వారంలో కేసులు 70 శాతం హైక్.. ఒమిక్రాన్ పంజా

ప్రపంచాన్ని కలవరపెడుతున్న కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శరవేగంగా వ్యాపిస్తోంది దక్షిణాఫ్రికాలో పుట్టిన ఒమిక్రాన్ ఇప్పటికే 90 దేశాలకు విస్తరించింది. క్రమంగా అన్ని దేశాలను చుట్టుముడుతోంది. ఒమిక్రాన్ దెబ్బకు యూరప్ లోని పలు దేశాలు  లాక్ డౌన్ ప్రకటించాయి. అగ్రదేశం అమెరికాపై కూడా ఒమిక్రాన్ మహమ్మారి పంజా విసురుతోంది. యూఎస్ లో ఒమిక్రాన్ కేసులు ఊహించని విధంగా భారీగా పెరుగుతున్నాయి. కేవలం ఒక వారం రోజుల వ్యవధిలోనే  ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3 శాతం నుంచి 73 శాతానికి పెరిగింది.  అమెరికాలో గత వారం వరకు డెల్టా  వేరియంట్ కేసులు అధికంగా ఉండగా.. ప్రస్తుతం మాత్రం ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా ఉంచున్నాయి. ఈ వారంలో ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. ఈ వారం డెల్టా వేరియంట్ కేసులు దాదాపు 27 శాతం మాత్రమే ఉన్నాయని చెప్పింది. భారీగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు అమెరికాలో భయాందోళనలను పెంచుతున్నాయి. కేసులు ఇదే రీతిలో పెరుగుతూ పోతే దేశంలోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ  తీవ్రంగా దెబ్బతింటుందని భావిస్తున్నారు. యూఎస్ లోని కొన్ని రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు ఆందోళనకరంగా నమోదవుతున్నాయి. న్యూయార్క్, న్యూజెర్సీలలో 92 శాతం, వాషింగ్టన్ లో 96 శాతం కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని, వ్యాక్సిన్ ఇప్పటికే వేయించుకున్నవారు బూస్టర్ డోస్ వేయించుకోవాలని మోడెర్నా సంస్థ సూచించింది. తమ వ్యాక్సిన్ మూడో డోసు వేసుకుంటే శరీరంలో యాంటీబాడీలు పెరుగుతాయని తెలిపింది. తమ వ్యాక్సిన్ల థర్డ్ డోసు ఒమిక్రాన్ ప్రభావాన్ని నియంత్రిస్తుందని ఫైజర్, బయోఎన్ టెక్ సంస్థలు తెలిపాయి. ప్రజలంతా మాస్కులు ధరించాలని, ఇన్ డోర్స్ లో ఉండాలని సీడీసీ సూచించింది.  మరోవైపు పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులతో ఉద్యోగులను మళ్లీ కార్యాలయాలకు పిలిపించాలనే అంశంపై పలు కంపెనీలు పునరాలోచనలో పడుతున్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం, జీపీ మోర్గాన్ వంటి పలు అంతర్జాతీయ సంస్థలు తమ కాన్ఫరెన్సులను, కార్యక్రమాలను వాయిదా వేసుకుంటున్నాయి. 

జగనన్నకు కోట్లలో బర్త్ డే గిఫ్ట్స్.. రిటర్న్ గిఫ్ట్ కోసమేనా..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 50లోకి  అడుగు పెడుతున్నారు. డిసెంబర్ 21న జ‌గ‌న్ రెడ్డి పుట్టిన‌ రోజు. ముఖ్యమంత్రిగా అయన జరుపుకుంటున్న మూడవ  పుట్టినరోజు వేడుక  ఇది. అయితే, మొదటి రెండు పుట్టిన రోజులకంటే ఇది కొంత ప్రత్యేకం. ఎందుకంటే, మొదటి రెండు పుట్టినరోజు వేడుకల్లో వైఎస్ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు. కానీ, ఈ సారి పాదయాత్రలో ఉన్న సోదరి షర్మిల హాజరు కావడం  లేదని తెలుస్తోంది. పాదయాత్రలో లేకున్నా ఆమె హజరు అయ్యేవారు కాదన్నది అందరికీ తెలిసిన రహస్యమే. అన్నా చెల్లి మధ్య చాలా కాలంగా సఖ్యత లేదు. ఇద్దరి మధ్య మాటలు కూడా లేవని అంటున్నారు. ఇక తల్లి విజయమ్మఅయినా కుమారుని ఆశ్వీదరిస్తారో లేదో తెలియదు. ఆ ఇద్దరి మధ్యన కూడా ముందున్న సంబంధాలు ఉన్నట్లు కనిపించడం లేదని అంటున్నారు.  కుటుంబం వ్యవహరం అలా ఈ పుట్టిన రోజు వేడుకల వేదిక, పార్టీ వివాదలకు కూడా వేదిక అవుతోంది. ముఖ్యంగా నగిరి ఎమ్మెల్యే, రోజా ఆమె ప్రత్యర్ధి వర్గం పోటాపోటీగా జగన్ రెడ్డి జన్మదిన వేడుకలు  జరిపేందుకు చేస్తున్న సన్నాహక కొట్లాటలు గత కొంత కాలంగా చర్చనీయాంశమవుతూనే వున్నాయి. ఎమ్మెల్యే రోజా ప్రత్యర్థి వర్గం నాయకులు ఇటీవల నగరిలో సమావేశమై ఆమె  పేరు చెప్పకనే విమర్శల దాడికి దిగిన సంగతి తెలిసిందే.తర్వాత రోజా మీడియా సమావేశంలో వారిపై ప్రతివిమర్శలకు దిగారు.ఈ నేపధ్యంలో ఆదివారం పుత్తూరులోని ఏలుమలై ఇంట్లో  సమావేశమైన ఎమ్మెల్యే రోజా  ప్రత్యర్ధి వర్గాలు మంగళవారం నిర్వహించ తలపెట్టిన జగన్‌ జన్మదిన వేడుకలకు ఏర్పాట్లపై చర్చించారు. పుత్తూరులో దాదాపు పది వేలమంది కార్యకర్తలతో ర్యాలీ, కార్వేటినగరం కూడలిలో బహిరంగ సభ నిర్వహించాలని,నాలుగు ప్రదేశాలలో అన్నదానం చేయాలని నిర్ణయించారు.ఈ సమావేశంలో ఏలుమలై, కేజే కుమార్‌, లక్ష్మీపతిరాజు, భాస్కరరెడ్డి, మురళిరెడ్డి, రవిశేఖరరాజు, నారాయణబాబు పాల్గొన్నారు.  మరో పక్క ఎమ్మెల్యే వర్గం కూడా జగన్‌ పుట్టిన రోజు వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయిదు మండలాల్లో తన వర్గం తరపున గెలిచిన ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, మున్సిపల్‌ చైర్మన్లు, కౌన్సిలర్లను జగన్‌ పుట్టినరోజు వేడుకల్లో భాగస్వాములను చేసి సత్తా చాటాలని వ్యూహరచన చేస్తున్నారు. నగరిలో పెద్దఎత్తున ర్యాలీ, బహిరంగ సభ, అన్నదానాలు చేయాలని భావిస్తున్నారు.అధికార పార్టీ కార్యకర్తలు ఒకేసారి జరిగే రెండు కార్యక్రమాల్లో ఎటువైపు మొగ్గాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇంతలోనే,   బ్యానర్లు, ఫ్లేక్సీల యుద్ధం నడుస్తోంది.  మంత్రి వర్గ విస్తరణ ఉహాగానాల నడుమ వచ్చిన  ఈ పుట్టిన రోజు వేడుకలను, కొందరు మంత్రి పదవులను ఆశిస్తున్న,ఎమ్మెల్ల్యేలు ఒక అవకాశంగా తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. భారీ బహుమతులతో ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా జగన్ రెడ్డి జన్మదిన వేడుకలను అంగ‌రంగ వైభ‌వంగా నిర్వహించడంతో పాటుగా, కోటి రూపాయలకుకు  తగ్గని బహుమతులను ఇచ్చి, రిట‌ర్న్ గిఫ్ట్‌గా మంత్రి పదవిని  ఆశిస్తున్న ఎమ్మెల్యేలు ఉన్నారని అంటున్నారు.ఈ జాబితాలో గుంటూరుకు చెందిన ఓ మ‌హిళా నాయ‌కురాలు.. అదేవిధంగా అనంత‌పురం జిల్లాకు చెందిన మ‌రో మ‌హిళా ఎమ్మెల్యే, విశాఖ‌కు చెందిన యువ నాయ‌కుడు, తూర్పుకు చెందిన‌.. మ‌రో నాయ‌కుడు.. ముందు వ‌రుస‌లో ఉన్నార‌ని అంటున్నారు. వీరంతా కూడా మంత్రి ప‌ద‌వుల‌పై ఆశ‌లు పెట్టుకున్న‌వారే. అయితే  బహుమతులకు ముఖ్యమత్రి ఫిదా అవుతారా?  రిటుర్న్ గిఫ్ట్ ఇస్తారా ? చూడవలసి ఉందని అంటున్నారు. ఈ పుట్టిన రోజు తర్వాత అయినా ముఖ్యమంత్రి మంచిగా మారాలని, మంచి పాలన అందివ్వాలని సామాన్యులు కొరుకుంటున్నారు.

