తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి. 

దేనికైనా రెడీ పై మోహన్ బాబు సారీ చెప్పాలి: ఎమ్మెల్యేలు

బ్రాహ్మణులపై నటుడు మోహన్‌బాబు అనుచరులు చేసిన దాడికి నిరసన తెలుపుతూ గురువారం   బ్రాహ్మణ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. 'దేనికైనా రెడీ' చిత్రంలో బ్రాహ్మణులపై అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని, వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం సాయంత్రం మోహన్‌బాబు ఇంటిముందు నిరసన తెలపగా వారిపై సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు.  అంతకు ముందు బ్రాహ్మణులే ఇంటిపై దాడి చేశారని విష్ణువర్థన్‌బాబు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు మోహన్ బాబు పైన మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బ్రాహ్మణులపై మోహన్ బాబు గార్డ్సు రౌడీయిజం చేయడం దురదృష్టకరమన్నారు. సినిమాలో ఉన్న అభ్యంతరకర సీన్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. బ్రాహ్మణులపై దాడి చేసినందుకు మోహన్ బాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కాకతీయ నిధులపై చిరు తొలి సంతకం

  మెగాస్టార్ చిరంజీవి కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. కాకతీయ ఉత్సవాలకు రూ.25 లక్షలు మంజూరు చేస్తూ చిరు తొలి సంతకం చేశారు. పర్యాటక శాఖ తనకు ఎంతో ఇష్టమైన శాఖ అన్నారు. భారత దేశం విభిన్న సంస్కృతులకు ప్రత్యేకమైనదన్నారు. దేశంలో పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.   తనకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు చిరంజీవి. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు చర్యలు చేపడతానని చెప్పారు. బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానన్నారు. ఈ కార్యక్రమానికి అల్లుఅరవింద్, మంత్రులు గంటా శ్రీనివాస్‌రావు, పితాని సత్యనారాయణ, రామచంద్రయ్య తదితరులు హాజరై చిరంజీవికి అభినందనలు తెలిపారు.

చైనా ఓపెన్ కు సైనా దూరం

  బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ చైనా ఓపెన్‌కు దూరం కానుంది. నవంబర్ రెండో వారంలో ప్రా రంభం కానున్న ఈ టోర్నీలో తాను ఆడబోవడంలేదని సై నా ప్రకటించింది. కుడి మోకాలి నొ ప్పితో కొంత అసౌకర్యంగా ఉన్నందున విశ్రాంతి తీసుకోనున్నట్టు తెలిపింది. 'మోకాలు కొంత అసౌకర్యంగా ఉం ది. అంటే అది డాక్టర్ దగ్గరకు పరిగెత్తాల్సినంత సీరియ స్ విషయమేమీ కాదు. కొద్దిగా ఫిజియోథెరపీ చేస్తే చాలు డెన్మార్క్ ఓపెన్‌లో విజయం సాధించడం, ఆ త ర్వాత ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు చేరడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఒలింపిక్స్‌లో పతకం గెల్చినప్పటినుంచీ నాలో ఆత్మవిశ్వాసం ఎంతో పెరిగిందని సైనా చెప్పింది.