ఓటమి భయంతో  కదిలిన కమలం 

ఉత్తర ప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం వేగంగా మారి పోతోంది. ఒక  విధంగా పశ్చిమ బెంగాల్’ సీన్ యూపీలో రిపీట్ అవుతోంది. పార్టీలు, పొత్తులతో సంబంధం లేకుండా బీజేపీ వ్యతిరేక ఓటర్లు, ముఖ్యంగా ముస్లిం ఓటర్లు, బీజేపీని ఓడించడమే లక్ష్యంగా, ఓడించగల పార్టీతో ర్యాలీ అవుతున్నారు. మొన్నటి బెంగాల్  అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గమనిస్తే, ముస్లిం ఓటర్ల ఆధిక్యతగల సుమారు 60కి పైగా గల నియోజక వర్గాల్లో, ఒక్క సీటు బీరు పోకుండా, మొత్తానికి మొత్తం స్థానాలను  తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుంది.  లౌకికవాద పార్టీలుగా చొక్కాలు చించుకునే కాంగ్రెస్, లెఫ్ట్ కూటమికి ఒక్క సీటు కూడా దక్కలేదు. అలాగే, రాష్ట్రం మొత్తంలోనూ ముస్లింలు కాంగ్రెస్, లెఫ్ట్ వైపు కన్నెత్తికూడా చూడలేదు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా తృణమూల్’ కు బల్కగా ఓట్లు గుద్దారు. ఫలితంగా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు జీరో’కు చేరుకుంటే, తృణమూల్ కాంగ్రెస్ జెండా ఎగరేసింది. మూడింట రెండువంతుల మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంది.     ఇప్పుడు యూపీలోనూ అదే లక్ష్యంతో, బీజేపీ వ్యతిరేక ఓటర్లు అందరూ, సమాజ్ వాదీ పార్టీ వైపు ర్యాలీ అవుతున్నారు. గతంలో కాంగ్రెస్, బీఎస్పీల వైపు మొగ్గు చూపిన వర్గాలు కూడా, బీజేపీని ఓడించే సత్తా ఉన్న పార్టీగా సమాజవాదీ పార్టీని చూస్తున్నారు. బెగాల్లో’ లానే, యూపీలోనూ ముస్లిం ఆధిక్యత ఉన్న నియోజక వర్గాలు వందకు పైగానే ఉంటాయి.ముఖ్యంగా  పశ్చిమ  ఉత్తరప్రదేశ్’ లో  అనేక నియోజక వర్గాల్లో ముస్లిం ఓటర్లే గెలుపు ఓటములని నిర్ణయించగల స్థాయిలో ఉన్నారు. గతంలోనూ ముస్లిం ఓటర్లు లౌకికవాద పార్టీల వైపే మొగ్గుచూపారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పార్టీకి జై కొట్టలేదు. ఈసారి ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు మొత్తానికి మొత్తంగా సమాజవాదీ పార్టీ  వైపు ర్యాలీ అవుతున్నారు. దీంతో బీజేపీలో గుబులు మొదలైంది. ఈ పరిణామం నేపధ్యంలో మరో ఆరేడు నెలలలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఎస్పీ మధ్య ద్విముఖ పోటీ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, బీహార్ ఫార్ముల ఫాలో  అయి, అక్కడ  ఆర్జేడీతో పొత్తు పెట్టుకున్నట్లు యూపీలో ఎస్పీతో జట్టు కడితే కొద్దిపాటి సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది.బెంగాల్ రూట్లో వెళితే అదే జీరో’ ఖాయం అవుతుంది .  అదలా ఉంటే, మరో వంక, బీజేపీ పొంచి ఉన్నప్రమాదాన్ని పసిగట్టి, పావులు కదుపుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్’ నియోజక వర్గాల పర్యటన ప్రారంభించారు. కార్యకర్తలు, స్థానిక నాయకులతో సమావేశాలు ఏర్పాటుచేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అలాగే, కరోనాతో చనిపోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తున్నారు. మరో వంక జిల్లా అధ్యక్షులు కూడా తమతమ జిల్లాలో కొవిడ్ బాధితులను కలిసి పరామర్శింఛి, అవసరమైన  సహాయం అందివ్వాలని సూచించారు.  అంతే కాదు, ఇంతకాలం అంతగా పట్టించుకోని మిత్రపక్షాలతో మళ్ళీ మాటకలిపే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కొద్ది రోజుల క్రితం, స్వతంత్ర దేవ్ సింగ్, అప్నా దళ్ నాయకురాలు అనుప్రియ పటేల్’తో సమావేశమయ్యారు.ఈ  సందర్భంగా పొత్తు కొనసాగించడంతో పాటుగా, త్వరలో చేపట్టే మంత్రివర్గ విస్తరణలో  అప్నా దళ్’కు ఒక బెర్త్’ ఖాయం చేసినట్లు తెలుస్తోంది. అయితే, మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని , ఉండదని పార్టీలో విభిన్న అభిప్రాయాలున్నాయి. మంత్రి వర్గ విస్తరణ జరిగితే, దళిత్, ఓబీసీలకు స్థానం కల్పించే  అవకాశం ఉందని పార్టీ వర్గాలు సమాచారం. పనిలో పనిగా, సిట్టింగ్ ఎమ్మెల్యేల పని తీరును, సింగ్, బన్సల్ సమీక్షిస్తున్నారు. ఇది అభ్యర్ధుల ఎంపికకు ప్రాతిపదికగా ఉంటుందని అంటున్నారు. మొత్తానికి, గత ఎన్నికల్లో అనూహ్యంగా, మొత్తం 403 సీట్లకు గానూ 312 సీట్లు గెలుచుకున్న, బీజేపీ, ఎన్నికలు ఇంకా  ఏడెనిమిది నెలల దూరంలో ఉండగానే, ఓటమి భయంతో ముదస్తు  ఊహంతో కదులుతోంది. అయితే, ముస్లిం ఓటు ఎస్పీ వైపు ర్యాలీ అయితే, బీజీపీకి కష్టాలు తప్పవని, అదే కారణంగా హిందూ ఓటు పోలరైజ్  అయితే మాత్రం బీజేపీకి అచ్చేదిన్ వచ్చినట్లే’అని  విశేషకులు అంటున్నారు.

ఫ్రస్టేషన్లో డీజీపీ గౌతమ్ సవాంగ్.. జగన్ రెడ్డే కారణమా?

మహాభారతంలో విదురుడు దుర్యోధనుడి దుర్మార్గాలను భరించలేక నోరు విప్పాడు. రామాయణంలో రావణాసురుడి రాక్షసత్వాన్ని తట్టుకోలేక విభీషణుడు సైతం నోరు విప్పాడు. కాని అటు నోరు విప్పలేక.. మనసులో ఉన్నది కక్కలేక.. ఫుల్లు ఫ్రస్టేషన్ తో ఆంధ్రప్రదేశ్ లో ఆ అధికారి అల్లాడిపోతున్నాడు. వద్దు వద్దని చెప్పాడు.. చేస్తే చేసుకోండి.. కాని ఇధి పద్ధతి కాదని చిలక్కి చెప్పినట్లు చెప్పాడు.. ఆ తర్వాత అతడిని అడగటమే మానేశారు.. సబార్డినేట్ సైతం తనను పక్కన పెట్టి ప్రొసీడ్ అయిపోవటంతో సైలెంట్ అవడం తప్ప ఏం చేయలేకపోయారు. కాని ఇప్పుడు సబార్డినేట్ చేసిన ఆ తప్పుల వల్ల మొత్తానికే ఎసరొస్తుందని.. చెప్పినా వినలేదని పిడికిలితో బల్ల మీద గుద్దడం తప్ప ఏం చేయలేక ఫ్రస్టేషన్ తో అల్లాడిపోతున్నారట. ఆయనే గౌతమ్ సవాంగ్..ఏపీ డీజీపీ.  ఇప్పుడు అమరావతి సర్కిల్స్ లో ఇదే స్టోరీ రీసౌండ్ తో వినిపిస్తోంది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ లో సీఐడీ వాళ్లు చూపించిన దూకుడు ఇప్పుడు సుప్రీంకోర్టులోనే కాకుండా పార్లమెంట్ లోనూ ప్రశ్నలకు గురయ్యే అవకాశం కనపడుతోంది. అరెస్టు చేయడమే సినీఫక్కీలో చేశారు. ఆ తర్వాత గుంటూరు సీఐడీ ఆఫీసులో ఇంటరాగేషన్ చేశారు. మామూలుగానే ఓ నిందితుడిని.. అందులోనూ ఆయనను అరెస్ట్ చేసిన కేసులో.. అందులోనూ ఓ ఎంపీని చేయి చేసుకోకూడదు. కాని చేసుకున్నారనేది ఎంపీ వాదన. ఇందుకు ఆయన తన శరీరంలోని భాగాలనే సాక్ష్యాలుగా చూపిస్తున్నారు. జిల్లా ఆస్పత్రిలో మేనేజ్ చేశారు.. వేరే ఆస్పత్రికి వెళ్లకుండా సాంకేతికంగా ఉన్న అవకాశాలన్నీ వాడుకుని జైలుకు తీసుకుపోవాలని చూశారు. కాని సుప్రీంకోర్టు ఆదేశాలతో సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తీసుకుపోవాల్సి వచ్చింది. అక్కడే కథ అడ్డం తిరిగింది. దెబ్బలున్నాయని నివేదిక వచ్చింది. సుప్రీం ఎంపీకి బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు హోంమంత్రికి, రక్షణశాఖ మంత్రికి, పార్లమెంటరీ కమిటీలకు, స్పీకర్ కి, రేపో మాపో రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి కూడా తన ఆరోపణలన్నీ వినిపించారు..వినిపిస్తున్నారు.. వినిపిస్తారు. ఇవన్నీ ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ కి చక్రబంధాలు వేస్తున్నాయ్. ఇదే జరుగుతుందని ముందే చెప్పిన డీజీపీ గౌతమ్ సవాంగ్ సైతం ఇరుకునపడే అవకాశం కనపడుతోంది. సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ నేరుగా సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్ లో పని చేశారని.. డీజీపీని సైతం పట్టించుకోలేదనే టాక్ వినపడుతోంది. ప్రభుత్వ రాజకీయ వ్యూహాలు శృతి మించినప్పుడు అధికారులే ఆ వ్యూహాల్లో బలిపశువులుగా మారతారనేది చరిత్ర చెబుతోన్న సత్యం. డీజీపీ గౌతమ్ సవాంగ్ మొదటి నుంచి సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు. మాట పడటమంటేనే ఇష్టముండదని సన్నిహితులు చెబుతుంటారు. కెరీర్ లో రిమార్క్స్ లేకుండా చూసుకోవాలని ప్రయత్నిస్తారు.. అదే సమయంలో ప్రభుత్వానికి విధేయుడిగా ఉంటూనే ఇఫ్, బట్స్ మెయిన్ టెయిన్ చేస్తుంటారని అంటుంటారు. కాని రిమార్కులు కాదు.. వైసీపీ హయాంలో డీజీపీకి పదవి చేపట్టిన సవాంగ్ పై ఏకంగా మరకలే పడ్డాయి. హైకోర్టు మూడు సందర్భాల్లో డీజీపీని నేరుగా విమర్శించింది. కోర్టుకే రప్పించింది. అలాంటి పరిస్ధితులను చూసిన సవాంగ్.. తట్టుకున్నారో లేదో ఆయన మనస్సాక్షికే తెలియాలి. మొదట్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు రాసిన లేఖలకు, ఆరోపణలు,విమర్శలకు కౌంటర్ ఇవ్వటానికి గౌతమ్ సవాంగ్ ప్రయత్నించారు. కాని పరిస్ధితి అదుపు తప్పుతుండటంతో.. మీడియా ముందుకు రావడమే తగ్గించేశారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ గురించి ఇప్పటివరకు డీజీపీ ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం.. తనకు సంబంధం లేనట్లుగా ఉండటం.. చూస్తుంటే.. సవాంగ్ ఎలా ఫీలవుతున్నారో అర్ధమవుతుందనే కామెంట్లు డిపార్టుమెంట్లోనే వినపడుతున్నాయి.

ఏఐసీసీ తర్వాతనే పీసీసీ! టీకాంగ్రెస్ లో ముదిరిన లొల్లీ..