సంక్రాంతి వస్తోంది.. కోడి పందాలకు ఓకేనా

సంక్రాంతి అంటేనే సంబురాల పండగ. సందడి పండగ. ఒక వైపు రంగు రంగుల హరివిల్లులు, మరో వైపు హరిదాసు సంకీర్తనలు, డూ డూ బసవన్న విన్యాసాలు, ఇంకో వైపు కర్ర, కత్తిసాము, హోరెత్తించే డప్పు కళాకారుల ప్రదర్శనలు, కోలాటం, పులి వేషాలు, ఈ అన్నింటినీ మించి కోడిపందాలు, ఎడ్ల పందాలు. ఏమున్నా, ఏమి లేక పోయినా కోడి పందాలు, ఎడ్ల పందాలు లేనిదే సంక్రాంతి, సంక్రాంతే కాదు. అసలు అదొక పండగే కాదు.  ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలలో జరిగే కోళ్ల పందాలు దేశంలోనే కాదు, విదేశాలలో కూడా వెరీ పాపులర్. కేవలం కోడి పందాలు చూసేందుకే, ఇరుగు పొరుగు రాష్ట్రల నుంచే కాదు   కాదు విదేశాల నుంచి కూడా వస్తుంటారు.అ యితే, చాలా కాలంగా ప్రభుత్వాలు  కోడి పందాలు , ఎడ్ల పందాలపై ఆంక్షలు విదించడంతో ప్రజల ముందస్తు సంబురాల మీద నీళ్లు జల్లు తున్నాయి. జీవహింస నిషేధం పేరిట, గ్యామ్బ్లింగ్ నిషేధం పేరున ప్రభుత్వ  యంత్రాంగం, పోలీసులు ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం కూడా అనవాయితీగా వస్తోంది. ఈ నేపధ్యంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, సంక్రాంతి, ఉగాది పండుగ ఉత్సవాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జరుపుకునేందుకు  శాశ్వతంగా అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు ముఖ్యమంత్రికి రాసిన లేఖలో ముద్రగడ, సంక్రాంతి, అదే విధంగ ఉగాదికి  5 రోజులు చొప్పున కోడి పందాలు,ఎడ్ల పందాలు సహా సాంప్రదాయ పద్దతిలో సంబరాలు జరుపుకునేందుకు శాశ్వతంగా అనుమతి ఇవ్వాలని, పర్మిషన్‌కి పర్మినెంట్‌ ఆర్డర్సు ఇప్పించాలని కోరారు.ఎలేఖలో అయన సంక్రాంతి పండుగ సమయంలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని ప్రస్తావించారు., “ఇది చాలా సున్నిత విషయం.  గ్రామాలలో సంక్రాంతి, ఉగాది ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం తరతరాలుగా వస్తున్న ఆచారం. ఈ సందర్భంగా ఎడ్లు, గుర్రం, కోడి వందాలు,ఆటల పోటీలు, జాతరలు వగైరాలతో సుమారు 5 రోజులు పండుగలు జరుపుకుంటారరు” అని పేర్కొన్నారు. అయితే ఈ మధ్యకాలంలో పండగ ఉత్సవాలలో ప్రభుత్వ ఆదేశాలతో పోలీసువారు చాలా ఇబ్బందులు పెట్టడం, ఆఖరిలో పర్మిషన్‌ ఇచ్చామని తూతూ మంత్రం చేస్తున్నారన్నారు. పోలీసు శాఖ కూడా ఇబ్బందులకు గురి అవుతున్న సంగతి గమనించాలన్నారు. అయితే, ఏపీలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, హిందువుల పట్ల, హిందువుల పడగల విషయంలో వివక్ష చూపుతున్నరనే  ఆరోపణలున్నాయి. అలాగే, గత సంవత్సరం కూడా సంక్రాంతి, ఉగాది సందర్భంలో పోలీసులు అతికి పోయి పండగ రోజుల్లోనూ ప్రజలను వేదింపులకు గురొఇ చేశారనే ఆరోపణలున్నాయి. మరి ఈసంవత్సరం ఏమి చేస్తారో ఏమో చూడాలి.. ..

నారా మాట.. కోర్టుతో ఏమొస్తది.. బోగస్ కు చెక్.. బేజారు బజార్.. టాప్ న్యూస్@7PM

ఆడ పిల్ల‌లంటే ఆట వ‌స్తువులు కాదు.. స్త్రీల‌ను గౌర‌వించాలి.. ఏ మ‌హిళ‌నూ అలా అవ‌మానించ‌కూడ‌దంటూ చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి ప‌రోక్షంగా వైపీసీ నాయ‌కుల‌కు చెంప‌పెట్టులాంటి హెచ్చరిక చేశారు. అసెంబ్లీలో భువ‌నేశ్వ‌రిపై అధికార పార్టీ నేత‌లు చేసిన అసంబ‌ద్ధ వ్యాఖ్య‌ల‌పై ఆమె మొద‌టిసారి స్పందించారు. చాలా హుందాగా.. ఉన్న‌తంగా.. రియాక్ట్ అయ్యారు.  వైసీపీ నేతల విమర్శలను పట్టించుకోన‌ని.. తాను బాధ పడటం లేద‌ని నారా భువ‌నేశ్వ‌రి అన్నారు.  --------- టీడీపీ నేత అచ్చెన్నాయుడుకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. విదేశాలకు వెళ్లడానికి ఏసీబీ కోర్టు అనుమతి తీసుకోవాలన్న ఆదేశాలను ఎత్తివేశారు. ESI స్కామ్‌లో అచ్చెన్నాయుడుకి ఇదివరకు హైకోర్టు బెయిల్ లభించింది. ACB కోర్టులో విచారణ ముగిసేవరకు దేశం విడిచి వెళ్లరాదని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అచ్చెన్నాయుడి విజ్ఞప్తి మేరకు కండిషన్‌ను హైకోర్టు ఎత్తివేసింది. ---- కోర్టుతో రాయలసీమకు వచ్చేదేమీ లేదని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. ఏపీకి పారిశ్రామికవేత్తలు వస్తే కూడా  సీఎం జగన్మోహన్‌‌రెడ్డిని కలవలేని పరిస్థితి, పరిశ్రమలు పెట్టాలంటే మనం ఏం అడుగుతామో అనే భయం పారిశ్రామికవేత్తలకు ఉందన్నారు. రాయలసీమకు న్యాయం చేయాలనిపిస్తే న్యాయ వ్యవస్థ పెట్టడంతో కాదు.రాయలసీమను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలన్నారు రఘురామ.  -------- ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. టికెట్ ధరల నియంత్రణపై జీఓ 35 రద్దు అందరికీ వర్తిస్తుందని ఏజీ తెలిపింది. గత విచారణలో పిటిషనర్లకు మాత్రమే ఈ జీవో నుంచి మినహాయింపు వస్తుందని హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ  హైకోర్టుకి తెలిపింది. ధరల నియంత్రణపై కొత్త కమిటీ ఏర్పాటు, వివరాలు తెలియజేయడానికి ప్రభుత్వం హైకోర్టుని సమయం కోరింది ---- ఎవరెన్ని కష్టాలు పెట్టినా..నియోజకవర్గంలో అనగతొక్కాలని చూసినా అవమానాలు చేసినా, జగనన్న మీద అభిమానంతో జగన్ అడుగుజాడల్లో ముందుకు వెళ్తున్నానని ఎమ్మెల్యే రోజా అన్నారు. జిల్లాలోని హనుమంతునిపాడు మండలం సీతారామపురంలో వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. సీఎం జగన్ అధికారంలోకి వస్తారని ప్రతిపక్ష నేత ఊహించి ఉండరన్నారు. వైయస్సార్ చనిపోయాక తమకు తిరుగుండదనుకున్నారని చెప్పారు.  ------- ఆహార భద్రత బాధ్యత కేంద్రానిదేనని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. తమది గొంతెమ్మ కోర్కె కాదన్నారు. బీజేపీ నేతలవన్నీ పచ్చి అబద్ధాలేనన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉచిత కరెంట్‌ ఉందా? అని ప్రశ్నించారు.  ఇప్పటి వరకు రైతులకు రూ.50 వేల కోట్లు ఇచ్చామన్నారు. కిషన్‌రెడ్డి యాసంగి వడ్లను కొంటారా లేదో చెప్పాలన్నారు. బీజేపీ నేతల్ని గల్లాపట్టి నిలదీయాలని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. ------- తెలంగాణ వచ్చాక ఇక ఉద్యమాల అవసరం ఉండదనుకున్నాం కాని స్వయం పాలనలో రైతులు రోడ్ల మీద, కేసీఆర్ ఏసీ గదుల్లో నిద్రపోతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీఏ ప్రభుత్వం ఉన్నంత వరకు వడ్ల కొనుగోలు సమస్య లేదన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు వచ్చాక వడ్ల సమస్య సృష్టించిదన్నారు.ధాన్యం కొనుగోలుకు కేంద్రాన్ని ఎందుకు ఒప్పించలేకపోతున్నారని మండిపడ్డారు -------- ఒమిక్రాన్ వేరియంట్ ను గుర్తించే సరికొత్త టెస్టింగ్ కిట్ ను భారత వైద్య పరిశోధన మండలి ఆవిష్కరించింది. ఈ కిట్ ను, అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని డిబ్రూగఢ్ లోని ఐసీఎంఆర్ రీజనల్ రీసెర్చ్ సెంటర్ అభివృద్ధి చేసింది. దీనితో త్వరితగతిన ఒమిక్రాన్ వేరియంట్ ను గుర్తించే వీలుంది.  కిట్ ను వాణిజ్య పంథాలో భారీ ఎత్తున ఉత్పత్తి చేసేందుకు ఆసక్తి ఉన్న కంపెనీలను ఐసీఎంఆర్ ఆహ్వానిస్తోంది. ----- ఎన్నికల చట్టాల సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఓటరు గుర్తింపు కార్డును ఆధార్ తో అనుసంధానం చేసేలా కేంద్రం ఈ బిల్లు తీసుకువచ్చింది. లోక్ సభలో విపక్షాల ఆందోళనల మధ్య బిల్లుకు ఆమోద ముద్ర పడింది. ఈ బిల్లు పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందంటూ కాంగ్రెస్ పార్టీ సహా విపక్షాలు ముక్తకంఠంతో ఆరోపించాయి. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా కేంద్రం వైఖరి ఉందని మండిపడ్డాయి.  ------- ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులతో మళ్లీ టెన్షన్లు పెరుగుతున్నాయి. స్టాక్ మార్కెట్లలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు.. తమ స్టాకులను అమ్ముకుంటూ లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఈరోజు మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,189 పాయింట్లు నష్టపోయి 55,822 వద్దకు పడిపోయింది. నిఫ్టీ 371 పాయింట్లు కోల్పోయి 16,614కి దిగజారింది. ----- యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియా జట్టు వరుసగా రెండో టెస్టులోనూ ఘనవిజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్ ను 275 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. 468 పరుగుల టార్గెట్ ను ఛేదించడానికి బరిలో దిగిన ఇంగ్లండ్ 192 పరుగులకు ఆలౌటైంది. క్రిస్ వోక్స్ అత్యధికంగా 44 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో జై రిచర్డ్సన్ 5 వికెట్లు, మిచెల్ స్టార్క్ 2, నాథన్ లైయన్ 2 వికెట్లు చేజిక్కించుకున్నారు.

మ‌ద్యం ధ‌ర‌ల‌పై మాట త‌ప్పి, మడ‌మ తిప్పింది అందుకేనా?

