జైలులో నెల‌కు కోటి లంచం.. తిహార్‌లో సుఖేశ్ లీల‌లు...

అత‌ను జైల్లో ఉన్నాడు. అందులోనూ దేశంలోనే టైట్ సెక్యూరిటీ ఉండే తీహార్ జైలు. అంత‌టి క‌ట్టుదిట్ట‌మైన జైల్లో ఓ కిలాడీ ఉన్నాడు. అస‌లే ఆర్థిక నేర‌గాడు. ఇంకేం.. జైలు సిబ్బందికి డ‌బ్బులు వెద‌జ‌ల్లాడు. వందో, వెయ్యో కాదు.. ఏకంగా నెల‌కు కోటి రూపాయ‌ల లంచం ఇస్తున్నాడు. జైల్లోనే జ‌ల్సాలు చేస్తున్నాడు. సెల్‌లోనే ల‌గ్జ‌రీలు అనుభ‌విస్తున్నాడు. అత‌న్ని క‌లిసేందుకు బాలీవుడ్ హీరోయిన్స్‌, మోడ‌ల్స్ వ‌చ్చి పోతున్నారు. తాజాగా ఈడీ ద‌ర్యాప్తులో ఆ వైట్ కాల‌ర్ క్రిమిన‌ల్ జైలు బాగోతం బ‌య‌ట‌ప‌డింది. విష‌యం తెలిసి విచార‌ణ అధికారులే అవాక్క‌య్యారు. ఇదంతా.. ఆర్థిక మోస‌గాడు సుఖేశ్ చంద్ర‌శేఖ‌ర్ గురించి. రాన్​బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్​, శివిందర్​ సింగ్​కు బెయిల్​ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర నుంచి ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేసిన కేసులో సుఖేశ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి.. తిహార్ జైలుకు త‌ర‌లించారు. కేంద్ర న్యాయశాఖలోని ఉన్నతాధికారిగా పరిచయం చేసుకుని వారిని మోసం చేసినట్లు తేల్చారు. జైల్లో తనకు ఖరీదైన వసతులు కల్పించడంతో పాటు స్వేచ్ఛగా ఉండేందుకు వీలుగా జైలు సిబ్బందికి సుఖేశ్‌.. ప్రతి నెలా రూ.కోటి లంచం ఇస్తున్నాడని ఈడీ దర్యాప్తులో వెల్లడైనట్టు జాతీయ మీడియా కథనాలు వ‌స్తున్నాయి. జైల్లో మొబైల్‌ ఫోన్ వాడేందుకు 15 రోజులకు రూ.60-75లక్షలు ఇచ్చినట్టు తెలుస్తోంది. జైల్లో సిబ్బందికి చికెన్‌ పార్టీలు కూడా ఇచ్చేవాడట సుఖేశ్‌.  జైల్లో ఉన్న సుఖేశ్‌ను జాక్వెలిన్‌ ఫెర్నాండెస్‌, నోరా ఫతేహీతో పాటు చాలా మంది బాలీవుడ్‌ హీరోయిన్లు, మోడల్స్‌ వచ్చేవారని స‌మాచారం. మొత్తం 12 మంది హీరోయిన్లు, మోడల్స్ జైల్లో అతడిని కలిసినట్టు తెలుస్తోంది. సుఖేశ్​ జైలులో ఉన్నప్పటికీ 2021 జనవరి నుంచి ఫోన్​ ద్వారా హీరోయిన్ జాక్వెలిన్​తో మాట్లాడుతున్నట్టు ఈడీ ఛార్జిషీట్లో న‌మోదు చేసింది. సుఖేశ్ కేసులో 200 కోట్ల మ‌నీ లాండ‌రింగ్ ఆరోప‌ణ‌ల‌తో జాక్వెలిన్‌నూ ప్ర‌శ్నించారు ఈడీ అధికారులు. అతని నుంచి జాక్వెలిన్‌ సుమారు రూ.10 కోట్లు విలువైన కానుకలు తీసుకున్నారని అంటున్నారు. సుఖేశ్‌​ పంపిన కానుకల్లో.. రూ.52 లక్షల విలువైన గుర్రం, నాలుగు పర్షియన్​ పిల్లులు (ఒక్కోటి రూ.9 లక్షలు) ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.  కాలర్​ ఐడీ స్పూఫింగ్​ ద్వారా తిహార్‌​ జైలు నుంచి జాక్వెలిన్‌తో సుకేశ్​ మాట్లాడేవాడని, ఖరీదైన పూలు, చాక్లెట్లు బహుమతిగా పంపేవాడని ఈడీ​ వర్గాలు తెలిపాయి. సుకేశ్‌పై దేశవ్యాప్తంగా 23 చీటింగ్​ కేసులు ఉన్నాయి.  ఇక‌, ఈ ఎపిసోడ్‌లో మ‌రో ట్విస్ట్ ఏంటంటే.. తిహార్‌ జైలు సిబ్బంది తనను వేధింపులకు గురిచేస్తున్నారని సుఖేశ్‌.. జైలు ఉన్న‌తాధికారులకు లేఖ రాశాడు. తనను డబుల్‌ లాక్ గదిలో బంధించడంతో మానసికంగా కుంగిపోతున్నానని అన్నారు. తన భార్యను కేవలం రెండు వారాలకు ఒకసారి మాత్రమే కలవనిస్తున్నారని ఆరోపించడం ఆస‌క్తిక‌రం. 

హైదరాబాద్ లో ఐఏఎంసీ ప్రారంభం.. సీజేఐ ఎన్వీ రమణను కీర్తించిన కేసీఆర్

దేశంలోనే తొలి ఐఏఎంసీ హైద‌రాబాద్‌లో ఏర్పాటైంది నానక్‌రామ్‌గూడ‌లోని ఫోనిక్స్ వీకే టవర్స్‌లో 25 వేల చ‌ద‌ర‌పు అడుగుల‌లో ఏర్పాటు చేసిన‌ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కేసీఆర్ క‌లిసి ప్రారంభించారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఐఏఎంసీ వెబ్‌సైట్ ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్బంగా ఐఏఎంసీ కేంద్రాన్ని సీజేఐకు అప్ప‌గించారు. ప్ర‌స్తుతం తాత్కాలిక భ‌వ‌నంలో ఐఏఎంసీ ఏర్పాటు అవుతోంది. ఐఏఎంసీ శాశ్వ‌త భ‌వ‌నం కోసం భూకేటాయింపులు పూర్త‌య్యాయి. ఈ కార్యక్రమంలో ట్రస్టీలుగా ఉన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వర రావు, జస్టిస్ హిమాకోహ్లి, సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, హోంమంత్రి మ‌హ‌ముద్ అలీ, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. భార‌త‌దేశంలో ప్ర‌ప్ర‌థ‌మంగా హైద‌రాబాద్‌లో ఐఏఎంసీ ఏర్పాటు కావ‌డం, సీజేఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ మ‌న‌ల్ని దీవించ‌డం మ‌నంద‌రికి గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ సంద‌ర్భంగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌ను హృద‌య‌పూర్వ‌కంగా, చేతులు జోడించి అభినందిస్తున్నాన‌ని కేసీఆర్ పేర్కొన్నారు. హైద‌రాబాద్‌ను అతిగా ప్రేమించే వ్య‌క్తుల్లో జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ఒక‌రని  చెప్పారు. ఐఏఎంసీ ఏర్పాటుకు ఆయనకే ప్ర‌ధాన పాత్ర పోషించారుని తెలిపారు. అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌కు దీటుగా హైద‌రాబాద్ పురోగ‌మిస్తోందన్నారు కేసీఆర్. అనేక రంగాల్లో హైద‌రాబాద్ కేంద్ర బిందువుగా మారుతోందని చెప్పారు.  హైద‌రాబాద్‌ను ఈ స్థాయిలో నిలిపేందుకు చాలా మంది కృషి చేశారని తెలిపారు. ఐఏఎంసీ.. దేశానికి, రాష్ట్రానికి, న‌గ‌రానికి, మ‌న వ్య‌వ‌స్థ‌కు మంచి పేరు ప్ర‌తిష్ఠ‌లు సంపాదిస్తుంద‌న‌డంలో ఎటువంటి సందేహం లేదన్నారు కేసీఆర్. హైద‌రాబాద్ న‌గ‌రంలో ఐఏఎంసీ ప్రారంభించ‌డం సంతోషంగా ఉంద‌ని సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ అన్నారు. ఐఏఎంసీ ఏర్పాటుకు ప్ర‌తిపాదించ‌గానే కేసీఆర్ అంగీక‌రించారని, త‌క్కువ కాలంలో మంచి వ‌స‌తుల‌తో ఐఏఎంసీ ఏర్పాటైందని చెప్పారు. ఐఏఎంసీ ఏర్పాటుకు స‌హ‌క‌రించిన సీఎం కేసీఆర్‌కు, మౌలిక వ‌స‌తులు క‌ల్పించిన ప్ర‌భుత్వానికి ఎన్వీ ర‌మ‌ణ ధ‌న్య‌వాదాలు తెలిపారు. రాజీ, మ‌ధ్య‌వ‌ర్తిత్వంలో ఐఏఎంసీ కీల‌కపాత్ర పోషిస్తుంద‌న్నారు. అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో ఐఏఎంసీ ఏర్పాటు చేశామ‌ని చెప్పారు. సాంకేతిక నైపుణ్యం, నిపుణుల స‌ల‌హాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఐఏఎంసీ ఏర్పాటుకు హైద‌రాబాద్ అన్ని విధాలా అనుకూలంగా ఉంద‌ని, ఉత్త‌ర‌, ద‌క్షిణ భార‌తానికి హైద‌రాబాద్ వార‌ధి లాంటిద‌ని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. 

మూడు రాజధానుల సభ తుస్.. గేట్లు బంద్.. మహిళలు జంప్ 

వైయస్ జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల నినాదం అందుకుంది. ఈ నినాదానికి అనుకూలంగా అభివృద్ధి వికేంద్రీకరణ  రాయలసీమ మనోగతం పేరిట శనివారం తిరుపతిలోని ఇందిరా మైదానంలో నిర్వాహకులు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అందుకోసం పరిసర ప్రాంతాల నుంచి ఈ సభకు భారీగా జనాన్ని నిర్వాహాకులు తరలించారు. అయితే అలా వచ్చిన జనం ముఖ్యంగా మహిళలు.. ఈ సభ ఇంకా ప్రారంభం కాకుండానే అక్కడి నుంచి వెనుదిరిగారు.  సభ నిర్వాహకులు మహిళలను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఇందిరా మైదానం గేట్లు బంద్ చేయించారు. దీంతో మహిళలు సభ నిర్వహాకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బారికేడ్లు దాటుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఆ సభకు వచ్చిన మహిళలు.. తమను ఎందుకు తీసుకు వస్తున్నారో.. అసలు ఈ సభ ఉద్దేశం ఏంటో తెలియక వచ్చామని..  తీరా ఈ సభకు వచ్చాక విషయం తెలిసిందని సదరు మహిళలు గుసగుసలాడుకోవడం స్థానికంగా వైరల్ అయింది. ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్.. అమరావతికి మద్దతు ప్రకటించి.. ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన మూడు రాజధానులంటూ కొత్త పల్లవి అందుకున్నారు. దీంతో అప్పటికే రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి ప్రాంత రైతులు ఆందోళనకు దిగారు. వీరి ఆందోళన దాదాపు 725 రోజులకు చేరుకుంది. నవంబర్ ఒకటో తేదీన అమరావతి ప్రాంత రైతులు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అంటూ చేపట్టిన పాదయాత్ర ఇటీవల పూర్తి అయింది. ఆ క్రమంలో రాజధాని అమరావతి పరిరక్షణ పేరిట డిసెంబర్ 17న తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఏపీకి ఏకైక రాజధాని అమరావతికి అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. అంతేకాకుండా ఈ సభకు అన్ని పార్టీల నేతలు సైతం హాజరై.. తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో అధికార వీకేంద్రీకరణ జరగాలంటూ.. రాయలసీమ అభివృద్ధి చెందాలంటూ ఆ ప్రాంతానికి చెందిన ప్రముఖులు ఈ సభను ఏర్పాటు చేశారు. అయితే ఈ సభ ఏర్పాటు వెనక జగన్ ప్రభుత్వంలోని పెద్దలు ఉన్నారనే టాక్ వైరల్ అవుతోంది