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుని ఎన్నిక ప్రహసనం రోజుకో మలుపు తిరుగుతోంది. మరో వంక అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షుని ఎన్నికనే ఇప్పటికి మూడుసార్లు వాయిదా వేసిన కాంగ్రెస్ అధినాయకత్వం, తెలంగాణా పీసీసీ విషయంలోనూ, ఎటూ తేల్చుకోలేక, కొత్త పాత ఫార్ములాల చుట్టూ తిరుగుతోంది. ఫలితంగా ఎంపిక ప్రక్రియ ఒకడుగు ముందుకు నాలుగడుగులు  వెనక్కి అన్నట్లుగా సాగుతోంది. ఇదిగో అంటే ఆరు నెలలు, అన్నట్లుగా ఎప్పుడో ఆరేడు నెలల క్రితమే పీసీసీ పగ్గాలు రేవంత్ రెడ్డికి ఇవ్వాలని రాహుల్ గాంధీ నిర్ణయించారని, సోనియా గాంధీ ఓకే చేశారని వార్తలొచ్చాయి. ఆ తర్వాత నాగార్జున సాగర్ ఉపఎన్నిక వరకు ఆగమని, పార్టీ అభ్యర్ధి, సీనియర్ నాయకుడు జానారెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు, వాయిదా పడిన ప్రకటన, సాగర్ కథ ముగిసినా, బయటకు రాలేదు. అంతేకాదు, కథ మళ్ళీ మొదటికొచ్చింది. ఇప్పుడు తాజాగా కర్ణాటక ఫార్ములా మీద కసరత్తు సాగుతోంది. ఈ ఫార్ములా ప్రకారం కింది నుంచి పైదాకా అందరి అభిప్రాయాలు తెలుసుకుని అప్పుడు పీసీసీ అధ్యక్షుని ఎంపిక చేస్తారని అనటున్నారు. అయితే, ఈ ప్రక్రియ అంత తేలిగా జరిగేది కాదని కూడా పార్టీ వర్గాలే  పేర్కొంటున్నాయి.   పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ‘ఒపీనియన్స్ మార్చుకొని వాడు పాలిటీషియన్’ కాలేడు’ అన్న గిరీశం ఫార్ములాను ఫాలో అయిపోతూ..  ‘ఒపినియన్ మార్చుకుని, తాను పక్కా పాలిటీషియన్’ అని నిరుపించుకున్నారు. రెండు రోజుల క్రితం, రాజ్ భవన్’ వద్ద, పీసీసీ అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డికి ఇచ్చినా ఓకే అన్న సంకేతాలు ఇచ్చిన కోమటి రెడ్డి, సోమవారం గాంధీ భవన్ ప్రాంగణంలో జరిగిన సత్యాగ్రహ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో  తాను పీసీసీ రేసులో ఉన్నానని, ఆ పదవికి  తాను మాత్రమే అన్ని విధాల అర్హుడినని, నొక్కి వక్కాణించారు. కేవలం రెండు రోజుల క్రితం రేవంత్ రెడ్డికి ఇచ్చిన ఓకే అన్నాఆయన ఇంతలోనే, తాను మాత్రమే అర్హుడిని అని, పీసీసీ అధ్యక్ష పదవి తప్పఇంకే పదవి ఇచ్చినా తీసుకోనని స్పష్టం చేశారు. కొసమెరుపుగా, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, అన్నారు. అయితే అదే సమయంలో, పార్టీ సీనియర్ నాయకుడు హనుమంత రావును కొందరు బెదిరిస్తున్నట్లు వస్తున్న వార్తలను ఖండిస్తున్నాను అంటూ, రేవంత్ రెడ్డికి చురక అంటించారు.అంతే కాదు, అయన సోదరుడు, ముగుగోడు ఎమ్మెల్యే  రాజగోపాల రెడ్డి పార్టీ మారాలా, వద్దా అనేది ఆయన వ్యక్తిగతమని చెప్పడం  ద్వారా, భవిష్య వాణి చెప్పకనే చెప్పారు.   పీసీసీ రేసులో ఉన్న మరో నేత ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణికం ఠాగూర్, తనను చిన్న చూపు చూస్తున్నారని  వాపోయారు. అంతే కాదు ముఖ్యమంత్రి కేసీఆర్’ను రాజకీయంగా  ఎదుర్కోవడం, తనకు మాత్రమే సాధ్యమని అన్నారు. నిజానికి కోమటి రెడ్డి, జగ్గా రెడ్డి తము మాత్రమే పీసీసీ పదవికి వన్నె తెస్తామని బయట పడ్డారు, కానీ, పార్టీలో అదే అభిప్రాయంతో ఉన్న నాయకులు ఇంకా అనేకులున్నారు.  ఇదిలా ఉంటే, పార్టీ అధిష్టానం పరిగణలోకి తీసుకున్న కీలక నేతలతో పాటుగా, రేసులో ఉన్నామంటున్న నేతలు కూడా పదవి రాకుంటే పక్క పార్టీలోకి జంప్’కు సిద్దమవుతున్నారని వార్తలొస్తున్నాయి. మరో వంక రేవంత్ రెడ్డి అనుచరుల నుంచి పార్టీ సీనియర్ నాయకుడు, వీహెచ్’కి బెదిరింపు కాల్స్ వస్తున్న విషయం పార్టీలో మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్’గాచర్చకు వచ్చింది. చర్చకు దారి తీసింది. గతంలో ఇదే విషయంలో  వీహెచ్, అసలు , పీసీసీ క్రమశిక్షణ  సంఘం ఉందా, అని ప్రశ్నించిన నేపధ్యంలో, క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోదండ రెడ్డి సీరియస్’గా స్పందించారు.  కాగా, ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న పార్టీ నేతలు, పీసీసీ పంచాయతి ఇప్పట్లో తేలదని, ఏఐసీసీ తర్వాతనే  పీసీసీ సమస్య పరిష్కారం అవుతుందని అంతవరకు ఈ తమషా క్రతువు ఇలా సాగుతూనే ఉంటుందని అంటున్నారు.

మందు మానేశాడు.. ఊరంతా సన్మానం చేశారు.. 

వెంకటేష్ అనే నేను.. సినిమా కాదండోయ్ బాబు.. ఇది ఒక ప్రతిజ్ఞ.. ప్రతిఙ్ఞనంటే భారత దేశం నా మారారు భూమి.. భారతీయులందరు నా సహోదరులు అంటారు కూడా అని అనుకుంటున్నా.. అవును నిజమే.. అది దేశ పౌరుడిగా చేసి ప్రతిజ్ఞ.. ఇది మందు బాబు చేసే ప్రతిజ్ఞ అందుకే ఇలా ఉంటుంది.. అసలు ఆ వెంకటేష్ ఎవరు..? అతడు మందు మానేస్తే ప్రతిజ్ఞ చేయడం ఏంటి.. అందులో ఏ న్యూస్ రాయడం ఏంటి..? మొత్తానికి మాకు ఈ నసేంటని అనుకుంటున్నారా..? కొంచం ఓపిక పట్టి కింది లైన్ కూడా చదవండి మీకే తెలుస్తుంది..  నేను ఐఏఎస్ అవుతాను, నేను డాక్టర్ అవుతాను అని ప్రతి మనిషికి గోల్స్ ఉండడం వేరు.. నేను మందు మానేస్తాను అదే నా గోల్ అనే వాడిని ఎపుడైనా చూశారా.. చూడండి అయితే.. నెల్లూరు జిల్లా, బుజ్జిరెడ్డి పాలెం మండలం, చల్లాయపాలెం. ఈ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి . అతని పేరు వెంకటేష్. అతను కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 25 ఏళ్ల ఆ వెంకటేష్ తనకు వచ్చే కూలి డబ్బంతా మద్యం తాగుడుకే తగలేసేవాడు. రోజు పనికెళ్ళడం ఆ డబ్బులతో మందెయ్యడం.. ఆ తర్వాత చిందేయ్యడం.. ఊరోలో అందరు చాలా చెప్పి చూశారు అయిన వెంకటేష్ లో ఎలాంటి మార్పు రాలేదు. తాజాగా ఏం జరిగిందో ఏమో.. వెంకటేష్ సడెన్ గా మందు మానేశాడు.. ఆ వార్త విన్న ఆ ఊరి జనం.. ఒక రకంగా పండగ చేసుకున్నారనే చెప్పాలి.. అతను మందు మానెయ్యడంతో ఆ ఊరివాళ్లంతా సంతోషించారు. వెంకటేష్ మందు మానేశాడ్రోయ్ అంటూ చాటింపు వేశారు. ఎప్పుడూ తాగుతూ, తూలుతూ కనిపించే వెంకటేష్ ఉన్నట్లుండి మద్యం తాగడం మానేయడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆనందించారు. అతనిని మరికొందరు స్ఫూర్తిగా తీసుకుని మద్యం మానుకుంటే బాగుంటుందని ఆశించారు. ఇందులో భాగంగా వెంకటేష్‌ను మేళతాళాలతో ఊరంతా ఊరేగించారు. అంతే కాదు ఆ ఊరిలో ఉన్న గుడిలో వెంకటేష్ దేవుడి సాక్షిగా ఇంకెప్పుడు మందు జోలికి వెళ్లానని  ప్రమాణం చేశాడు.. ప్రతి సంవత్సరంలో 3 రోజులు తప్పా మరే ఇతర రోజుల్లో మాత్రమే మందు తాగాను అని దేవుడి గుడిలో మొక్కాడు మందు మానేసిన వ్యక్తి కి ఊరంతా ఊరేగించి సన్మానం చేశారు. కు చెందిన వెంకటేష్ అనే వ్యక్తి అలాంటి యువకుడు ఉన్నట్టుండి తాగుడు మానేయడంతో 

త‌గ్గేదే లే.. ఈట‌ల బ‌లప్ర‌ద‌ర్శ‌న‌.. మ‌రి, రాజీనామా? భ‌య‌మా! వ్యూహ‌మా!

తెలంగాణ అటెన్ష‌న్ అంతా హుజురాబాద్ మీదే. ఈట‌ల రాజీనామా అంశం ఉత్కంఠ రేపుతోంది. తెలంగాణ రాజ‌కీయం చాలారోజుల త‌ర్వాత కాక మీదుంది. ఏకంగా కేసీఆర్‌పైకే ఈట‌ల.. ఈటెల‌తో దూసుకొస్తుండ‌టంతో రాజ‌కీయం రంజుగా మారింది. బ‌స్తీ మే స‌వాల్ అంటూ ఇటు కేసీఆర్‌, అటు రాజేంద‌ర్‌.. సై అంటే సై అంటూ తొడ‌లు కొట్ట‌డంతో పోరుగ‌డ్డ మీద పొట్టేళ్ల పోట్లాట జోరుమీదుంది. కేబినెట్ నుంచి ఈట‌ల బ‌ర్త‌ర‌ఫ్‌.. భూక‌బ్జాల‌పై కేసులు, క‌మిటీలతో కేసీఆర్ మొద‌ట పావులు క‌దిపారు. కౌంట‌ర్‌గా ఈట‌ల బీజేపీతో చ‌ర్చ‌లు, ఢిల్లీ టూర్‌తో గులాబీ బాస్‌కు చెక్ పెట్టేందుకు సిద్ద‌మ‌య్యారు. గ్రౌండ్‌వ‌ర్క్ మొత్తం ప్రిపేర్ అయ్యాక‌.. తాను ఎమ్మెల్యే ప‌ద‌వికి, పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్టు అనుచ‌రుల‌ చ‌ప్ప‌ట్ల మ‌ధ్య ప్ర‌క‌టించారు ఈట‌ల రాజేంద‌ర్‌. ఇక అంతే. రోజులు గ‌డుస్తున్నా.. ఆయ‌న నుంచీ ఉలుకూ-ప‌లుకూ లేదు. ఇంకా ఎలాంటి ముంద‌డుగులూ ప‌డ‌లేదు. ప్రెస్‌మీట్లో రాజీనామాను ప్ర‌క‌టిస్తే స‌రిపోద్దా? దానికో ప‌ద్ద‌తి ఉంటుంద‌ని ఈట‌ల‌కు తెలియంది కాదు. అయినా, ఆయ‌న ఆ దిశ‌గా ఎలాంటి ప్ర‌య‌త్న‌మూ చేయ‌లేదు. ఇక్క‌డే ప‌లు ప్ర‌శ్న‌లు.. అంత‌కుమించి అనుమానాలు వినిపిస్తున్నాయి.  వారం రోజుల్లో ఈట‌ల బీజేపీలో చేరుతారు. గ‌తం వారం రోజులుగా వినిపిస్తున్న మాట ఇది. రోజులు గ‌డుస్తున్నాయి కానీ, ఈట‌ల మాత్రం రాజీనామా చేయ‌డం లేదు.. బీజేపీలోనూ చేర‌డం లేదు. అటు, టీఆర్ఎస్ నేత‌లు మాత్రం రాజీనామా చేస్తావా? పార్టీ నుంచి కూడా వెళ్ల‌గొట్ట‌మంటావా? అంటూ రెచ్చ‌గొడుతున్నారు. ఈట‌ల మాత్రం తుఫాను ముందు ప్ర‌శాంత‌త‌లా.. త‌న ప‌ని తాను చేసుకుపోతున్నారు. వేటాడే పులి.. రెండ‌డుగులు వెన‌క్కి వేసి దాడి చేసిన‌ట్టు.. ఈట‌ల రాజేంద‌ర్ త‌న బ‌లాన్ని, బ‌ల‌గాన్ని బేరీజు వేసుకుంటున్నారని అంటున్నారు. క్షేత్ర‌స్థాయిలో త‌న స‌త్తా ఎంతో మ‌రోసారి చెక్ చేసుకుంటున్నార‌ని చెబుతున్నారు. గులాబీ పార్టీ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు చేజారిన వారు ఎంద‌రు? ఈట‌లే త‌మ నాయ‌కుడంటూ త‌న వెంట కలిసి న‌డిచే అనుచ‌రులు ఎవ‌రు? తేల్చే ప‌నిలో ప‌డ్డారు. త‌న స‌త్తా, స‌త్తువా ఎంతో కేసీఆర్‌కు తెలిసొచ్చేలా బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌కు దిగుతున్నారు.  తాజాగా, టీఆర్‌ఎస్‌కు భారీ షాక్ ఇస్తూ.. 7 గ్రామాల సర్పంచ్‌లు, ఇద్దరు ఎంపీటీసీలు అధికార పార్టీకి రాజీనామా చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. వీణవంక మండలానికి చెందిన 7 గ్రామాల సర్పంచ్‌లు, వైస్‌ ఎంపీపీ, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్లు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. సోమవారం 12 గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులు, పలువురు కార్యకర్తలు టీఆర్ఎస్‌ను వీడారు. తామంతా ఈటల వెంటే ఉన్నామంటూ కేసీఆర్‌కు తెలిసొచ్చేలా.. వీణవంకలో ఈటలకు మద్దతుగా పదర్శన నిర్వహించడం విశేషం.   అటు.. ఈట‌ల సైతం త‌న సొంత ఇలాఖాలో బ‌ల ప్ర‌దర్శ‌నకు దిగారు. కమలాపూర్‌లో భారీ ఎత్తున‌ రోడ్‌షో నిర్వ‌హించారు. ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌ట‌న చేసిన త‌ర్వాత ఆయ‌న తొలిసారి నియోజకవర్గానికి వెళ్లారు. ఈటల మద్దతుదారులు, అభిమానులు ‘జై-ఈటల’ నినాదాలతో హోరెత్తించారు. మహిళలు మంగళహారతులతో ఈటలకు ఘన స్వాగతం పలికారు.  అభిమానుల జేజేల మ‌ధ్య ఈట‌ల సైతం కేసీఆర్‌పై హూంకరించారు. హుజూరాబాద్‌ నుంచే మరో ఉద్యమానికి నాంది ప‌లుకుతాన‌ని.. ఎత్తిన జెండా, బిగించిన పిడికిలితో ముందుకు సాగుతామని రాజేందర్ సింహ‌గ‌ర్జ‌న చేవారు.  హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ధర్మానికి, అధర్మానికి మధ్య సంగ్రామం జరగనుందని.. అందులో ధర్మానిదే విజయమని.. తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగురవేస్తామన్నారు ఈట‌ల రాజేంద‌ర్‌.  ఇలా, ఈట‌ల త‌గ్గేదే లే.. అంటూ కేసీఆర్‌పై దండ‌యాత్రకు రెడీ అవుతున్నారు. ఇదంతా స‌రే కానీ.. మ‌రి, రాజీనామా ఏమైంద‌ని గులాబీ శ్రేణులు ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌క‌ట‌న చేస్తే స‌రిపోతుందా.. స్పీక‌ర్‌కు ఫార్మాట్‌లో రాజీనామా లేఖ ఇవ్వ‌రా అంటూ నిల‌దీస్తున్నారు. రాజీనామా ప్ర‌క‌ట‌న చేసి ఇన్ని రోజులు అవుతున్నా.. 5 నిమిషాల ప‌నికి ఇంత ఆల‌స్యం ఎందుకు చేస్తున్నారా? అని ప్ర‌జ‌ల్లోనూ అనుమానం నెల‌కొంది. రాజీనామాతో పాటు బీజేపీలో చేరే అంశ‌మూ లేట్ అవుతుండ‌టంతో అస‌లు ఈట‌ల ఇంకా అదే స్టాండ్ మీద ఉన్నారా? లేక‌, స్ట్రాట‌జీ ఏమైనా మారుస్తున్నారా? అని చ‌ర్చించుకుంటున్నారు. ఈట‌ల‌, టీఆర్ఎస్ నేత‌లు ప‌ర‌స్ప‌రం చేసుకున్న విమ‌ర్శ‌ల‌ను చూస్తే.. ఆయ‌న ఒక్క‌క్ష‌ణం కూడా ఇక పార్టీలో, ప‌ద‌విలో కొన‌సాగ‌ర‌ని అంతా భావించారు. కానీ, ఈట‌ల మాత్రం నింపాదిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎమ్మెల్యే ప‌ద‌విలోనే కాదు.. ఇంకా టీఆర్ఎస్ స‌భ్యునిగానే ఉన్నారు రాజేంద‌ర్‌. ఆయ‌న ఆల‌స్యం చేస్తున్నా కొద్దీ.. అధికారపార్టీలో అస‌హ‌నం పెరిగిపోతోంది. ఈట‌ల రాజీనామా చేసే వ‌ర‌కూ ఆగాలా? లేక‌, ఉన్న‌ప‌ళంగా వేటు వేసేయాలా అనే చ‌ర్చ కూడా కారు పార్టీలో జ‌రుగుతోంద‌ట‌.  అయితే, రాజీనామా విష‌యంలో ఈట‌ల వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నార‌ని అంటున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న‌ రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు కాబ‌ట్టి.. ఈట‌లనే పార్టీని, ప‌ద‌విని తృణ‌ప్రాయంగా వ‌దిలేశార‌ని ప్ర‌జ‌ల్లో ముద్ర‌ప‌డిపోతుంది. ఆల‌స్యం అవుతున్నా కొద్దీ.. ఈట‌ల ఎపిసోడ్ నిత్యం జ‌నాల నోళ్ల‌ల్లో నానుతుంటుంది. ఆ మేర‌కు త‌న‌కు ఇమేజ్‌తో పాటు సానుభూతి పెరుగుతుంది. ఆ లోగా.. త‌న బ‌లాన్ని, బ‌ల‌గాన్ని స‌మీక‌రించుకోడానికి స‌మ‌య‌మూ చిక్కుతుంది. అంతా ఓకే అయ్యాక‌.. ఎమ్మెల్యేగా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌నుల‌న్నీ చ‌క్క‌బెట్టుకున్నాక‌.. ఇక సరైన స‌మ‌యంలో కార్య‌చ‌ర‌ణ అమ‌లు చేసేలా ఈట‌ల వ్యూహ‌ర‌చ‌న చేస్తున్నార‌ని ఆయ‌న స‌న్నిహితుల నుంచి తెలుస్తోంది. ఈలోగా కేసీఆర్ త‌న‌పై వేటు వేస్తే.. ఆ మేర‌కు అద‌న‌పు సానుభూతి సైతం త‌న‌కు క‌లిసొస్తుంది. ఒక‌వేళ తాను ఇప్ప‌టికిప్పుడు రాజీనామా చేసినా.. వెంట‌నే ఉప ఎన్నిక వ‌చ్చే ప‌రిస్థితి కూడా లేదు. మ‌రో ఆరు నెల‌లో.. అంత‌కు మించి స‌మ‌య‌మో ప‌ట్టే అవ‌కాశం ఉంది. అంత ఆల‌స్యంగా జ‌రిగే ఎన్నిక‌కు.. ఇప్పుడే హ‌డావుడిగా రాజీనామా చేయాల్సిన అవ‌స‌ర‌మేమీ లేద‌న్న‌ది ఈట‌ల రాజేంద‌ర్ అంత‌రార్థంగా అనిపిస్తోంది. అందుకే, రాజీనామా విష‌యంలో ఈట‌ల ఏమాత్రం తొంద‌ర‌ప‌డ‌టం లేద‌ని.. స్లో అండ్ స్ట‌డీగా.. వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు. ఏది ఏమైనా.. ఎవ‌రి విశ్లేష‌ణ ఎలా ఉన్నా.. ఈట‌ల రాజీనామాపై త్వ‌ర‌లోనే స్ప‌ష్ట‌త రావ‌డం మాత్రం ఖాయం. అప్పుడుంటుందిక అస‌లైన‌ పోరు తెలంగాణం... 