పీకే టీమ్ వ‌చ్చింది. స‌ర్వేల‌తో రంగంలోకి దిగింది. అందుకే, జ‌గ‌న్‌రెడ్డి నిర్ణ‌యాల్లో మార్పు క‌నిపిస్తోంది. మోనార్క్‌లా, దూకుడుగా, దోచుకోవ‌డ‌మే పాల‌న‌లా.. రెండున్న‌రేళ్లు ప్ర‌జ‌ల‌కు చుక్క‌లు చూపించిన ముఖ్య‌మంత్రి.. తాజాగా, త‌న‌కు అనుకూలంగా మాట త‌ప్పుతున్నారు.. త‌న‌కు లాభం జ‌రిగేలా మ‌డ‌మ తిప్పుతున్నారు.. అని అంటున్నారు. జ‌గ‌న్‌లో ఈ మార్పుకు కార‌ణం ప్ర‌శాంత్ కిశోరే అని టాక్‌.  మూడు రాజ‌ధానుల బిల్లును జ‌గ‌న్ ప్ర‌భుత్వం ర‌ద్దు చేయ‌డం వ్యూహాత్మ‌కం. కోర్టుల్లో టెక్నిక‌ల్‌గా నిల‌బ‌డే ఛాన్స్ లేక‌పోవ‌డంతో.. వెన‌క్కి త‌గ్గాల్సి వ‌చ్చింది. అంత‌లోనే మ‌ద్యం ధ‌ర‌లు త‌గ్గిస్తూ.. మందు బాబుల మ‌త్తంతా దిగిపోయేలా వారికి గుడ్ న్యూస్ చెప్పారు. మ‌హిళ‌ల‌కు మాత్రం ఇది షాకింగ్ న్యూస్. ధ‌ర‌ల త‌గ్గింపుతో.. ఇక మ‌ద్యపాన నిషేధం హామీ అట‌కెక్కించిన‌ట్టేన‌ని అధికారికంగా చెప్పిన‌ట్టే. లిక్క‌ర్ విష‌యంలో జ‌గ‌న్‌లో ఇంత‌టి మార్పు ఎవ‌రూ ఊహించ‌లేదు. పీకే టీమ్ ఫీడ్ బ్యాక్ వ‌ల్లే.. జ‌గ‌న్ ఇలా మాట త‌ప్పి.. మ‌డ‌మ తిప్పి.. మ‌ద్యం ధ‌ర‌లు త‌గ్గించార‌ని అంటున్నారు.  పెంచ‌డమే కానీ త‌గ్గించ‌డం త‌న డిక్ష‌న‌రీలోనే లేని జ‌గ‌న్‌.. అందులోనూ భారీగా ఆదాయం వ‌స్తున్న‌.. అప్పుల‌కు ఊతం ఇస్తున్న‌ మ‌ద్యం ధ‌ర‌లు త‌గ్గించ‌డం మామూలు విష‌యం కానే కాదు. మ‌రీ అంత‌లా పీకే టీమ్ జ‌గ‌న్‌ను ఎలా ఒప్పించిగ‌లిగింది? స‌డెన్‌గా ధ‌ర‌లు త‌గ్గించడానికి కార‌ణ‌మేంటి? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్‌. ఏపీలో జ‌గ‌న్‌ను విమ‌ర్శించే గొంతుక‌లు కోట్ల‌ల్లోనే ఉంటాయి. వారందరిలోకెల్లా మందుబాబులు తిట్టిపోసేంత‌గా మ‌రెవ‌రూ తిట్టుండ‌రు. పెగ్గు పెగ్గుకీ జ‌గ‌న్‌కు శాప‌నార్థాలు పెడుతున్నారు. ఊరూపేరూలేని బ్రాండ్ల మ‌ద్యం తాగ‌లేక‌.. జేబులు లూటీ చేసే ధ‌ర‌లు చెల్లించ‌లేక‌.. మద్యం ప్రియులంతా.. బొట్టు బొట్టుకీ.. తిట్ల దండ‌కం అందుకుంటున్నారు. మద్యం తాగే వారిలో రోజుకూలీలే అత్యధిక మంది ఉంటారు. వారంతా సీఎం జగన్ ను మద్యం దుకాణాల ద‌గ్గ‌ర‌ బండబూతులు తిడుతుంటారు. ఏపీలో ఏ చోటికి వెళ్లినా ఈ సీన్ కామ‌న్‌.  జేబుల‌కు చిల్లు పెట్టే.. ఆరోగ్యం గుల్ల చేసే.. మ‌ద్యం పాల‌సీపై ప్ర‌జ‌ల్లో ఎంత వ్య‌తిరేక‌త ఉందో ఐ-ప్యాక్‌ టీమ్ స‌ర్వేలో తేలిందని తెలుస్తోంది. ఆ దారుణ‌మైన‌ ఫీడ్ బ్యాక్ జ‌గ‌న్ ముందు ఉంచి.. అత్య‌వ‌స‌రంగా మ‌ద్యం ధ‌ర‌ల‌ను స‌వ‌రించాల్సిందేన‌ని తేల్చి చెప్పార‌ని అంటున్నారు. పీకే బృందంపై ఎంతో న‌మ్మ‌కం ఉంచే జ‌గ‌న్‌.. వారు చెప్పిన‌ట్టు చేయ‌క త‌ప్ప‌లేద‌ని చెబుతున్నారు. అందుకే, ఇన్నాళ్లూ దోచుకున్నాక‌.. తాజాగా ప్ర‌భుత్వానికి బంగారు బాతులాంటి మ‌ద్యం ధ‌ర‌ల్లో కాస్త వెసులుబాటు క‌ల్పించార‌ని టాక్‌. పీకే టీమ్ సూచ‌న‌ల‌తో.. త్వ‌ర‌లో మ‌రిన్ని నిర్ణ‌యాల్లోనూ జ‌గ‌న‌న్న‌ మ‌డ‌మ తిప్ప‌డం ఖాయ‌మంటున్నారు. 

పీవీ రమేష్ అరెస్టుకు ఏపీ పోలీసుల ప్రయత్నం! 

ఆంధ్రప్రదేశ్ లో జగన్   ప్రభుత్వానికి సలహాదారుగా పని చేసిన మాజీ ఐఏఎస్ అధికారిని అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు విఫలయత్నం చేశారని తెలుస్తోంది., హైదరాబాద్‌లోని ఆయన ఇంటి వద్దకు దాదాపుగా ఇరవై మంది వరకూ పోలీసులు వచ్చారట. కానీ ఆయన ఇంట్లో లేకపోవడంతో అరెస్ట్ చేయలేకపోయారని చెబుతున్నారు. ఏపీ పోలీసులు  రావడంతో పీవీ రమేష్  కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారని అంటున్నారు. పీవీ రమేష్ ను ఏపీ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారో తమకు తెలియడం లేదని చెబుతున్నారు.  పీవీ రమేష్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహిత ఐఏఎస్ అధికారిగా గుర్తింపు పొందారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు నిమ్స్ బాధ్యతలు సహా అత్యంత కీలకమైన పదవుల్లో ఆయన పని చేశారు . తర్వాత ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రత్యేకంగా రాష్ట్ర సర్వీసుకు తీసుకు వచ్చారు. కీలక బాధ్యతలు ఇచ్చారు. రిటైరైన వెంటనే ఆయనను సలహాదారుగా నియమించారు జగన్ రెడ్డి. మధ్యలో ఏం జరిగిందో కానీ ఆయనను అవమానకరంగా బయటకు పంపేశారు. అప్పట్నుంచి పీవీ రమేష్ సైలెంట్‌గా ఉన్నారు.సోషల్ మీడియాలో కొన్ని ట్వీట్లు చేస్తూంటారు పీవీ రమేష్. అయితే నేరుగా ఎవర్నీ ఉద్దేశించి కూడా ఆయన వ్యాఖ్యలు చేయరు. ఆయన చేసిన కొన్ని ట్వీట్లు జగన్ సర్కార్ కు ఇబ్బందిగా మారాయి.  పీవీ రమేష్ సోదరిని ప్రస్తుతం ఏపీ సీఐడీ చీఫ్‌గా ఉన్న సునీల్ కుమార్ వివాహం చేసుకున్నారు. అయితే ఆయనపై గృహ హింస కేసును ఆమె నమోదు చేసింది. ఆ వివాదం ఉంది. ఈ క్రమంలో పీవీ రమేష్ అరెస్టుకు ఏపీ పోలీసులు ప్రయత్నాలు చేయడం సంచలనంగా మారింది. అసలు ఆయనపై నమోదైన కేసేంటి..? చట్ట బద్దంగా నోటీసులు కూడా ఇవ్వకుండా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు..? లాంటి అంశాలపై స్పష్టత లేదు. పీవీ రమేష్ ఈ అంశంపై స్పందిస్తేనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.    

త‌గ్గేదే లే.. రెబెల్స్‌కు రోజా వార్నింగ్‌...

ఎవరెన్ని కష్టాలు పెట్టినా.. నియోజకవర్గంలో అణగతొక్కాలని చూసినా.. అవమానాలు చేసినా.. జగనన్న మీద అభిమానంతో జగన్ అడుగుజాడల్లో ముందుకు వెళ్తున్నానంటూ ఎమ్మెల్యే రోజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రోజా ఎవ‌రిని ఉద్దేశించి ఈ కామెంట్లు చేశారో న‌గ‌రిలో అంద‌రికీ తెలుసు. ఎమ్మెల్యే రోజా వ‌ర్సెస్ మంత్రి పెద్దిరెడ్డి.. ఎమ్మెల్యే రోజా వ‌ర్సెస్ డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామిల వైరం రాష్ట్రంలో అంద‌రికీ తెలిసిందే. తాజాగా, మంగ‌ళ‌వారం జ‌గ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నేతల మధ్య కుమ్మలాటలు మరోసారి బయటపడ్డాయి. పుత్తూరులో వైసీపీకి చెందిన రెబల్స్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అది త‌ట్టుకోలేని కొందరు.. ఆ ఫ్లెక్సీలను చించివేశారు. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు చించివేయడంతో కలకలం రేగింది. ఫ్లెక్సీలు డ్యామేజ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ రెబల్స్ డీఎస్సీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.  అంత‌కుముందు.. న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలోని నాలుగు మండ‌లాల‌కు చెందిన కీల‌క నాయ‌కులు స‌మావేశ‌మై వ‌చ్చే ఎన్నిక‌ల్లో రోజాను గెలిపించేది లేద‌ని తీర్మానించారు. అస‌లు ఆమెకు ఎమ్మెల్యే టికెటే ఇవ్వొద్ద‌ని జ‌గ‌న్‌కు సూచించారు. ఇలా త‌న‌కు వ్య‌తిరేకంగా పావులు క‌దుపుతున్న నాయ‌కుల‌కు.. పెద్దిరెడ్డి, నారాయ‌ణ స్వామిల స‌పోర్ట్ ఉంద‌నేది రోజా అనుమానం. అందుకే, ఎవ‌రెన్ని క‌ష్టాలు పెట్టినా.. త‌న‌ను అణ‌గ‌దొక్కాల‌ని చూసినా.. అవ‌మానించినా.. జ‌గ‌నన్న అభిమానంతో త‌గ్గేదే లే అంటూ స‌వాల్ చేస్తున్నారు న‌గ‌రి ఎమ్మెల్యే రోజారెడ్డి.