ప‌వ‌న్ లెక్కేంటి? తిరుప‌తి స‌భ‌కు రాలేదేంటి? రైతుల కంటే డ్యాన్స‌రే ముఖ్య‌మా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ తిరుప‌తి మ‌హా స‌భ‌కు ఎందుకు రాలేదు? అమ‌రావ‌తికి జ‌న‌సేనాని ఇప్ప‌టికే మ‌ద్ద‌తు ఇచ్చారుగా? మ‌రి, రైతుల స‌భ‌కు రావొచ్చుగా? అంత ప్ర‌తిష్టాత్మ‌క స‌భ‌కు పీకే రాక‌పోవ‌డాన్ని ఎలా చూడాలి? ప‌వ‌న్ గైర్హాజ‌రు వ్యూహ‌త్మ‌క‌మా? పీకే లెక్కేంటి? అమ‌రావ‌తిపై తిక్కేంటి?   జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌. పార్ట్ టైమ్ పొలిటిషియ‌న్‌ అనేది విమ‌ర్శ‌కుల ఆరోప‌ణ‌. తాను మాత్రం 25 ఏళ్లు రాజ‌కీయాల్లోనే ఉంటానంటున్నారు పీకే. తాను మాత్రమే 100% ప‌ర్‌ఫెక్ట్ అంటారు. త‌న‌ను గెలిపించ‌క‌పోవ‌డం ప్ర‌జ‌ల పొర‌బాటేన‌ని చెబుతారు. అదంతా స‌రే.. అమ‌రావ‌తి విష‌యంలోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ వైఖ‌రి మ‌రింత చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. అమ‌రావ‌తికి, రాజ‌ధాని రైతుల ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ఇస్తూనే.. తిరుప‌తిలో జ‌రిగిన మ‌హా స‌భ‌కు హాజ‌రుకాక‌పోవ‌డం ఏమిట‌నే ప్ర‌శ్న త‌లెత్తుతోంది. ఇంత‌కీ పీకే తిరుప‌తికి ఎందుకు రాలేదు? అమ‌రావ‌తి విష‌యంలో ఆయ‌న రియ‌ల్ స్టాండ్ ఏంటి? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉక్కు సంక‌ల్పంతో పోరాడుతున్నారు. ఆంధ్రుల హ‌క్కును అడ్డ‌గోలుగా అమ్ముతున్న‌ది కేంద్ర‌మైతే.. ఆ కేంద్ర బీజేపీని గానీ, మోదీని, నిర్మ‌ల‌ను గానీ.. ప‌ల్లెత్తు మాట అన‌కుండా చేస్తున్న పోరాటం ఎవ‌రి మీద‌నో ఆయ‌నకైనా అర్థం అవుతోందో లేదో అనే అనుమానం వ్య‌క్తం అవుతోంది. ఉక్కు ఫ్యాక్ట‌రీ కోసం దీక్ష‌లు, ధ‌ర్నాలు చేస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అమ‌రావ‌తి రాజ‌ధాని కోసం మాత్రం మొహ‌మాటంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు. రాజ‌ధాని రైతులు జ‌న‌సేనాని మ‌ద్ద‌తు కోసం ఆయ‌న చుట్టూ తిరుగుతుంటే.. అమ‌రావ‌తికి త‌న స‌పోర్ట్ ఎప్పుడూ ఉంటుందంటూ ఉత్తుత్తి మాట‌లు చెబుతున్నారే గానీ.. విశాఖ ఉక్కులా గ‌ట్టి సంక‌ల్పం మాత్రం చూపించ‌డం లేద‌నే విమ‌ర్శ ఉంది. ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తికి బీజేపీ మ‌ద్ద‌తుగా నిల‌బ‌డ‌గా.. వైసీపీ ఆడుతున్న మూడు రాజ‌ధానుల డ్రామాపై పోరాటం చేయ‌డం ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు మ‌రింత సులువైన అంశం. కానీ, ఉక్కు విష‌యంలో చూపిస్తున్నంత ఇంట్రెస్ట్‌.. కేపిట‌ల్ ఇష్యూపై క‌న‌బ‌ర‌చ‌డం లేదంటున్నారు.  అమ‌రావ‌తి నుంచి తిరుమ‌ల‌కు కాలిన‌డ‌క‌న వెళ్లి.. తిరుప‌తిలో రాజ‌ధాని రైతులు నిర్వ‌హించిన మ‌హా స‌భ గ్రాండ్ స‌క్సెస్ అయింది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు, బీజేపీ నేత క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ‌, సీపీఐ నారాయ‌ణ‌, ఎంపీ ర‌ఘురామ‌లాంటి హేమాహేమీలు హాజ‌రైన ఆ స‌భ‌లో.. ప‌వ‌న్ క‌ల్యాణ్ లేని లోటు కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించింది. అలా అని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏ విదేశాల్లోనో, సినిమా షూటింగ్స్‌లోనో బిజీగా లేరు. తీరిగ్గా.. త‌న మిత్రుడు త్రివిక్ర‌మ్ భార్య సౌజ‌న్య నాట్య ప్ర‌ద‌ర్శ‌న తిలకిస్తూ ఉండిపోయారు. తిరుప‌తిలో అమ‌రావ‌తి రైతుల‌ మ‌హా స‌భా? త్రివిక్ర‌మ్ వైఫ్ డ్యాన్స్ ప్రోగ్రామా? అంటే.. పీకే రెండో ఆప్ష‌న్‌నే సెలెక్ట్ చేసుకున్నారు. త్రివిక్ర‌మ్ స‌తీమ‌ణి నాట్యానికి ఇచ్చినంత‌ ప్రాధాన్య‌త అమ‌రావ‌తి రైతుల స‌భ‌కు ఇవ్వ‌లేద‌ని అంటున్నారు.  ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయాల్లో బాగా ముదిరిపోయార‌ని అంటున్నారు. పొలిటిక‌ల్‌గా సెల్ఫ్ ప్ర‌మోష‌న్ చేసుకోవ‌డంలో యాక్టివ్‌గా ఉంటున్నార‌ని చెబుతున్నారు. విశాఖ ఉక్కు ఉద్య‌మం వీక్ అవుతున్న స‌మ‌యానికి కావాల‌నే.. స్టీల్ ప్లాంట్‌పై ఫైట్ చేస్తున్నార‌ని భావిస్తున్నారు. జ‌న‌సేన త‌న సొంత ఎజెండా ప్ర‌కార‌మే పాలిటిక్స్ చేస్తుంద‌ని చెప్పడ‌మే ఆయ‌న ఉద్దేశం అంటున్నారు. గ‌తంలో గాజువాక‌లో ఓడిపోయారు కాబ‌ట్టి విశాఖ ఉక్కుపై స్పెష‌ల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నార‌ని కూడా టాక్‌. ఇక‌, అమ‌రావ‌తి ఉద్య‌మంలో ముందునుంచీ ప‌వ‌న్ క‌ల్యాణ్ అంత యాక్టివ్‌గా లేరు. రాజ‌ధానికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారే కానీ.. త‌న‌దైన స్టైల్‌లో.. గ‌తంలో ప్ర‌త్యేక హోదా విష‌యంలో పోరాడిన‌ట్టు పోరాడ‌టం లేదు. అప్పుడంటే స్పెష‌ల్ స్టేట‌స్‌కు ప్ర‌జ‌ల స‌పోర్ట్ లేదంటూ త‌ప్పుకున్నారు.. మ‌రి, ఇప్పుడు అమ‌రావ‌తిపై అప్ప‌టిలానే పోరాడ‌వ‌చ్చుగా? అమ‌రావ‌తికి ప్ర‌జ‌ల స‌పోర్ట్ దండిగా ఉందిగా? అని ప్ర‌శ్నిస్తున్నారు. అయితే, అమ‌రావ‌తి కోసం గ‌ట్టిగా పోరాడితే.. మిగ‌తా ప్రాంతాల్లో పార్టీ ప‌లుచ బ‌డుతుంద‌ని భ‌య‌మో.. అమ‌రావ‌తి క్రెడిట్ చంద్ర‌బాబుకు వెళుతుంద‌ని అనుమాన‌మో.. కార‌ణం ఏదైనా.. ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం అమ‌రావ‌తి ఉద్య‌మం విష‌యంలో ఫ‌క్తు రాజ‌కీయ నాయ‌కుడిలానే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు. తిరుప‌తిలో అంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించిన మ‌హా స‌భ‌కు.. రైతులు స్వ‌యంగా ఆహ్వానించినా.. జ‌న‌సేనాని హాజ‌రుకాక‌పోవ‌డం.. అదే స‌మ‌యంలో త్రివిక్ర‌మ్ భార్య డ్యాన్స్ ప్రోగ్రామ్‌కు వెళ్ల‌డం.. పీకే లెక్క‌కు.. తిక్క‌కు.. నిద‌ర్శ‌నం అని చ‌ర్చించుకుంటున్నారు. 

టాయిలెట్లు కడిగిన మంత్రి.. వీడియో వైరల్

సమస్యలపై జనాలు ఫిర్యాదు చేస్తే సాధారణంగా నాయకులు ఏం చేస్తారు.. ఆ ఫిర్యాదును సంబంధిత అధికారులకు పంపించి చేతులు దులుపుకుంటారు. ఇంకొందరమో అక్కడి నుంచే సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసి వెళతారు. కానీ ఈ మంత్రి మాత్రం అందుకు భిన్నం. తనకు ఫిర్యాదు అందిన సమస్యపై వెంటనే స్పందించారు. అధికారులకు చెప్పకుండా తానే స్వయంగా రంగంలోకి దిగారు. అప్పటికప్పుడు సమస్యను పరిష్కరించారు. ఏకంగా టాయిలెట్లు శుభ్రం చేసి జనాలతో శభాష్ అనిపించుకున్నారు.  మధ్యప్రదేశ్ లో జరిగిన ఈఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  గ్వాలియర్ లో ఉన్న ఓ పాఠశాలలో టాయిలెట్లు మంచిగా లేవంటూ ఓ విద్యార్థిని విద్యుత్ శాఖ మంత్రి ప్రధుమాన్ సింగ్ తోమర్ కు ఫిర్యాదు చేసింది. దీనివల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నామని తెలిపింది. అయితే సమస్యను పరిష్కరించాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేయలేదు. తానే  స్వయంగా రంగంలోకి దిగారు మంత్రి.. ఆ పాఠశాలకు వెళ్లి టాయిలెట్లను కడిగి శుభ్రం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. టాయిలెట్లు కడిగిన మంత్రిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.  విద్యార్థిని ఫిర్యాదుతో ఆ పాఠశాలకు వెళ్లిన మంత్రి తోమర్ చీపురు, బ్రష్ పట్టుకుని టాయిలెట్ల గదులకు వెళ్లారు. అక్కడ నీళ్లు పోస్తూ..శుభ్రం చేశారు. టాయిలెట్లున్న పరిసర ప్రాంతాల్లో చెత్త శుభ్రం చేశారు. పాఠశాలలో ఉన్న టాయిలెట్లను శుభ్రంగా ఉంచాలని అక్కడున్న వారికి చెప్పారు. పాఠశాలలో ఉన్న సిబ్బంది పరిశుభ్రంగా ఉంచడం లేదని విద్యార్థిని చెప్పడంతో తాను ఈ పని చేయడం జరిగిందని మీడియాకు తెలిపారు మంత్రి తోమర్.   మంత్రి ప్రధుమాన్ సింగ్ తోమర్ గతంలోనూ  ఇలాంటి పనులు చాలానే చేశారు. గ్వాలియర్ నియోజకవర్గంలో ఓ ప్రభుత్వ కార్యాలయంలో టాయిలెట్లు క్లీన్ గా ఉంచడం లేదని ఫిర్యాదు రావడంతో స్వయంగా వాటిని కడిగి క్లీన్ చేశారాయన. ఇటీవలే ఈ నియోజకవర్గంలో బిర్లానగర్ లో 16వ వార్డులో ఉన్న కాల్వలను క్లీన్ చేశారు. అంతేకాదు విద్యుత్ స్తంభం ఎక్కి…దానిపై ఉన్న చెత్తను శుభ్రం చేశారు. అప్ప‌ట్లో ఆ వీడియో కూడా బాగా వైర‌ల్ అయింది. 

