ఉప్పల్ టెస్ట్: భారత బౌలర్స్ దెబ్బకు కుప్పకూలిన కీవిస్
భారత్ న్యూజిలాండ్ల మధ్య నగరంలోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ రెండో రోజులో భారత బౌలర్లు ధాటికి న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ బాట్స్ మెన్ లు పెవిలియన్కు క్యూ కట్టారు. న్యూజిలాండ్ ఓపెనర్లు మెక్ కల్లమ్ 22, విలియమ్సన్ 32 పరుగులకే ప్రజ్ఞాన్ ఓజా పెవిలియన్కు పంపగా, గుప్తిల్ 2, రాస్ టేలర్ 2, ఫ్లిన్ 16 పరుగులకే స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అవుట్ చేశాడు. టీమిండియా బౌలర్స్లలో రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్ తీసుకోగా, ప్రజ్ఞాన్ ఓజా 2 వికెట్లు తీసుకున్నారు. రెండో రోజు ఆట ముగిసే సయమానికి క్రీజులో ఫ్రాంక్లిన్ 31, వ్యాన్ వేక్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ ఫాలోఆన్ నుండి తప్పించుకోవాలంటే ఇంకా 133 పరుగులు చేయాల్సి ఉంది.
శుక్రవారం టీమ్ ఇండియా తొలి ఇన్సింగ్స్లో 438 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. ఓవర్ నైట్ బ్యాట్స్ మెన్ పుజారా 159 పరుగులు చేయగా, ధోని 73 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అశ్విన్ 37 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో జీతన్ పటేల్ 4, బౌల్ట్ 3 వికెట్లు తీశారు.