ఆర్టీసీ ఉద్యోగుల పీఎఫ్ ఫండ్స్  కూడా హాంఫట్ 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కన్ను ఆర్టీసీ ఉద్యోగులు దాచుకున్న భవిష్య నిధి (పీఎఫ్) ఫై పడింది. ఒకసారి ప్రభుత్వం కన్నుపడింది అంటే ఇంకేముంది, అంతే సంగతులు. అందుకు నడుస్తున్న చరిత్రే సాక్ష్యం. అందుకే కావచ్చు, ఆర్టీసీ పీఫ్ ఖాతాలోని రూ.1600 కోట్లను, ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీస్‌ కార్పొరేషన్‌లో డిపాజిట్‌ చేయాలని ప్రభుత్వం కోరినా ఆర్టీసీ యాజమాన్యం నడుకు అందుకు అంగీకరించ లేదని సమాచారం.  నిజానికి, ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల నిదులను సర్కార్ ఖాతాలో వేసుకునే కత్తిరింపు కార్యక్రమం  ఒక్క ఎపీఎస్ ఆర్టీసీకి పరిమితం అయిన కార్యక్రమం కాదు, ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థల డిపాజిట్లు ఏ బ్యాంకులో ఉన్నా, తక్షణం  స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌లో డిపాజిట్‌ చేయాలని ఎప్పుడోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రక్రియలో భాగంగా  ఇప్పుడు ఎపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల ఖాతా మీద సర్కార్ నజర్ పడినట్లు తెలుస్తోంది. అయితే, పీఎఫ్ నిధులను దారి మళ్లించడం కుదరదని, కేంద్ర ప్రభుత్వానికి చెందిన కొన్ని నిర్దేశిత పథకాలు, సంస్థల్లో మాత్రమే వీటిని పెట్టుబడులు పెట్టాలని, వాటిలోనే డిపాజిట్‌ చేయాల్సి ఉంటుందని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొన్నట్లు సమాచారం. వీటికి లాక్‌ పీరియడ్‌ ఉంటుందని, మధ్యలో తీసేందుకు వీలుండదని యాజమాన్యం  స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.  కానీ, రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు, ఎఫ్ఆర్బీఎం నిబంధనలనే మార్చేసిన, జగన్ రెడ్డి ప్రభుత్వానికి, ఎపీఎస్ ఆర్టీసీ పీఫ్ ఖాతా నిబంధనలను పక్కకు నేట్టేయడం పెద్ద పనా? అని ప్రభుత్వ అధికారులే ప్రశ్నిస్తున్నారు. పాటించే వారికి నిబంధనలు కానీ, పక్కన పెట్టే వారిని నిబంధనలు ఏమిచేస్తాయని, అంటున్నారు.  ఉద్యోగుల పీఎఫ్‌ను సొంతంగా నిర్వహించుకునేందుకు వీలుగా ట్రస్టు ఏర్పాటుకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) గతంలో మినహాయింపు ఇచ్చింది. ఉద్యోగుల మూల వేతనం, కరవు భత్యం (బేసిక్‌, డీఏ) నుంచి 12 శాతం ప్రతి నెలా రికవరీ చేస్తారు. అంతే మొత్తాన్ని యాజమాన్యం (ప్రస్తుతం ప్రభుత్వం) వాటాగా ఇస్తుంది. యాజమాన్య వాటా నుంచి కొంత మొత్తాన్ని ఈపీఎఫ్‌-95 పింఛను పథకం కోసం ఈపీఎఫ్‌వోకు ఇస్తారు. మిగిలినదంతా ఆర్టీసీ పీఎఫ్‌ ట్రస్టులోనే ఉంటుంది. ఇలా ట్రస్టులో ప్రస్తుతం పద్దుల ప్రకారం దాదాపు రూ.2 వేల కోట్లు ఉండాలి. గతంలో ఆర్టీసీ యాజమాన్యం జీతాల సర్దుబాటు సమయంలో పీఎఫ్‌ వాటాను ట్రస్టుకు సకాలంలో జమ చేయలేదు. వీటిని ఆర్టీసీ వాడుకుంది. ఈ మొత్తం రూ.850 కోట్ల వరకు ఉంటుంది. ఇందులో కొంత కాలం కిందట ఆర్టీసీ రూ.450 కోట్లు ట్రస్టుకు జమ చేయగా, ఇంకా రూ.400 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన పీఎఫ్‌ ట్రస్టులో ప్రస్తుతం రూ.1,600 కోట్లు ఉన్నాయి. ఈ రూ.1,600కోట్లపైనే, ప్రభుత్వం కన్ను పడింది. ఆ మొత్తాని ఎదో ఓకే విధంగా స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌లో డిపాజిట్ చేయగలిగితే, ఇక ఆ తర్వాత కథ తర్వాత అన్నట్లుగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. అయితే, ఇలా ముందు వెనకా చూసుకోకుండా, పభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల నిధులను దారి మళ్లించడం వలన, భవిష్యత్ లో చాలా చాలా చిక్కు సమస్యలు ఎదుర్కోనవలసి వస్తుందని, అధికార వర్గాలు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. అయినా నిండా మునిగిన వరికి చలేమిటి?

మోకాళ్లపై కూర్చోపెట్టి క్షమాపణ.. జగన్ ఓడిపోతారన్న సుబ్బారావుపై మంత్రి అనుచరుల దాడి 

ఇలాగైతే జగన్ ఓడిపోవడం ఖాయం.. ఆ ముగ్గురు నేతల వల్ల పార్టీకి 20 శాతం ఓట్లు లాస్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఒంగోలు వైసీపీ నేత సుబ్బరావు గుప్తాపై దాడి జరిగింది. సొంత పార్టీ నేతలే ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఓ లాడ్జ్‌లో ఉన్న సుబ్బారావు ఆచూకీ కనిపెట్టి మరీ దౌర్జన్యం చేశారు. సుబ్బారావుపై దాడి చేసిన వ్యక్తిని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుచరుడు సుభానీగా గుర్తించారు. దాడి చేస్తున్న దృశ్యాల్ని వీడియో తీసి మరీ సుబ్బారావుకు వార్నింగ్ ఇచ్చింది సుభానీ గ్యాంగ్. బాలినేనికి క్షమాపణ చెప్పాలంటూ గుప్తాను మోకాళ్లపై కూర్చోపెట్టి క్షమాపణ చెప్పించారు. సుబ్బారావుపై దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో  వైరల్ గా మారి సంచలనమయ్యాయి.  ఓ మంత్రి, ఎమ్మెల్యేల మాటలతో పార్టీకి నష్టం జరుగుతుందని ఇటీవల మంత్రి బాలినేని బర్త్ డే వేడుకల్లో మాట్లాడారు సుబ్బారావు. ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీలో ప్రకంపనలు రేపాయి. ఇది జీర్ణించుకోలనే వైసీపీ నేతలు సుబ్బారావు కోసం గాలించారు. దీంతో ఆయన ప్రాణభయంతో అదృశ్యమయ్యారు. సుబ్బారావు కోసం వెతుకుతున్న దుండగులు ఆదివారం రాత్రి ఆయన ఇంటిపై దాడి చేశారు. మద్యం మత్తులో ఉన్న 15 మంది లంబాడీడొంకలోని సుబ్బారావు గుప్తా ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన ఇంటి వద్దలేరు. దుండగులు ఇంట్లోకి ప్రవేశించి కుటుంబ సభ్యులను బెదిరించారు. ఇంటి బయట ఉన్న ఆయన ద్విచక్రవాహనాన్ని తగలబెట్టారు.  ఈ నెల 12న ఒంగోలులో మంత్రి బాలినేని జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత సోమిశెట్టి సుబ్బారావు సొంతపార్టీ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ కారణంగా పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. వారు అసలు వైసీపీకి హితులో, శత్రువులో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి వల్ల పార్టీకి 20 శాతం ఓట్లు పోయే ప్రమాదం ఉందన్నారు. వారి కారణంగా పార్టీకి తీరని నష్టం జరిగే అవకాశం ఉందని, ఈసారి టీడీపీ అధికారంలో వస్తే కర్రలతో వెంబడించి కొడతారని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.  

జ‌గ‌న్‌ను ఢీ కొట్టాలంటే.. టీడీపీ మారాల్సిందేనా? నేత‌ల్లో మార్పు రావాలా?