జనరల్ బిపిన్ రావత్ మృతిపై ఎయిర్ చీఫ్ సంచలనం..

తమిళనాడు రాష్ట్రంలోని కూనురు సమీపంలో డిసెంబర్ 8న జరిగిన ఆర్మీ హెలికాప్టర్  ప్రమాదంలో భారత తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ సహా 14 మంది దుర్మరణం చెందారు. అత్యంత సురక్షితమైన, భద్రత కలిగిన ఆర్మీ హెలికాప్టర్ క్రాష్ కావడం నిపుణులను ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో ప్రమాదంపై పలు సందేహాలు తలెత్తాయి. హెలికాప్టర్ ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణకు ఎయిర్ ఫోర్స్ ఆదేశించింది. అయితే 10 రోజులవుతున్నా  ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పక్కా సమాచారం రావడం లేదు. ఘటనాస్థలిలో  దొరికిన బ్లాక్ బాక్స్ ను డీకొడ్ చేస్తూ దర్యాప్తు జరుపుతున్నారు అధికారులు.  ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై రోజు రోజుకు అనుమానాలు పెరుగుతున్నాయి. బిపిన్ రావత్ ప్రయాణించిన చాపర్ పై సైబర్ అటాక్ జరిగిందనే వార్తలు వస్తున్నాయి. హెలికాప్టర్ ప్రమాదంపై రోజుకు కొత్త విషయం బయటికి వస్తుండగా..  ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్‌రామ్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన పాసింగ్ అవుట్ పెరడ్  కు ముఖ్యఅతిథిగా హాజరైన వివేక్ రామ్..  బిపిన్ రావత్ విమాన ప్రమాదంలో మరణించిన ఘటనపై స్పందించారు.  బిపిన్ రావత్ విమాన ప్రమాదంపై ఇప్పుడే ఏమి చెప్పలేమన్నారు. ప్రమాదంపై హై లెవెల్ ఎంక్వైరీ కొనసాగుతోందని.. విచారణ కమిటీలో ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఉన్నతాధికారులు ఉన్నారన్నారు.  హెలికాప్టర్ కూలిపోవడానికి వాతావరణ తప్పిదమా..? మానవ తప్పిదమా..? లేక సాంకేతిక లోపమా..? అనేది విచారణ చేస్తున్నామని  ఎయిర్ చీఫ్ మార్షల్ తెలిపారు. ఎలాంటి ఆధారాలూ లేకుండా ప్రమాదంపై ఇప్పుడే ఏమీ మాట్లాడలేమన్నారు. ప్రమాదానికి సంబంధించి ఆధారాలు సేకరించిన తర్వాతే ఏమైనా మాట్లాడగలమన్నారు వివేక్‌రామ్. రావత్ ఘటనపై ఏ చిన్న ఆధారాన్ని కూడా వదలదలుచుకోలేదని చెప్పారు. ఘటనా స్థలంలో దొరికిన ప్రతి ఎవిడెన్స్‌ను పరిశీలిస్తున్నామన్నారు. ప్రతి సాక్షిని విచారించాలని.. ఇందుకోసం వారాల సమయం పడుతుందన్నారు ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్‌రామ్.  తూర్పు లడఖ్ ప్రాంతంలో ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు వివేక్ రామ్. ప్రస్తుతం అక్కడ స్టేటస్ కో మేయింటేయిన్ చేస్తున్నామని చెప్పారు. సరిహద్దుల్లో బెదిరింపులు వస్తూనే ఉంటాయని... వాటికి అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. మల్టీ డైమన్షన్ వార్‌పై దృష్టి సారించాలని కాడెట్స్‌కు చెబుతున్నామన్నారు. కేవలం యుద్ధం వైపే కాదు సాంకేతికంగా, సైబర్ పరంగా ఎదురయ్యే సవాళ్ళను ధీటుగా తిప్పికొట్టేలా నైపుణ్యం సాధించాలని చెబుతున్నామన్నారు. డ్రోన్ దాడులు ఛాలెంజింగ్‌గా మారాయన్నారు. డ్రోన్ దాడుల నుంచి వీఐపీలను రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. 

ఎస్పీ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు.. యూపీలో  వేడెక్కిన రాజకీయం

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం చాలానే ఉంది, అయినా ఎన్నికల వేడి మాత్రం, ఇప్పటికే తారాస్థాయికి చేరింది. ఓ వంక, గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికార పగ్గాలు చేపట్టిన, బీజేపీ అధికారాన్ని, నిలుపుకోవాలని, తద్వారా కేంద్రంలో ముచ్చటైన మూడో వరస విజయానికి బాటలు వేసుకోవాలని  తహతహ లాడుతోంది. మరో వంక బీజేపీ ప్రధాన ప్రత్యర్ధిగా నిలిచేందుకు సమాజ్ వాదీ పార్టీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. బీజేపీ గెలుపుకోసం  ప్రధాని నరేంద్ర మోడీ మొదలు బీజేపీ సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రులు  ఒకరి తర్వాత ఒకరు, ఒకరి వెంట ఒకరు యూపీలో ఎన్నికల దండ యాత్రలు సాగిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కొద్ది రోజుల క్రితం సొంత నియోజక వర్గం వారణాశిలో సాగించిన ఆద్యాత్మిక రాజకీయ సుడిగాలి పర్యటన యూపీ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఎంతగా ఆశలు  పెట్టుకుందో చెప్పకనే చెపుతోంది.. ప్రధాని అటు వెళ్ళారో లేదో ఇటు అమిత్ షా దిగి పోయారు. రాష్ట్ర రాజధాని లక్నోలో 'సర్కార్ బనావో, అధికార్ పావో'’  ర్యాలీలో పాల్గొన్నారు . షాతో పాటు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, నిషాద్ పార్టీ అధినేత సంజయ్ నిషాద్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మ ర్యాలీలో పాల్గొన్నారు.అంతే కాదు 2017లో వచ్చిన భారీ మెజారిటీకి ఏ మాత్రం తగ్గకుండా మెజారిటీ సాధించేందుకు,బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.  మరోవంక బీజేపీని దీటుగా ఎదుర్కునేందుకు కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ ప్రయత్నాలు చేస్తున్నా, ఎస్పీనే ప్రధాన ప్రత్యర్ధిగా నిలిచి తొడచరుస్తోంది. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్  బీజేపీ పై  విరుచుకు పడుతున్నారు. జనం కూడా చాల వరకు ఎస్పీనే బీజేపీకి ప్రత్యాన్మాయంగా మరీ మరీ మాట్లాడితే బీజేపీని ఓడించే సత్తా ఉన్న పార్టీగా గుర్తిస్తున్నారు. అయితే బీజేపీ ఇటు రాష్ట్రంలో,అటు కేంద్రంలో అధికారంలో  ఉన్న బీజేపీ, అఖిలేష్ యాదవ్ దూకుడుకు ఎక్కడికక్కడ కళ్ళెం వేసేందుకు ఐటీ, ఈడీ అస్త్రాలను సంధిస్తోంది. తాజగా, ఈరోజు (శనివారం) సమాజ్‌వాదీ పార్టీ నేతలు, మద్దతుదారుల ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. ఈ నేపధ్యంలోనే అఖిలేష్ యాదవ్ బెదిరింపు రాజకీయాల్లో బీజేపీ కుడా కాంగ్రెస్‌ను అనుసరిస్తోందని ఆరోపించారు. బీజేపీ ప్రతిపక్షాలను బెదిరించేందుకు కేంద్ర సంస్థలను ఉపయోగించుకుంటోందన్నారు.  ఆదాయపు పన్ను శాఖ అధికారులు శనివారం ఉదయం వారణాసి నుంచి మావు చేరుకుని,  సహదత్ పురలోని సమాజ్‌వాదీ పార్టీ జాతీయ కార్యదర్శి రాజీవ్ రాయ్ నివాసంలో సోదాలు చేశారు. ఆయన పన్ను ఎగవేసినట్లు అనుమానంతో ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకుని నినాదాలు చేశారు. పోలీసులు స్పందిస్తూ, శాంతిభద్రతలకు భంగం కలిగించవద్దని ప్రజలను కోరారు. మెయిన్‌పురిలోని ఆర్‌సీఎల్ గ్రూప్ యజమాని మనోజ్ యాదవ్‌ నివాసంలో కూడా అధికారులు సోదాలు చేశారు. అదేవిధంగా లక్నోలోని జైనేంద్ర యాదవ్ నివాసంలో కూడా ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిగాయి. వీరిద్దరూ అఖిలేశ్ యాదవ్‌కు సన్నిహితులేనని తెలుస్తోంది. అంతే కాదు అఖిలేష్ యాదవ్ ఆర్థిక ములాలపై దెబ్బ తీసేందుకు బీజీపీ ఏ చిన్న అవకాశాన్ని వాదులు కోవడం లేదని అంటున్నారు. అదెలా ఉన్నా, బీజేపీ వ్యతిరేక ఓటు పూర్తిగా ఎస్పీ వైపుకు తెచ్చుకునేందుకు అఖిలేష్ చేస్తున్న ప్రయత్నం ఇంతవరకు విజయవంతగా ముందుకు సాగుతోంది. బెజేపీని ఓడించాలంటే ఎస్పీని గెలిపించాలనే భావ్ననను అఖిలేష్ విజయవంతంగా ముదుకు తీసుకు పోతున్నారు. ఈ క్రమంలో బీఎస్పీ,కాంగ్రెస్ పార్టీలు బెగాల్లో కాంగ్రెస్, లెఫ్ట్ కూటమి లాగా . జీరో రేసులో ముందుండే ప్రమాదం ఉందని పరిశీలకులు అంటున్నారు.

యువ కెరటం.. పదునైన రాజకీయం.. హ్యాపీ బర్త్ డే రామ్మోహన్ నాయుడు..