కురుక్షేత్ర యుద్ధంలో గెలుపు నాదే! కేసీఆర్ కాస్కో అన్న రాజేందర్.. 

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచే తెలంగాణలో కొత్త శ‌కం రాబోతుందన్నారు ఈటల రాజేందర్. రాష్ట్రంలో మ‌రో ఉద్య‌మం మొదలైందన్నారు. హుజురాబాద్ గెలుపే ఆత్మ‌గౌర‌వంపై పోరాడుతున్న వారి గెలుపు అవుతుందన్నారు. తెలంగాణ ఉద్య‌మకారులు, ఆత్మ‌గౌర‌వం కోసం పోరాడుతున్న వారు రాష్ట్రంలో త‌మ ప్రాంతాల‌ను కాపాడుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారుని.. వాళ్లంతా హుజురాబాద్‌కి వ‌చ్చి  తనకు  మ‌ద్ద‌తు తెల‌పాలని ఈటల పిలుపిచ్చారు. తెలంగాణ‌లో నీతి, నిజాయ‌తి కాకుండా అవినీతి, మ‌భ్య‌పెట్టే తీరుతో పాల‌న కొన‌సాగుతోందని ఈట‌ల ఆరోపించారు. అక్ర‌మంగా సంపాదించుకున్న వంద‌ల కోట్ల రూపాయ‌ల‌ను వాడుకుంటూ కొంద‌రు నాయ‌కుల‌ను ఇబ్బంది పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారని మండిపడ్డారు. గొర్ల మంద‌ల మీద తొడేళ్లు ప‌డ్డ‌ట్లుగా తన మ‌ద్ద‌తు దారుల‌పై దాడులు చేస్తున్నారని చెప్పారు. బ్లాక్ మెయిల్ చేసినా, దాడులు చేసినా తన వారిని కొన‌లేరని ఈట‌ల తేల్చిచెప్పారు. 19 ఏళ్ల పాటు గులాబీ జెండాను, తెలంగాణ ఉద్య‌మాన్ని గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటే తెలంగాణ ద్రోహుల‌ను ప‌క్క‌కు పెట్టుకుని, క‌ష్ట‌కాలంలో అండ‌గా ఉన్న తన లాంటి వారికి కేసీఆర్‌ ద్రోహం చేస్తున్నార‌ని చెప్పారు.  ప్ర‌గ‌తి భ‌వ‌న్ కేంద్రంగా స్క్రిప్టులు రాసి ఇస్తే కొంద‌రు తనపై ఆరోపణలు చేస్తున్నారని ఈటల అన్నారు. తాను ఏంటో తెలంగాణ ప్ర‌జ‌ల‌కు తెలుసని.. తన గురించి తప్పుడు వ్యాఖ్య‌లు చేస్తే వారే న‌ష్ట‌పోతారని చెప్పారు. త‌న‌ రాజీనామా త‌ర్వాత వ‌చ్చే ఎన్నిక‌లో కేసీఆర్‌కు ప్ర‌జ‌లు బుద్ధి చెప్పి తీరుతార‌ని ఈట‌ల‌ అన్నారు.అక్ర‌మంగా సంపాదించిన డ‌బ్బుతో ఓట‌ర్ల కొనుగోలుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఈటల ధ్వజమెత్తారు. హుజూరాబాద్  నియోజ‌క వ‌ర్గంలో జ‌రిగే సంగ్రామం కౌర‌వుల‌కు, పాండ‌వుల‌కు మ‌ధ్య జ‌రిగిన కురుక్షేత్ర యుద్ధంలా ఉంటుంద్న  ఈట‌ల.. కేసీఆర్ విజ‌యం సాధించే అవ‌కాశం లేద‌ని చెప్పారు.  టీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నాన‌ని ప్ర‌క‌టించిన త‌ర్వాత త‌న సొంత హుజూరాబాద్ నియోజ‌క వ‌ర్గంలో తొలిసారి ప‌ర్య‌టిస్తున్న ఈట‌ల రాజేంద‌ర్.. శంభునిప‌ల్లి నుంచి క‌మ‌లాపూర్ వ‌ర‌కు ద్విచ‌క్ర వాహ‌నాల‌తో భారీ ర్యాలీలో నిర్వ‌హించారు. కొంద‌రు వ్య‌క్తులు ఈ రోజు టీఆర్ఎస్ తొత్తులుగా, బానిస‌లుగా మారిపోయి నా మ‌ద్ద‌తుదారులు, ప్ర‌జ‌ల‌పై ఆరోప‌ణ‌లు చేస్తూ అవ‌మానిస్తున్నారు. రాజ‌కీయంగా మిమ్మ‌ల్ని బొంద పెడ‌తాం అంటూ రాజేందర్ ఈ సందర్భంగా హెచ్చరించారు. 

కేసీఆర్ నెక్స్ట్ టార్గెట్ రెడీ! ఆ మంత్రికి ఊస్టింగేనా? 

తెలంగాణ రాజకీయాలన్ని కొన్ని రోజులుగా ఈటల రాజేందర్ చుట్టే తిరుగుతున్నాయి. మంత్రివర్గం నుంచి ఈటలను కేసీఆర్ తొలగించడం కాక రేపింది. కేసీఆర్ తీరుపై రగిలిపోయిన రాజేందర్.. భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘ చర్చలు జరిపారు. కొత్త పార్టీ పెట్టాలని ప్రయత్నించినా..చివరకి కమలం గూటికి చేరాలని డిసైడయ్యారు. ఇటీవల గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పిన ఈటల.. త్వరలో అధికారికంగా కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈటలకు రాజకీయంగా ఇబ్బందులు పెట్టేలా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారని తెలుస్తోంది. ఈటల రాజీనామాతో జరగబోయే హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం ఇప్పటికే ఆపరేషన్ మొదలుపెట్టారని చెబుతున్నారు. ఈటలను తొలగించిన కేసీఆర్.. త్వరలో మరో మంత్రిని టార్గెట్ చేయనున్నారనే ప్రచారం తెలంగాణ భవన్ లో జోరుగా సాగుతోంది. కొన్ని రోజులుగా ఆ మంత్రి తీరును గమనిస్తున్న గులాబీ బాస్.. త్వరలోనే చెక్ పెట్టనున్నారని సమాచారం. ఉద్యమం నుంచి కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న సదరు మంత్రి... కొన్ని రోజలుగా కేసీఆర్ దగ్గరకు రావడం లేదని చెబుతున్నారు. కేబినెట్ సమావేశాలు, జిల్లాకు సంబంధించిన పాలనా వ్యవహారాలు తప్ప.. కేసీఆర్ ను కలవడం లేదని తెలుస్తోంది. కేసీఆర్ ఆదేశాలతోనే సదరు మంత్రిని ప్రగతి భవన్ లోనికి రానివ్వడం లేదనే చర్చ టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లోనే జరుగుతోంది. సీఎం కేసీఆర్ తర్వాత వేటు వేస్తారనే ప్రచారం జరుగుతున్న ఆ మంత్రి ఎవరో కాదు.. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన జగదీశ్ రెడ్డి. అవును కేసీఆర్ కు మొదటి నుంచి అత్యంత సన్నిహితంగా ఉన్న జగదీశ్ రెడ్డిపైనే త్వరలో వేటు పడనుందని తెలుస్తోంది. ఇందుకు ఆయన నిర్వహించిన ఓ కార్యక్రమమే కారణమంటున్నారు. ఈ సంవత్సరం జనవరిలో మంత్రి జగదీశ్ రెడ్డి.. కర్ణాటకలోని హంపిలో ఓ పార్టీ ఏర్పాటు చేశారట. తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా అరేంజ్ చేసిన ఆ పార్టీకి నల్గొండ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు హాజరయ్యారట. ఆ సమావేశంలోనే కేసీఆర్ పనితీరుపై చర్చ జరిగిందని తెలుస్తోంది. కొందరు నేతలు కేసీఆర్ కుటుంబంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని సమాచారం.  జగదీశ్ రెడ్డి పార్టీలో పాల్గొన్న నేతలు కేసీఆర్ ప్యామిలీ విషయాలతో పాటు ఈటల రాజేందర్ వ్యవహారంపైనా చర్చించారట. అప్పటికే పలుసార్లు రాజేందర్.. కేసీఆర్ ను టార్గెట్ చేసేలా మాట్లాడారు. ఈటల విషయాన్ని ప్రస్తావిస్తూ.. కేసీఆర్ మోనార్క్ లా వ్యవహరిస్తున్నారని కొందరు ఎమ్మెల్యేలు లూజ్ టాక్ చేశారని సమాచారం. ఈటల సొంత పార్టీ పెట్టే అవకాశం ఉందని కూడా మాట్లాడుకున్నారట. జగదీశ్ రెడ్డికి కూడా కేసీఆర్ ప్రాధాన్యత ఇవ్వడం లేదని కొందరు మాట్లాడారని తెలుస్తోంది. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు మాట్లాడుతున్నా జగదీశ్ రెడ్డి వారించలేదని తెలుస్తోంది. మంత్రి సైలెంటుగా ఉండటంతో కొందరు ఎమ్మెల్యేలు, నేతలు రెచ్చిపోయి కేసీఆర్ పై మాట్లాడారని కూడా తెలుస్తోంది.  కర్ణాటక హంపిలో జరిగిన పార్టీలో జగదీశ్ రెడ్డితో పాటు ఆయన వర్గంగా చెప్పుకునే ఎమ్మెల్యేలు, నాయకుల వ్యవహారం పూర్తిగా కేసీఆర్ కు చేరిందంటున్నారు. హంపి వీడీయో పూటేజ్ ను పరిశీలించిన కేసీఆర్.. జగదీశ్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగాల్సి ఉండటంతో కూల్ అయ్యారని చెబుతున్నారు. ఇప్పుడు తనకు వ్యతిరేకంగా ఉన్నవారిని ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తున్న గులాబీ బాస్.. ఈటల రాజేందర్ ను సాగనంపారు. త్వరలోనే జగదీశ్ రెడ్డిపై వేటు వేయనున్నారని తెలంగాణ భవన్ లోనూ గుసగుసలు వినిపిస్తున్నాయి. 

