సీఎం జ‌గ‌న్‌కు క్రికెట‌ర్ లేఖ‌.. కూల్చివేత‌పై ఆందోళ‌న‌..

విశాఖ‌లో కూల్చివేత‌ల ప‌రంప‌ర కాక రేపుతోంది. సీఎం జ‌గ‌న్‌రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ బుల్డోజ‌ర్ల దూకుడుతో సాగ‌ర తీరం షేక్ అవుతోంది. ఇన్నాళ్లూ టీడీపీ నాయ‌కుల ఆస్తులే ల‌క్ష్యంగా కూల్చివేత‌లు కొన‌సాగాయి. మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి ఇంటి ప్ర‌హారీ, గీతం వ‌ర్సిటీ క‌ట్ట‌డాలు, టీడీపీ నేత పల్లా శ్రీనివాస‌రావు బిల్డింగ్.. ఇలా వ‌రుస‌బెట్టి ఆస్తుల ధ్వంసంతో విశాఖ అట్టుడికింది. అదంతా రాజ‌కీయ ప్ర‌తీకార‌మంటూ న‌గ‌రం హోరెత్తింది. అయితే, అంత‌టితో ఆగ‌లేదు విధ్వంస‌కాండ‌. ఆ త‌ర్వాత భీమిలీ రోడ్డులో అక్ర‌మ‌ణ‌ల పేరుతో షాపుల తొల‌గింపు మ‌రింత క‌ల‌క‌లం రేపింది. తాజాగా, ఏకంగా మాన‌సిక దివ్యాంగుల పాఠ‌శాల కూల్చివేత జ‌గ‌న్‌రెడ్డి పైశాచిక ఆనందానికి నిద‌ర్శ‌న‌మంటూ ప్ర‌తిప‌క్షంతో పాటు ఈసారి సామాన్యులూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఆ పాఠ‌శాల‌ను క‌బ్జా చేసేందుకు వైసీపీ బ్యాచ్ ప్ర‌య‌త్నం చేసింద‌ని.. అది కుద‌ర‌క‌పోవ‌డంతో జీవీఎమ్‌సీని ముందుంచి కూల్చివేత‌ల‌కు తెగ‌బ‌డిందంటూ టీడీపీ విమ‌ర్శ‌లు చేస్తోంది. దివ్యాంగులంటే ఎవరికైనా సానుభూతి ఉంటుంది. కానీ, ఆ మాత్రం మానవత్వం కూడా లేకుండా వారి పాఠ‌శాల‌ను కూల్చివేయ‌డం దారుణ‌మంటూ విశాఖ వాసులు మండిప‌డుతున్నారు.  మ‌రోవైపు, మానసిక దివ్యాంగుల పాఠశాల కూల్చివేతపై మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించారు. హిడెన్ స్ప్రౌట్స్ మానసిక దివ్యాంగుల పాఠశాల నలుగురు విద్యార్థులతో 2013లో ప్రారంభమైంద‌ని.. ప్ర‌స్తుతం 150కి పైగా విద్యార్థులకు జ్ఞానాలయంగా మారిందని తెలిపారు. పాఠశాల నెలకొల్పిన శ్రీనివాస్‌ జీవితమంతా స్కూల్‌కే అంకితం చేశారని ఎమ్మెస్కే ప్రసాద్‌ గుర్తుచేశారు. అందుకే శ్రీనివాస్‌కు జ్యువెల్ ఆఫ్ ఇండియా అనే అవార్డు వచ్చిందన్నారు. దీనిపై సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి పునరాలోచించాలని కోరుతూ ఎమ్మెస్కే ప్రసాద్ లేఖ రాయ‌డంతో వివాదం మ‌రింత ముదురుతోంది. జీవీఎమ్‌సీ అధికారులు త‌మ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకునేలా చూడాల‌న్నారు. ఆ పాఠ‌శాల తిరిగి ప్రారంభ‌మ‌య్యేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సీఎం జ‌గ‌న్‌కు విజ్ఞ‌ప్తి చేశారు మాజీ క్రికెట‌ర్‌ ఎమ్మెస్కే ప్ర‌సాద్‌.    

మందు ఆనందయ్యది.. సోకు వైసీపీ నేతలది! ఇదేం విడ్డూరం..