'వీడు ఆరడుగుల బుల్లెట్టూ.. ధైర్యం నింపిన రాకెట్టూ' అంటూ అత్తారింటికి దారేది సినిమాలో పవర్స్టార్ పవన్ను వర్ణించిన పాట అభిమానుల్నే కాదు అందరినీ అలరించింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా అలాంటి ఓ బుల్లెట్టే ఉంది. తెలుగుదేశం పార్టీలో బుల్లెట్లా ముందుకు దూసుకొచ్చింది. ఆ బుల్లెట్ మరెవరో కాదు శ్రీకాకుళం టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు. 2014లో 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో రామ్మోహన్నాయుడు వరుసగా శ్రీకాకుళం నుంచి టీడీపీ ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా రామ్మోహన్నాయుడు హిందీలో అనర్గళంగా మాట్లాడిన తీరుతో సభలో ఉన్న అందరినీ ఆకట్టుకుని ఔరా అనిపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఎండగట్టి యావద్దేశం దృష్టినీ ఆకర్షించారు రామ్మోహన్నాయుడు. దివంగత మాజీ లోక్సభ స్పీకర్, నాన్న కింజరాపు ఎర్రంనాయుడి రాజకీయ వారసత్వాన్ని రామ్మోహన్నాయుడు  అక్షరాలా పుణికిపుచ్చుకున్నారు. ఎర్రంనాయుడి రాజకీయ ఒరవడినే కొనసాగిస్తున్నారు. ఎంపీగా ఎన్నికైన నాలుగేళ్లలోనే నాన్న వారసత్వాన్ని రామ్మోహన్నాయుడు  నిలబెట్టారు. చిన్నతనంలో ఎలాంటి రాజకీయ నీడ పడకుండా పెరిగిన రామ్మోహన్నాయుడు.. ఎంపీగా పోటీ చేసే వయస్సు కూడా రాక ముందే అభ్యర్థిగా ఖరారైన యువ నేత రామ్మోహన్నాయుడు. ఎంపీగా విజయాలు సాధించిన ఆయన భయంతో, బాధ్యతతో, క్రమశిక్షణతో ఎదిగారు. పార్లమెంట్లో రామ్మోహన్నాయుడి గుణాత్మక పనితీరు, వ్యక్తిగత కృషి ఆధారంగా 2020లో సంసద్ రత్న 'జ్యూరీ కమిటీ స్పెషల్ అవార్డు’ అందుకున్నారు.  అతి చిన్న వయస్సులోనే సంసద్ రత్న అవార్డు అందుకుని రామ్మోహన్నాయుడు రికార్డులకెక్కారు. తన పనితనంలో, దూసుకుపోయే తత్వంతో పార్లమెంట్‌ పబ్లిక్‌ అండర్‌టేకింగ్స్‌ కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. బుల్లెట్లా దూసుకుపోయే రామ్మోహన్నాయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మినిష్టర్‌ కొడాలి నానిని ఆయన ఇలాఖా గుడివాడలోనే విమర్శించగల దమ్మున్నోడు రామ్మోహన్నాయుడు. రాజకీయ భిక్షపెట్టిన టీడీపీకి కొడాలి వెన్నుపోటు పొడిచారని ఆక్షేపించారు. జగన్ పిరికివాడని, వేల కిలోమీటర్లు నడిచినా బెణకని ఆయన కాలు ఢిల్లీ టూర్ అనగానే ఎందుకు బెణికిందంటూ సూటిగా ప్రశ్నించగల సత్తా ఉన్న నేత రామ్మోహన్నాయుడు. టీడీపీ ఏ కార్యక్రమం తలపెట్టినా ముందువరసలో నిలబడే నిబద్ధతగల యువ నేత రామ్మోహన్నాయుడు. పార్టీ నిర్దేశించిన పలు నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని అరెస్టులు కూడా అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిన ప్రతిసారి పార్లమెంట్‌ ఆవరణలో టీడీపీ ప్రతి నిరసన కార్యక్రమంలోనూ రామ్మోహన్‌ పాత్ర తప్పకుండా ఉండాల్సిందే. విశాఖపట్నంలో రైల్తే జోన్‌ ఎంత అవసరమో స్పష్టంగా వివరిస్తూ 2017లో లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్‌కు లేఖ రాశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రయివేట్‌ పరం విషయంలో ఏపీ పట్ల సవతితల్లి విధానం ప్రదర్శిస్తోందంటూ లోక్‌సభలోనే తూర్పారపట్టారు రామ్మోహన్‌నాయుడు. జగన్‌ సర్కార్‌ గొప్పగా ప్రచారం చేసుకుంటున్న నవరత్నాలను బూడిద రత్నాలని ఆయన అభివర్ణించారు. 22 మంది ఎంపీలు ఉన్నా వైసీపీ ప్రత్యేక హోదా తీసుకురాలేకపోవడాన్ని తప్పుపట్టారు. జగన్‌కు 24 గంటలూ భజనం చేయడంలోనూ, బూతులు తిట్టడంలో వైసీపీ నాయకుడు పోటీపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. రైతులంటే జగన్ ప్రభుత్వానికి అస్సలు గౌరవం లేదని, నిర్లక్ష్యం చేస్తోందని శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో రైతులతో భారీ ర్యాలీ నిర్వహించి సక్సెస్‌ అయ్యారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు రామ్మోహన్‌నాయుడు స్పందించే తీరు అందరి చేతా ఔరా అనిపించక మానదు. ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ మహమ్మారి నియంత్రణలో ఏపీ సీఎం జగన్ విఫలమయ్యారంటూ రామ్మోహన్నాయుడు లేఖ సంధించారు. కోవిడ్ సమయంలో కొన్ని సంస్థల సహకారంతో శ్రీకాకుళం రిమ్స్లో 50 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, 50 ఆక్సిజన్ సిలిండర్లు అందజేశారు. శ్రీకాకుళంలో కోవిడ్ హెల్ప్లైన్ ఏర్పాటు చేసి, వైద్యులు, హాస్పిటళ్లు, బెడ్ల సమాచారం బాధితులకు అందుబాటులో ఉండేలా చేయడం ఆయన బాధ్యతగల నాయకుడనిపించుకున్నారు. డ్రగ్స్ వ్యాపారంతో విజయవాడకు ఉన్న లింకుల్ని ప్రజలకు తెలియకుండా అణచివేసేందుకు వైసీపీ ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ రామ్మోహన్నాయుడు విరుచుకుపడ్డ తీరు అకట్టుకుంది. పన్నుల మీద పన్నులు వేసి, ప్రజల్ని వైసీపీ సర్కార్‌ ఇబ్బందులు పెడుతున్న తీరుపై స్పందించడం గమనార్హం. వైసీపీ సర్కార్ కొత్త ఇసుక పాలసీ తెచ్చి 20 లక్షల మంది భవన నిర్మాణ కూలీల దైనందిన జీవనాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేసిందని రామ్మోహన్‌నాయుడు ప్రభుత్వానికి రాసిన లేఖలో ఆరోపించారు. ఇవన్నీ ప్రజలంటే రామ్మోహన్‌నాయుడికి ఉన్న బాధ్యతను గుర్తు చేసే అంశాలే. మూడో క్లాసు దాకా సొంతూరు శ్రీకాకుళంలోనే చదివిన రామ్మోహన్నాయుడు 1994లో తొలిసారిగా హైదరాబాద్ వెళ్లారు. భారతీయ విద్యాభవన్లో 4, 5 క్లాసులు చదివారు. 1996లో ఎర్రన్నాయుడు కేంద్ర మంత్రి అయినప్పుడు మళ్లీ చదువుల కోసం ఢిల్లీ వెళ్లారు. ఆర్కేపురం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చేరిన రామ్మోహన్నాయుడికి హిందీ అర్థంకాక ముందు చాలా ఇబ్బంది పడ్డారు. 12వ తరగతి తర్వాత రామ్మోహన్నాయుడు అమెరికా వెళ్లేందుకు పరీక్ష రాసి పర్డ్యూ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల నిమ్మాడలో పుట్టిన రామ్మోహన్నాయుడికి ఇంజనీరింగ్ అంటే ఇష్టమట. అందుకే అమెరికాలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్ చేశారు.  తర్వాత ఎంబీఏ పూర్తిచేసి ఇండియా తిరిగివచ్చారు. అమెరికాకు చెందిన ఓ ఇంటీరియర్ కంపెనీతో టై అప్ చేసుకుని ఢిల్లీలో మార్కెటింగ్ చేశారు. రామ్మోహన్‌నాయుడి నాన్న ఎర్రంనాయుడు మరణించినప్పుడు  తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎంతో ధైర్యం చెప్పారని గుర్తుచేసుకుంటారు. ఏ కెరీర్ ఎంచుకున్నా తాను చూసుకుంటానని చంద్రబాబు తనకు భరోసా ఇచ్చారంటారు. ఎర్రంనాయుడి మరణించిన సమయం 14 రోజుల్లో  లక్షలాది మంది తనను ఓదార్చేందుకు వచ్చారని, వారంతా తాను రాజకీయాల్లోకి రావాలని కోరారని చెబుతారు రామ్మోహన్‌నాయుడు. ఎర్రంనాయుడికి ప్రజల్లో ఉన్న అభిమానం చూసి ఆయన మార్గాన్ని కొనసాగించాలని రాజకీయాల్లోకి రామ్మోహన్నాయుడు వచ్చానంటారు. ట్యూషన్ మాస్టర్నిపెట్టుకుని హిందీ నేర్చుకున్నాను అంటారాయన. పార్లమెంటరీ జీవితంలో రామ్మోహన్నాయుడిపై ప్రభావం చూపిన వారిలో ప్రస్తుత భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఒకరు. లోక్సభలో తన తొలిరోజుల్లో ఓ చిన్న ప్రశ్న హిందీలో అడిగినప్పుడు వెంకయ్యనాయుడు తనను సభలోనే అభినందించారని, అందరితో సభలో చప్పట్లు కొట్టించారని రామ్మోహన్నాయుడు సంతోషంగా చెప్పుకుంటారు. టీడీపీ రాజకీయాల్లో యువనేత రామ్మోహన్‌నాయుడు మరింతగా దూసుకుపోయే బుల్లెట్‌ లాంటి వారనడంలో సందేహం లేదు.

