సైనా నెహ్వాల్ కు డీఎల్ఎఫ్ ఆడి క్యూ 5 కారు
లండన్ ఒలింపిక్స్లో పతకాలు గెలిచి దేశానికి ఖ్యాతి తీసుకొచ్చిన హర్యానా ప్లేయర్లకు ఆడి క్యూ 5 కార్లుతో సత్కరించాలని ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్ఎఫ్ నిర్ణయించింది. ఈ ఎస్యూవీ కార్లు అందుకునే వారిలో రెజ్లర్లు సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్, ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్, షూటర్ గగన్ నారంగ్ ఉన్నారు. కాగా, ఒలింపిక్స్లో పతకాలు సాధించలేకపోయి నా, బెర్త్ సంపాదించిన మరో 15 మంది రాష్ట్ర క్రీడాకారులకు కూడా మారుతి సుజుకి ఎస్ ఎక్స్ 4 సెడాన్ స్పెషల్ ఎడిషన్ కార్లును డీఎల్ఎఫ్ బహూకరించనుంది. హర్యానా ప్రభుత్వం, డీఎల్ఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో ప్లేయర్లను సత్కరించనున్నారు. ఆదివారం జరిగే కార్యక్రమంలో హర్యానా సీఎం భూపిందర్ సింగ్ హూడా ప్లేయర్లకు తాళాలు అందించనున్నారు.