సొమ్మెకడిది.. సోకొకడిది.. ఇది పూర్వకాలం నుంచి ఉన్న సామెత. ఒకడి కష్టాన్ని ఇంకొకడు తింటుంటే.. ఒకడికి దక్కాల్సిన భాగ్యాన్ని మరొకడికి అనుభవిస్తుంటే ఈ సామెతను వాడుతుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతల తీరు అచ్చం ఇలానే ఉంది. ఆనందయ్య మందు విషయంలో అధికార పార్టీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.. ఆనందయ్యకు దక్కల్సిన క్రెడిట్ ను కొట్టేయాలని చూస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.  ఎన్నో వివాదాలు.. అనుమానాలు.. కోర్టు కేసుల మధ్య ఆనందయ్య మందు పంపిణికి అనుమతి వచ్చింది. జనాలు అశగా ఎదురుచూస్తున్న మందు పంపిణీ ప్రారంభమైంది.  నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గంలోనూ, చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గంలోనూ పంపిణీ జరుగుతోంది. సర్వేపల్లి వద్ద ఆనందయ్యే స్వయంగా మందు తయారుచేస్తుండగా, చంద్రగిరిలో ఆయన తనయుడు, శిష్యులు మందు తయారుచేస్తున్నారు. అయితే ఇక్కడే మరో వివాదం మొదలైంది.మందు పంపిణి వరకే బాగానే ఉన్నా... ప్రజలకు మందు అందిస్తున్న కవర్లపై వైసీపీ రంగులు, సీఎం జగన్ ఫోటోలు ఉండటం రచ్చగా మారుతోంది.  చంద్రగిరిలో పంపిణీ చేస్తున్న ఆనందయ్య మందు డబ్బాలపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సీఎం జగన్, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫొటోలు దర్శనమిస్తున్నాయి. మందు సృష్టికర్త ఆనందయ్య పేరు తప్ప ఆయన ఫొటో మాత్రం లేదు. మందు డబ్బాలను చూసిన జనాలు కూడా షాకవుతున్నారు. ఆనందయ్య ఫోటో లేకుండా సీఎం జగన్ , ఎమ్మెల్యే చెవిరెడ్డి ఫోటోలు ఉండటం ఏంటని ముక్కున వేలేసుకుంటున్నారు. సొమ్మెక్కడి.. సొకొకడిది అన్నట్లుగా వైసీపీ నేతలు వ్యవహారం ఉందని కొందరు విమర్శిస్తున్నారు.  ఆనందయ్య మందు కవర్లపై వైసీపీ రంగులు ఉండటంపై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రంగా స్పందించారు. అసలు... ఆనందయ్య మందుకు రాజశేఖర్ రెడ్డి, జగన్ ఫొటోలకు, వైసీపీకి ఏమిటి సంబంధం? అని ప్రశ్నించారు.ఒక ముఖ్యమంత్రిగా మందుకు కావాల్సిన వనరులను సమకూర్చడంలో తప్పులేదని, అయితే ఆనందయ్య మందును తామే సొమ్ము చేసుకోవాలన్న దుర్బుద్ధి ఇందులో కనిపిస్తోందని గోరంట్ల అభిప్రాయపడ్డారు. "అంతేలే... కోడికత్తిలో కోడి లేదు, గుండెపోటుకి బాబాయ్ లేడు, ఆనందయ్య మందులో ఆనందయ్య లేడు!" అంటూ గోరంట్ల సెటైర్ వేశారు. ఇక సర్వేపల్లి నియోజకవర్గంలోని గొలగముడి ఆలయం వద్ద ఆనందయ్య మందు పంపిణీని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. అయితే ఆనందయ్య మందు కవర్‌పై వైసీపీ రంగులతో పాటు ఆ పార్టీ నేతల ఫోటోలు దర్శనమిచ్చాయి. ఇది కూడా చర్చనీయాంశంగా మారింది. దీనిపై కొందరు అభ్యంతరం చెప్పగా.. వైసీపీ రంగులతో పాటు తమ ఫోటోలు వేసుకోవడం తమ ఇష్టమని ఎమ్మెల్యే కాకాని తెలిపారు. సొంత నిధులు ఖర్చుపెట్టి తయారు చేయించాం..  సర్వేపల్లి నియోజకవర్గంలో 1.80 లక్షల కుటుంబాలకు ఆనందయ్య మందు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. సర్వేపల్లి నియోజకవర్గంలో పంపిణీ పూర్తి అయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తామన్నారు.  మొత్తంగా ఆనందయ్య మందు పంపిణి మొదలైనా... అది ప్రస్తుతానికి రెండు నియోజకవర్గాలకే పరిమితం కావడం జనాలను నిరాశ పరిచింది. ఇక మందు కవర్లపై వైసీపీ రంగులు ముద్రించడంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఆనందయ్య మందుపై రాజకీయం చేయడం సరికాదంటున్నారు. మొదటి నుంచి స్థానిక ఎమ్మెల్యే జోక్యం వల్లే గతంలో మందు పంపిణి ఆగిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్నో అడ్డంకులు అధిగమించి మందు తయారవుతున్నా.. ఇప్పుడు పార్టీ రంగులు, సీఎం ఫోటోలు ముద్రించి మళ్లీ వివాదాస్పదం చేస్తున్నారని జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆనందయ్యపై రాజకీయం చేయవద్దని.. ఆయన పనిని ఆయనను చేసుకోనివ్వాలని కోరుతున్నారు. 

ఫ్రీ వ్యాక్సిన్‌.. దేశ‌ప్ర‌జ‌ల‌కు మోదీ బంప‌ర్ ఆఫ‌ర్‌..