20 ఏళ్ల క్రితం చంద్ర‌బాబు ఇమేజ్ ఎలా ఉందో.. ఇప్పుడూ అలానే ఉంది. అస‌లేమాత్రం చెక్కు చెద‌ర‌లేదు. వీస‌మెత్తు కూడా త‌గ్గ‌నే లేదు. ఇంకా స్ప‌ష్టంగా చెప్పాలంటే.. హైద‌రాబాద్ న‌వ నిర్మాత‌గా ఎంత పేరుగాంచారో.. న‌వ్యాంధ్ర తొలి ముఖ్య‌మంత్రిగా అంత‌కంటే ఎక్కువే పాపులారిటీ వ‌చ్చింది. అమ‌రావ‌తి రూప‌శిల్పిగా, స‌న్‌రైజ్ స్టేట్ రూప‌క‌ర్త‌గా మ‌రింత ఉన్న‌తంగా నిలిచారు. అంతా బాగుండి.. మ‌రి, 2019 ఎన్నిక‌ల్లో ఏం జ‌రిగింది? టీడీపీ ఎందుకంత ఘోరంగా ఓడిపోయింది? అంటే.. చంద్ర‌బాబుపై వ్య‌తిరేక‌త‌తో కాదు.. జ‌గ‌న్ అర‌చేతిలో చూపించిన అత్యాశ‌తో రాష్ట్ర భ‌విష్య‌త్తు అంథఃకార‌మ‌యంగా మారిందంటున్నారు. స‌న్‌సెట్‌ స్టేట్‌గా మారిన ఏపీలో మ‌ళ్లీ స‌న్ రైజ్ కావాలంటే.. జ‌గ‌న్ పోవాలి.. చంద్ర‌బాబు రావాలి.. అంటున్నారు.  అలా జ‌ర‌గాలంటే ముందు టీడీపీ మారాలి. పార్టీ నాయ‌కుల్లో మార్పు రావాలి. సో కాల్డ్ సీనియ‌ర్స్‌ను నెత్తిన‌పెట్టుకోవ‌డం కాకుండా.. స‌మ‌ర్థులైన న‌వ త‌రంగాన్ని టీడీపీలో ప్రోత్స‌హించాలి. కొత్త అనే ఏకైక కార‌ణంతో.. స‌త్తా ఉన్న నాయ‌కుల‌ను ప‌క్క‌న‌పెట్టేయ‌కుండా.. ప్ర‌జ‌ల కోసం ప‌ని చేస్తార‌నే న‌మ్మ‌కం.. క‌ష్ట‌కాలంలో పార్టీకి క‌ట్టుబ‌డి ఉండే నాయ‌క గ‌ణాన్ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. లేదంటే, మోనార్క్‌లాంటి జ‌గ‌న్‌ను.. పస‌లేని నాయ‌కుల‌తో నెగ్గుకురావ‌డం క‌ష్టం..అంటున్నారు తెలుగు త‌మ్ముళ్లు.  టీడీపీలో మార్పు రావాల‌ని చెప్ప‌డానికి అనేక ఉద‌హార‌ణ‌లు. గ‌ద్దె నెక్కిన‌ప్ప‌టి నుంచీ ప‌సుపు ద‌ళాన్నే టార్గెట్ చేస్తూ.. కేసులు, కుట్ర‌లు, దాడుల‌తో భ‌యోత్పాతం సృష్టిస్తున్న అధికార పార్టీ దారుణాల‌కు ఎదురొడ్డి పోరాడుతున్న‌ది కొంద‌రే. అచ్చెంన్నాయుడు, అయ్య‌న్న‌పాత్రుడు, కూన ర‌వికుమార్‌, చింత‌మ‌నేని, య‌ర‌ప‌తినేని, ప‌రిటాల‌, జేసీ, కొల్లు ర‌వీంద్ర‌, ధూళిపాళ్ల‌, దేవినేని, ప‌ట్టాభి, బోండా ఉమా, బుద్దా వెంక‌న్న లాంటి ఓ ప‌ది మంది నాయ‌కులు మాత్ర‌మే పోరాడే సాహ‌సం చేస్తున్నారు. మ‌రి, టీడీపీ అంటే ఈ ప‌దిమందేనా? మిగ‌తా నేత‌లంతా ఎక్క‌డ దాగున్నారు? అధికారంలో ఉన్న‌ప్పుడు ప‌ద‌వులు అనుభ‌వించిన గంటా, నారాయ‌ణ‌, క‌ళా, ప‌త్తిపాటి.. లాంటి సో కాల్డ్ టీడీపీ లీడ‌ర్లంతా ఇప్పుడు ఏ మూల‌న న‌క్కారు?  ఉర‌క‌లెత్తే ర‌క్తంతో ఉవ్వెత్తున పోరాటం చేయాల్సిన టీడీపీ యంగ్ త‌రంగ్ సైతం.. చేష్టలుడిగి.. చేవచచ్చి.. తమ స్వార్థమే చూసుకుంటోంది. నారా లోకేశ్, పరిటాల శ్రీరాం, రామ్మోహన్ నాయుడు.. లాంటి ఓ ముగ్గురు, న‌లుగురు యువ నాయ‌కులు మాత్ర‌మే జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వంపై అలుపెర‌గ‌కుండా పోరాడుతున్నారు. మ‌రి, మిగ‌తా యంగ్ ట‌ర్క్స్ అంతా ఎక్క‌డ రెస్ట్ తీసుకుంటున్నారు?  బ‌రితెగించి బూతులు, దాడుల‌తో అడ్డ‌గోలు అరాచ‌క రాజ‌కీయాలు చేస్తున్న వైసీపీని ఢీకొట్టాలంటే.. టీడీపీలో మార్పు రావాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఆ మార్పు నాయ‌కుల‌తోనే సాధ్యం. కేవ‌లం పాత‌, సీనియారిటీ ప్రాతిప‌దిక‌నే కాకుండా.. ప‌నికొచ్చే, పార్టీకి క‌ట్టుబ‌డి ఉండే.. అనే లైన్ మీద కొత్త నాయ‌కుల‌ను ఎంక‌రేజ్ చేయాల్సిందే. అంతా క‌లిసి స‌మిష్టిగా, మ‌రింత దూకుడుగా పాలిటిక్స్ చేయాల్సిందే. అలా జ‌ర‌గాలంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌రెడ్డికి ఝ‌ల‌క్ ఇవ్వాలంటే.. టీడీపీ అధినేత మ‌రింత క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోవాల్సిందే. ప్ర‌స్తుతం జ‌గ‌న్ పాల‌న‌పై వెల్లువెత్తుతున్న ప్ర‌జాగ్ర‌హాన్ని.. ప‌దునైన ఆయుధంగా మార్చుకోవాలంటే.. నాయ‌కుల‌కు మ‌రింత ప‌దును పెట్టాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. టీడీపీ కార్య‌క‌ర్త‌ల క‌ర్మాగారం అంటారు. అభిమానుల‌కు, అనుచ‌రుల‌కు కొద‌వ లేదు. కావ‌ల‌సిందంతా చంద్ర‌బాబు, లోకేశ్‌లా ముందుండి న‌డిపించే నాయ‌కులే. 

ఆయన మారరు.. మార్చ వలసిందే...

ఇంటికంటే గుడి పదిలం అంటారు. అదే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే, ప్రగతి భవన్ కంటే ఫామ్‌హౌస్‌ మేలని అంటారో లేదో కానీ, ఆయన ఫామ్‌హౌస్‌ (ఎర్ర‌వ‌ల్లి  వ్య‌వ‌సాయ క్షేత్రం)లో ఉండేదుకు ఎక్కువ ఇష్టపడతారని, ఆయన సన్నిహిత వర్గాల సమాచారం.  అంతే  కాదు, ముఖ్యమంత్రి కూడా ఒకటి  రెండు సందర్భాలలో వ్య‌వ‌సాయ క్షేత్రం ప్రస్తావన చేశారు. సరే, అది ఆయన ఎలా సంపాదించారు, ఎలా విస్తరించారు, కోటి రూపాయల ఆదాయం ఎలా వచ్చింది అనేది ప్రస్తుతానికి అప్రస్తుతం కాబట్టి పక్కన పెడితే, ముఖ్యమంత్రి  గ‌తేడాది డిసెంబ‌ర్ 13 నుంచి ఈ ఏడాది డిసెంబ‌ర్ 12 వ‌ర‌కూ, అంటే ఒక సంవత్సర కాలంలో 142 రోజుల పాటు ఎర్ర‌వ‌ల్లిలోని వ్య‌వ‌సాయ క్షేత్రంలోనే గ‌డిపారు. సహజంగా ముఖ్యమంత్రి , మంత్రులు, సచివాలయం నుంచి పరిపాలన సాగిస్తారు. కాదంటే, అత్యవసర విధులను అధికార నివాసం నుంచి నిర్వహిస్తారు. ప్రజలను, అధికారాలను ప్రత్యక్షంగా కలుస్తారు. సమస్యలు తెలుసు కుంటారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ప్రతి రోజు కొంత సమయం ప్రజలకు కేటాయించి, ప్రజా దర్బార్’లో ప్రజల సమస్యలు తెలుసుకుని, అత్యవసరం అనుకున్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేవారు. కానీ, కేసీఆర్ స్టైలే వేరు… ఇప్పుడే కాదు సచివాలయం కూల్చక ముందు కూడా అయన పెద్దగా,, సచివాలయం వైపు  కన్నెత్తి చూడలేదు. ప్రగతి భవన తయారైన తర్వాత అసలు సచివాలయం ఒకటుందనే మరిచి పోయారు. ఆ తర్వాత సచివాలంలో ముఖ్యమంత్రి కాలు పెట్టిన సందర్భం బహుశా లేదని చెప్ప వచ్చును. అంతేకాదు, నిన్నమొన్నటి దాకా, ముఖ్యమంత్రి దర్శనం సామాన్య ప్రజలకు మాత్రమే కాదు, మంత్రులకు కూడా దొరికేది దు. ఇదేమి రహస్యం కాదు, దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి చేయక పోవడం ఎంత నిజమో, ఇది కూడా అంతే నిజం. అయితే, హుజూరాబాద్ ఎపిసోడ్ తర్వాత ఈమధ్య కాలంలో కొద్దిగా మార్పు వచ్చిందని అంటున్నారు. కానీ, కడుపులో లేనిది కక్కుకుంటే వస్తుందా అన్నట్లు, ఆయన మొక్కుబడిగా మాత్రమే బయటకు వస్తున్నారు.  నిజానికి ముఖ్యమంత్రి వర్కింగ్ స్టైల్ విషయంలో, చాలా చాలా విమర్శలు వచ్చాయి. అయినా, అయన ఎప్పుడూ విమర్శలను అంతగా పట్టించుకోలేదు. సచివాలయానికి చుట్టపు చూపుగా అయినా రాని  ముఖ్యమంత్రి అని విపక్షాలు ఎద్దేవ చేసినా పట్టించుకోలేదు. అధికారుల అభ్యంతరాలను అయితే అసలే పట్టించుకోలేదు. సహజంగా ముఖ్యమంత్రి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు, సంబంధిత అధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధులతో క‌లిసి చర్చించి అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటారు. కానీ, కేసీఆర్ అందుకు విరుద్ధం. అందుకే, ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కే ప‌రిమిత‌మైన ఆయ‌న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ఏం తెలుసుకుంటార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఫామ్‌హౌస్‌’కే, పరిమితమెయిన్ ముఖ్యమంత్రి   ఇక పాల‌న ఎలా చేస్తారంటూ,పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పలు సందర్భాలలో కదిగి పారేశారు. ఇతర విప‌క్షాలు ఆయ‌న‌పై మాట‌ల దాడి కొన‌సాగిస్తూనే ఉన్నాయి. కానీ కేసీఆర్‌.. నేనేను నేనే, అన్నట్లుగా  త‌న పంథాను మార్చుకోవ‌డం లేద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.కొన్ని కొన్ని సందర్భాలలో నెలలో సగం రోజులకంటే ఎక్కువ ఫామ్‌హౌస్‌’లోనే ఉంటున్నారు. గ‌తేడాది జూన్‌లో 18 రోజులు, జ‌న‌వ‌రిలో 17 రోజులు ఇలా ఫామ్‌హౌస్‌కే ఆయ‌న ప‌రిమిత‌మ‌య్యారు. ఇలా ముఖ్యమంత్రి ఫామ్‌హౌస్‌’కే పరిమితం అయితే, పరిపాలన పరంగానే, కాకుండా ప్రజలకు కూడా  ఇబ్బందులు త‌లెత్తుతున్నాయ‌ని విప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. అయినా ఆయన దారి ఆయనదే., ఆయనంతే ఆయనంతట ఆయన మారరు .. జనం మార్చ వలసిందే.

