కిరణ్కుమార్ రెడ్డితో మంత్రుల బృందం భేటీ
ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డితో మంత్రుల బృందం క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. ధర్మాన ప్రాసిక్యూషన్పై వారు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మంత్రులు వట్టి వసంత్కుమార్,ఏరాసు ప్రతాప్రెడ్డి, దానం నాగేందర్, గల్లా అరుణ, ఆనం రాంనారాయణరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, డి.కె అరుణ, శైలజానాథ్, జానారెడ్డి, మహీధర్రెడ్డి, గంటా, పొన్నాల లక్ష్మయ్య, సుదర్శన్రెడ్డి, కొండ్రు మురళి, పితాని, సారయ్య, తోట నర్సింహ, ప్రసాద్కుమార్ పాల్గొన్నారు. ధర్మాన ప్రసాద్రావు కూడా ఈ భేటీకి హాజరయ్యారు. ఇదే అంశంపై నిన్న రాత్రి మంత్రి వట్టి వసంత్కుమార్ ఇంట్లో మంత్రులు సమావేశమైన విషయం తెలిసిందే.