క‌రోనా క‌ల్లోల వేళ‌ దేశ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని మోదీ గుడ్ న్యూస్ చెప్పారు.  జూన్‌ 21 నుంచి.. 18 ఏళ్లు పైబడిన వారికి కేంద్రమే ఉచితంగా వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తుంద‌ని ప్ర‌క‌టించారు. కేంద్రమే టీకాలు కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఇస్తుందని మోదీ చెప్పారు. వ్యాక్సిన్‌కు రాష్ట్రాలు రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని.. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనన్నారు ప్ర‌ధాని మోదీ. ప్రైవేట్ ఆసుపత్రలకు 25 శాతం డోసులు ఇస్తామని.. అయితే, ప్రైవేటు ఆసుపత్రులు వ్యాక్సిన్లపై సర్వీస్ చార్జి కింద కేవలం రూ.150 మాత్రమే వసూలు చేయాల్సి ఉటుందని ప్ర‌ధాని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్‌పై అనేకసార్లు సీఎంలతో మాట్లాడాన‌ని.. టీకాల‌ కొరతపై రాష్ట్రాల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. దేశంలో మెడికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ బాగా పెరిగింది. తక్కువ సమయంలోనే ఆక్సిజన్‌ ఉత్పత్తిని 10 రెట్లు పెంచాం. ఆక్సిజన్‌ సరఫరాకు వైమానిక, నౌకా, రైల్వే సేవలు వినియోగించుకున్నాం. సెకండ్‌ వేవ్‌ కంటే ముందే ఫ్రంట్‌లైన్‌ యోధులకు వ్యాక్సినేషన్‌ పూర్తి చేశాం. ఇప్పటివరకు 23కోట్ల డోసులు పంపిణీ చేశామ‌న్నారు ప్ర‌ధాని.  ‘కరోనా వ్యాక్సిన్‌ కోసం ఎన్నో దేశాలు ఎదురుచూస్తున్నాయి. కరోనా అదృశ్య శక్తితో పోరాటంలో కొవిడ్ ప్రొటోకాల్‌  పాటించడమే మనకు రక్ష. ఇంతమంది జనాభా ఉన్న దేశంలో వ్యాక్సిన్‌ తయారు చేసుకోకుంటే పరిస్థితి ఏమిటి? మనం వ్యాక్సిన్‌ తయారు చేసుకోకపోతే విదేశాల నుంచి వచ్చేందుకు ఏళ్లు పట్టేది. గతంలో టీకాల కోసం దశాబ్దాల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది. మిషన్‌ ఇంద్ర ధనస్సు ద్వారా యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్‌ ప్రారంభించాం. వ్యాక్సిన్‌తయారీలో ప్రపంచ దేశాలతో సమానంగా పోటీపడ్డాం. తక్కువ సమయంలో టీకా తయారీలో మన శాస్త్రవేత్తలు సఫలమయ్యారు. టీకా తయారీలో అన్ని విధాలుగా కేంద్రం మద్దతిచ్చింది. టీకా తయారీ సంస్థలు, క్లినికల్‌ ట్రయల్స్‌కు పూర్తి మద్దతుగా నిలిచాం. కేంద్రం తీసుకున్న కచ్చితమైన నిర్ణయాల వల్లే వ్యాక్సిన్లు వచ్చాయి.  దేశంలో 7 కంపెనీలు టీకాలు తయారు చేస్తున్నాయి.  మరో మూడు కంపెనీలు క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నాయి. చిన్నారుల టీకా కోసం కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నాసల్‌ స్పే టీకా కోసం కూడా ప్రయోగాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో మనం ఎవరి కంటే వెనుకబడిలేం. కొద్ది రోజుల్లోనే కొవిడ్ వ్యాక్సిన్‌ ఉత్పత్తి మరింత వేగవంతమవుతుంది. జూన్‌ 21 నుంచి 18ఏళ్లు పైబడిన వారందరికీ కేంద్రమే ఉచితంగా వ్యాక్సిన్‌ అందిస్తుంది. వ్యాక్సినేషన్‌ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే’’ అని మోదీ ప్ర‌క‌టించారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని దీపావళి వరకూ పొడిగిస్తున్నట్టు ప్రధాని ప్రకటించారు. ఈ పథకం వల్ల 80 కోట్ల మంది పేదలు ఉచిత రేషన్ అందుకుంటారని చెప్పారు. గత ఏడాది కూడా కోవిడ్ సమయంలో కొన్ని నెలల పాటు ఈ స్కీమ్‌ను కేంద్రం అమలు చేసింది. కోవిడ్ సెకెండ్ వేవ్ నేపథ్యంలో కేంద్రం తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సినేషన్ లభ్యత, స్వదేశీ వ్యాక్సిన్ల అభివృద్ధి తదితర కీలక విషయాలపై జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు.   

వ‌ద‌ల జ‌గ‌న్‌రెడ్డీ నిన్నొద‌లా.. 28 రాష్ట్రాల సీఎంల‌కు ర‌ఘురామ లేఖ‌..