సీఎం జగన్‌రెడ్డికి ఆనందయ్య లేఖతో క‌ల‌క‌లం.. స‌ర్కారు ఘోర వైఫ‌ల్యం.. చంద్ర‌బాబు సీఎంగా ఉంటేనా..!

సీఎం జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వ చేత‌గానిత‌నం అన్ని విష‌యాల్లోనూ కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంద‌నే విమ‌ర్శ‌లు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. క‌రోనా క‌ట్ట‌డిలో చేతులెత్తేసిన స‌ర్కారు.. క‌నీసం ఆ క‌రోనా రాకుండా చేసే అవ‌కాశం ఉన్న ఆనంద‌య్య మందుకైనా ప్రోత్సాహం ఇవ్వ‌కుండా నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని మండిప‌డుతున్నారు. ఆనంద‌య్య త‌న మానాన తాను నిత్యం వేలాది మందికి ఉచితంగా మందు పంపిణీ చేస్తుంటే.. మ‌ధ్య‌లో ప్ర‌భుత్వం జోక్యం చేసుకొని వార‌ల త‌ర‌బ‌డి మందును ఆపేసింది. ఆ ప‌రీక్ష‌లు, ఈ ప‌రీక్ష‌లు చేసి.. అంతా ఓకే ఆయ్యాక కూడా మ‌రో వారం పాటు ఆల‌స్యం చేసింది. ఈలోగా వేల‌ది మంది.. క‌రోనా బారిన ప‌డ‌టానికి ప‌రోక్షంగా కార‌ణ‌మైంది. ప‌దుల సంఖ్య‌లో ప్రాణాలు పోయాయి. ఆనంద‌య్య మందును అప్పుడే య‌ధావిదిగా పంపిణీ చేయ‌నిస్తే... ఇప్ప‌టికే ఆ మందు తీసుకున్న వారి సంఖ్య ల‌క్ష‌ల్లో ఉండేది.  క‌రోనా విజృంభించాక‌.. ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చాక‌.. ఇటీవ‌ల మ‌ళ్లీ మందు పంపిణీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అంతే. త‌న వంతుగా ఇంకేమీ చేయ‌లేదు. ఆనంద‌య్య మందు ఉత్ప‌త్తి పెంచ‌డానికి కానీ, మ‌రింత మంది ప్ర‌జ‌ల‌కు ఆ సంజీవ‌నిని చేరువ చేయ‌డానికి కానీ.. జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం చేసిందేమీ లేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. చేయాల్సింది చేయ‌క‌పోగా.. ఆనంద‌య్య‌ను, ఆయ‌న మందును హైజాక్ చేశారంటూ ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. మా ఆనంద‌య్య మందును మాకు దూరం చేశారంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కాకాని.. ముందుగా త‌న స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గానికి మాత్ర‌మే మందు పంపిణీ చేయిస్తున్నారు. మ‌రో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి.. ఆనంద‌య్య కుమారుడిని త‌న గుప్పిట్లో పెట్టుకొని.. త‌న ప్రాంత ప్ర‌జ‌ల‌కే మందును అందుబాటులో ఉంచారు. పైగా ఆనంద‌య్య ఫోటో లేకుండా.. వైఎస్సార్‌, వైఎస్ జ‌గ‌న్‌, చెవిరెడ్డి ఫోటోల‌తో ఉన్న బాక్సుల్లో ఆ మందును స‌ర‌ఫ‌రా చేస్తుండ‌టం తీవ్ర విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. అంద‌రి వాడైన ఆనంద‌య్య‌ను కొంద‌రి వాడిని చేసి.. ప్ర‌జ‌లంద‌రికీ అందాల్సిన మందును.. కొంద‌రికే ప‌రిమితం చేసి.. క‌రోనా స‌మ‌యంలో కుళ్లు రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్నార‌ని జ‌నాలు జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారును అస‌హ్యించుకుంటున్నారు.  ఆనంద‌య్య సైతం లోలోన కుమిలిపోతున్నా.. కోపంతో ర‌గిలిపోతున్నా.. ప్ర‌భుత్వానికి, వైసీపీ పాల‌కుల‌కు భ‌య‌ప‌డి.. పైకి మాత్రం మామూలుగా ఉన్న‌ట్టు క‌నిపిస్తున్నారు. ఎక్క‌డ ఏ మాట అంటే.. మ‌ళ్లీ త‌న మందును ప్ర‌జ‌ల‌కు కాకుండా చేస్తారోన‌ని తెగ ఆందోళ‌న చెందుతున్నారు. అయినా.. ఉండ‌బ‌ట్ట‌లేక‌.. జ‌రుగుతున్న అన్యాయాన్ని గ‌ట్టిగా ప్ర‌శ్నించ‌లేక‌.. కాస్త మెత‌క వైఖ‌రి ప్ర‌ద‌ర్శిస్తూ.. త‌న‌కు ప్ర‌భుత్వ ప్రోత్సాహం అందించాలంటూ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డికి లేఖ రాయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఆయ‌న ఎంత ఇబ్బంది ప‌డుతుంటే.. ఆయ‌న ఎంత క‌ష్ట, న‌ష్టాల‌కు ఓరుస్తుంటే.. ఇక త‌న వ‌ల్ల కాద‌ని.. సర్కారు సాయం చేయాల్సిందేన‌ని.. నేరుగా సీఎంకే లేఖ రాసుంటార‌ని అంటున్నారు.   ఔష‌ధం త‌యారీ సామ‌గ్రి త‌దిత‌రాల‌కు స‌హ‌కారం అందించాల‌ని లేఖ‌లో ముఖ్య‌మంత్రిని కోరారు ఆనంద‌య్య‌. ఎక్కువ మొత్తంలో మందును త‌యారు చేసి ఇత‌ర రాష్ట్రాల‌కు సైతం పంపిణీ చేసే విధంగా స‌హాయ‌స‌హ‌కారాలు అందించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. మందు తయారీకి విద్యుత్ సౌక‌ర్యం ఉన్న కేంద్రం ఏర్పాటు చేయాల‌ని ఆనంద‌య్య లేఖ‌లో రాసిన‌ట్టు తెలుస్తోంది.  ఏపీలో జ‌గ‌న్‌రెడ్డి కాకుండా చంద్ర‌బాబు సీఎంగా ఉండి ఉంటేనా.. ఈ పాటికి ఆనంద‌య్య మందు ఇంట‌ర్నేష‌నల్‌గా ఫేమ‌స్ అయి ఉండేద‌ని ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు. జిల్లా జిల్లాకు ప్ర‌త్యేక భ‌వ‌నాలను కేటాయించి.. ప్ర‌భుత్వ అట‌వీ శాఖ సిబ్బందితో మందు త‌యారీకి కావ‌ల‌సిన వ‌న‌మూలిక‌ల‌ను స‌మ‌కూర్చి.. ఆనంద‌య్య‌తో పాటు ఆయ‌న శిష్యుల‌తో ఎక్క‌డిక‌క్క‌డ‌.. ప్ర‌భుత్వ ఆధ్య‌ర్యంలో మందు త‌యారీ కార్య‌క్ర‌మం యుద్ధ‌ప్రాతిప‌దిక‌న చేసుండేవార‌ని అంటున్నారు. ఆనంద‌య్య మందు కోసం ఆన్‌లైన్ బుకింగ్స్ ఏర్పాటు చేసి.. ప్ర‌త్యేక కోడ్ కేటాయించి.. ముందే టైమ్ నిర్ణ‌యించి.. ఆనంద‌య్య మందును డోర్ డెలివ‌రీ చేయించేవార‌ని.. ఏపీతో పాటు ఇత‌ర రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కూ ఆనంద‌య్య మందును చేరువ చేసేవార‌ని.. చంద్ర‌బాబు వ‌ర్కింగ్‌స్టైల్ తెలిసిన వారంతా అంటున్నారు. కానీ, ఏం చేస్తాం.. జ‌గ‌న్‌రెడ్డిని అంద‌లం ఎక్కించినందుకు అనుభ‌విస్తున్నాం అని అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.  ఆనంద‌య్య మందు కోసం సీఎం జ‌గ‌న్‌రెడ్డి త‌ర‌ఫున ఒక్క‌టంటే ఒక్క ప్రోత్సాహ‌క‌మైనా ల‌భించిందా అని ప్ర‌జ‌లు నిల‌దీస్తున్నారు. క‌నీసం, మందు త‌యారీకి అవ‌స‌ర‌మైన వ‌న‌మూలిక‌ల‌ను, సామాగ్రిని, క‌రెంట్ స‌ర‌ఫ‌రాను సైతం అందించ‌లేని ప్ర‌భుత్వం ఉండి ఏం ప్ర‌యోజ‌నం అంటూ జ‌నం తీవ్ర‌ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ పార్టీ నేత‌లే ఆనంద‌య్య‌ను క‌ట్ట‌డి చేస్తూ.. కేవ‌లం రెండు నియోజ‌క‌వ‌ర్గ‌ ప్ర‌జ‌ల‌కే మందును పంపిణీ చేస్తున్నా.. సీఎం జ‌గ‌న్ ఉదాసీనంగా ఉండ‌టం దారుణమంటున్నారు. ఏపీ ప్ర‌జ‌లంతా మీ ప్ర‌జ‌లు కాదా? అని నిల‌దీస్తున్నారు. మందు త‌యారీ ఆనంద‌య్య వ‌ల్ల కాక‌.. సీఎం జ‌గ‌న్‌రెడ్డికి లేఖ రాసేవ‌ర‌కూ ప‌రిస్థితి దిగ‌జారడం దారుణ‌మ‌న్నారు. ఇప్ప‌టికే కొవిడ్ మందులు, ఆక్సిజ‌న్ సిలెండ‌ర్లు, ఆసుప‌త్రి బెడ్లు, వ్యాక్సిన్లు.. ఇలా క‌రోనా క‌ట్ట‌డి విష‌యంలో ఘోరంగా విఫ‌ల‌మైన సీఎం జ‌గ‌న్‌రెడ్డి.. ఉచితంగా ఇస్తూ, క‌రోనా పాలిట సంజీవ‌నిగా మారిన ఆనంద‌య్య మందు పంపిణీ విష‌యంలోనూ వైఫ‌ల్యం చెంద‌డం ముఖ్య‌మంత్రి చేత‌గానిత‌నానికి నిద‌ర్శ‌న‌మంటున్నారు ప్ర‌జ‌లు.  మ‌రో వైపు.. మంగ‌ళ‌వారం నెల్లూరు జిల్లాలోని మునుబోలు మండ‌లంలో ఆనందయ్య మందును పంపిణీ చేస్తున్నారు. కేవలం సర్వేపల్లి వాసులకు మాత్రమే మందు పంపిణీ కొన‌సాగుతోంది. వాలంటీర్ల ద్వారా ఔష‌ధాన్ని ఇంటింటికీ చేర‌వేస్తున్నారు. మందు కోసం ఇత‌ర ప్రాంతాల వారిని అనుమ‌తించ‌డం లేదు పోలీసులు. కృష్ణ‌ప‌ట్నం పంచాయ‌తీ ప‌రిధిలో 144 సెక్ష‌న్ అమ‌లును కొనసాగిస్తున్నారు.    ఆనంద‌య్య ఔష‌ధంలో ఒక‌టైన కె ర‌కానికి హైకోర్టు అనుమ‌తి ఇచ్చిన నేప‌థ్యంలో మందును రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ అంద‌జేయ‌డానికి ప్ర‌భుత్వం స‌హ‌కారం కావాల‌ని.. ప్ర‌భుత్వం నుంచి త‌న‌కు సాయం అందడం లేద‌ని ఆనంద‌య్య ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. తాజాగా, సీఎం జ‌గ‌న్‌రెడ్డికి ఆ మేర‌కు లేఖ రాయ‌డం సంచ‌ల‌నంగా మారింది.   