జనసేన పోరు.. డీఎస్ కథేంటీ.. సాగర్ జర్నీ.. టాప్ న్యూస్@1PM

ఏపీ ఎంపీలు విశాఖ ఉక్కు పరిరక్షణకు ఉద్యమించాలంటూ జనసేన దీక్ష చేపట్టింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు చేసింది పాదయాత్ర కాదని.. స్థానిక ఎన్నికల ప్రచార యాత్ర అని ఆరోపించారు. జనసేన అధికార ప్రతినిధి శివశంకర్ మాట్లాడుతూ ప్రైవేటీకరణకు పైకి వ్యతిరేకమంటూనే లోపాయకారంగా మద్దతిస్తున్నారని మండిపడ్డారు. అఖిలపక్షం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు.  ---- స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా అనేక మందికి శిక్షణ ఇచ్చామని, దాదాపు 60 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు తెలిపారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మాజీ అధికారులను వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. స్నేహితుడి పరామర్శకు ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కేపై కేసులు పెట్టారన్నారు. జగన్‌రెడ్డి జేబు సంస్థగా సీఐడీ మారిందని విమర్శించారు.  ----- సాలూరులో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. 216 కిలోల గంజాయిని సరిహద్దులు దాటిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. ఒడిస్సాలోని కోరాపూర్ జిల్లా పుట్టంగించి నుంచి రాజస్థాన్ కు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఓ భారీ వాహనంలో ఎవరికి తెలియకుండా గంజాయి రవాణా చేస్తున్నారు. సాధారణ తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఈ గంజాయి తరలిస్తున్న వాహంన పట్టుబడింది.  ----- తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉదయాస్తమాన సేవా టికెట్ల ధరను టీటీడీ  నిర్ణయించింది. సాధారణ రోజుల్లో ఉదయాస్తమాన సేవా టికెట్ రూ.కోటి కాగా శుక్రవారం రోజున రూ.1.5కోట్లుగా నిర్ణయించింది. టీటీడీ దగ్గర  531 ఉదయాస్తమాన సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ టికెట్‌తో దాదాపు 25 ఏళ్ల పాటు ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశాన్ని భక్తులు పొందనున్నారు.  --------- చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం పాలమంగళంలో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. దాదాపు 300 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుంగలను తరలిస్తున్న 18 మంది ఎర్రచందనం కూలీలను అరెస్ట్‌ చేశారు. సుమారు రూ.1.50 కోట్ల విలువైన 3 టన్నుల ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ---- ఐఏఎంసీని ప్రారంభించడం సంతోషంగా ఉందని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. నానక్‌రాంగూడలో ఐఏఎంసీ కేంద్రాన్ని సీజేఐ ఎన్వీరమణ, సీఎం కేసీఆర్ ప్రారంభించారు. తాను సీజేఐ కాగానే ఐఏఎంసీ ఏర్పాటును ప్రతిపాదించానని... దీనికి ఆగస్టు 20న సీఎం కేసీఆర్‌ అంగీకరించారని అన్నారు. ఐఏఎంసీ ఏర్పాటులో సీజేఐ ఎన్వీ రమణ కీలక పాత్ర పోషించారని కేసీఆర్ అన్నారు.హైదరాబాద్‌ను ఎక్కువగా ప్రేమించే వ్యక్తుల్లో సీజేఐ ఎన్వీ రమణ ఒకరని తెలిపారు.  ----- టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు స్పందించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో డి శ్రీనివాస్ అన్నీ అనుభవించారన్నారు. రెండు సార్లు పీసీసీ ఎంజాయ్ చేశారని.. అయితే పార్టీ కష్టాల్లో ఉన్నపుడు టీఆర్ఎస్‌లోకి వెళ్లిపోయారన్నారు. డి శ్రీనివాస్ కుమారుడు బీజేపీలో ఎంపీ అయ్యారన్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ కార్యకర్తల నుంచి ఫోన్లు వస్తున్నాయని వీహెచ్ చెప్పారు.  -------- నాగార్జున సాగర్‌లో టూరిజం లాంచీ ప్రయాణం ప్రారంభమైంది. విజయపురిసౌత్ నుంచి నాగార్జున కొండకు ఏపీ టూరిజం లాంచీ సర్వీసులు పున:ప్రారంభమయ్యాయి. కొండకు వెళ్లే టూరిజం లాంచీలకు ఐఆర్ఎస్, అటవీశాఖ నుంచి  అనుమతులు మంజూరయ్యాయి. భద్రతా కారణాలతో గత 2 ఏళ్లుగా సాగర్‌లో పర్యాటక శాఖ లాంచీలు నిలిచిపోయాయి. ప్రస్తుతం పురావస్తు శాఖ ఉద్యోగులకే కొండకు వెళ్లేందుకు అనుమతి లభించింది. --- సిద్దిపేట జిల్లాలో మావోయిస్టు పార్టీ లేఖ కలకలం రేపుతోంది. కొండపాక మండలం సిర్సనగండ్ల సర్పంచ్ గుడెపు లక్ష్మరెడ్డికి రూ.20 లక్షలు పార్టీ ఫండ్ ఇవ్వాలని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పేరిట లేఖ వచ్చింది. మావోయిస్టు జగన్ పేరిట రూ.20 లక్షలు ఇవ్వాలని, సాయంత్రంలోగా సమకూర్చాలని ఫోన్ వచ్చింది. లక్ష్మారెడ్డి పోలీసులను ఆశ్రయించారు. సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  ---- బెదిరింపు రాజకీయాల్లో కాంగ్రెస్‌ను బీజేపీ అనుసరిస్తోందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. సమాజ్‌వాదీ పార్టీ నేతలు, మద్దతుదారుల ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడుల నేపథ్యంలో అఖిలేశ్ స్పందిస్తూ బీజేపీ ప్రతిపక్షాలను బెదిరించేందుకు కేంద్ర సంస్థలను ఉపయోగించుకుంటోందన్నారు.  ---  

ఓటరు ఐడీకి ఆధార్ అనుసంధానం ..ఎందుకంటే!

ఇప్పుడు కాదు, ఎప్పటినుంచో ఎన్నికల సంఘం, ప్రజాస్వామ్య పరిరక్షణ,, ఎన్నికల సంస్కరణల కోసం కృషి చేస్తున్న పలు స్వచ్చంద సంస్థలు, మేథావులు, సామాన్య జనం అందరూ కూడా  ఓటరు ఐడీని ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలని కోరుతున్నారు. దీని మీద ప్రజాభిప్రాయ సేకరణ కోసం సభలు, సమావేశాలు, సదస్సులు ఇలా అనేక ప్రయత్నాలు జరిగుతూనే ఉన్నాయి.  ఎన్నికలలో దొంగ ఓట్లను నిరోధించేందుకు ఇదొక ఉత్తమ మార్గంగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. అయినా, ప్రభుత్వాలు ఎందుకనో, ఆ ఒక్కటీ అడక్కు అన్నట్లుగా, ఎప్పటికప్పుడు నిర్ణయాన్ని వాయిదా వేస్తూవస్తున్నాయి. అలాంటిది హఠాత్తుగా ఓటరు కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానించేందుకు ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని మంత్రివర్గం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం ఎందుకోసంగా ఈ నిర్ణయం తీసుకున్నా, ఇది స్వాగతించ వాల్సిన నిర్ణయంగానే, పరిశీలకులు భావిస్తున్నారు.  ఓటరు గుర్తింపు కార్డును ఆధార్’ తో అనుసంధానం చేయడం ద్వారా దొంగ ఓట్లను నివారించవచ్చని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఓటరు కార్డులు ఒకటి, రెండు, మూడు కూడా ఉండవచ్చును కానీ అధార్ నెంబర్ మాత్రం దేశం మొత్తం మీద ఎక్కడ ఉన్నా ఒక వ్యక్తికి ఒకటే ఉంటుంది. పోలింగ్ సమయంలో ఓటరు ఓటు గుర్తింపు కార్డుతో పాటుగా, ఆధార్ కార్డు కూడా చూపించాలంటే దొంగ ఓటు వేసే అవకాశం లేకుండా పోతుంది. ఆ విధంగా దొంగ ఓట్లను తగ్గించవచ్చును అని సంస్కరణ వాదులు భావిస్తున్నారు.  అయితే నిజంగా ఆధార్ అనుసంధానంతోనే ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్న  దొంగ ఓట్ల రుగ్మత తొలిగి పోతుందా, అంటే అనుమానమే. ఎందుకంటే, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లుగా, ఇంతవరకు ఎనికల ఆక్రమాలను నిరోధించేందుకు ఎన్నికల ప్రధానాధికారిగా టీ.ఎన్. శేషన్ శ్రీకారం చుట్టిన ఎన్నికల సంస్కరణలు, తీసుకున్న చర్యలు మొదలు ఇంతవరకు ఆ దిశగా తీసుకున్న నిర్ణయాలకు మనోళ్ళు తూట్లు పొడుస్తూనే ఉన్నారు. సో .. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, అది కూడా సగం అయిష్టంగా తీసుకున్న ఈ నిర్ణయం ఆశించిన ఫలితాలు ఇస్తుందని ఆశించడం ఎంతవరకు సమజసం అనేది కాలమే నిరనయిస్తుందని అంటున్నారు.    అదొకటి  అలా ఉంటే, చాంతాడంత రాగం తీసి ఎదో పాట పాడినట్లుగా, కేంద్ర మంత్రి వర్గం, ఓటరు గుర్తింపు నెంబరుకు, ఆధార్ అనుసంధానం తప్పని సరి చేయలేదు. ఐచ్చికంగ వదిలేసింది. అంటే, మీరు కావాలనుకుంటే, అనుసంధానం చేసుకోవచ్చు, వద్దను కుండే వదిలేయనూ వచ్చును. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ఐచ్చిక క్లాజు, ద్వారా అనుసంధానం  స్వచ్చంధం చేయటమే అనుమానాలకు తావిస్తోంది.  అయితే, ఓటరు  ఐడీ నెంబరుకు, ఆధార్ నెంబరు అనుసంధానం చేయాలని   కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన ఓటల్ జాబితాను బలోపేతం చేయడానికి, ఓటింగ్ ప్రక్రియను మరింత పెరుగుపరచడానికి ఎంతగానో దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, న్యాయపరమైన చిక్కులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఓటరు ఐడీతో ఆధార్ అనుసంధానం ఐచ్చికంగా వదిలేసిన  ఓటర్లు శ్రద్ద తీసుకుని అనుసంధానం చేసుకోవాలని, ఒక విధంగా ఇది మాన్ ఓటు హక్కును లాక్ చేసుకోవడమే అని అంటున్నారు. మన ఆస్తుల రక్షణకు ఇటికి తాళం వేసుకున్నట్లుగానే, మన ఓటుకు ఆధార్ టప్ లాక్ చేసుకోవాలని అంటున్నారు.  అదలా ఉంటే కేంద్ర మంత్రి వర్గం ఎన్నికల సంస్కరణలకు సంబందించి  మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది.  ఓటుహక్కు నమోదుకు ఇప్పటివరకు జనవరి 1వ తేదీని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇకనుండి ఏడాదిలో నాలుగు తేదీలను తీసుకోవాలని కూడా మంత్రివర్గం ఎన్నికల సంఘానికి సూచించింది.

స‌చిన్ ఫ్రెండ్‌కు యాక్సిడెంట్‌.. థ్యాంక్స్ చెప్పిన టెండూల్క‌ర్‌..

స‌చిన్ టెండూల్క‌ర్‌. క్రీజ్‌లో ఎంత దూకుడుగా ఉంటాడో.. మైదానం వెలుప‌ల అంత కూల్‌గా ఉంటాడు. చాలా సెన్సిటివ్ అంటారు. అలాంటిది ఇటీవ‌ల త‌న ద‌గ్గ‌రి స్నేహితురాలు ఒకామెకు రోడ్ యాక్సిడెంట్ జ‌రిగింది. ఆ ప్ర‌మాదంలో ఆమె తీవ్రంగా గాయ‌ప‌డింది. అయితే, ఆ స‌మ‌యంలో అక్క‌డే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంట‌నే స్పందించారు. ఆమెను ఆటోలో హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. స‌మ‌యానికి చికిత్స అందించ‌డంతో పెద్ద ప్ర‌మాద‌మే త‌ప్పింద‌ని.. ప్ర‌స్తుతం ఆవిడ క్షేమంగా కోలుకుంటున్నార‌ని డాక్ట‌ర్లు తెలిపారు.  త‌న ఫ్రెండ్‌కు జ‌రిగిన యాక్సిడెంట్ గురించి తెలిసి స‌చిన్ ఆందోళ‌న చెందారు. అయితే, ప్ర‌స్తుతం ప్ర‌మాద‌మేమీ లేద‌ని.. ట్రాఫిక్ పోలీస్ స‌మ‌యానికి హాస్పిట‌ల్‌లో చేర్చ‌డం వ‌ల్ల ప్రాణాపాయం త‌ప్పింద‌ని తెలిసి.. కాస్త ఊర‌ట చెందారు. వెంట‌నే త‌న స్నేహితురాలిని ఆసుప‌త్రికి త‌ర‌లించిన ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎవ‌రా అని ఆరా తీశారు. ఆయ‌న్ను స్వయంగా కలుసుకొని థ్యాంక్స్ చెప్పారు.  ఈ విష‌యాన్ని ట్విటర్‌లో వెల్లడించారు స‌చిన్‌. ‘అలాంటి వారి వల్లే ప్రపంచం ఇంత అందంగా ఉంటోంది. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు దేశ వ్యాప్తంగా ట్రాఫిక్‌ పోలీసులు ఎంతో శ్రమిస్తున్నారు. వారికి అభినందనలు. మనమంతా ట్రాఫిక్‌ నిబంధనలు పాటిద్దాం’ అని పోస్ట్‌ చేశారు.