వ‌ద‌ల జ‌గ‌న్‌రెడ్డీ నిన్నొద‌లా.. అంటూ ర‌ఘురామ ఓ రేంజ్‌లో ఆటాడుకుంటున్నారు. ఇన్నాళ్లూ ఏపీకే ప‌రిమిత‌మైన ఆయ‌న రివేంజ్‌.. ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో ద‌డ‌ద‌డ‌లాడిస్తున్నారు. రాజ్యాంగం ప్ర‌సాదించిన ఏ ఒక్క మార్గాన్నీ ఆయ‌న వ‌దులుకోవ‌డం లేదు. త‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని.. సీఐడీ క‌స్ట‌డీలో గాయాల‌ను, జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌ను.. తు.చ త‌ప్ప‌కుండా.. పొల్లుబోకుండా.. పూస‌గుచ్చిన‌ట్టు అంద‌రికీ వివ‌రిస్తున్నారు. సీఎం జ‌గ‌న్‌రెడ్డికి వ్య‌తిరేకంగా యావ‌త్ దేశాన్ని ఏకం చేస్తున్నారు. ఆ ప్ర‌య‌త్నంలో ర‌ఘురామ‌కృష్ణ‌రాజుకు దాదాపు అన్ని రాష్ట్రాలు, అన్ని పార్టీల నుంచి సానుభూతి, మ‌ద్ద‌తు వెల్లువెత్తుతుండ‌టంతో జ‌గ‌న్‌రెడ్డి ఇర‌కాటంలో ప‌డుతున్నారు. ఢిల్లీ స్థాయిలో త‌న ప‌రువు బ‌జారు కీడుస్తుండ‌టంపై సీఎం జ‌గ‌న్‌రెడ్డిలో క‌ల‌వ‌రపాటు మొద‌లైంద‌ని అంటున్నారు. అందుకే, కేంద్ర‌హోంమంత్రి అమిత్‌షాను క‌లిసేందుకూ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని చెబుతున్నారు. తాజాగా, ఎంపీ ర‌ఘురామ‌.. తన అరెస్ట్‌, తదనంతర పరిణామాలను వివరిస్తూ అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు. జగన్ మిన‌హా.. మిగ‌తా అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు రఘురామ లేఖలు పంపించారు. ఏపీ సీఐడీ పోలీసులు తనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్‌ వేసినందుకే.. కక్ష సాధింపు చ‌ర్య‌ల్లో భాగంగా తనను అరెస్ట్‌ చేయించారని రఘురామకృష్ణరాజు తెలిపారు. ఈ విషయంపై పార్లమెంట్‌లో తనకు మద్దతిచ్చేలా వారి ఎంపీలకు సూచించాలని సీఎంలను కోరారు. రాజద్రోహం సెక్షన్‌ను తొలగించేలా అసెంబ్లీల్లో తీర్మానం చేసి.. కేంద్రానికి పంపాలని సీఎంలకు రాసిన లేఖలో రఘురామ కోరడం విశేషం.  ఇప్ప‌టికే ప‌లు పార్టీల‌కు చెందిన స‌హ‌చ‌ర‌ ఎంపీల‌కు ర‌ఘురామ లేఖ‌లు రాసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న రాసిన లేఖ‌ల‌తో ర‌ఘురామ‌కు దేశ‌వ్యాప్తంగా ఎంపీల నుంచి మద్దతు పెరుగుతోంది. కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్‌, మండ్యా ఎంపీ సుమ‌ల‌త‌, కేర‌ళ ఎంపీ ప్రేమ్ చంద్రన్‌, ఒడిశాలోని పూరి ఎంపీ, బిజూ జ‌న‌తాదళ్ పార్లమెంటరీ పార్టీ నేత పినాకి మిశ్రాతో పాటు మ‌రో ఒడిశా ఎంపీ చంద్రశేఖ‌ర్ సాహూ వంటి వారు ర‌ఘురామ ప‌ట్ల ఏపీ సీఐడీ వ్య‌వ‌హ‌రించిన‌ తీరును తీవ్రంగా ఖండించారు. రఘురామ రాసిన లేఖకు స్పందించిన నీటిపారుదల వ్యవహారాల స్థాయీ సంఘం ఛైర్మన్‌ సంజయ్‌ జైస్వాల్.. ఈ ఘటన బాధించిదని ఈ విషయంపై పార్ల‌మెంట్‌లో తప్పక మాట్లాడతానని రఘురామకు మెయిల్‌ చేశారు. అనేక మంది ఎంపీలు పోలీసుల క్రూర‌త్వం, ర‌ఘురామ‌కు జ‌రిగిన దారుణాన్ని తీవ్రంగా త‌ప్పుబ‌డుతూ, ఖండిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.  ఇలా.. ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఎపిసోడ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అదే స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్‌రెడ్డి ఇమేజ్‌ దేశ‌వ్యాప్తంగా డ్యామేజ్ అవుతోంది. సుప్రీంకోర్టు షరతులకు లోబ‌డి.. జ‌గ‌న్‌రెడ్డి ప్రభుత్వంపై తనదైన శైలిలో పోరాడుతున్నారు ఎంపీ ర‌ఘురామ‌. వీల్‌ఛెయిర్‌లో వెళ్లి ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను క‌ల‌వ‌డం.. లోక్‌స‌భ స్పీక‌ర్‌ను క‌లిసి కాలి గాయాలు చూపించ‌డం.. త‌న‌పై జ‌రిగిన దాడిపై జాతీయ మాన‌వ హ‌క్కుల సంఘానికి ఫిర్యాదు చేయ‌డం.. కేసుతో సంబంధం ఉన్న ప‌లువురు ఏపీ అధికారుల‌కు లీగ‌ల్ నోటీసులు పంపించ‌డం.. త‌న సెల్‌ఫోన్ తీసుకున్నారంటూ సీఐడీ ఉన్న‌తాధికారిపై ఢిల్లీ పోలిస్‌స్టేష‌న్‌లో కంప్లైంట్ చేయ‌డం... ఇలా ఢిల్లీలో ఉంటూనే త‌న అరెస్ట్‌, క‌స్ట‌డీలో కొట్ట‌డంపై గ‌తంలో ఏ నాయ‌కుడూ పోరాడ‌ని విధంగా పోరాడుతున్నారు ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. ర‌ఘురామ ఎత్తుగ‌డ‌ల‌తో.. దేశ‌వ్యాప్తంగా ప‌ర‌వు పోగొట్టుకొని.. జాతీయ వ్య‌వ‌స్థ‌ల ముందు దోషిగా నిల‌బ‌డే దుస్థితి వ‌స్తుండ‌టంతో.. జ‌గ‌న్‌రెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నార‌ట‌. అందుకే, ర‌ఘురామ బిగుస్తున్న చ‌క్ర‌బంధ‌నం నుంచి త‌ప్పించుకోడానికి కేంద్ర హోంశాఖ శ‌ర‌ణు కోరేందుకు అమిత్‌షా అపాయింట్‌మెంట్ కోసం తెగ ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని ఎద్దేవా చేస్తున్నారు విమ‌ర్శ‌కులు. ఏదిఏమైనా.. అన్ని రాష్ట్రాల సీఎంల‌కు, ఎంపీల‌కు లేఖ‌లు రాసి.. జాతీయ స్థాయిలో జ‌గ‌న్‌రెడ్డిపై ర‌ఘురామ తీర్చుకుంటున్న‌ రివేంజ్ ఓ రేంజ్‌లో ఉంటోందంటున్నారు. అందుకే, జ‌గ‌న్‌రెడ్డికి ఢిల్లీ వైపు చూడాలంటేనే ముచ్చెమ‌ట‌లు ప‌ట్టేలా చేస్తున్నార‌ట‌ ర‌ఘురామ‌...