అసెంబ్లీ ఘ‌ట‌న‌పై భువ‌నేశ్వ‌రి వార్నింగ్‌.. వైసీపీకి సిగ్గు సిగ్గు..

ఆడ పిల్ల‌లంటే ఆట వ‌స్తువులు కాదు.. స్త్రీల‌ను గౌర‌వించాలి.. ఏ మ‌హిళ‌నూ అలా అవ‌మానించ‌కూడ‌దంటూ చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి ప‌రోక్షంగా వైపీసీ నాయ‌కుల‌కు చెంప‌పెట్టులాంటి హెచ్చరిక చేశారు. అసెంబ్లీలో భువ‌నేశ్వ‌రిపై అధికార పార్టీ నేత‌లు చేసిన అసంబ‌ద్ధ వ్యాఖ్య‌ల‌పై ఆమె మొద‌టిసారి స్పందించారు. చాలా హుందాగా.. ఉన్న‌తంగా.. రియాక్ట్ అయ్యారు.   వైసీపీ నేతల విమర్శలను పట్టించుకోన‌ని.. తాను బాధ పడటం లేద‌ని నారా భువ‌నేశ్వ‌రి అన్నారు. పనిలేక మాపై విమర్శలు చేస్తున్నారు.. సమాజానికి ఉపయోగం లేని విమర్శ‌లెందుకు? ఆ వ్య‌వ‌హారాన్ని ప‌ట్టించుకోన‌వ‌స‌రం లేదు.. తాను మాత్రం ఎప్ప‌టిలానే ప్రజాసేవకే అంకితమవుతాన‌ని.. చిరున‌వ్వుతో చెప్పారు భువ‌నేశ్వ‌రి. సీత‌లాంటి భువ‌నేశ్వ‌రిపై నిండు స‌భ‌లో అడ్డ‌గోలు ఆరోప‌ణ‌లు చేసిన వైసీపీ మూక‌లు.. ఇప్పుడు భువ‌నేశ్వ‌రి స్పంద‌న చూసి సిగ్గుప‌డాల‌ని అంటున్నారు. ఇంతటి ఉత్త‌మరాలిపైనా తాము అలా నోటికొచ్చిన‌ట్టు వాగింది అని చెంప‌లేసుకోవాల‌ని చెబుతున్నారు. త‌న‌పై అలా కారుకూత‌లు కూసినా.. ఆమె మాత్రం న‌వ్వుతూ.. త‌న‌పై చేసిన‌ విమ‌ర్శ‌ల‌ను సుతిమెత్త‌గా తీసిపారేశారు. ప్ర‌జా సేవ‌పైనే త‌న చిత్త‌శుద్ధి అని మ‌రోసారి తేల్చి చెప్పారు. భువ‌నేశ్వ‌రి మాటల్లో మెచ్యూరిటీ చూసైనా.. బూతులు మాట్లాడే వైసీపీ నేత‌లు నోటికి తాళాలు వేసుకొని.. ముక్కు నేల‌కు రాసి.. ఆమెకు బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని రాష్ట్ర ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్నారు. 

ప్ర‌భుత్వ వైఫ‌ల్యంతో వ‌ర‌ద న‌ష్టం!.. ఎన్టీఆర్ ట్రస్ట్ 48 లక్షలు సాయం..

రాయ‌ల‌సీమ‌ను వ‌ర్షాలు ముంచెత్తాయి. పైనుంచి వ‌ర‌ద వెల్లువెత్తినా.. ప్రాజెక్టు గేట్లు ఎత్త‌డంలో అధికారుల నిర్ల‌క్ష్యం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించింది. ఫ‌లితం.. అన్న‌మ‌య్య‌, పింఛా ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. వ‌ర‌ద కింద‌కు పోటెత్తి.. ఊళ్ల‌కు ఊళ్ల‌ను తుడిచిపెట్టేసింది. గ్రామాలు చెరువుల‌య్యాయి. ఏకంగా ఆర్టీసీ బ‌స్సే వ‌ర‌ద పాలైంది. అనేక మంది మృత్యువాత ప‌డ్డారు. తీర‌ని ప్రాణ న‌ష్టం.. అంత‌కు మించి ఆస్థి న‌ష్టం.  వ‌ర‌ద విప‌త్తుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు చ‌లించిపోయారు. వెంట‌నే వ‌ర‌ద బాధిత ప్రాంతాల్లో వాలిపోయారు. హెలికాప్ట‌ర్‌లో పైపైన చ‌క్క‌ర్లు కొట్టి.. సెల్ఫీలు దిగి వెళ్లిపోలేదు. చంద్ర‌బాబు వ‌ర‌ద న‌ష్టాన్ని ప్ర‌త్య‌క్షంగా ప‌రిశీలించారు. బాధిత కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించారు. ఆదుకుంటామ‌ని భ‌రోసా ఇచ్చారు. మృతుల కుటుంబాల‌కు ఎన్టీఆర్ ట్ర‌స్ట్ త‌ర‌ఫున ల‌క్ష రూపాయ‌లు ప‌రిహారం ప్ర‌క‌టించారు. తెలుగు త‌మ్ముళ్లు సైతం ఎక్క‌డిక‌క్క‌డ వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌ల్లో విస్తృతంగా పాల్గొన్నారు.  మాట త‌ప్ప‌కుండా.. మ‌డ‌మ తిప్ప‌కుండా.. ఇచ్చిన మాట ప్ర‌కారం చంద్ర‌బాబు.. ఎన్టీఆర్ ట్రస్ట్ త‌ర‌ఫున వ‌ర‌ద బాధిత కుటుంబాల‌కు ఆర్థిక సాయం అందించారు. ల‌క్ష రూపాయ‌ల‌ చెక్‌లు పంపిణీ చేశారు. తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో రూ. 48 లక్షలను మృతుల కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్‌పర్సన్ నారా భువనేశ్వరి చెక్‌లు పంపిణీ చేశారు. అసెంబ్లీలో ఏ భువ‌నేశ్వ‌రి టార్గెట్‌గానైతే వైసీపీ నాయ‌కులు అసంబ‌ద్ధ వ్యాఖ్య‌లు చేశారో.. ఇప్పుడు ఆ భువ‌నేశ్వ‌రినే వైసీపీ పాల‌కుల వ‌ల్ల కుటుంబ స‌భ్యులను కోల్పోయిన వ‌ర‌ద‌ బాధితులకు ఆస‌రాగా నిలిచారు.  ఇంత‌టి ప్రాణ‌నష్టానికి కార‌ణం ప్ర‌భుత్వ వైఫ‌ల్య‌మే కార‌ణ‌మ‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. అధికారులు స‌కాలంలో గేట్లు పైకి ఎత్త‌క‌పోవ‌డం వ‌ల్లే ఇంత‌టి విప‌త్తు దాపురించింద‌ని అంటున్నారు. ఇసుల లారీల కోసం పాల‌కులు అధికారుల‌పై ఒత్తిడి తేవ‌డం వ‌ల్లే ఇంత‌టి దారుణం జ‌రిగింద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అలాంటిది.. విఫ‌లం చెందార‌ని విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న ప్ర‌భుత్వ‌మే.. చ‌నిపోయిన వారి కుటుంబ స‌భ్యుల‌కు 5 లక్షల చొప్పున పరిహారం అందించింది. ప్ర‌భుత్వ‌మే 5 ల‌క్ష‌లు ఇస్తే.. ఇక‌ స్వ‌చ్ఛంద సంస్థ అయిన ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ల‌క్ష ఇవ్వ‌డ‌మంటే మామూలు విష‌యం కాదంటున్నారు. వ‌ర‌ద సాయంలోనే కాదు.. గ‌తంలో క‌రోనా క‌ల్లోల స‌మ‌యంలోనూ ఎన్టీఆర్ ట్ర‌స్టు పెద్ద ఎత్తున సాయం చేసి.. ప్ర‌జ‌ల అభిమానం చూర‌గొంది. ద‌శాబ్దాలుగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఇలా ప్ర‌జా సేవ‌లో నిమ‌గ్న‌మై ఉంది. 

అంతొద్దు.. ప్లకార్డులు పట్టుకోండి చాలు! వైసీపీ ఎంపీలపై పవన్ సెటైర్లు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై వైసీపీ ఎంపీల చేతగాని తనాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ప్రాణ త్యాగాలు చేసి అయినా అడ్డుకుంటామని గతంలో వైసీపీ ఎంపీలు చెప్పిన గాలి మాటల్ని ఆయన జనసేన ట్విట్టర్ హ్యాండిల్లో ప్రస్తావిస్తూ.. ‘అంతటి త్యాగాలు అక్కర్లేదు. కనీసం ప్లకార్డులు పట్టుకోండి చాలు’ అంటూ హితవు పలికారు. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో వైసీపీ నేతలు ‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ప్రాణ త్యాగాలు చేసైనా సరే అడ్డుకుంటాం’ అని చెప్పారు. అయితే.. వైసీపీ ఎంపీలు ఈ విషయంపై పార్లమెంటులో కనీసం ప్లకార్డులు కూడా పట్టుకోవడం లేదని పవన్ కళ్యాణ్ విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా ఈ నెల 18,19, 20 తేదీల్లో డిజిటల్ ఉద్యమం నిర్వహించాలని జనసేన నేతలు, శ్రేణులకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జనసేన పార్టీ నేతలు, వీర మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున డిజిటల్ ఉద్యమం నిర్వహిస్తున్నారు. ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ ప్లకార్డులు పట్టుకుని వారంతా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే వైసీపీ ఎంపీలు గళం వినిపించాలని డిమాండ్ చేస్తున్నారు.

రోడ్లపై కార్యకర్తలు.. కనిపించని కేసీఆర్ ఫ్యామిలీ! ఇదేం డ్రామా గురూ..