DSPకి ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్.. ఊ అంటారా? ఉలిక్కిప‌డ‌తారా?

థియేట‌ర్ల‌లో పుష్ప హ‌వా న‌డుస్తోంది. పుష్ప‌రాజ్ మాస్ అప్పీల్‌కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక ఐటం సాంగ్ అయితే కుమ్మేస్తోంది. స‌మంత 'ఊ' అన‌గానే.. ఆడియ‌న్స్ అంతా ఊ ఊ.. అంటున్నారు. ఆ సాంగ్ ఎంత హిట్ అయిందో.. అంతే కాంట్ర‌వ‌ర్సీగా మారింది. ఐట‌మ్ సాంగ్స్‌ను డివోష‌న‌ల్ సాంగ్స్‌తో లింక్ చేస్తూ.. మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీ ప్ర‌సాద్ చేసిన వ్యాఖ్య‌లు మంట రేపుతున్నాయి.  తాజాగా, మ్యూజిక్ డైరెక్టర్‌ దేవిశ్రీ ప్రసాద్‌కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్వీట్‌గా స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చారు. హిందూ సమాజం ఇచ్చే గౌరవాన్ని స్వీకరించటానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. పుష్ప సినిమా ఐటమ్ సాంగ్‌లో పదాలను.. దేవుడి స్లోకాలతో పోల్చటాన్ని ఖండించారు. దేవిశ్రీ ప్రసాద్ హిందువుల మనోభావాలను కించపరిచారన్నారు. DSP వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు.  దేవిశ్రీ ప్ర‌సాద్ అస‌లేమ‌న్నారంటే.. ఇటీవల జరిగిన ‘పుష్ప’ ఈవెంట్‌లో దేవిశ్రీ మాట్లాడుతూ.. ఐటెం సాంగ్స్ అన్ని తనకు డివోషనల్ సాంగ్సే అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఉదాహరణకు పాడి చూపిస్తాను అంటూ తాను కంపోజ్ చేసిన రెండు ఐటెం సాంగ్స్‌కు డివోషనల్ లిరిక్స్‌తో ట్యూన్‌ కట్టి పాడి వినిపించారు కూడా.  ఆర్య 2లోని ‘రింగ రింగ..’ సాంగ్‌కు ‘నాకు ఉన్న కోరికలన్నీ.. నువ్వే తీర్చాలి స్వామి.. స్వామీ.. స్వామీ..’ అంటూ అదే ట్యూన్‌లో పాడారు. ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా..’ సాంగ్‌కు కూడా ‘స్వామీ.. నేను కొండ ఎక్కాను, పూలు పళ్లు అర్పించాను.. ప్రసాదం తినేసి.. నా కష్టాలు తీర్చు స్వామి.. ఊ అంటావా స్వామి.. ఊ ఊ అంటావా స్వామి..’ అని పాడి వినిపించారు. పుష్ప స్పెషల్‌ సాంగ్‌ను ప్రముఖ డివోషనల్ సింగర్ శోభారాజ్ గారు ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా’ అంటూ డివోషనల్‌కి మార్చి పాడుకున్నారంటూ దేవిశ్రీ ప్ర‌సాద్‌ వివరణ ఇచ్చారు. పాటని మనం ఎలా తీసుకుంటే అలాగే ఉంటుందంటూ విమర్శకులకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. దేవిశ్రీ ఇచ్చిన ఈ వివ‌ర‌ణ‌పైనే లేటెస్ట్‌గా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. హిందువుల మ‌నోభావాలు కించ‌ప‌రిచార‌ని.. వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని.. లేదంటే హిందూ స‌మాజం ఇచ్చే గౌర‌వాన్ని స్వీక‌రించడానికి రెడీగా ఉండాలంటూ వార్నింగ్ ఇచ్చారు రాజాసింగ్‌.   

తిరుమల గిరుల సాక్షిగా అమరావతి నినాదం.. రాజధాని రైతుల సంబరం

తిరుమల గిరుల సాక్షిగా అమరావతి నినాదం మార్మోగింది అమరావతే ఏకైక రాజధాని అంటూ వెంకన్న పాదాల కింద సింహనాదం వినిపించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష తిరుపతి వేదికగా స్పష్టమయింది. అమరావతి రైతుల సభకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. అమరావతి రైతు నినాదానికి అన్ని రాజకీయ పార్టీల అతిరథ మహారథలు జతకట్టారు. కలిసి నినదించారు. వంద మందికిపైగా పట్టేలాస్టేజ్‌ను రూపొందించారు. అయితే అన్ని పార్టీల నుంచి నేతలు తరలిరావడంతో స్టేజ్ కూడా కిక్కిరిసిపోయింది. రైతులు నిర్వహించిన మహోద్యమ సభకు హాజరైన అన్ని పార్టీల నేతలు.. ఏకైక రాజధానిగా అమరావతి ఉండాని నినదించారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అంగీకరించి అడ్డగోలుగా చేసిన మోసాన్ని అందరూ ప్రజల ముందు పెట్టారు. చివరికి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా అదే చెప్పారు. తిరుపతి మహోద్యమ సభలో  ఎక్కడా భిన్నాభిప్రాయం వినిపించలేదు. అమరావతి నిర్మాణం చేతకాకపోతే తప్పుకోవాలని అందరూ ముక్త కంఠంతో జగన్‌కు సలహా ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు సహా అందరూ అమరావతి ఆకాంక్ష ప్రజల్లో ఉందని.. అమరావతి ప్రజారాజధానిగా స్పటం చేశారు. జగన్‌రెడ్డిది చేతకాని అసమర్థ ప్రభుత్వమని చంద్రబాబు మండిపడ్డారు. బీజేపీ తరపున హాజరైన కన్నా లక్ష్మినారాయణ హాజరై దోచుకునేందుకు విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారని విమర్శించారు. అమ‌రావ‌తి అంద‌రి రాజ‌ధాని.. ధ‌ర్మ‌పోరాటం ఆగ‌ద‌న్న చంద్ర‌బాబు.. ఏపీ రాజధాని అమరావతిని కాపాడుకునేందుకు రైతులకు ఆది నుంచి టీడీపీ ఒక్కపార్టీనే కాదు .. ఏపీలో ఉన్న అన్ని రాజకీయపార్టీలు, వామపక్షాలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు పూర్తి మద్దతునిచ్చాయి. ఒకటే రాజధాని.. అది ఏపి అమరావతేనని ఆకాంక్షించారు. శుక్రవారం తిరుపతి వేదికగా అమరావతి పరిరక్షణ ‘మహోద్యమ సభ’..అమరావతి అందరిది అన్న ట్యాగ్ లైన్ తో రైతులు భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు ఏపీలోని ప్రతి పార్టీ నుంచి పదిమందికి పైగా నేతలు వచ్చి .. సభలోప్రసంగించారు. రైతుల కోసం ఎంత దూరమైన వస్తామని .. రాజధానిని కాపాడుకునేందుకు దేనికైనా సిద్దమని తెగెసి చెప్పారు. జగన్ రెడ్డి ముర్ఖత్వంతోనే ఏపీలో పరిస్థితులు ఇలా దాపురించాయని, అమరావతిని తప్పనిసరిగా కాపాడుకుంటామని తేల్చి చెప్పారు.  అమ‌రావ‌తి రూప‌శిల్పి చంద్ర‌బాబు.. రాజ‌ధాని మార్చ‌డం అసాధ్య‌మ‌న్న ర‌ఘురామ‌ రైతుల ఆహ్వానం మేరకు తెలుగుదేశం, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, వామపక్ష నేతలు సభకు హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, నటుడు శివాజీ, మాజీ మంత్రులు రావెల, పరిటాల, ఆదినారాయణ రెడ్డి తదితరులు ముఖ్యనేతలు వేదికపై ఆశీనులై, ముక్తం కంఠంతో ఏపీ రాజధాని అమరావతేనని నినదించారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులు నెలన్నర పాటు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ పాదాయత్ర చేసి తమ సంకల్పాన్ని చాటారు. ఎన్ని విమర్శలు.. లాఠీచార్జ్‌లు.. నిర్బంధాలు ఎదురైనప్పటికీ సభకు భారీగా జన సమూహం తరలి రావడంతో రైతులు తమ ప్రయత్నాల్లో మరో అడుగు ముందుకేశామన్న సంతృప్తి వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్ లో డీఎస్ చేరికకు బ్రేక్! బీజేపీ ఎంపీ వల్లే ఆగిందా..? 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ కాంగ్రెస్ లో చేరిక వాయిదా పడింది. శుక్రవారం డీఎస్ కాంగ్రెస్ లో చేరిక జరుగుతుందని ఏఐసీసీ వర్గాల నుంచి సమాచారం వచ్చింది. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీతో సమావేశమయ్యారు డీఎస్. దాదాపు 40 నిమిషాల పాటు ఇద్దరి మధ్య చర్చ జరిగింది. అప్పుడే డీఎస్ కాంగ్రెస్ లో చేరిక ఖాయమైంది. డీఎస్ చేరిక కార్యక్రమానికి రావాలంటూ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సహా పలువురు నేతలకు అధిష్టానుంచి పిలుపు కూడా వచ్చింది. అయితే సడెన్ గా అది వాయిదా పడింది.  డీఎస్ విషయంలో ఏఐసీసీ నుంచి పీసీసీ వర్గాలకు తాజా సమాచారం వచ్చింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణికం ఠాగోర్ నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు అందిన ఆదేశాలతో చివరి నిమిషంలో డీఎస్ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. తిరిగి ఎప్పుడు రావాలో చెబుతామని, అప్పటి వరకు వేచి ఉండమని చెప్పినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ లో డీఎస్ చేరిక ఎందుకు వాయిదా పడిందన్న దానిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. అయితే కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం డీఎస్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన పదవీకాలం మరో ఆరు నెలలకుగాపైగానే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కనుక పార్టీ మారితే ఫిరాయింపు చట్టం వర్తించే అవకాశం ఉంది. దీంతో ఆ ఇబ్బంది లేకుండా సంక్రాంతి తర్వాత ఆయనను పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఫిరాయింపుల వ్యవహారం వల్లే డీఎస్ చేరికకు బ్రేక్ పడిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నా.. అసలు సంగతి మాత్రం మరొకటి అంటున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన కొందరు నేతలు డీఎస్ రాకను వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. పార్టీలో చేరిక సోనియాతో డీఎస్ చర్చల తర్వాత...  డీఎస్‌ పార్టీలోకి ఎంట్రీ విషయమై రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌ నిజామాబాద్‌ నేతలతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన చేరికను స్థానిక నేతలు వ్యతిరేకించినట్టు సమాచారం. ఇటీవల కాలంలో డీఎస్ కొడుకు, బీజేపీ ఎంపీ అర్వింద్.. కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు కూడా ఇందుకు ఓ కారణమంటూ స్థానికంగా చర్చ నడుస్తోంది. మొత్తానికి  డీఎస్ రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతుందన్న అంశం నిజామాబాద్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.  