ఈటల డీఎన్ఏ పే చర్చ! ఆత్మగౌరవమా.. ఆస్తుల రక్షణా?

మాజీ మంత్రి, మాజీ తెరాస నాయకుడు ఈటల రాజేందర్ తనంతట తానుగా,మంత్రి పదవికి రాజీనామా చేయలేదు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఐదేళ్లకు పైగా ఆయన అవమానాలను భరిస్తూ వచ్చారు. అవమానాలకు ఆత్మగౌరవం బలవుతున్నా పెదవి విప్పలేదు. ఆయన తమ ఆవేదను, తమలోనే దాచుకున్నారు. మంత్రి పదవికంటే ఆత్మగౌరవం ముఖ్యమని, మంత్రిపదవిని, బానిస భవన్ ముఖాన కొట్టి రాలేదు.చివరకు ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆయన్ని  బర్తరఫ్ చేశారు. బర్తరఫ్ అయిన తర్వాత కూడా ఆయన మీసాలు మేలేయ లేదు తొడలు కొట్టలేదు. అవమానాలను గుర్తుచేసుకుని ఆత్మాభిమానాన్ని చూపలేదు. తెగిన బంధం అటుకుతుందేమో అని ఆశగా ఎదురు చూసారు. కాదని తేలిన తర్వాత  ప్రత్యాన్మాయ రాజకీయ వేదిక వేటలో పడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యతిరక వర్గాల నాయకులను కలిసి చర్చలు జరిపారు ఈటల. సలహాలు, సూచనలు తీసుకున్నారు. కొత్త పార్టీ పెట్టడమా, ఉన్న పార్టీలలోచేరడమా,  ఉన్న పార్టీలలో ఏది ఉత్తమం?  కాంగ్రెస్, బీజేపీ  ఏ పార్టీలో చేరాలి ... ఏ పార్టీలో చేరితే ఎంత లాభం, ఇలా అనేక కోణాల్లో లాభ నష్టాలను  బేరీజు వేసుకున్నారు, చివరకు, కేంద్రంలో అధికారంలో ఉన్న కమల దళాన్ని ఎంచుకున్నారు. అయన బీజేపీని ఎంచుకోవడానికి, ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండడం ఒక కారణం అయితే,రాష్రంలోనూ అంతో ఇంతో బలము, భవిష్యత్ ఉన్న పార్టీ కావడమే కారణం. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అంతో ఇంతో భవిష్యత్ ఉందన్న భరోసా చిక్కితే, ఒక క్షణం అలోచించకుండా, హస్తం పార్టీతోనే చేతులు కలిపేవారు. ఇదీమి బ్రహ్మ పదార్ధం కాదు. ఎవరికీ తెలియని రహస్యం కాదు.  అయినా, చిత్రంగా ఆయన పూర్వాశ్రయంలోకి తొంగి చూస్తున్నారు. అయన ఎప్పుడో వదిలేసినా ఎర్ర చొక్కాను, రెడ్  ఫ్లాగ్, నాటు తుపాకిని గుర్తు చేస్తున్నారు. చిత్రంగా ఆయన డీఎన్ఏ గురించి మాట్లాడుతున్నారు. కమ్యూనిస్ట్ నాయకులు,మాజీ కమ్యూనిస్టులు ఈటల బీజేపీలో చేరి మైల పడి పోయారని, ఆవేదనతో కూడిన ఆగ్రహం వ్యక్త పరుస్తున్నారు, అలాగే, అయన, వామ పక్షాల గురింఛి చేసిన కొన్ని వ్యాఖ్యలకు నొచ్చుకుంటున్నారు. ఈటల బీజేపీలో చేరాలని నిర్ణయించుకోవడం ఆత్మహత్యా సదృశమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. వామపక్ష రాజకీయాలతో ప్రారంభమై.. ప్రజాస్వామికవాదిగా కొనసాగి..ఇప్పుడు మతోన్మాద ఫాసిస్ట్‌ బీజేపీ పంచన చేరడం సిగ్గుపడాల్సిన విషయమని విమర్శించారు. ప్రజాస్వామ్యం కోసం పోరాడే శక్తిగా ఈటల తయారవుతారని తెలంగాణ ప్రజలు భావించారని, అయితే ఆయన నిర్ణయంతో వారందరూ చల్లబడిపోయారని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. తన ఉనికి కోసమే బీజేపీలోకి ఈటల వెళ్తున్నట్లు స్పష్టమవుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. ఈటల తన అక్రమ ఆస్తులు కాపాడుకునేందుకు బీజేపీలోకి వెళ్తున్నారా? అని యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి ఎద్దేవా చేశారు.  మరో వైపు సీపీఐపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తప్పుపట్టారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమన్నారు. టీఆర్ఎస్‌తో తమకు లోపాయకారి ఒప్పందం ఉంటే నిరూపించాలన్నారు.  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా ఈటల రాజేందర్ బీజేపీలో చేరడాన్ని తప్పుపట్టారు. ఆత్మగౌరవం కాదని.. ఆస్తుల రక్షణ కోసమే వెళుతున్నారని విమర్శించారు. నిజానికి ఈ చర్చ అంతా అనవసరం. ఎందుకంటే, ఈరోజు రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు సిద్దాంతాలకు ఎప్పుడోనే విడాకులు ఇచ్చేశారు. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడు అయినా కోరుకునేది, కట్టుబడేది అధికారానికి, ఆత్మరక్షణకు. ఈటల అందుకు మినహాయింపు కాదు, ఆయన బీజేపీలో చేరి చేదిపోయాడని, అనుకునే వాళ్ళు అంతే.