కోడలిని రూ. 80 వేలకు బేరం పెట్టిన మామ 

ఒక వైపు అడ్డవాళ్లకు సమాన హక్కులు కల్పించాలని. చట్ట సభల్లో అదే ఆడవాళ్లకు వారి జనాభా తరుపున రిజర్వేషన్ అవకాశం కల్పించాలని.  ఆడవాళ్లను నింగిలో సగం నెలలో సగం  అంటూ కవులు రాస్తున్నారు. ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న సమాజంలో మహిళలు కూడా అన్ని రంగాల్లో మగవాళ్ళతో సమానంగా పనిచేస్తున్నారు. నేటి సమాజంలో లో మహిళలపై ఉన్న ఓ కోణం ఇది అయితే.. ఆడవాళ్లు అంటే వంటింటి బానిసలే.. మగాడి చెప్పుచేతుల్లో మగ్గాల్సిందే అనేది మరో కోణం అయితే.. ఈ సమాజంలో మరో చీకటి కోణం కూడా ఉంది ఆడవాళ్లు అంటే మగాడి కోరికలు తీర్చే వస్తువుగా మాత్రమే కొంత మంది చూస్తారు. తాజాగా ఒక మహిళను సూపర్ మార్కెట్ లో సరుకు అమ్మినట్లు అమ్మనలేకున్నాడు ఒక దుర్మార్గుడు.. ఆడవాళ్లను అమ్మడం ఏంటి అమ్మడానికి ఆవిడ ఏమైనా అంగట్లో ఉల్లిపాయనా, ఉసిరికాయనా అని అనుకుంటున్నారా మీరే చుడండి అసలు ఏం జరిగిందో..  అతని పేరు చంద్ర రామ్. కొన్నీ రోజులుగా అతనికి  కోడలిని ఒక ముఠాకి అమ్మాలని పధకం వేశాడు. అందుకు అన్ని ఒప్పందాలు చేసుకున్నాడు.  రూ. 80 వేలకు విక్రయించాలని ప్రయత్నించాడు. ఈ విషయం తెలిసిన ఆమె భర్త పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. తీగలాగితే డొంక అంత బయట పడేట్లు ఈ ఒక విషయం తో మిగతా మొత్తం ముఠా దొరికింది. వివరాల ప్రకారం.. యూపీలోని బారాబంకీ జిల్లాలో మల్లాపూర్‌కు చెందిన చంద్రరామ్ అనే వ్యక్తి గుజరాత్‌కు చెందిన ఓ ముఠాతో ఒప్పందం కుదుర్చుకుని తన కోడలిని రూ. 80 వేలకు విక్రయించాడు. ఈ విషయం కాస్త మహిళ భర్తకు తెలియడంతో.. బాధితురాలి భర్త వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. అప్రమత్తమైన పోలీసులు రైల్వే స్టేషన్‌కు చేరుకుని బాధితురాలిని కాపాడారు. అనంతరం 8 మంది ఉన్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఈ ముఠా ఇప్పటి వరకు 300 మంది మహిళలను ఇలా కొనుగోలు చేసినట్టు పోలీసులకు తెలియడంతో వారు ఒక్కసారిగా షాకయ్యారు. పోలీసులు అరెస్ట్ చేసిన ముఠాలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ముఠాలో ప్రధాన నిందితుడు బాధితురాలి మామ చంద్రరామ్‌ ప్రస్తుతం పరారీలో ఉండగా పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనన ఉత్తరప్రదేశ్‌లో  చోటుచేసుకుంది. 

ప్రధాని మోడీకి జగన్ మరో లేఖ.. ఎందుకో తెలుసా? 

కేంద్ర ప్రభుత్వానికి లేఖల మీద లేఖలు రాస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కొవిడ్ వ్యాక్సిన్ విషయంలో ఇటీవలే ప్రధాని మోడీ నాలుగైదు లేఖలు రాశారు. వ్యాక్సిన్ కేటాయింపు, గ్లోబల్ టెండర్లపైనా కేంద్రానికి లేఖలు రాశారు. తాజాగా ప్రధాని నరేంద్రమోడీకి మరో లేఖ రాశారు సీఎం జగన్. ఈసారి ఆయన  ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) పథకంలో రాష్ట్రానికి అదనపు సాయం కోసం కేంద్రాన్ని అభ్యర్థించారు.  ప్రధాని మోడీకి జగన్ రాసిన లేఖలో ఏముందంటే..  ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రపంచంలోనే ఉత్తమ పథకం. ఈ పథకం ద్వారా... 2022 నాటికి పేదవాళ్లకు పక్కా ఇళ్లు కల్పించాలి. అప్పటికి ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. అందరికీ ఇళ్లు ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ PMAYని తెచ్చింది. ఇందులో భాగంగా... హౌసింగ్ కాలనీల అభివృద్ధి భారీ ఎత్తున జరుగుతోంది. గత 7 ఏళ్లలో 308.2 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.2.99 లక్షల కోట్ల సాయం చేసింది. ఈ పథకంలో 3 కీలక అంశాలున్నాయి. 1.లబ్దిదారులకు స్థలాలు కేటాయించడం 2.కేటాయించిన స్థలంలో ఇల్లు కట్టుకునేలా లబ్దిదారులకు ప్రభుత్వం సాయం చేయడం 3.రోడ్లు, కరెంటు, నీటి సప్లై, డ్రైనేజ్ సదుపాయాలను కాలనీల్లో నిర్మించడం. అందరికీ ఇళ్లు అనే కేంద్రం ఆలోచనను ముందుకు తీసుకెళ్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 68,381 ఎకరాల స్థలాన్ని ఈ పథకం కోసం కేటాయించింది. మొత్తం 17,005 గ్రీన్ ఫీల్డ్ కాలనీల్లో... 30.76 లక్షల మంది లబ్దిదారులు ప్రయోజనం పొందబోతున్నారు. ఇందుకు అంచనా వ్యయం రూ.23,535 కోట్లు అవుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లబ్దిదారులు 28.30 లక్షల పక్కా ఇళ్లు కట్టుకునేలా సాయం చేస్తోంది. ఇందుకు అంచనా వ్యయం రూ.50,944 కోట్లు కానుంది. ఇళ్ల నిర్మాణం అత్యంత నాణ్యంగా ఉండేలా చేసేందుకు రెండు పోస్టులను ఏపీ ప్రభుత్వం సృష్టించింది. 2022 నాటికి ఈ ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందనే ఆశతో తాను ఉన్నట్లు ఏపీ సీఎం జగన్ తన లేఖలో తెలిపారు. ఐతే... మౌలిక వసతులు కల్పించకుండా ఇళ్లు నిర్మిస్తే సరిపోదన్న సీఎం జగన్... మౌలిక వసతుల నిర్మాణానికి రూ.34,109 కోట్లు అంచనా వ్యయం అవసరం అవుతుందన్నారు. ఇంతటి భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించలేదన్న సీఎం జగన్... ఈ విషయాన్ని పరిశీలించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఇళ్ల నిర్మాణం పూర్తైనా... మౌలిక వసతులు లేకపోతే... ప్రయోజనం ఉండదు అన్నారు. పెట్టిన ఖర్చంతా వేస్ట్ అవుతుందన్నారు, ఈ విషయాన్ని పరిశీలించి... పట్టణాభివృద్ది శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల వారితో చర్చించి... గ్రీన్ ఫీల్డ్ కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిందిగా చర్యలు తీసుకోవాలని వినతి.  ఇదీ ప్రధాని మోడీకి  సీఎం జగన్ రాసిన లేఖ. ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్థనపై కేంద్రం ఎలా స్పందిస్తున్నది త్వరలో తేలనుంది. ఇటీవలే ఏపీలో ఇళ్ల నిర్మాణ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. తొలి విడతలో 15 లక్షలపైగా ఇళ్ల నిర్మాణం కోసం సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. 

నీటిలో నిరాహార దీక్ష.. 

నిరసన ఏవైనా ఏ రోడ్డు మీదో.. లేదంటే ప్రభుత్వ కార్యాలయం ముందో.. లేదంటే ధర్నా చౌక్ లోనో చేస్తారు.. కానీ వీళ్ళు మాత్రం చాలా కొత్తగా తమ నిరసనను తెలిపారు.. అది ఏంటో తెలిస్తే మీకు నిరసన ఇలా కూడా చేయొచ్చా అని అనుకుంటారు.. మాకెందుకు ఇలాంటి ఐడియా రాలేదని మరికొందరు అనుకోవడం కాయం.. ఇంతకీ ఆ నిరసన ఎందుకు చేశారో తెలుసా ఆ ప్రాంతంలో మద్యం నిలిపివేయాలని.. మాంసాహారాన్ని నిషేధించాలని.. దాదాపు 12 గంటలు నీరసం చేయడమే గగనం అంటే.. వాళ్ళు ఆ నిరసన ఎక్కడ చేశారో మీరే చూడండి..  అది లక్షద్వీప్‌. ఆ ప్రాంతంలో ప్రతిపాదిత కొత్త చట్టాలకు వ్యతిరేకంగా లక్షద్వీప్, కేరళలో నిరసనలు కొనసాగుతున్నాయి. లక్షద్వీప్ పరిపాలనాధికారి (అడ్మినిస్ట్రేటర్) ప్రఫుల్ పటేల్‌ను తొలగించడంతోపాటు వివాదాస్పద ఎల్డీఏఆర్ బిల్లును ఉపసంహరించుకోవాలని ‘సేవ్ లక్షద్వీప్ ఫోరం’ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు  భారీ స్థాయిలో ఆందోళన చేపట్టారు. ఏకంగా వాళ్ళ నీరసం సెగలు సముద్ర గర్భంలో వినిపించాయి.. సముద్ర గర్భంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 12 గంటలపాటు నిరాహార దీక్ష చేపట్టారు. ప్రఫుల్ పటేల్‌కు వ్యతిరేకంగా కేరళ ప్రతిపక్ష పార్టీలు కూడా నిరసన గళం వినిపిస్తున్నాయి. లక్షద్వీప్‌లో ముస్లింలు ఎక్కువగా ఉన్న దీవుల్లో మద్యాన్ని, మాంసాన్ని నిషేధించారని, తీర ప్రాంతాల్లో జాలర్ల గుడిసెలను కూల్చివేయించారని ఆరోపించాయి. ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఎంపీలు కొచ్చిలోని లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు.

మృగశిర కార్తె .. చేపలు తినాల్సిందే! ఫిష్ మార్కెట్లలో ఫుల్ రష్.. 

నేటి నుంచి (జూన్‌ 8) నుంచి మృగశిర కార్తె ప్రారంభం కానుంది. ఆశ్విని మొదలుకుని రేవతి వరకూ మనకున్న 27 నక్షత్రాల్లో సూర్యుడి ప్రవేశం ఆధారంగా కార్తె నిర్ణయం జరుగుతుంది. చంద్రుడు ఒక్కొక్క నక్షత్రం సమీపంలో 14 రోజుల పాటు ఉంటాడు. ఏ నక్షత్రంలో సమీపంలో ఉంటే ఆ కార్తెకు ఆ పేరు పెడతారు. అశ్వినితో మొదలై రేవతితో ముగిసే వరకూ 27 నక్షత్రాల పేర్లతో కార్తెలున్నాయి. ప్రస్తుతం మృగశిర నక్షత్రానికి చేరువలో చంద్రుడు ఉండటం వల్ల దీనికి మృగశిర కార్తె అనే పేరు వచ్చింది. ఈ క్రమంలో సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించిన నాటినుంచి నైరుతి రుతుపనాలు వస్తాయి. వాతావరణం ఒక్కసారి చల్లబడటం, ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలతో సతమతమవుతుంటారు. కార్తెలో వచ్చే నైరుతి రుతుపవనాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఉపశమనం కలుగుతుంది. ఈ మృగశిర కార్తెలో రైతులు ఏరువాక సాగే కాలం అని కూడా ఉంటుంటారు. ఏరువాక అంటే నాగటి చాలు. ఈ కాలంలో రుతుపవనాలు విస్తరించి తొలకరి వర్షాలు పడగనే రైతులు పొలాన్ని దున్ని పంటలు వేయడం ప్రారంభిస్తారు. మృగశిర కార్తె మొదటి రోజును దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మృగశిర, మృగం, మిరుగు, మిర్గం అనే పేర్లతో పిలుస్తారు.  ఈ కార్తె రోజు చేపలకు ఎందుకంత ప్రాముఖ్యత.. మృగశిర కార్తె రోజున చేపలు తినడాన్ని మన పూర్వీకుల నుంచి ఆనాదిగా వస్తోంది. దీని వెనుక ఆరోగ్య రహస్యం దాగివుంది. ఎండకాలం తర్వాత వాతావరణం చల్లబడటంతో మన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీంతో వేడి ఉండేందుకు చేపలను తింటారు. దీని వల్ల గుండె జబ్బులు, ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది. అంతేకాకుండా ఈ కార్తె రావడంతో వర్షాలు మొదలు కానున్న నేపథ్యంలో పలు వ్యాధులు వచ్చే అవకాశాలుంటాయి. ఈ సీజన్‌లో చాలా మందికి జీర్ణశక్తితో పాటు రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంటుంది. జ్వరం, దగ్గు, ఇతర వ్యాధుల బారిన పడుతుంటారు. ఇలాంటి నుంచి గట్టెక్కాలంటే చేపలు తినాల్సిందే. పూర్వీకులు శాఖాపరమైన ఇంగువను బెల్లంలో కలుపుకొని ఉండలు.. ఉండలుగా చేసుకుని తినేవారు. మాంసాహారులైతే చేపలను ఇంగువలో, చింత చిరుగులో పెట్టుకుని తినేవారు. మృగశిరకార్తె రోజున ఏ ఇంటా చూసినా చేపల పులుసే. చేపల కూర వంటకాలే కనిపిస్తుంటాయి. పంచాంగం ప్రకారం ఆరుద్ర నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించే సమయంలోని తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు, శకునాలు తదితర అంశాల ఆధారంగా చేసుకుని ఆ సంవత్సరం యొక్క వర్షాన్ని నిర్ణయించడం జరుగుతుంది. ఈ విధంగా వ్యవసాయదారులకు నిత్యజీవనోపయోగిగా,వ్యవసాయం పనులకు మార్గదర్శకంగా ఈ కార్తెలు ఉపయోగపడుతున్నాయి. పురాణగాధ ప్రకారం మృగశిరస్సు కలిగిన మృగవ్యాధుడు అను వృతాసురుడు వరప్రభావంచే పశువులను , పంటలను హరించి వేయడం ప్రకృతి భీభత్సాలాను సృష్టించడం , వర్షాలకు అడ్డుపడటం జరుగుతూ ఉండేడిది. ఇతను చనిపోకుండా అనేక వరాలు కలిగి ఉండటంచేత ఇంద్రుడు సముద్ర హలల నుండి వచ్చే నురుగును ఆయుధంగా చేసి చంపేస్తాడు. ప్రకృతి మార్పు ప్రభావం ఈ కథ ఆధారంగా ఖగోళంలో ఇంద్ర నక్షత్రమైన జ్యేష్టాకు మృగశిరకు 180 డిగ్రీల దూరంలో ఉండటం వలన తూర్పు ఆకాశంలో ఇంద్ర నక్షత్రం ఉదయించగానే వృతాసుర నక్షత్రం అస్తమిస్తుంటుంది. ఇక్కడ నురుగు అనేది ఋతుపవనాలకు , వర్షాలకు సూచన. ఇంద్ర నక్షత్రమైన జ్యేష్ట ఉదయించినపుడు సూర్యుడు మృగశిరలోకి ప్రవేశించడం వలన మృగశిరకార్తె ప్రవేశిస్తుంది. వర్షాలు పడకుండా అడ్డుపడ్డ మృగాసురుని చంపిన ఇంద్రున్ని వర్షప్రదాతగా , వర్షదేవుడుగా పిలుస్తారు. ఇది కథ. చేపలలో పోషకాలు: 1. చేపలలో ఎన్నో పోషకాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. చేపలలో అనేకమైన మాంసకృతులతో పాటు శరీరానికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి. కాల్షియం , పాస్పరస్‌ , ఐరన్‌ , మెగ్నీషియం , కాపర్‌ , జింక్‌ వంటి ఖనిజ పోషకాలు ఎన్నో లభిస్తాయి. 2.  చేపలు కొవ్వులు చాలా సులభంగాజీర్ణమై శక్తిని అందిస్తాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఎవరైనా తినవచ్చు. 3. చేపల్లో ఉన్న కొవ్వు మన శరీరంలో రక్త పీడనంపై మంచి ప్రభావం చూపుతాయి. 4. ఓమేగా 3 కొవ్వు ఆమ్లాలలో డీహెచ్‌ఏ , ఈపీఏ వంటివి కంటి చూపునకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే జ్ఞాపకశక్తిని కూడా పెంచుతాయి. 5. చేపల్లో బీ12 విటమిన్‌ , రైబోప్లవిన్‌ , నియాసిన్‌ , బయెటిక్‌ , థయామిన్‌ తదితర విటమిన్లు లభిస్తాయి 6. సముద్ర చేపల కాలేయంలో విటమిన్‌ఏ , డీ , ఈ వంటి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. 7. చేపలు గుండెకు సంబంధిత వ్యాధులకు , ఆస్తమా , షూగర్‌ వ్యాధి గ్రస్తులకు మంచి ఆహారంగా పని చేస్తుంది. ముఖ్యంగా గర్భిణులు , పిల్లల తల్లులకు ఎంతో మేలు. పిల్లల్లో జ్ఞాపకశక్తి , నాడీ వ్యవస్థ అభివృద్ధి చేస్తాయి చేపలు 8. మన రాష్ట్ర చేపల్లో కొర్రమీనులో లభించే ఆరాఖిడోనిక్‌ ఆమ్లం ఉంటుంది. ఇది గాయాలైనప్పుడు రక్తం తొందరగా గడ్డకట్టించే స్వభావం ఉంటుంది 9. దేశీయ మార్పు చేపల్లో ఐరన్‌ , కాపర్‌ వంటి ఖనిజ పోషకాలు ఎన్నో లభిస్తాయి. మృగశిర కార్తె రోజు చేపలను ఏ రూపంలో తిన్నా మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. 10. ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఉన్నందున స్థానికంగా దొరికే పెద్ద చేపలను ఇంగువ , చింత చిగురుతో కలిపి వండుకుని తింటే ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు 11. మృగశిర కార్తెలో చేపలు తినడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవచ్చు. ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది. 12. చేపలు తినడం వల్ల ముఖ్యంగా గుండె జబ్బులు , ఆస్తమా , మధుమోహ వ్యాధి ఉన్న వారు , గర్భిణులు ఈ సమయంలో చేపలు తింటే ఎంతో ప్రయోజనం ఉంటుంది.