రోజుకు 14 లక్షల కేసులు! ఒమిక్రాన్ తో భారత్ కు పెను ముప్పేనా? 

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మన దేశంలోనూ వేగంగా విస్తరిస్తోంది. భారత్ లో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే 11 రాష్ట్రాలకు పాకేసింది కొత్త వైరస్ . డెల్టా రకం కన్నా 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందే లక్షణంతో ఒమిక్రాన్ కేసులు మన దేశంలో 111గా నమోదైనట్టు కేంద్రం ప్రకటించింది.  కొత్తగా మహారాష్ట్రలో మరో ఎనిమిది మందిలో ఈ కొత్త వేరియంట్‌ వెలుగుచూడగా.. కేరళలో మరో రెండు కేసులు నమోదయ్యాయి.  మహారాష్ట్రలో ఒమిక్రాన్‌ బాధితుల సంఖ్య 40కి చేరింది. తాజాగా బయటపడిన వారిలో ఆరుగురు పుణెకు చెందిన వారు కాగా.. ఒకరు ముంబయి, మరొకరు కల్యాణ్‌ డోంబివలీకి చెందినవారిగా అధికారులు గుర్తించారు. వీరంతా 29 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు కలిగిన పురుషులేనని తెలిపారు. యూఏఈ నుంచి కోచికి వచ్చిన ఇద్దరు వృద్ధ దంపతుల్లో ఈ వేరియంట్‌ వెలుగుచూసింది. వీరిలో ఒకరి వయస్సు 68 ఏళ్లు కాగా.. మరొకరి వయస్సు 67. వీరిద్దరూ స్వీయనిర్బంధంలో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఢిల్లీలో 22, రాజస్థాన్‌ 17, కర్ణాటక 8, తెలంగాణ 8, కేరళ 7, గుజరాత్‌ 5, ఏపీ, చండీగఢ్‌, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్కొక్కటిచొప్పున నమోదయ్యాయి.  యూకే, ఫ్రాన్స్‌ దేశాల్లో ఒమిక్రాన్‌, కరోనా విజృంభణ స్థాయిని చూస్తుంటే.. అలాంటి పరిస్థితులు గనక భారత్‌లో ఏర్పడితే రోజుకు లక్షలాది కేసులు నమోదయ్యే అవకాశం ఉందని కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ చీఫ్‌ వీకే పాల్ హెచ్చరించారు. యూకే మాదిరి పరిస్థితి భారత్‌లో గనక ఏర్పడితే మన జనాభాను బట్టి రోజుకు 14లక్షల కేసులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పుడు ఫ్రాన్స్‌లో రోజుకు 65వేల చొప్పున వస్తుండగా.. అక్కడి పరిస్థితితో పోలిస్తే మన జనాభా దృష్ట్యా భారత్‌లో ప్రతిరోజూ 13లక్షల కేసులు నమోదవుతాయంటూ ఉదహరించారు. యూరప్‌లో 80శాతం మేర పాక్షికంగా వ్యాక్సినేషన్‌ పూర్తయినప్పటికీ డెల్టా ఉద్ధృతి తగ్గడంలేదన్నారు.  అందువల్ల ప్రజలు అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించారు.  గత 20 రోజులుగా మన దేశంలో రోజుకు 10వేలు కన్నా తక్కువ కొవిడ్‌ కేసులే వస్తున్నప్పటికీ.. ఇతర దేశాల్లో కొత్త వేరియంట్ కేసులు భారీగా నమోదవుతుండటంతో మనం అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని వీకే పాల్‌ గుర్తు చేశారు.   అత్యంత వేగంగా వ్యాప్తి చెందే లక్షణం కలిగిన ఈ ఒమిక్రాన్‌ వేరియంట్‌ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం పదేపదే విజ్ఞప్తి చేస్తోంది. వ్యాక్సిన్‌ వేయించుకోవడంతో పాటు మాస్క్‌ ధరించడం, భౌతికదూరం పాటించడం, జనం రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండటం, అనవసర ప్రయాణాలను మానుకోవడం వంటి చర్యలు తీసుకోవాలని సూచిస్తోంది. వ్యాక్సిన్లు వేయించుకోవడం, మాస్క్‌ ధరించడం, శానిటైజర్లు వాడకంతో పాటు జనం రద్దీగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలని అలర్ట్ చేస్తోంది. నూతన సంవత్సర వేడుకలను కొద్దిమందితోనే జరుపుకొనేలా ఏర్పాట్లు చేసుకోవాలని వైద్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

ఢిల్లీలో తెలంగాణ మంత్రుల ధర్నా! కేంద్రంపై యుద్ధానికి కేసీఆర్ పిలుపు.. 

కేంద్ర ప్రభుత్వంపై మరోసారి యుద్ధం ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్‌ఎస్ ఆధ్యర్యంలో ఈ నెల 20 నుంచి రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన టీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశంలో ఈ మేరకు పార్టీ నేతలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వైఖరిని నిలదీయాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు. బీజేపీ పై తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు కేసీఆర్. బీజేపీతో తాడో పేడో తేల్చుకుందామన్నారు. మంత్రులంతా కార్యక్రమాలు రద్దు చేసుకొని ఢిల్లీ వెళ్లాలని ఆదేశించారు. వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రమంత్రిని కలవాలని మంత్రులను ఆదేశించారు. సమయం ఇవ్వకపోతే అక్కడే కూర్చోండి..తేల్చుకొని రండని ఆయన స్పష్టం చేశారు. రైతులంతా కష్టాల్లో ఉన్నారన్నారు. తాను కూడా ఎల్లుండి పర్యటనలు రద్దు చేసుకుంటున్నానని కేసీఆర్ చెప్పారు.  పార్టీ మీటింగ్‌లో సీఎం కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. చురుగ్గా పని చేయాలని, ఎమ్మెల్యేలను, ఎంపీలను మళ్లీ గెలిపించే బాధ్యత తనదేనని చెప్పారు. నాయకులకు ఓపిక ఉండాలని, పార్టీ కోసం కష్టపడ్డోళ్లకు పదవులు వస్తాయని స్పష్టం చేశారు. నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీ చేస్తామన్నారు సీఎం కేసీఆర్‌. రాష్ట్రమంతా దళిత బంధు అమలు చేస్తామని..  మొదట ప్రతి నియోజకవర్గంలో వంద మందికి ఇస్తామని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. పంటల మార్పిడిపై రైతులను చైతన్య పరచాలని.. మిల్లర్లతో టై అప్ ఉన్నోళ్లు వరి వేసుకోనివ్వాలని సీఎం స్పష్టం చేశారు.  ‘రైతు బంధు’ యథావిధిగా ఇస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. 

రేప్ తప్పదంటే.. ఎంజాయ్ చేయాలి!

‘రేప్ తప్పనిసరి అయినప్పుడు ఎంజాయ్ చేయడం మేలు’ ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారారి. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో చిన్నా చితకా వ్యక్తి అయితే.. అంతగా పట్టింపు వచ్చేది కాదేమో..! స్వయంగా ఓ సీనియర్ ఎమ్మెల్యే, గతంలో అసెంబ్లీ స్పీకర్ గా కూడా వ్యవహరించిన వ్యక్తి. ఆ వ్యక్తి అయినా ఎక్కడో అన్నా అంతగా ప్రాధాన్యం ఉండకపోవచ్చనుకున్నా.. ఆయన ఏకంగా శాసనసభ వేదికగానే ఈ వ్యాఖ్యలు చేయడం.. మహిళలు, రాజకీయ పక్షాలు భగ్గుమనడంతో.. క్షమాపణ కోరక తప్పలేదాయనకు. ఇంతకీ ఎవరా వ్యక్తి? అనుకుంటున్నారా?.. ఆయన ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే, అసెంబ్లీ మాజీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్. ‘అత్యాచారం నుంచి తప్పించుకోలేనప్పుడు దాన్ని ఎంజాయ్ చేయడమే మేలు’ అని కర్ణాటక శాసనసభ స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డేను ఉద్దేశించి కేఆర్ రమేశ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ వేదికగా రమేశ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దేశ వ్యాప్తంగా మహిళలు, ప్రజా సంఘాల నుంచి రమేశ్ కుమార్పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో నాలిక్కరుచుకున్న రమేశ్ క్షమాపణలు కోరారనుకోండి. ‘అత్యాచారం గురించి అసెంబ్లీలో నేను ఉదాసీనంగా, నిర్లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు తెలుపుతున్నా. రేప్ లాంటి క్రూరమైన నేరాన్ని తేలిగ్గా తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదు. అనుకోకుండా నోరుజారా. ఇకపై జాగ్రత్తగా మాట్లాడతా’ అని ట్విట్టర్లో రమేశ్ కుమార్ తెలిపారు. కర్నాటక అసెంబ్లీలో సభ్యులు నిరవధికంగా ఆందోళన చేస్తుండడంతో స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే ‘నేను అన్నింటినీ ఆస్వాదిస్తూ.. అవును, అవును అనే పరిస్థితిలో ఉన్నా’ అన్నారు. ఆ వెంటనే రమేశ్ స్పందిస్తూ ‘అత్యాచారం అనివార్యమైనప్పుడు ఆనందంగా ఆస్వాదించాలి’ అనే ఓ సామెత ఉంది.. మీరు ఇప్పుడు సరిగ్గా అలాంటి స్థితిలోనే ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు. ఏదో సరదా కోసమే రమేశ్ ఈ వ్యాఖ్యలు చేశారనుకున్నా తీవ్ర దుమారాన్నే లేపుతున్నాయి. రమేశ్ కుమార్ వ్యాఖ్యలు విచారకరం అని, దురదృష్టకరమని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ ఖండించారు. మహిళలంటే చిన్నచూపు చూసే ప్రజా ప్రతినిధులు ఉండడం బాధాకరమని నిప్పులు చెరిగారు. రమేశ్ కుమార్ వ్యాఖ్యలపై సుమోటోగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలా ఉండగా.. 2019లో కర్ణాటక అసెబ్లీ స్పీకర్ గా ఉన్నప్పుడు కూడా కేఆర్ రమేశ్ కుమార్ ఇలాంటి వ్యాఖ్యలే చేసిన సందర్భాన్ని పలువురు గుర్తుచేస్తున్నారు. ‘తన పరిస్థితి అత్యాచార బాధితురాలిగా ఉంద’ని అప్పట్లో రమేశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు అప్పుడు కూడా దుమారం రేపాయి. ‘అత్యాచారం జరిగినప్పుడు దాన్ని అక్కడితో వదిలేస్తే ఒకసారితో అయిపోతుంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే నిందితుడిని జైల్లో పెడతారు. కానీ లాయర్లు వదలరు. ఎన్నిసార్లు జరిగింది? ఎంతమంది చేశారు? అని ప్రశ్నిస్తారు. అత్యాచారం ఒకసారే జరుగుతుంది. కానీ కోర్టులో వందసార్లు జరుగుతుంది. ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది’ అని అప్పట్లో రమేశ్ కుమార్ వ్యాఖ్యానించారు.

ఈటల ఎటు పోతున్నారు? పార్టీ మారుతారా?

రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగ వచ్చును. అందులోనూ పార్టీలు మారడం అంగీ మార్చినంత ఈజీ వ్యవహరంగా సాగిపోతున్న ప్రస్తుత సమయంలో మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పార్టీ మారుతున్నారని వార్తలు రావడం పెద్ద విషయం కాదు. విశేషం కాదు. సహజం. ఒక పార్టీ నాయకుడు ఇంకొక పార్టీ నాయకుని కళ్ళతో పలకరించుకున్నా, నిముషాల్లో స్క్రోలింగులు వచ్చే రోజుల్లో ఈటల గురించి పుకార్లు రావడంలో ఆశ్చర్యం లేదు.   అయితే, నిన్న గాక మొన్న, అధికార తెరాస నుంచి బయటకు వచ్చి, బీజేపీలో చేరిన ఈటల రాజేందర్, ఇంతలోనే మళ్ళీ పార్టీ మారుతారా? కాంగ్రెస్ పార్టీలో చేరతారా?  అంటే, కొంచెం చాలా ఆలోచించవలసి వస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిజంగా,ఈటల అలాచేస్తే, అది ఆయన రాజకీయ భవిష్యత్’ను ప్రశ్నార్ధకం చేస్తుందని అంటున్నారు. నిజానికి, అలాంటిది ఏమీ లేదని, తాను పార్టీ మారే ప్రశ్నే లేదని, ఈటలే స్వయంగా ప్రకటించారు. పార్టీలు మారడం తన తత్త్వం కాదని, తెరాస నుంచి కూడా తాను బయటకు రాలేదని, బయటకు పపంపారని ఈటల వివరణ ఇచ్చారు. అయినా రాజకీయ వర్గాల్లో మాత్రం ఆ చర్చ అలా సాగుతూనే ఉంది.   అదలా ఉంటే, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, బీజేపీలో మరో చర్చ జరుగుతోంది. బీజీపీ జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. అదే సమయంలో రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావాలంటే, ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్చుకోవడం అనివార్యమని జాతీయ నాయకత్వం స్పష్టమైన అభిప్రాయంతో ఉంది. ఈ నేపధ్యంలో ఇటు తెరాస నుంచి అటు కాంగ్రెస్ నుంచి కూడా గట్టి పట్టున్న నాయకులను కమలం గూటికి చేర్చే కీలక బాధ్యతను తెరాస నుంచి వచ్చిన ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి కమలం గూటికి చేరిన డీకే అరుణకు అధిష్టానం అప్పగించి నట్లు తెలుస్తోంది.  తెరాసలో కింది స్థాయి కార్యకర్తల నుంచి నియోజక వర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరి పుట్టు పూర్వోత్తరాలు, ఆపసోపాలు అన్నీ, ఈటలకు కొట్టిన పిండే, కాబట్టి ఆ బాధ్యతలను పార్టీ అధిష్టానం ఆయనకు అప్పగించిందని అంటున్నారు. ఇప్పటికే ఈటల ఆ దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే ఈటల తెరాసలో అసంతృప్తులు తమతో టచ్’లో ఉన్నారని అంటున్నారు. ఖచ్చితంగా ఇంతమంది ఆని కాకుండా, పట్టున్న నాయకులను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఈటల అడుగులు వవేస్తున్నారని, ఇటు బీజేపీలో తెరాసలోనూ చర్చ జరుగుతోంది. ఈటల అడుగులు వేయడం వల్లనే   ముఖ్యమంత్రి ఉన్నట్లుండి పార్టీ మీద దృష్టి పెట్టారని, జిల్లా పర్యటనలకు బయలు దేరుతున్నారని తెరాస పార్టీలోనూ గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా, బీజేపీ అదిష్టానం తెరాసకు బీజేపీని ప్రధాన ప్రత్యర్ధిగా ప్రజలలోకి తీసుకు వెళ్ళే ప్రయత్నాలలో భాగంగా కేసీఆర్’ కు ఈటలను ప్రత్యర్ధిగా నిలిపేందుకు కూడా సిద్దమవుతున్నట్లు సమాచారం. కేంద్ర నాయకత్వం ఉంచి అలాంటి సంకేతాలు ఉన్నందునే ఈటల రాజేందర్ బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్’పై పోటీ చేసేందుకు అయినా సిద్ధమని ప్రకటించారని అంటున్నారు.  అదలా ఉంటే, కేసీఆర్ మంత్రివర్గం నుంచి ఈటల బర్తరాఫ్ అయినప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని అనేక ఉహాగానాలు వినవచ్చాయి. అలాగే, ఆయన బీజేపీలో చేరి, హుజూరాబాద్ ప్రచారంలో తలమునకలై ఉన్న సమయంలోనూ, ఆయన బీజేపీలో ఇమడలేక పోతున్నారు. ఆయనకు, బీజేపీ నాయకులు సహకరించడ లేదు. ఆయన రేపోమాపో  బీజీపీకు గుడ్ బై చెపుతున్నారు .. ఇండిపెండెంట్’గా పోటీకి రెడీ అవుతున్నారు, కాంగ్రెస్’లో చేరుతున్నారు .. అంటూ చాలా ఉహాగానాలు వినిపించాయి. అయినా, అందులో ఏ ఒక్కటీ నిజం కాలేదు, ఇప్పుడు ఆయన కాంగ్రెస్’లో చేరుతున్నారు అంటూ వస్తున్న ఉహాగానాలు కూడా అంతే అంటున్నారు, ఈటల సన్నిహితులు. అంతేకాదు, కేసీఆర్ ఏ ఉద్దేశంతో ఈటలను బయటకు పంపినా, ఒక విధంగా ఈటల కూడా అదే కోరుకున్నరని. ఆయనసన్నిహితులు అంటున్నారు.

పీకే పనై పోయిందా? శ‌కునం చెప్పే పిల్లి కుడితిలో ప‌డిందా?

రాజ‌కీయ ఎన్నికల వ్యూహ‌క‌ర్త‌గా ఓ వెలుగు వెలిగిన ప్ర‌శాంత్ కిశోర్‌ పనై పోయిందా? శకునం చెప్పే పిల్లి కుడితిలో పడింది అన్నట్లుగా,  ఇంత వరకు  అడిగిన అందరికీ కోట్లలో ఎన్నికల వ్యూహాలను సప్లై చేసిన పీకే, ఇప్పుడు, తన రాజకీయ వ్యూహం ఏమిటో తనకే అర్థం కాక తికమక పడుతున్నారా?  అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి, పశ్చిం బెంగాల్ ఎన్నికల తర్వాత పీకే , ఇక ఎన్నికల వ్యాపారానికి స్వస్తి చెప్పేస్తున్నానని ప్రకటించారు. ఆయన ఆ మాట మీద నిలబడితే ఎలా  ఉండేదో కానీ, అయన అక్కడి నుంచి ఒక్క విషయంలో మినహాయించి అన్ని విషయాల్లోనూ  వరస పెట్టి పిల్లి మొగ్గలు వేస్తూనే ఉన్నారు.  ‘బీజీపీని ఓడించాలి, మోడీని  గద్దె దించాలి’అనే సింగల్ పాయింట్ ఫార్ములా చుట్టూ పీకే, పిల్లి మొగ్గలు, కుప్పి గంతులు వేస్తున్నారు. నిజానికి వ్యూహ‌క‌ర్త‌ల, పరిస్థితులను అన్ని కోణాల్లో పరిశీలించి, ఆకలింపు చేసుకుని ఒక నిర్ణ‌యానికి వ‌చ్చి అప్పుడు కార్యక్షేత్రంలో దిగుతారు. నిజానికి, పీకే కూడా బెంగాల్ వరకు అదే పద్దతిలో పనిచేశారు. ఆ తర్వాతనే పీకే ఆలోచనలు పక్కదారి పట్టాయి. ఒక విధంగా చూస్తే బెంగాల్ తర్వాత పీకేలో రాజకీయ ఆశలు మొదలయ్యాయి అనిపిస్తుంది. అందుకే ఆయన, స్థిరం అడుగులు వేయలేక పోతున్నారు. అందుకే ఆయన భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.  ప్రస్తుతం ఆయన  ఎమీతోచక ఆలోచనలు మొద్దుబారిన కొత్త వ్యుహాల కోసం  అల్లాడుతున్నారనే చర్చ కూడా రాజకీయ, మీడియా వర్గాల్లో మొదలైంది.   మరో వంక సోనియా, రాహుల్ మొదలు కేసీఆర్, కేటీఆర్ వరకు  ప్రతిపక్ష పార్టీలు, బీజేపీ, మోడీని ఓడించేందుకు పేకే వ్యూహాల మీద ఆధార పడడం .. అన్యధా శరణం నాస్తి ..త్వమేవ శరణం పేకే ..అంటూ వెంట పడడడం కూడా ఆయనలో మార్పుకు కారణం అంటున్నారు. అందుకే ఆయన ఆలోచనలు బాలన్స్ తప్పు తున్నాయి నిపిస్తుంది. ఒక విధంగా పిచ్చోడి చేతిలో రాయి, అన్నట్లుగా పీకే వ్యవహరిస్తున్నారు.   నిజానికి బెంగాల్ గ్యాప్ తర్వాత ఆయన కాంగ్రెస్ అనుకూల స్టాండ్ తీసుకున్నారు. కాంగ్రెస్ లేకుండా విపక్షాలు బీజేపీని ఎప్పటికీ ఓడించలేవని సూత్రీకరించారు. ఆ విధంగా కాంగ్రెస్ చుట్టూ ప్రతిపక్షాలను నిలబెట్టీ ప్రయత్నం చేశారు. స్వయంగా తానూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఏమైందో ఏమో గానీ, కాంగ్రెస్‌’కు ఛీ కొట్టి మళ్ళీ మమతా బెనర్జీ (తృణమూల్) అనుకూల స్టాండ్ తీసుకున్నారు. కాంగ్రెస్ నాయకులను దగ్గరుండి తృణమూల్ పంచకు చేర్చారు. ఇప్పడు మళ్ళీ రాహుల్ గాంధీకి జై కొడుతున్నారు. రాహుల్ గాంధీ రాజకీయాలకే పనికిరాడని, నిజానికి కాంగ్రెస్ కష్టాలకు ఆయనే కారణమని కొంత కాలం రాహుల్ గాంధీని రఫ్ ఆడారు..  అయితే ఇప్పుడు మళ్ళీ దేశానికీ ప్రధాని అయ్యే అర్హతలు అన్నీ రాహుల్ గాంధీకి   ఉన్నాయని, ఆయనో జాతి రత్నం అంటున్నారు. రాహుల్‌కు ప్ర‌ధాని అయ్యే ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉన్నాయ‌ని, రాహుల్ ప్ర‌ధాని కావాల‌ని.. యువ‌త కోరుకుంటోంద‌ని అంటున్నారు. అంతేకాదు.. కేంద్రంలో కాంగ్రెస్ ప‌ని అయిపోయింద‌ని చెప్పిన నోటితోనే.. ఇప్పుడు  కేంద్రంలో.. కాంగ్రెస్ లేకుండా.. అస‌లు ప్ర‌భుత్వ‌మే ఏర్పాటు కాద‌ని పీకే వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి, ఇలా ఇటు అటూ ఏటంటే అటు కొట్టుకు పోతున్న పీకే అలోచనలు .. వ్యూహాలు అయితే ..రహస్య అజెండాలో భాగం అయినా కావాలి .. కాదంటే ... ఆయన  వ్యూహాల మేజిక్ బాక్స్ నిండుకుని అయినా ఉండాలి .. అయితే ... ఇక పీకే .. పీకేది ఏమీ లేదని మాత్రం ఇంతకాలం ఆయన చుట్టూ తిరిగిన  రాజకీయ నాయకులే  ఇక పీకే దుకాణం బంద్ ..అయినట్లే అనీ అంటున్నారు. ప్రతి కుక్కకు ఒక రోజుంటుంది... పీకే రోజు వెళ్ళిపోయింది.