పార్లమెంట్ లో మద్దతివ్వండి! ఢిల్లీ సీఎంకు రఘురామ లేఖ..

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు దూకుడు మరింత పెంచారు. ఎంపీ అయిన తనపై ఏపీ సీఐడీ పోలీసులు దారుణంగా వ్యవహరించారని ఆరోపిస్తున్న రఘురామ.. తన పోరాటం ఉధృతం చేశారు. ఇప్పటికే తనపై జరిగిన దాడిపై లోక్ సభ స్పీకర్ కు , పార్లమెంట్ కమిటీలకు ఫిర్యాదు చేశారు. ఎంపీలందరికి లేఖలు రాశారు. రఘురామపై దాడి ఘటనపై ఎంపీలు షాకయ్యారు. తీవ్రంగా స్పందిస్తూ కొందరు ఎంపీలు ట్వీట్లు చేశారు. ఎంపీకే ఇంత దారుణమా అంటూ కొందరు ఏపీ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపై రాజద్రోహం కేసు పెట్టడంపై అన్ని విధాల పోరాటం చేస్తున్న రఘురామ.. పార్లమెంట్ లో ఈ అంశాన్ని లేవనెత్తపోతున్నారు.ఇందుకోసం ఇప్పటికే ఎంపీల మద్దతు కూడగట్టిన రఘురామ.. ఇప్పుడు పార్టీల మద్దుతు కోసం ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కు లేఖ రాశారు ఎంపీ రఘురామ రాజు. సెక్షన్ 124ఏ రద్దుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు పార్లమెంటులో డిమాండ్ చేయాలని  తన లేఖలో కోరారు. ఆప్ సభ్యులు పార్లమెంటులో దీనిపై గళం వినిపించేలా చూడాలని రఘురామ విజ్ఞప్తి చేశారు. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారి ఓ ఎంపీని 124ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేసి, చిత్రహింసలు పెట్టారని ఎంపీ రఘురాం  తెలిపారు.  మే 14న తనను అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు క్రూరంగా హింసించారని వివరించారు. సెక్షన్ 124ఏను రద్దు చేసేందుకు పూర్తి మద్దతు ఇవ్వాలని రఘురామకృష్ణరాజు తన లేఖలో కోరారు.

కోరిక తీర్చమన్న భర్త.. చంపేసిన భార్య.. 

