న్యూయార్క్‌లో కాల్పులు: 2మృతి, 9మందికి గాయలు

అమెరికాలోని న్యూయార్క్‌లో గల ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ సమీపంలో జనంపై తూటాలు పేలాయి. జాన్సన్‌ అనే ఉద్యోగిని తొలగించారన్న అసంతృప్తితో ఉన్మాదిగా మారి కాల్పులకు తెగబడ్డాడు. కాల్పుల్లో ఇద్దరు మరణించారు, మరో తొమ్మిది మందికి గాయలయ్యాయి. ఈ ఉదంతం న్యూయార్క్‌లోని 102 అంతస్తుల ఆకాశహర్మ్యం ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ బయట శుక్రవారం చోటుచేసుకుంది. ఘాతుకానికి పాల్పడిన జెఫ్రీ జాన్సన్(53) అనే వ్యక్తిని పోలీసులు ఎదురుకాల్పుల్లో హతమార్చా రు. ఇటీవల కాలంలో రెండు విచక్షణారహిత కాల్పుల సంఘటనలు చోటు చేసుకున్నాయి. జులై 20న అరోరాలో 'ది డార్క్‌ నైట్‌ రైజెస్‌' అనే సినిమా చూస్తున్న వారిపై జేమ్స్‌ హోమ్స్‌ (24) అనే వ్యక్తి కాల్పులు జరిపిన సంఘటనలో 12 మంది మృతి చెందారు. 58 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ నెల 5న మిల్‌వాకీ బయట సిక్కు మందిరం వద్ద ఒక వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఆరుగురు చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.