామంటూ ఒక హెచ్చరిక లాంటిది చేశారు. బీహార్‌లో బీజేపీ మినహా అన్ని పార్టీలు  కులాలవారీ జనగణన జరగాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే. ఈ డిమాండ్‌ విషయంలో, బీజేపీ కేంద్ర నాయకత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోయినా, బీహార్ బీజేపీ నాయకులు చాలావరకు కుల గణనను సమర్ధిస్తున్నారు. పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే కుల గణన డిమాండ్’ను తాను ఎప్పుడూ వ్యతిరేకించ లేదని, కర్ర విరగకుండా పాము చావకుండా మాటలను  మెలికలు తిప్పి  సరైన సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నా.   బీహార్ ఉప ముఖ్యమంత్రి రేణుదేవి సహా పలువురు బీజేపీ నేతలు కులగణనకు మద్దతు పలుకుతున్నారు.అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా అవుననీ, కాదని అనకుండా నెట్టుకొస్తోంది. అయితే, ఇప్పుడు ఈ డిమాండ్‌పై నితీష్, తేజస్వి ఏకాభిప్రాయంతో ఉండటంతో పాటుగా బీజీపీ రాష్ట్ర నాయకులూ కూడా అటే మొగ్గుచుపుతున్న నేపధ్యంలో, కేంద్రం కూడా  ఇక దాగుడుమూతలు కట్టేయక తప్పదని పరిశీలకులు అంటున్నారు.  అలాగే ఉత్తర ప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా దగ్గరలోనే ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఈ సున్నిత సమస్య విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదన్న మాట కూడా రాజకీయ వర్గాల్లో వినవస్తోంది. అయితే ఇదొక తేనే తుట్టెను కదిలించడమే అవుతుందని, కొందరు అంటుంటే, ఓబీసీ జాబితాను రూపొందించుకునే రాష్ట్రాల హక్కును పునరుద్దరిస్థూ 127  రాజ్యాంగ సవరణ బిల్లును తెచ్చిన కేంద్ర ప్రభుత్వం, కుల గణన విషయంలోనూ సానుకూలంగా స్పందించ వచ్చని మరి కొందరు అభిప్రాయ పడుతున్నారు. కుల గణన వలన ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఒక ప్రాతిపదిక ఏర్పడుతుంది, అదే సమయంలో కులాల మధ్య ఇప్పటికే  రగులుతున్న చిచ్చు మరింతగా భగ్గు మంటుంది. ఒక మాటలో చెప్పాలంటే కుల గణన అటు రాజకీయంగానూ, ఇటు సామాజికంగానూ రెండు వైపులా పదునున్న కత్తి... మోడీ ఎటు నుంచి నరుకొస్తారో ... ఈసున్నిత సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాల్సిందే అంటున్నారు విశ్లేషకులు. 

థర్డ్ వేవ్ వచ్చేసింది.. తస్మాత్ జాగ్రత్త 

కరోనా మహామ్మారి సెకండ్ వేవ్ చివరాఖరి దశకు చేరుకుంది. ఇక రేపో మాపో బై బై చెప్పి వెళ్ళిపోతుంది, ఆగష్టులో వస్తుందనుకున్న థర్డ్ వేవ్ రాలేదు. మనం ఇక కాస్త ఊపిరి  తీసుకోవచ్చు, అని అందరూ ఆశపడుతున్న సమయంలో, కేంద్ర హోమ్ శాఖ బాంబు పేల్చింది. సెకండ్ వేవ్ ఉదృతి సంపూర్ణ క్షీణ దశకు చేరుకుంది, కానీ, మహమ్మారి థర్డ్ వేవ్ వచ్చేసిందని,  అక్టోబర్ నాటికీ, ఉదృత రూపం దాలుస్తుందని పిడుగులాంటి వార్తను మోసుకొచ్చింది.  కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ  పరిధిలో పనిచేసే  జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్ఐఎండీ) నిపుణుల కమిటీ, థర్డ్ వేవ్ వచ్చేసిందని,  ప్రస్తుతానికి  కొంత మెల్లగా ఉన్నా, అక్టోబర్ నాటికి తీవ్ర రూపం దాల్చే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. కొవిడ్ పునరుత్పత్తి రేటు, ‘ఆర్ – వాల్యూ’ పెరుగుతోంది. జూలై చివరి వారంలో 0.9 గా ఉన్న ఆర్ – విలువ ఇప్పుడు ఒకటి గీత దాటిందని ఇది థర్డ్ వేవ్ వచ్చిందనేందుకు తిరుగు లేని  సంకేతమని,తేల్చి చెప్పింది. అలాగే, ‘థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనే సంసిద్ధత.. పిల్లలపై ప్రభావం, రికవరీ’ పేరు’ తో ప్రధాని కార్యలయానికి సమర్పించిన అధ్యయన నివేదికలో ఎన్ఐఎండీ ముందుగా అనుకున్నట్టు చిన్న పిల్లల్లే థర్డ్ వేవ్ టార్గెట్’ కానుందని, అదే సమయంలో పెద్దలను వదలదని, ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా భారీ నష్టం తప్పదని గట్టి హెచ్చరికలే చేసినట్లు సమాచారం.  