పెళ్ళాం మొగుడు అన్నంక కొంచం ముద్దు ముచ్చట ఉండాలి, సరసం, విరసం..విసుకోవడాలు, విన్న వించుకోవడాలు ఉండలు ఉంటాయి. అన్ని కలిస్తేనే సంసారం అంటారు. ధర్మ, అర్థ, కామ, మోక్షములలో తోడుగా ఉంటానని పంచభూతాలుగా సాక్షిగా ప్రతిజ్ఞ చేసిన సతి చివరికి భర్త చావుకు కారణం అయింది. భర్తతో కలిసి జీవితాన్ని పంచుకోవాల్సిన భార్య.. అతడి పాలిట యమపాశంగా మారింది. ఇంతకీ ఏం జరిగింది.. ఎలా జరిగింది అనేది చూద్దాం..  కామారెడ్డి పట్టణంలోని బీడీ వర్కర్స్ కాలనిలో ప్రవీణ్ (38), లావణ్య దంపతులు నివాసం ఉంటున్నారు.  వీరికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. మెట్ పల్లి శివారులో బీడీ కార్ఖానాలకు ఇంఛార్జిగా ప్రవీణ్ పని చేస్తున్నాడు. అతనికి ఇద్దరు  బావమరుదులు ఉన్నారు. ఈ మైదా కాలంలో వారు కొంత భూమి విక్రయించగా కొంత డబ్బు వచ్చింది.. బావ బావమరుదులు అన్నాకా ఇచ్చి పుచ్చుకోవడం సహజం.. అది పక్కన పెడితే సహాయం అడిగిన బావ కి తమకు తోచిన సహాయం అందించడం బామ్మర్దుల దర్మం.. అలా భూమి విక్రయించగా  వచ్చిన డబ్బులలో తన అవసరానికి కొంత తేవాలని భార్యకు సూచించాడు అతడు..  అంతే అదే ఆయన చేసిన పాపమైంది. భర్త అడిగిన విషయమై ఆమె అన్నదమ్ములైన రమేష్, శ్రీను, లక్ష్మణ్ ల వద్ద ప్రస్తావించింది. భర్తకు డబ్బులు ఇవ్వడం ఇష్టంలేని భార్య తన అన్నదమ్ములతో కలిసి భర్తను హత్యచేయడానికి ప్లాన్ వేసింది.  ఇక అందుకు అన్ని సిద్ధం చేశారు.  అది సోమవారం ఉదయం కామారెడ్డికి వచ్చిన  ముగ్గురు బామ్మర్దులు, వారి భార్యలు, ప్రవీణ్ భార్య కలిసి ప్రవీణ్ పై ఇటుకలు, కర్రలతో దారుణంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్ర గాయాలైన ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న దేవునిపల్లి రూరల్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సై రవికుమార్ కాలానికి వచ్చి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాలనిలో అందరితో కలుపుగోలుగా ఉండే ప్రవీణ్ హత్యకు గురికావడం కాలనిలో విషాదాన్ని నింపింది.  

ఈటలకు కీలక పదవి! ఆ మూడు ఆఫ‌ర్ల‌లో ఏది బెస్ట్‌?