 ‘యూ ఇడియట్’.. కేటీఆర్ పై బీజేపీ నేత ఫైర్

కొవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యుద్దమే సాగింది. కేంద్ర వ్యాక్సిన్ పాలసీపై కాంగ్రెస్ తో పాటు పలు ప్రాంతీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కూడా కేంద్రం వైఫల్యం వల్లే దేశంలో టీకాల కొరత ఏర్పడిందని ఆరోపించారు. కొవిడ్ విషయంలో మంత్రి కేటీఆర్ పదేపదే కేంద్రాన్ని టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో ఓ బీజేపీ జాతీయ నేత ఆయనపై ఫైరయ్యారు. సహనం కోల్పోయి మంత్రి కేటీఆర్ ను దూషించారు. ట్విట్టర్ వేదికగా జరిగిన ఈ ఘటన వైరల్ గా మారింది.  మంత్రి కేటీఆర్ ఆదివారం సాయంత్రం ట్విట్టర్‌లో ‘లెట్స్ టాక్ వ్యాక్సినేషన్’ హ్యాష్‌టాగ్‌తో చిట్‌చాట్ నిర్వహించారు. కొవిడ్ కట్టడి, వ్యాక్సినేషన్ పాలసీపై నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ల విషయంలో కేంద్ర విధానాలను కేటీఆర్ తప్పుబట్టారు. భారత్ వ్యాక్సిన్ల హబ్‌గా ఉన్నప్పుడు డిమాండుకు, సరఫరాకు మధ్య ఇంత వ్యత్యాసం ఎందుకని ప్రశ్నించారు. మిగతా దేశాలన్నీ గతేడాది మొదట్లోనే టీకాలకు ఆర్డర్లు ఇచ్చాయని, కేంద్రం మాత్రం ఇప్పుడు కళ్లు తెరిచిందని విమర్శించారు. కేటీఆర్ విమర్శలపై   బీజేపీ అధికార ప్రతినిధి ఖేమ్ చంద్ర శర్మ కొవిడ్ విషయంలో కేటీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఫైరయ్యారు. సహనం కోల్పోయి మంత్రిని యూ ఇడియట్’ అంటూ విరుచుకుపడ్డారు. టీకాల విషయంలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీకాల విషయంలో మనమే ముందున్నామని, ఇప్పటి వరకు 17.5 కోట్ల మందికి తొలి డోసు ఇచ్చామని పేర్కొన్నారు. మొత్తంగా 22.37 కోట్ల మందికి టీకాలు ఇచ్చినట్టు గుర్తు చేశారు. బీజేపీ నేత ఖేమ్ చంద్ వ్యాఖ్యలపై కేటీఆర్ సౌమ్యంగా స్పందించారు. తాను కూడా మీలాగే మాట్లాడగలను కానీ, అది తమ సంస్కృతి కాదని బదులిచ్చారు. ఇజ్రాయెల్‌లో 60 శాతం మందికి, అమెరికాలో 40 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయిందని చెప్పారు. దీనిని బట్టి మనం ఎక్కడున్నామో అర్థం చేసుకోవచ్చని కౌంటర్ ఇచ్చారు. వాస్తవాలను జీర్ణించుకోలేని మీలాంటి వారికి ఇలాంటి విషయాలు కఠినంగానే ఉంటాయని చెప్పారు కేటీఆర్. 

12 ఏళ్ళ బాలికపై.. డ్రైవర్ దారుణం.. 

మారాడు లోకం.. మారాదు కాలం... ఎవ్వరు ఏమైంపోని ఆ దేవుడు దిగిరాని.. మారదు లోకం.. మారదు కాలం. అప్పుడెప్పుడో ఆటవికం మరి ఇప్పుడో ఆధునికం.. యుగయుగాల కన్నా మృగాల కన్నా ఎక్కువ ఏం ఎదిగాం.. రాముడిలా ఎదగలం రాక్షసులను మించగలం రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎప్పుడో సొంత ముఖం.. అని అంటాడు ఒక కవి. మనిషిలో రోజురోజుకి క్రూరత్వం పెరిగిపోతుంది. తాజాగా ఒక డ్రైవర్. పెళ్లి కి హాజరైన 12 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాలుపడ్డాడు కామాంధుడు. వివరాల్లోకి వెళితే..    ఓపెన్ చేస్తే.. అది శ్రీకాకుళం జిల్లా. జలుమూరు మండలం. గుగ్గిలి పంచాయతీ పరిధిలోని గుండువలస. అతని పేరు కె సింహాచలం. వయసు 28 సంవత్సరాలు. వృత్తి డ్రైవర్. శనివారం రాత్రి గ్రామంలోని ఓ ఇంట్లో పెళ్లి జరుగుతోంది. అందరు పెళ్లి పనుల్లో ఉన్నారు. పెళ్లి వేడుక అంటే అందరికి చూడాలని ఉంటుందని.. స్థానికులతో పాటు బాలిక (12) కూడా పెళ్లి వేడుక చూడడానికి అక్కడికి వెళ్లింది. అదే గ్రామానికి చెందిన కె.సింహాచలం ఆ బాలిక పై కన్నేశాడు. ఆ తర్వాత పధకం వేశాడు.. మెల్లిగా మాయమాటల్లికి దించాడు.. పెళ్లి వేడుక  నుంచి బయటకు తీసుకెళ్లాడు. స్థానికంగా ఓ ఇంటి నిర్మాణం జరుగుతున్న ప్రదేశానికి తీసుకెళ్లాడు.. అక్కడికి వెళ్లాగానే ఆమె నోరునొక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు. కట్ చేస్తే.. అప్పటి వరకు తమతో ఉన్న కూతురు కనిపించక పోవడంతో. ఆందోళన పడిన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించగా పాప ఏడుస్తూ కనిపించింది. ఏం జరిగిందని వారు ఆరా తీశారు. ఆ బాలిక జరిగింది తతంగం మొత్తం చెప్పింది. బాలిక  నుంచి రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు జిల్లా ఎస్పీకి సమాచారం ఇచ్చారు. ఎస్పీ ఆదేశాల మేరకు దిశ పోలీస్‌స్టేషన్‌ డీఎస్పీ వాసుదేవ్‌ ఆదివారం సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు సింహాచలానికి వివాహమైంది. మనస్పర్థలతో అతడి భార్య రెండేళ్లుగా పుట్టింట్లోనే ఉంటోంది. ప్రస్తుతం అతడు ఓ రైస్ మిల్లులో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

గోల్డెన్ టైమ్‌.. బంగారం కొనడానికి ఇదే మంచి స‌మ‌యమా?

బంగారం మిడిసిప‌డుతోంది. ప‌సిడి ధ‌ర‌లు పైపైకి ఎగ‌బాకుతున్నాయి. వెండి సైతం తానేమి త‌క్కువా అన్న‌ట్టు హొయ‌లుపోతోంది. ఇలా, గోల్డ్-సిల్వ‌ర్‌లు జంట‌గుర్రాల్లా రంకెలుపెడుతున్నాయి. వీటి జోరు చ‌స్తుంటే త్వ‌ర‌లోనే 60వేల మార్కును ట‌చ్ చేసేలా క‌నిపిస్తోంది. ఇన్నాళ్లూ క‌రోనా కార‌ణంగా ఆర్థిక వ్య‌వ‌స్థ చ‌తికిల‌ప‌డింది. ఆ ప్ర‌భావం బంగారం కొనుగోళ్ల‌పైనా ప‌డింది. పెళ్లిళ్లు లేక జ్యువెల్ల‌రీ షాపులు బోసి పోయాయి. అక్ష‌య తిధియ నాడు సైతం బిజినెస్ త‌గ్గిపోయింది. చాలా మంది ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి ఆర్థికంగా దెబ్బ‌తిన్నారు. దీంతో, గిరాకీ లేక గోల్డ్ దిగుమ‌తులు బాగా త‌గ్గాయి. డిమాండ్ ప‌డిపోవ‌డంతో ధ‌ర కూడా బాగానే త‌గ్గింది. అయితే, కొవిడ్ నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ప‌లు రాష్ట్రాల్లో అన్‌లాక్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. మ‌ళ్లీ సాధార‌ణ ప‌రిస్థితుల వైపు ప్ర‌జ‌లు అడుగులు వేస్తున్నారు. పోస్ట్‌పోన్ చేసుకున్న పెళ్లిళ్లు మ‌ళ్లీ మొద‌లుపెడుతున్నారు. క‌రోనా కార‌ణంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారానికి ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తోంది. ఆ మేర‌కు బంగారం ధరలు కూడా పెరుగుతున్నాయి. ఆగస్టు నాటికి రూ.60 వేల వరకు చేరే అవకాశం ఉందని బులియెన్ మార్కెట్ వ‌ర్గాల అంచ‌నా.  ఆర్థిక వ్య‌వ‌స్థ మ‌ళ్లీ పుంజుకుంటుంద‌న్న కారణంతో బంగారం, వెండి ధరలు ఫామ్‌లోకి వ‌స్తున్నాయి. మార్చి నెల 31న 22 క్యారెట్ల ఆర్న‌మెంట్ గోల్డ్ ధర రూ.41,100 ఉండ‌గా.. అదిప్పుడు (మంగ‌ళ‌వారం) రూ.47,800కు చేరింది. అంటే, 67 రోజుల్లో ధర రూ.6,700 పెరిగిన‌ట్టు. అలాగే.. 24 క్యారెట్ల నగల బంగారం 10 గ్రాములు మార్చి 31న రూ.44,840 ఉండగా… ఇప్పుడు రూ.52,300 ఉంది. అంటే 67 రోజుల్లో ధర రూ.7,460 పెరిగింది. రాష్ట్రాల‌ను బ‌ట్టి ఈ ధ‌ర‌ల్లో కాస్త వ్య‌త్యాసం ఉంటుంది.  ఇక గత10 రోజుల్లో బంగారం ధర 7 సార్లు పెర‌గ్గా, రెండు సార్లు తగ్గింది. ఒకరోజు స్థిరంగా ఉంది. వెండి ధరలు గత 10 రోజుల్లో 6 సార్లు పెరగగా 3 సార్లు తగ్గాయి. ఒక‌రోజు స్థిరంగా ఉన్నాయి. నిన్న దేశీయంగా కిలో వెండి ధర రూ. 71 వేలు ఉంది.  బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టాలి అనుకునేవారికి ఇదే మంచి అవకాశమని అంటున్నారు బులియ‌న్ వ్యాపారులు. గోల్డ్ రేట్ పెర‌గ‌డం ఇప్పుడే మొదలైంద‌ని.. భవిష్యత్తులో మ‌రింత పెరుగుతుంద‌ని అంటున్నారు. ఇప్పుడు రూ.50వేల లోపే తులం బంగారం వ‌స్తోంది కాబ‌ట్టి.. ఇప్పుడు కొనిపెట్టుకుంటే.. రానున్న రోజుల్లో రూ.60వేలకు చేరే అవ‌కాశం లేక‌పోలేద‌ని చెబుతున్నారు. ఈ లెక్క‌న‌.. దాదాపు 20 శాతం లాభం పొందిన‌ట్టు అవుతుంద‌ని అంటున్నారు. అన్‌లాక్ కంప్లీట్ అయి.. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ఊపందుకుంటే..  ఇక ప‌సిడి ప‌రుగుల‌కు ప‌గ్గాలు ఉండ‌వ‌ని.. అందుకే, బంగారం కొనుగోలుకు ఇదే మంచి త‌రుణ‌మ‌ని ఊరిస్తున్నారు వ్యాపారులు. ఈ ఏడాది పెళ్లిళ్లు మామూలుగా జ‌రిగే అవ‌కాశం ఉంది కాబ‌ట్టి.. అప్ప‌టిక‌ల్లా బంగారం లాగే.. ధ‌ర కూడా ధ‌గ‌ధ‌గ మెర‌వ‌డం ఖాయ‌మంటున్నారు.   