ఒకవేళ పెద్ద సంఖ్యలో పిల్లలు కోవిడ్ బారినపడితే వారికి తక్షణమే చికిత్స అందజేసేలా వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, వెంటిలేటర్లు, అంబులెన్స్‌లు సహా పిల్లలకు అవసరమైన వైద్య సదుపాయాలను సిద్ధం చేసుకోవాలి’ అని తెలిపింది. అనారోగ్య సమస్యలున్న చిన్నారులకు ప్రాధాన్యత, దివ్యాంగులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించింది. థర్డ్ వేవ్ అక్టోబరులో తారాస్థాయికి చేరుకుంటుందని గతంలో వివిధ సంస్థలు వేసిన అంచనాలతో ఈ కమిటీ ఏకీభవించింది.ఈ  నేపధ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఇందులో భాగంగానే, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ సరఫరా కోసం రాష్ట్రంలో మరో 41 ఆసుపత్రుల్లో ప్లాంటుల ఏర్పాటు చేస్తోందని చెప్పారు. భద్రాచలం, జగిత్యాల్, జనగాం అప్రభుత్వ ఆసుపత్రులలో PSA ఆక్సిజన్ ప్లాంటులు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. కోవిడ్ చికిత్స, వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశ వ్యాప్తంగా సజావుగా కొనసాగుతోందని, రాష్త్రంలో మరో 13 లక్షల 18 వేల వాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. అందరికీ కొవిడ్ వాక్సిన్ వేసేందుకు అన్నీ ఏర్పాట్లూ జరుగుతున్నాయని, ఎవ్వరూ ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. అయితే, కొవిడ్ జాగ్రత్తలను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని కోరారు. కిషన్ రెడ్డి, ప్రత్యక్షంగా థర్డ్ వేవ్ ప్రస్తావన చేయక పోయినా, కేంద్ర ప్రభుత్వం అందుకు సిద్దం అవుతోందని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.  నిజానికి  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొవిడ్ ఫస్ట్  ఫస్ట్ వేవ్ సమయంలో తీసుకున్న శ్రద్ధ సెకండ్ వేవ్ సమయంలో తీసుకోలేదు. అందుకే, సెకండ్ వేవ్ కొవిడ్ కేసులే కాదు మరణాలు కూడా చాలా పెద్ద ఎత్తున సంభవించాయి. అయితే, ప్రభుత్వాతో పాటుగా, ప్రజలు కూడా  నిర్లక్ష్యంగా నిబంధనలను గాలికి వదిలేశారు. అందుకే, ఫస్ట్ వేవ్ కన్నా.., సెకండ్ వేవ్’లో మన దేశం  ఎక్కువ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. అలాగే, సెకండ్ వేవ్ ఉదృతికి డెల్టా వేరియంట్ కూడా ఒక ప్రధాన కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇక ఇప్పుడు వచ్చిన థర్డ్ వేవ్’ ఏ వేరియంట్’ అవుతుందో, ఎలాంటి ప్రభావం చూపుతుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. థర్డ్ వేవ్ రాక తప్పదని తేలడంతో.. పిల్లల్ని కాపాడేందుకు భారీ ఎత్తున వైద్య సౌకర్యాలు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోందని కమిటీ సైతం నివేదికలో పేర్కొనట్లు సమాచారం. మరో వంక  కొవిడ్ పునరుత్పత్తి రేటు, ‘ఆర్ – వాల్యూ’ పెరుగుతోంది. జూలై చివరి వారంలో 0.9 గా ఉన్న ఆర్ – విలువ ఇప్పుడు ఒకటి గీత దాటిందని ఇది థర్డ్ వేవ్ వచ్చిందనేందుకు స్పష్టమైనసంకేతమని, దీనిని ఉపేక్షించ రాదని ఎన్ఐఎండీ  నిపుణులు హెచ్చరిస్తున్నారు.