ప్రధాని మన్మోహన్ సింగ్ కలిసిన ఒలింపిక్ విజేతలు
లండన్ ఒలింపిక్స్లో వివిధ విభాగాల్లో భారత్ తరుపున ప్రాతినిధ్యం వహించి ఆరు పతకాలను సాధించిన ఒలింపిక్ విజేతలు శుక్రవారం ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీని కలుసుకున్నారు. 7, రేస్ కోర్స్ రోడ్డులో ఉన్న ప్రధాని నివాసంలో మన్మోహన్ను రజిత పతక విజేతలు షూటర్ విజరుకుమార్, రెజ్లర్ సుశీల్కుమార్, కాంస్య పతకం గెలిచిన మహిళా బాక్సర్ మేరీకోమ్, షట్లర్ సైనా నెహ్వాల్, షూటర్ గగన్ నారంగ్, రెజ్లర్ యోగేశ్వర్ దత్ కలుసుకున్నారు.