నెట్‌లో ఫోటోలు.. 36 కోట్లు వ‌సూలు.. ఇద్ద‌రు పోకిరీలు..

ఇద్ద‌రు పోకిరీలు చేసిన ప‌నికిమాలిన‌ ప‌నికి.. 36 కోట్లు చెల్లించాల్సి వ‌చ్చింది యాపిల్ కంపెనీకి. పైస‌ల‌తో పాటు ప‌రువూ పోయింది. యాపిల్ అధీకృత స‌ర్వీస్ సెంట‌ర్‌లో ప‌ని చేసే ఇద్ద‌రు టెక్నీషియ‌న్లు.. రిపేర్‌కు వ‌చ్చిన ఫోన్‌లోని ప‌ర్స‌న‌ల్ ఫోటోల‌ను కాపీ చేసుకున్నారు. ఆ త‌ర్వాత వాటిని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక అంతే. విష‌యం ఎక్క‌డికో వెళ్లింది. ఏకంగా యాపిల్ సంస్థే దిగొచ్చింది. బాధితురాలికి ఏకంగా 36 కోట్లు చెల్లించింది. ఈ ఘ‌ట‌న అమెరికాలో జ‌రిగింది.  ఒరెగాన్‌లోని యూనివర్సిటీలో చదువుతున్న ఓ విద్యార్థిని.. తన యాపిల్‌ ఫోన్‌ రిపేర్‌కు రావడంతో 2016లో సర్వీస్‌ సెంటర్‌కు తీసుకెళ్లింది. పెగట్రాన్‌ సంస్థ ఆ సర్వీస్‌ సెంటర్‌ను నిర్వహిస్తోంది. ఫోన్‌ రిపేర్‌ చేసే క్రమంలో అక్కడ పనిచేసే ఇద్దరు టెక్నీషియన్లు ఆ ఫోన్‌లోని ఆమె వ్యక్తిగత చిత్రాలు, వీడియోలను దొంగిలించి ఆన్‌లైన్‌లో ఉంచారు. కొన్ని రోజుల్లోనే ఆ ఫోటోలు వైర‌ల్ అవ‌టం.. ఆ విష‌యం తెలిసి బాధితురాలు అవాక్క‌వ‌డం జ‌రిగిపోయింది. త‌న ఫోటోల‌ను యాపిల్ స‌ర్వీస్ సెంట‌ర్ సిబ్బంది తస్క‌రించారంటూ ఆమె కోర్టును ఆశ్రయించింది. అమెరికా చ‌ట్టాలు క‌దా.. ఫుల్ ఖ‌త‌ర్నాక్ ఉంటాయి. డేటా చోరీ కేసులో యాపిల్ సంస్థ‌కు భారీ మొత్తంలో ఫైన్ విధించింది అక్క‌డి కోర్టు.  బాధితురాలి తరఫు లాయర్‌ 5 మిలియన్‌ డాలర్లు డిమాండ్ చేసిన‌ట్టు తెలుస్తోంది. అంటే మ‌న క‌రెన్సీలో దాదాపు 36 కోట్ల రూపాయలు. అయితే, ఈ కేసును యాపిల్ సంస్థ కోర్టు బ‌య‌టే సెటిల్ చేసుకుంది. త‌మ సంస్థ సిబ్బంది వ‌ల్ల మెంట‌ల్ టార్చ‌ర్ అనుభ‌వించిన ఆ యువ‌తికి భారీ మొత్తమే చెల్లించిందట యాప‌లి్ కంపెనీ. ఆ త‌ర్వాత తప్పు చేసినట్లు తేలిన ఆ ఇద్దరు ఉద్యోగులను జాబ్ నుంచి తొలగించింది. అనంతరం ఆ ఉద్యోగుల‌ను నియ‌మించిన‌ పెగట్రాన్‌ సంస్థ నుంచి చెల్లించిన మొత్తాన్ని తిరిగి రాబట్టినట్టు తెలుస్తోంది. ఈ మొత్తం విష‌యం ర‌హ‌స్యంగా జ‌రిగినా.. అది ‘టెలిగ్రాఫ్‌’ లో రావ‌డంతో విష‌యం ఆల‌స్యంగా బ‌య‌ట‌కొచ్చింది. 

ఏ వ్యాక్సిన్ సామర్ధ్యం ఎక్కువ? యాంటీబాడీల పరిస్థితి ఏంటీ?

కొవిడ్ మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషన్ ప్రధానమని వివిధ అధ్యయన సంస్థలు, వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా కట్టడి అయిన దేశాల్లోనే వ్యాక్సినేషనే కీలకమైంది. అందుకే మన దేశంలోనూ టీకాల పంపిణిని యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తున్నారు. మన దేశంలో ప్రస్తుతం రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. త్వరలో రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ పంపిణి కానుంది. అయితే దేశంలో అందిస్తున్న టీకాలలో ఏది బెస్ట్, దేని సామర్ధ్యం ఎక్కువయ ఏ టీకాతో శరీరంలో యాంటీబాడీలు ఎక్కువగా తయారవుతున్నాయన్నది ఆసక్తిగా మారింది. జనాలు కూడా ఈ అంశాలను తెలుసుకునేందుకు గుగూల్ లో వెతుకున్నారు. వ్యాక్సిన్ తీసుకోవడానికి సిద్ధమవుతున్న వారు కూడా ఏ టీకా తీసుకోవాలా అన్న దానిపై ఆలోచనలో పడుతున్నారు.  మన దేశంలో ప్రధానంగా రెండు వ్యాక్సిన్లు ఉన్నాయి. ఒకటి ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనెకాకు చెందిన కొవిషీల్డ్ .హైదరాబాద్ బయోటెక్ కు చెందిన కొవాగ్జిన్. కరోనాను కట్టడి చేయడంలో ఈ రెండు వ్యాక్సిన్లు దేనికవే ప్రత్యేకమనే అభిప్రాయాలున్నాయి ఈ మేరకు అధ్యయన సంస్థలు కూడా అదే చెప్పాయి. అయితే డాక్టర్ ఏకే సింగ్ ఆయన సహచర వైద్య నిపుణులు ఈ రెండు వ్యాక్సిన్లపై అధ్యయనం చేసి మరిన్ని అద్భుతమైన విషయాలను వెల్లడించారు. ప్రధానంగా రెండు వ్యాక్సిన్లలో యాంటీబాడీలు ఎక్కువగా వృద్ధి రేటుపై కొత్త విషయాన్ని కనుగొన్నారు. యాంటీబాడీల అభివృద్ధిలో మాత్రం కొవిషీల్డ్ ఎంతో మెరుగ్గా పనిచేస్తున్నట్టు అధ్యయనంలో తేలింది.  మొత్తం 515 మంది ఆరోగ్య కార్యకర్తలపై ఈ పరిశోధన చేశారురు. వీళ్లలో 305 మంది పురుషులు 210 మంది మహిళలు ఉన్నారు. వీళ్లు ఈ వ్యాక్సిన్ల రెండు డోసులు తీసుకున్నారు. మొత్తం 425 మంది కొవిషీల్డ్ తీసుకున్న వాళ్లలో 98.1 శాతం..  90 మంది కొవాగ్జిన్ తీసుకున్న వాళ్లలో 80 శాతం సెరోపాజిటివిటీ  కనిపించినట్టు అధ్యయన బృందం తేల్చింది. రోగ నిరోధక వ్యవస్థను అందించడంలో రెండు వ్యాక్సిన్లు బాగా పనిచేస్తున్నట్టు తెలిపారు. అయితే  సెరోపాజిటివిటీ రేట్లు సగటు యాంటీ-స్పైక్ యాంటీబాడీ టైటర్ల విషయానికి వస్తే మాత్రం కొవాగ్జిన్ కంటే.. కొవిషీల్డ్ చాలా మెరుగ్గా ఉన్నట్లు అధ్యయన బృందం గుర్తించింది.  యాంటీబాడీ టైటర్ బ్లడ్ టెస్టులు కూడా చేశారు. దీని ప్రకారం కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లలో యాంటీబాడీ టైటర్ 115 AU/ml  గా ఉండగా.. కొవాగ్జిన్ తీసుకున్న వాళ్లలో 51 AU/mlగా ఉంది. ఈ లెక్కన కొవాగ్జిన్ కంటే కొవిషీల్డ్ లో యాంటీ బాడీల సంఖ్య చాలా ఎక్కువని ఈ అధ్యయనం తేల్చింది.  అయితే ఏ వ్యాక్సిన్ను తక్కువ చేసే ఉద్దేశం తమకు లేదని అధ్యయనం బృందం స్పష్టం చేసింది. 

షర్మిల పార్టీ వైఎస్సార్ టీపీ.. జూలై8న ప్రకటన

గత కొంత కాలంగా, తెలంగాణలో ‘రాజన్న  రాజ్యం’ లక్ష్యంగా, రాజకీయ పార్టీ ఏర్పాటుకు, సన్నాహాలు చేస్తున్న  దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కుమార్తె, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి, వైఎస్ షర్మిల, ముందుగా ప్రకటించిన విధంగా జులై 8, వైఎస్సార్ జన్మదినం రోజున పార్టీ ప్రారంభానికి సిద్దవుతున్నారు. కాగా, పార్టీ పేరు రిజిస్ట్రేషన్ ప్రక్రియ దాదాపుగా పూర్తయినట్లు, సమాచారం.పార్టీ పేరును వైఎస్సార్’ టీపీ గా ఖరారు చేశారు. పార్టీ పేరు ఆంధ్ర ప్రదేశ్’లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరును పోలి ఉన్నందున, ఆ పార్టీ నుంచి అబ్యంతరం రాకుండా, షర్మిల, వైఎస్సార్ సీపీ, గౌరవ అధ్యక్షురాలు, తల్లి విజయమ్మ నుంచి ‘నో అబ్జెక్షన్’ లేఖను ఎన్నికల సంఘానికి సమర్పించారు. దీంతో ఇక ఆమె పార్టీ రిజిస్ట్రేషన్’కు ఎలాంటి అడ్డంకులు ఉండవని, రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని షర్మిల భావిస్తున్నారు.ఆంధ్ర ప్రదేశ్’లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ (యువజన, శ్రామిక, రైతు, కాంగ్రెస్ పార్టీ)పేరు తమ పార్టీ పేరును పోలి ఉందని, ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ  ‘అన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మహబూబ్ బాషా ఢిల్లీ హై కోర్టులో దాఖలు చేసిన పిటీషన్ ను న్యాయస్థానం ఇటీవలనే కొట్టి వేసిన విషయం తెలిసిందే.  వైఎస్ షర్మిల, తెలంగాణ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడం విషయంలో, మొదటి నుంచి అనేక అనుమానాలు వ్యక్త మావుతూనే ఉన్నాయి.ఆమె రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలనే ఆలోచన వెనకబీజేపీ నుంచి తెరాస వరకు, ఎవరెవరి హస్తమో ఉందన్న ఆరోపణలు వచ్చాయి.అలాగే, జగనన్నవిడిచిన బాణం అన్న అనుమానాలు వ్యక్త మయ్యాయి.అయితే షర్మిల, మాత్రం ఆరోపణలను పట్టించుకోకుండా, ‘రాజన్న రాజ్యం’ ఒక్కటే నినాదంగా పార్టీ ఏర్పాటు సన్నాహాల్లో మునిగిపోయారు. జిల్లాల వారిగా సన్నాహక సమావేశాలు నిర్వహించడంతో పాటుగా, తెరాస ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ,ముఖ్యమంత్రి కేసీఆర్’ పై విమర్శలు చేస్తున్నారు.  నిరుద్యోగ సమస్య పరిష్కారం కోరుతూ ఏప్రిల్ నెలలో ఇందిరా పార్క్ వద్ద,72 గంటల  దీక్ష చేపట్టి సంచలనం సృష్టించారు.అయితే, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే అనుమతిచ్చిన పోలీసుల సాయంత్రం దీక్షనుభగ్నం చేయడంతో, పోలీసుల తీరుకు నిరసనగా షర్మిల ధర్నాచౌక్ నుంచి లోటస్ పాండ్ వరకు కాలినడకన వెళ్లి సంచలనం సృష్టించారు. అంతే కాకుండా, ఆమె  నిజమైన తెలంగాణ నాయకులకంటే, కేసీఆర్’  ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు.‘మనం ప్రశ్నించకపోతే తెలంగాణ మొత్తాన్ని దొరగారు లూటీ చేస్తారు’ అంటూ పరుషంగా విమర్శిస్తున్నారు.  