వరి విషయంలో కేంద్రంతో పోరాటంలో తగ్గేదే లే అంటున్నారు సీఎం కేసీఆర్. మోడీ సర్కార్ తో తాడోపేడో తేల్చుకుంటామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. కాని  క్షేత్రస్థాయిలో అంత సీన్ కనిపించడం లేదు. దీంతో కేంద్రంతో కేసీఆర్ పోరాటం  మాటల వరకే పరిమితం అనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా జరుగుతున్న పరిణామాలు అందుకు బలాన్నిస్తున్నాయి. వరి విషయంలో లేటెస్ట్‌గా హ‌స్తిన‌కు మంత్రుల బృందాన్ని పంపించారు కేసీఆర్. రాష్ట్రంలోనూ చావు డప్పు పేరుతో నిరసనలకు పిలుపిచ్చారు. కాని ఈ కార్యక్రమాల్లో ఎక్కడా కేసీఆర్ కుటుంబం కనిపించడం లేదు. ఇదే ఇప్పుడు చర్చగా మారింది.  వ‌రి పంట కొనుగోలు విష‌యంలో కేంద్రంతో మాట్లాడేందుకు మంత్రుల బృందం సోమవారం ఢిల్లీ వెళ్లింది. అయితే ఆ బృందంలో కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హ‌రీశ్‌రావు కానీ లేరు. తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుంటారు కేటీఆర్. ముఖ్యమంత్రి చేయాల్సిన ప్రకటనలు, ప్రారంభోత్సవాలు కూడా ఆయన చేసేస్తుంటారు. కాని తెలంగాణలో ప్రస్తుతం అత్యంత కీలకంగా మారిన వరి విషయంలో కేంద్రంతో మాట్లాడేందుకు వెళ్లిన మంత్రుల బృందంలో మాత్రం ఆయన లేరు. ప‌దే ప‌దే ట్విట్ట‌ర్‌లో కామెంట్లు పెట్టే కేటీఆర్.. రైతుల కోసం ఢిల్లీ వెళ్లొచ్చుగా? ఆర్థిక మంత్రిగా ఉన్న హ‌రీశ్‌రావు హ‌స్తిన‌కు వెళితే త‌ప్పేంటి?  కారు పార్టీకి ట్ర‌బుల్ షూట‌ర్‌గా ఉన్న హ‌రీశ్‌.. రైతుల ట్ర‌బుల్స్ తీర్చేందుకు ఢిల్లీ వెళ్లి త‌న టాలెంట్ ఏంటో చూపించాలిగా? అని జనాలు ప్ర‌శ్నిస్తున్నారు.   ఇక  సీఎం కేసీఆర్ తీరు మ‌రింత దారుణం. వ‌రి మీద యుద్ధం అన్నారు.. కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామంటూ స‌వాల్ చేశారు. ఇందిరా పార్క్ లో ఏకంగా ధర్నా కూడా చేశారు. తర్వాత ఢిల్లీకి వెళ్లారు. నాలుగు రోజులు ఢిల్లీలోనే ఉన్నారు. కాని ఏమైనా చేశారంటే.. ఏమీ చేయ‌లేదు. ఒక్క మంత్రిని కూడా క‌ల‌వ‌లేదు. కేసీఆర్ భార్య శోభ‌ను ఆసుప‌త్రిలో చూపించ‌డానికి కొడుకు కేటీఆర్‌, కూతురు క‌వితను వెంటేసుకుని వెళ్లారు. అక్క‌డ ప్ర‌శాంత్ కిషోర్‌తో చ‌ర్చ‌లు జ‌రిపార‌ని అంటారు. ఢిల్లీ వెళ్లింది త‌న ప‌ర్స‌న‌ల్ ప‌నుల‌ మీద అయితే.. బ‌య‌ట‌కు చెప్పింది మాత్రం రైతుల త‌ర‌ఫున‌ కేంద్రాన్ని నిల‌దీయ‌డానికంటూ అస‌త్య ప్ర‌చారం చేశారు. ఇప్పుడు మ‌రోసారి అలానే.. న‌లుగురు మంత్రుల‌ను ఢిల్లీకి పంపించి.. రైతు డ్రామా ర‌క్తి క‌ట్టిస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు.  ఢిల్లీలో గొంతెత్త‌ని కేసీఆర్‌.. హైద‌రాబాద్‌కు తిరుగొచ్చి మాత్రం బీజేపీ నేత‌ల‌పై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డుతున్నారు. కేంద్రమంత్రి కిష‌న్‌రెడ్డిని, బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌ను నోటికొచ్చిన‌ట్టు తిడుతున్నారు. ఆయ‌న మాట‌ల‌ను బ‌ట్టి.. కేసీఆర్ బాగా ఫ్ర‌స్టేష‌న్‌లో ఉన్నార‌ని ఇట్టే తెలిసిపోతోంది. బీజేపీ నేత‌ల నుంచీ గ‌ట్టిగానే కౌంట‌ర్లు ప‌డుతుండ‌టం.. కేంద్రం ఎంత కొంటున్న‌ది.. రాష్ట్రం టార్గెట్ మేర అమ్మ‌లేక‌పోతున్న‌ది.. అంతా పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రించే స‌రికి కేసీఆర్ డిఫెన్స్‌లో ప‌డిపోతున్నారు. ఆ వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు.. బీజేపీనే దోషిగా చూపించేందుకు.. తాజాగా ' చావుడ‌ప్పు' పేరుతో గ్రామాల్లో నిర‌స‌న కార్య‌క్ర‌మాలకు పిలుపునిచ్చారు కేసీఆర్‌. ఇక్కడ మరో అంశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ కార్యకర్తలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తుంటే.. కేసీఆర్ మాత్రం ప్రగతి భవన్ కే పరిమితమయ్యారు. గతంలో ఇందిరా పార్క్ లో ధర్నా చేసిన కేసీఆర్.. ఇప్పుడు చావుడప్పు కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేదని విపక్షాలు, రైతు సంఘాలు నిలదీస్తున్నాయి.  ఒక‌ప్పుడు కేసీఆర్‌ను రాజ‌కీయ చాణ‌క్యుడు.. ఎత్తులు, పైఎత్తులు వేయ‌డంలో దిట్ట అంటూ గొప్ప‌గా చెప్పేవారు. ఇప్పుడు మాత్రం కేసీఆర్‌కు అంత సీన్ లేదంటున్నారు. ఆయ‌న ప‌ని అయిపోయింద‌ని తేల్చేస్తున్నారు. మాస్ట‌ర్ మైండ్ కాదు.. ఉత్తుత్తి మైండ్ అంటున్నారు. ఇటీవ‌ల ఆయ‌న చేసిన‌, చేస్తున్న ప‌నుల‌న్నీ బూమ‌రాంగ్ కావ‌డ‌మే అందుకు నిద‌ర్శ‌నమ‌ని చూపిస్తున్నారు. దుబ్బాక నుంచి హుజురాబాద్ వ‌ర‌కూ.. ఎదురుదెబ్బ‌ల‌తో త‌ల‌బొప్పి క‌ట్టింది. ఇక‌, ప్రాజెక్టులు, వ‌రి పంట‌పై త‌ల‌నొప్పి మొద‌లైంది. ల‌క్ష కోట్లు పెట్టి కాళేశ్వ‌రం క‌డితే.. ఒక్క ఎక‌రా కూడా అద‌నంగా త‌డిపింది లేదంటున్నారు. ఇక, వ‌రి వేస్తే ఉరి అంటూ.. రైతులను ఆగ‌మాగం చేస్తున్నారు. వ‌రి పంటే వేయొద్దంటే.. ఇక కాళేశ్వ‌రం ఎందుకు? ల‌క్ష కోట్ల ఖ‌ర్చు ఎందుకు? రైతు బంధు ఇంకెందుకు? అనే ప్ర‌శ్న‌లు. రైతుల నుంచి ఆగ్ర‌హ జ్వాల‌లు. ఆ బ‌ద్నాం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకే అన్న‌ట్టు.. వ‌రి మీద తెగ వ‌ర్రీ అవుతున్నారు కేసీఆర్‌. అడ్డ‌గోలు, అర్థంప‌ర్థం లేని రాజ‌కీయంతో మ‌రింత ఊబిలోకి జారుతున్నారు. వ‌రి విష‌యంలో బీజేపీని బ‌లి ప‌శువు చేయాల‌ని తెగ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అంటారు. ప‌దే ప‌దే వ‌రి నెపాన్ని కేంద్రం మీద మోపుతూ.. బీజేపీ చేత‌గాని త‌నం అంటూ ప్ర‌చారం చేస్తూ.. రాజ‌కీయ ప‌బ్బం గడుపుకునే స్కెచ్ ర‌చించార‌ని చెబుతున్నారు.

దమ్ములేని ఎంపీలు.. తుగ్లక్ ఇన్ లైవ్.. రోజా రచ్చ.. గ్రామాల్లో చావు డప్పు.. టాప్ న్యూస్@1PM 