మంత్రి కేటీఆర్ కు మహిళా నేత క్లాస్!

దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ అనుకున్నంత స్పీడుగా సాగడం లేదు. వ్యాక్సిన్ కొరతే ఇందుకు కారణమవుతోంది. తమకు కావాల్సినన్ని టీకాలు కేంద్రం అందించడం లేదని చాలా రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర వ్యాక్సినేషన్ పాలసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆదివారం ఆస్క్ కేటీఆర్ పేరుతో ట్విట్టర్ ద్వారా నెటిజన్లతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ పై కొందరు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. కేంద్ర సర్కార్ వ్యాక్సినేషన్ పాలసీ సరిగా లేదని కేటీఆర్ విమర్శించారు. వన్ నేషన్ పాలసీని గొప్పగా ప్రచారం చేసుకునే మోడీ సర్కార్.. టీకాల పంపిణిలో మాత్రం ఆ సిద్ధాంతాన్ని వదిలేసిందని ఆరోపించారు.   కరోనా వ్యాక్సిన్ల అంశంలో కేంద్రాన్ని విమర్శిస్తూ  మంత్రి కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలపై  బీజేపీ మహిళా నేత విజయశాంతి తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా కౌంటరిచ్చిన రాములమ్మ... కేటీఆర్ గారూ... మీకు అసలు వ్యాక్సిన్ అంటే ఏంటో తెలుసా? అని సూటిగా ప్రశ్నించారు. వ్యాక్సిన్ ఉత్పత్తి ఎలా జరుగుతుందో కొంచెమైనా తెలుసా? అని నిలదీశారు. కేటీఆర్ కు కౌంటరిస్తూ  విజయశాంతి సోషల్ మీడియాలో సుదీర్ఘంగా ఇచ్చిన  వివరణ ఉన్నది ఉన్నట్లుగా..  కేటీఆర్ గారు..!! అసలు మీకు వ్యాక్సిన్ అంటే ఏంటో తెలుసా..? టీకా ఉత్పత్తి ఎలా జరుగుతుందో కొంతమాత్రమైనా అవగాహన ఉందా..? వ్యాక్సిన్ అనేది గంటలలోనో... రోజులలోనో... ఉత్పత్తి నడిపి ఇప్పటికిప్పుడు ఇబ్బడిముబ్బడిగా తయారు చేసేది కాదు. అదొక ప్రత్యేకమైన ప్రక్రియ.అనేకమంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి వ్యాక్సిన్‌ రూపకల్పనకు రేయింబవళ్లు కష్టపడ్డారు. వ్యాక్సిన్ల తయారీ కోసం ఎందరో అవిశ్రాంతంగా పనిచేశారు.  సాధారణంగా టీకాల తయారీకి ఏళ్లు పడుతుంది. కానీ నరేంద్ర మోదీ సర్కారు ప్రోత్సాహం, నిర్దిష్టమైన ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయడంతో..  మన శాస్త్రవేత్తలు అతి తక్కువ సమయంలోనే అభివృద్ధి చేశారు. దాని ఫలితంగానే నేడు ఒకటి కాదు రెండు స్వదేశీ టీకాలు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాదు, ఇంకా ఎన్నో వ్యాక్సిన్లు కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. దేశీయ టీకా తయారీతో భారత్‌ సత్తా మరోసారి ప్రపంచానికి తెలిసింది. ఇది భారతదేశ బలానికి, భారతదేశ శాస్త్రీయ నైపుణ్యానికి, భారతదేశ ప్రతిభకు ఒక ప్రకాశవంతమైన రుజువు. ఇంకా కేంద్ర ప్రభుత్వానికి విజన్ లేదు.. ప్లాన్ లేదంటూ మాట్లాడుతున్న కేటీఆర్ గారికి సరైన విజ్ఞత లేదని అర్థమవుతోంది. ఎందుకంటే ప్రపంచంలో వ్యాక్సినేషన్ మొదలైందే గత డిసెంబర్ లో..! భారత్ లో జనవరి 16వ తేదీన వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. జనవరి 16 నుంచి మొదలు ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 25 కోట్లకు పైగా టీకా డోసుల (వ్యాక్సినేషన్) పూర్తి చేశాం. ఇది అమెరికా కంటే ఎక్కువ. ఈ లెక్కలు తెలుసా కేటీఆర్ గారూ? వేగంగా టీకాలను అందిస్తోన్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి అందరికీ వ్యాక్సిన్లు అందేలా నరేంద్ర మోదీ ప్రభుత్వ తీవ్రంగా కృషి చేస్తోంది. వీలైన అన్ని మార్గాల ద్వారా టీకాల సేకరణకు మోదీ సర్కార్ నడుం బిగించింది. డిసెంబర్ నాటికి 250 కోట్ల డోసుల టీకాలను భారత్ సేకరించేలా ప్రణాళికలు రూపొందించింది. టీకాల పంపిణీపై టీఆర్ఎస్ సర్కారు దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటు. స్వదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తిచేయకుండా విదేశాలకు టీకాలు అమ్ముకొంటుందని కేంద్రంపై నిందలు మోపుతున్నవారికి బాధ్యత ఉందా..? స్వదేశీ సాంకేతికతతో టీకా తయారీ చేసుకోవడం మీరు ఓర్చుకోలేకపోతున్నారా..? WHO, UNO సలహా మేరకు, ఉత్పత్తి సంస్థల నిబంధనల ప్రకారం కొవాగ్జిన్, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా తయారు చేసిన ఆస్ట్రాజెనికా (కొవిషీల్డ్) స్నేహపూర్వకంగా ఇతర దేశాలకు పంపిణీ చేయాల్సిందే. విదేశాలకు పంపిన టీకాలు సరైన అనుమతులు, ఇతర వాణిజ్యపరమైన నిబంధనల ప్రకారం పంపినవే. నిబంధనల ప్రకారం ఉత్పత్తి సంస్థలు కచ్చితంగా పంపాల్సిందే. ఆ విషయం తెలుసుకోకుండా మాట్లాడటం తప్పకుండా అవివేకమే. మీ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపడం మంచిదికాదు.  కరోనా మహమ్మారి భారత్ లో పుట్టలేదు. అది వూహాన్ లో పుట్టి వివిధ దేశాలకు విస్తరించి మన భారత్‌కు అంటుకుంది. అందుకే ప్రపంచానికి వ్యాక్సినేషన్ జరిగినప్పుడే వైరస్ నిర్మూలన అనేది సుసాధ్యం.  అవివేకంతో ఒక్క తెలంగాణలోనే వ్యాక్సిన్ చేస్తా అనుకుంటే అది మీ అజ్ఞానమే.    ఫైజర్ సంస్థను వ్యాక్సినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపితే ఒక్క డోసుకు రూ. 2,880 నిర్ణయించారు. అంటే భారత జనాభా లెక్కల ప్రకారం రూ. 7 లక్షల కోట్లు ఆ సంస్థకు ఇవ్వాల్సి వచ్చేది. అందుకే భారత్ స్వదేశీ పరిజ్నానంతో, వేగవంతంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టింది. దీన్ని కూడా తప్పుపట్టిన టీఆరెస్ నాయకత్వానికి కొంచమైన సోయి ఉందా..? లేక కమీషన్ల ముసుగులోనే మాట్లాడదుతున్నారా అర్థం కావట్లేదు..? ఫైజర్ సంస్థకు దోచిపెట్టి అక్కడ కూడా కమీషన్లు దండుకోవాలనే భ్రమలో మాట్లాడుతున్నారా..? అనే సందేహం కలుగుతోంది.  కేసీఆర్ గారి కుటుంబం జీవితమే కమీషన్ల బాపతు. అందుకే ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలను భారతదేశానికి ఎందుకు తీసుకురావడం లేదని గాయి గాయి పెడ్తున్న మీరు దేశ సంపదను ఆ కంపెనీలకు దోచిపెట్టాలనుకుంటున్నారా..? అంటే దేశంలో ఒక డోసు టీకా రూ. 250 ధరకే దొరకొద్దా..? రూ. 2వేలు, రూ.3వేలు అంటూ ఇష్టారీతిన రేట్లు పెంచుతూ కమీషన్లు దండుకోవాలనుకోవడం TRS దుర్బుద్ధి కాదా..? వ్యాక్సినేషన్ ప్రక్రియపై  టీఆర్ఎస్ ప్రభుత్వ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపడం దుర్మార్గం. ప్రపంచంలోనే అత్యధికంగా వ్యాక్సినేషన్ జరిగిన దేశాల్లో భారత్ రెండోస్థానంలో ఉంది. మొదటి డోసు ఇచ్చిన స్థానాల్లో భారత్ మొదటిస్థానంలో ఉంది. వచ్చే డిసెంబర్ నాటికి మొత్తం 250 కోట్ల డోసులు వ్యాక్సిన్ ఇవ్వాలన్న లక్ష్యంతో నరేంద్ర మోదీ సర్కారు పనిచేస్తోంది.  కరోనా టైంలో సుమారు రూ.వేల కోట్ల కుంభకోణం జరిగింది. ప్రైవేటు ఆస్పత్రులకు దోచిపెట్టి కమీషన్లు దండుకుంది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. వేలమంది పేద ప్రజల ప్రాణాలను బలిపెట్టి ఖజానా నింపుకోవడం దుర్మార్గం. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ గురించి స్పందించకుండా.. టాస్క్ ఫోర్స్ అంటూ కొన్ని ఆసుపత్రులపై జులుం చూపెట్టి.. దోపిడీ చేసే పలు ప్రైవేట్ ఆసుపత్రులను చూసీచూడనట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారు..? ఈ వేలకోట్ల అవినీతిలో సీఎం కేసీఆర్ గారి కుటుంబ కమీషన్ ఎంతనో వారే చెప్పాలి. ఇప్పటివరకు దేశమంతా వ్యాక్సినేషన్ ను కేంద్రప్రభుత్వం ఉచితంగానే ఇచ్చింది. 80 లక్షల డోసులను కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అందించింది. అసలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత కొనుగోలు చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎంతమందికి టీకాలు అందించారో చెప్పాలి.అబద్ధాలు, పిచ్చి ప్రేలాపనలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కేసీఆర్ కుటుంబానికి రోజులు దగ్గరపడ్డాయి. కేటీఆర్ గారు..! హైదరాబాద్ జనాభా అంత కూడా లేని దేశాలతో 130 కోట్ల జనాభా గల భారతదేశాన్ని పోల్చడం మీ అవగాహనరాహిత్యానికి నిదర్శనం కాదా?  ప్రభుత్వానికి దొరకని వ్యాక్సిన్లు, ఇంత పెద్ద మొత్తంలో కొన్ని ప్రైవేట్ సంస్థలకు ఎట్ల దొరుకుతున్నాయి..? భారత్ బయోటెక్ కంపెనీ మన దగ్గరే ఉన్నా, ఆ సంస్థ దగ్గర్నుంచి వ్యాక్సిన్ తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఆ సంస్థ సుమారు పది లక్షల డోసులను మన రాష్ట్రంలోని ప్రైవేట్ హాస్పిటళ్లకు సరఫరా చేసినట్టు హెల్త్ ఆఫీసర్లే  చెప్తున్నారు. కానీ, ప్రభుత్వానికి మాత్రం ఇప్పటివరకూ రెండున్నర లక్షల డోసులే సరఫరా అయ్యాయి. అంటే మతలబు ఏంటి..? ప్రైవేటు ఆస్పత్రులతో కుమ్మక్కై కమీషన్ల కోసం ప్రజల ప్రాణాలు బలిపెట్టాలనుకుంటున్నారా..?  టీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 2,500 కోట్ల ఖర్చుతో గ్లోబల్ టెండర్లు పిలిచి వ్యాక్సిన్ కొనుక్కుంటామంటూ బాతాలు కొడుతున్నరు కదా..  కనీసం రాష్ట్రంలో వెంటిలేటర్లను సర్వీసింగ్ కూడా ఎందుకు చేసుకోలేకపోయారు..? ఆక్సిజన్ ను సకాలంలో అందించలేకపోయారు ఎందుకు..? కల్లబొల్లి మాటలతో మభ్యపెట్టే బదులు వ్యాక్సినేషన్ విషయంలో మీ అసమర్థతను ఒప్పుకోండి. మీరు వ్యాక్సినేషన్ చేసినా , చేయించకపోయినా.. ఖచ్చితంగా భారత ప్రజలందరికీ నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను అందిస్తుంది. తెలంగాణ కూడా భారత ప్రజలే అని గుర్తుంచుకోవాలి. (కేటీఆర్ గారు....! ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి ..! తెలంగాణ రాష్ట్రం కూడా భారతదేశంలోనే ఉంది.) అసలు కరోనాపై పోరాటంలో టీఆర్ఎస్ సర్కారు ఏం చేసింది..?  టెస్టులు తక్కువ చేసి, పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్యను తక్కువ చూపెట్టింది. దవాఖాన్లలో సిబ్బందిని నియమించలేదు. వసతులు మెరుగుపర్చలేదు. ఫలితంగా సర్కారు ఆసుపత్రులు ప్రజలకు సరైన వైద్యసేవలు అందించలేకపోయాయి.  టీఆర్ఎస్ నాయకుల ప్రోద్బలంతో ప్రైవేటు ఆసుపత్రుల ఫీజు దోపిడీని కొనసాగించింది. నిర్వహణ వైఫల్యంతో వ్యాక్సిన్ పెద్దమొత్తంలో వృథా చేసింది. కరోనా విషయంలో టీఆర్ఎస్ సర్కారు వైఫల్యాలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉంది. దీనిని తప్పించుకునేందుకే కేటీఆర్ వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రంపై నిందలు మొపుతున్నారు. కానీ, ప్రజలు అన్నీ అర్థం చేసుకుంటున్నారు  భవిష్యత్తులో మీ పతనానికి మీరే గొయ్యి తవ్వుకుంటున్నారని గుర్తుపెట్టుకోవటం మంచిది. విజయశాంతి