వైసీపీ ప్ర‌భుత్వంపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మండిప‌డ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వైసీపీ ఎంపీలు  క‌నీసం ప్ల‌కార్డులు కూడా ప‌ట్టుకోవ‌ట్లేద‌ని విమర్శించారు. కార్పోరేషన్ ఎన్నికల స‌మ‌యంలో 'వైసీపీ నేతలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని ప్రాణ త్యాగాలు చేసైనా సరే అడ్డుకుంటాం' అని చెప్పారు.. అంత త్యాగాలు అక్కర్లేదు, కనీసం ప్లకార్డులు పట్టుకోండి చాలు అని ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. ----- ఓటీఎస్‌ను రద్దు చేయాలంటూ టీడీపీ ఆందోళనకు దిగింది. పటమట తహశీల్దారుకు వినతి పత్రం అందచేసింది.  జగన్ పరిపాలన తుగ్లక్ చర్యలకు మించి సాగుతోందన్నారు. పన్నుల భారాలతో ప్రజలను దోచుకుంటున్నారని ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ ఆరోపించారు. తుగ్లక్ ఉదంతం చరిత్రలో చదివితే.. జగన్ లైవ్‌లో చూపిస్తున్నారన్నారు. కేంద్రం సహకారంతో కట్టిన ఇళ్లకు ఇప్పుడు డబ్బులు కట్టమనడం ఏమిటి? అని ప్రశ్నించారు. --- విశాఖ నగరానికి పులివెందుల కల్చర్ వచ్చేసిందని  టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు అన్నారు.  వైసీపీ నేతల అరాచకాలు రోజురోజుకు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హయ గ్రీవ జగదీష్ సెల్ఫీ వీడియోనే  ఇందుకు ఉదాహరణ అని... ఇలాంటి బాధితులు ఎంతోమంది విశాఖలో ఉన్నారని అన్నారు. పారిశ్రామికవేత్తలను వైసీపీ నేతలు భయబ్రాంతులకు గురిచేసి పరిశ్రమలు రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు -- చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య కుమ్మలాటలు మరోసారి బయటపడ్డాయి. మంగళవారం సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా పుత్తూరులో ఆ పార్టీకి చెందిన రెబల్స్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే దీన్ని జీర్ణించుకోలేని కొందరు వ్యక్తులు ఆ ఫ్లెక్సీలను చించివేశారు. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు చించివేయడంతో కలకలంరేగింది.  --- కృష్ణా జిల్లా నందిగామ 16వ వార్డులో గతంలో టీడీపీ హయంలో నిర్మించిన శిలా ఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. టీడీపీ నిర్మించిన ప్రాంతంలో వైసీపీ శిలాఫలకాన్ని వేసింది. వైసీపీ శిలాఫలకం వేయడంపై మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నిరసనకు దిగారు. టీడీపీ వేసిన శిలా ఫలకాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని తంగిరాల సౌమ్య డిమాండ్ చేశారు. ------- ఖరీఫ్‌ సీజన్‌లో పండే ప్రతిగంజా కొనుగోలు చేస్తామని.. కేంద్రమంత్రులు చెబుతున్నారని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. అయితే ప్రకటనలు కాకుండా లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కోటి 30 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా ఉందన్నారు. కేంద్రం ఇచ్చిన టార్గెట్‌ను పెంచాలని గతంలోనే కోరామని తెలిపారు. తెలంగాణలో వరి ధాన్యం కోసం 6 వేలకు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ---- ప్రభుత్వం, ఇంటర్ బోర్డు తీరుకు నిరసనగా వామపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. నారాయణగూడా ఫ్లై ఓవర్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకూ విద్యార్థి సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. క్వాలిటీ విద్యతో పాటు నాణ్యమైన విద్యను అందించాలని డిమాండ్ చేశారు. సప్లిమెంటరీ పరీక్షలకు ఒక్క రూపాయి కూడా కట్టబోమన్నారు ------- ఒమిక్రాన్ గురించి నెల్లూరు జిల్లాకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఒమైక్రాన్ గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు.  ధన్వంతరి భారతీయులకు వరమన్నారు ఆనందయ్య. శీతాకాలంలో ముందస్తుగా ఒమిక్రాన్ తదితర వ్యాధులు సోకకుండా ఆయుర్వేద మందు తయారైందన్నారు. ఫిబ్రవరి వరకూ 15 రోజులకు ఒకసారి మందు వాడాలన్నారు. ------ మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవి కోసం హిందుత్వను ఉద్దవ్ థాకరే తాకట్టు పెట్టారని షా విమర్శించారు. పూణెలో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమావేశంలో అమిత్ షా పాల్గొన్నారు.  మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు ---- పనామా ప‌త్రాల లీకేజీ వ్య‌వ‌హారంలో ప్రముఖ సినీ నటి ఐశ్వ‌ర్యా రాయ్ బ‌చ్చ‌న్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) నుంచి నోటీసులు అందాయి. ఈ రోజు ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాల‌యానికి వ‌చ్చి, తమ ఎదుట విచార‌ణ‌కు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. అయితే, తాను ఈ రోజు విచార‌ణ‌కు రాలేన‌ని, విచార‌ణ‌ను మ‌రో తేదీకి మార్చాల‌ని ఐశ్వ‌ర్యా రాయ్ ఈడీని కోరిన‌ట్లు తెలిసింది. దీనిపై ఈడీ స్పందించాల్సి ఉంది. ---

ఒమిక్రాన్ అంత డేంజరా! ఆనందయ్య ఏమంటున్నారు..

కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వైరస్ ఇప్పటికే 90 దేశాలకు పాకేసింది. శరవేగంగా విస్తరిస్తూ ఆందోళన కల్గిస్తోంది, ఒమిక్రాన్ తో బ్రిటన్, ఫ్రాన్స్ అతలాకుతలం అవుతున్నాయి. డెల్టా వైరస్ కు ఒమిక్రాన్ తోడవడంతో యూకేలో ప్రస్తుతం రోజుకు 90 వేలకు పైగా కొత్త కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఫ్రాన్స్ లో 60 వేల వరకు రోజువారి కేసులు వస్తున్నాయి.  భారత్ లోనూ ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. ఆదివారం వరకు ఒమిక్రాన్ కేసులు 150 దాటేశాయి. భారత్ లో జనవరి మధ్య నుంచి ఒమిక్రాన్ తీవ్రత పెరుగుతుందని, ఫిబ్రవరిలో పీక్ స్డేజీకి వెళుతుందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. బ్రిటన్, ఫ్రాన్స్ లో కొనసాగుతున్న తీవ్రతను బట్టి.. భారత్ లో ఆ స్థాయిలో వైరస్ విజృంభిస్తే రోజుకు 14 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందనే హెచ్చరికలు వైద్య సంస్థలు, సైంటిస్టుల నుంచి వస్తున్నాయి.  భారత్ తో పాటు ప్రపంచ దేశాలను భయపెడుతున్న ఒమిక్రాన్ గురించి నెల్లూరు జిల్లాకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఒమైక్రాన్ గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు.  ధన్వంతరి భారతీయులకు వరమన్నారు ఆనందయ్య. శీతాకాలంలో ముందస్తుగా ఒమిక్రాన్ తదితర వ్యాధులు సోకకుండా ఆయుర్వేద మందు తయారైందన్నారు. ఫిబ్రవరి వరకూ 15 రోజులకు ఒకసారి మందు వాడాలన్నారు. ఒమిక్రాన్‌కి క్రిష్ణపట్నంలోను, విశాఖలోను మందు పంపిణీ చేస్తానన్నారు.  

పుష్పకు సెలవు కావాలి..  స్టూడెంట్స్ లెటర్ వైరల్

విద్యార్థులు మరీ బరి తెగిస్తున్నారు. చిల్లర చేష్టలతో విసుగు తెప్పిస్తున్నారు.  ఒకప్పుడు టీచర్‌ను అడగాలంటేనే విద్యార్థులు భయపడిపోయేవారు. కానీ ఇప్పుడు విద్యార్థుల టైం మారింది.. టైమింగూ మారింది. సినిమా కోసం సెలవు కావాలంటూ  ఏకంగా ప్రిన్సిపల్‌కే లేఖ రాసేస్తున్నారు. పుష్ప సినిమా కోసం కాలేజ్‌కి సెల‌వు ఇవ్వాలంటూ ఏకంగా హెచ్‌వోడీకే లెట‌ర్ రాశారు ఓ ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్‌. ఈ నెల 17న ‘పుష్ప’ సినిమా రిలీజ్‌ అవ్వగా.. దానికి ముందు రోజు ఓ ప్రైవేట్‌ కళాశాల విద్యార్థులు లేఖ రాశారు. మరుసటి రోజు కాలేజీకి సెలవు ప్రకటించాలని కోరారు. సెలవు ఇవ్వకపోయినా తాము రాకపోవడం మాత్రం పక్కా అని లేఖ‌లో క‌న్ఫామ్ చేశారు. తాము క్లాసుల‌కి అటెండ్ కాక‌పోతే.. ఇంటికి మెసేజ్‌లు పంపొద్దని, కాల్స్‌ చేయొద్దని ప్రిన్సిపల్‌కు లెట‌ర్ రాశారు. సెలవు ఇవ్వాలంటూ కోరుతూనే.. లేఖ‌ చివర్లో ‘తగ్గేదేలే’ అంటూ ప‌రోక్షంగా వార్నింగ్ కూడా ఇచ్చారు. ప‌నిలో ప‌నిగా హెచ్‌వోడీ /ప్రిన్సిపల్‌కు ఓ బంపర్‌ ఆఫర్ కూడా ఇచ్చారు. తమ ద‌గ్గ‌ర ఇంకో ఎక్స్‌ట్రా టికెట్‌ ఉందని, కావాలంటే మీరు కూడా సినిమాకు రావొచ్చంటూ ఇన్‌వైట్ చేశారు ఆ స్టూడెంట్స్‌.  హైద‌రాబాద్ ఘ‌ట్‌కేస‌ర్‌లోని వీబీఐటీ కాలేజ్ సెకండ్ ఇయ‌ర్ స్టూడెంట్స్‌, అల్లు అర్జున్ ఫ్యాన్స్ పేరుతో ఉన్న ఈ లెట‌ర్ సోష‌ల్ మీడియాలో మూడు రోజులుగా ఫుల్ వైర‌ల్ అవుతోంది. పేర్లు లేకుండా లెట‌ర్ రాయ‌డం.. లెట‌ర్ చివ‌ర‌న‌.. నీ అవ్వ త‌గ్గేదే లే.. అంటూ రాయ‌డం.. లెట‌ర్ రాసింది హెచ్‌వోడీ కా? ప్రిన్సిప‌ల్‌కా అనే క్లారిటీ లేకుండా రాయ‌డం.. త‌మ ఇంఛార్జ్ మేడ‌మా? సారా? అనే స్ప‌ష్ట‌త కూడా లేకుండా లేఖ రాయ‌డం.. ఇవ‌న్నీ చూస్తుంటే.. పుష్ప రిలీజ్ సంద‌ర్భంగా కావాల‌నే ఈ లెట‌ర్ క్రియేట్ చేసి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశార‌ని అంటున్నారు. వాళ్ల ప్లాన్ బాగానే వ‌ర్క‌వుట్ అయిన‌ట్టుంది.. కామెంట్లూ, లైకులూ బాగానే వ‌స్తున్నాయి.  

జర్నలిస్టులకు జగన్ ఝలక్.. ఎవరిని వదిలేది లే.!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనం.. వివాదమే. ఏ వర్గాన్ని వదలకుండా భారాలు మోపుతోంది జగన్ రెడ్డి సర్కార్. ఖజానా ఖాళీ కావడంతో ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ పన్నులు బాదేస్తోంది. తాజాగా జర్నలిస్టలకు షాకిచ్చింది జగన్ సర్కార్. పాత్రికేయుల పిల్లలకు పాఠశాలల ఫీజుల్లో 50 శాతం రాయితీ కల్పిస్తూ గత ప్రభుత్వంలో ఇచ్చిన ఉత్తర్వులను జగన్‌ సర్కారు తాజాగా నిలిపేసింది. పాత్రికేయుల పిల్లలకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులో 50 శాతం రాయితీ కల్పిస్తూ అప్పట్లో ప్రతి జిల్లాలోనూ జిల్లా విద్యాశాఖాధికారులు ఉత్తర్వులిచ్చారు. కొన్ని చోట్ల ఇది అమలుకావడం లేదని జిల్లాల్లో పాత్రికేయ సంఘాలు డీఈవోలకు వినతిపత్రాలు ఇచ్చాయి. సదరు డీఈవోలు ఈ అంశాన్ని పాఠశాల విద్య డైరక్టర్‌కు నివేదించారు. అక్కడ ఉత్తర్వుల అమలు కోసం ఆదేశాలివ్వకపోగా.. అసలు వాటిని అమలే చేయొద్దని నిర్దేశించింది ప్రభుత్వం. ఇది రాష్ట్ర స్థాయిలో తీసుకోవాల్సిన విధానపరమైన నిర్ణయమని, డీఈవోలు ఇలాంటి సర్క్యులర్లు ఇవ్వడం, అమలుచేయడం వద్దని తేల్చిచెప్పారు. దీనిపై పాత్రికేయ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.