త్వ‌ర‌లోనే బీజేపీలో చేర‌బోతున్నారు మాజీమంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌. టీఆర్ఎస్‌లో ఆయ‌న కేసీఆర్ త‌ర్వాత కేసీఆర్ అంత‌టివారు. త‌న‌కు కుడిభుజం లాంటి వార‌ని స్వ‌యంగా కేసీఆరే ఓ బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌క‌టించారు. ఇంకో అధికార పార్టీ నేత మాట‌ల్లో చెప్పాలంటే రెండో సీఎం ఈట‌ల రాజేంద‌ర్‌. ఆ స్థాయి నేత తెలంగాణ‌లో అంత‌గా బ‌లంలేని బీజేపీలో చేరితే.. ఇంకెంతంటి కీల‌క ప‌ద‌వి ల‌భించాలి?  పార్టీలో, ఒక‌వేళ అధికారంలోకి వ‌స్తే ప్ర‌భుత్వంలో ఎలాంటి ప్రాధాన్య‌త ద‌క్కాలి? అనే అంశాల‌పై చ‌ర్చ జ‌రుగుతోంది. ఇటీవ‌ల ఢిల్లీ వెళ్లి కాషాయం పెద్ద‌ల‌ను క‌లిసిన ఈట‌ల‌.. ఆ మేర‌కు వారితో విస్తృతంగా చ‌ర్చించార‌ట‌. వారి నుంచి కాస్త సంతృప్తిక‌ర‌మైన హామీ ల‌భించాకే.. కాషాయ కండువా క‌ప్పుకోటానికి ఈట‌ల సిద్ధ‌మ‌య్యార‌ని అంటున్నారు.  టీఆర్ఎస్‌లో కేసీఆర్ నియంతృత్వ పోక‌డ‌లు న‌చ్చ‌లేదు. చిన‌బాస్ కేటీఆర్ కింద ప‌ని చేయ‌డం ఇష్టం లేదు. బానిస‌లా బ‌త‌క‌లేక పార్టీని వీడుతున్నాన‌ని ఈట‌ల స్ప‌ష్టం చేశారు. మ‌రి, బీజేపీలోనైనా య‌జ‌మాని కాగ‌లుగుతారా? అనేదే ఇప్పుడు ప్ర‌శ్న‌. ఆరుసార్లు ఎమ్మెల్యే. ప‌లుమార్లు మంత్రి ప‌ద‌వి. ఇక రాష్ట్ర స్థాయిలో ఆయ‌న రాజ‌కీయ జీవితంలో మిగిలింది రెండే రెండు ప‌ద‌వులు. ఒక‌టి పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి. ఇంకోటి ముఖ్య‌మంత్రి పీఠం. లేదంటే.. పార్ల‌మెంట్ స‌భ్య‌త్వంతో పాటు కేంద్ర‌మంత్రి హోదా. ఈ మూడే ఈట‌ల ముందున్న బెస్ట్‌ ఆప్ష‌న్లు.  ఇందులో మొద‌టి రెండు ఆప్ష‌న్ల విష‌యానికి వ‌స్తే.. పార్టీ ప‌గ్గాలు.. ముఖ్య‌మంత్రి సీటు. ఈ రెండూ బీజేపీలో కాస్త క‌ష్ట‌మే అంటున్నారు. ఎందుకంటే.. సంఘ్ ప‌రివార్ నుంచి వ‌చ్చిన వారు కాకుండా కొత్త వారి చేతికి పార్టీని అప్ప‌గించ‌డం దాదాపు అసాధ్యం. ఇప్ప‌టి వ‌ర‌కూ దేశ‌వ్యాప్తంగా బీజేపీకి ఉన్న రాష్ట్ర అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రులు అంతా ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు ఉన్న‌వారే. ఆ లెక్క‌న‌.. ఈట‌ల‌కు ఈ రెండు ప‌ద‌వులు వ‌రించ‌డం కుద‌ర‌క‌పోవ‌చ్చు. అయితే, ఇక్క‌డే మ‌రో పాయింట్ కూడా ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తోంది. ఇటీవ‌ల కేర‌ళ అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా.. త‌ట‌స్తుడైన మెట్రో మ్యాన్ శ్రీధ‌ర‌న్‌ను బీజేపీలో చేర్చుకొని ఆయ‌న‌ను సీఎం క్యాండిడేట్‌గా ముందే ప్ర‌క‌టించింది కాషాయ‌ద‌ళం. కిర‌ణ్‌బేడీ విష‌యంలోనూ ఇదే స్ట్రాట‌జీ అమ‌లు చేశారు. అదే విధంగా ఈట‌ల విష‌యంలోనూ ఎగ్జెంప్ష‌న్ ఇచ్చే అవ‌కాశమూ లేక‌పోలేద‌ని అంటున్నారు. బీసీని ముఖ్య‌మంత్రిని చేయాల‌ని అనుకుంటే.. ఇప్ప‌టికే బండి సంజ‌య్ ఉన్నారుగా అని గుర్తు చేస్తున్నారు. బండి సంజ‌య్‌కు ఇప్ప‌టిలానే పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌లతో పాటు కేంద్రంలోకి తీసుకుంటే.. అప్పుడు ఈట‌ల‌కు రూట్ క్లియ‌ర్ అవుతుంద‌నేది ఓ అంచ‌నా. అయితే.. కేంద్ర పెద్ద‌ల‌ ఆశీస్సులు బ‌లంగా ఉన్న కిష‌న్‌రెడ్డిని కాద‌ని.. బీసీని ముఖ్య‌మంత్రిని చేసేంత‌ సాహ‌సం బీజేపీ చేస్తుందా అనేది కీల‌కాంశం.  ఇక‌, పార్టీ ప‌గ్గాలు, ముఖ్య‌మంత్రి ప‌ద‌వి తీసేస్తే.. ఇప్ప‌టికిప్పుడు ఈట‌ల ముందున్న మ‌రో ఆప్ష‌న్ రాజ్య‌స‌భ ప‌ద‌వి + కేంద్ర మంత్రి. తొలి నుంచీ ఇదే ప్ర‌చారం జ‌రుగుతోంది కూడా. హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో ఈటల స‌తీమ‌ణి జ‌మునారెడ్డితో పోటీ చేయించి.. రాజేంద‌ర్‌ను రాజ్య‌స‌భ‌కు పంపి.. కేంద్రమంత్రిని చేస్తార‌నే దిశ‌గా బీజేపీ అధిష్టానం నుంచి లీకులు వ‌స్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ నుంచి కేంద్రంలో కిషన్‌రెడ్డి ఒక్కరే మంత్రిగా ఉండడంతో ఈటలకు బెర్త్ దాదాపు కన్ఫామ్ అంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ హామీతోనే ఈట‌ల బీజేపీలో చేరుతున్నార‌ని.. కాషాయం పార్టీకి పెద్ద మొత్తంలో పార్టీ ఫండ్ ఇచ్చేందుకు సైతం రాజేంద‌ర్ సిద్ద‌మ‌య్యార‌ని టాక్‌. ఇవ‌న్నీ అనుకున్న‌వి అనుకున్న‌ట్టు జ‌ర‌గాలంటే.. హుజురాబాద్‌లో ఈట‌ల గెలుపు త‌ప్ప‌నిస‌రి. అది ఆయ‌నే పోటీ చేసినా.. లేక‌, ఆయ‌న స‌తీమ‌ణి బ‌రిలో నిలిచిన‌.. ఎలాగైనా గెలిచి తీరాల్సిన త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితి. అయితే, అది అంత ఈజీగా అయ్యే ప‌నిలా క‌నిపించ‌డం లేదు. కేసీఆర్ వేగంగా క‌దుపుతున్న పావుల‌కు.. ఇప్ప‌టికే ఈట‌ల వ‌ర్గం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గులాబీ కేడ‌ర్ అంతా టీఆర్ఎస్‌లోనే ఉండేలా న‌యానా, భ‌యానా క‌ట్ట‌డి చేయ‌డంలో అధికార పార్టీ స‌క్సెస్ అవుతోంది. స్థానిక బీజేపీ శ్రేణులు సైతం ఈట‌ల రాక‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. బీజేపీ నేత పెద్దిరెడ్డికి ఇప్ప‌టికే టీఆర్ఎస్ గాలం వేసి రెడీగా ఉంచింది. ప్ర‌స్తుతానికి ఈట‌ల రాజేంద‌ర్ వెంట ప‌ట్టుమ‌ని ప‌ది మంది నేత‌లు కూడా లేని దుస్థితి. అయినా, నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌లే త‌న‌ను గెలిపించుకుంటార‌నే ధీమా ఆయ‌న‌లో క‌నిపిస్తోంది. త‌న తెగువ‌కు, బీజేపీ దూకుడు తోడైతే.. హుజురాబాద్‌లో అధికార పార్టీ ప‌ప్పులు ఉడ‌క‌వ‌ని భావిస్తున్నారు. రాజ‌కీయంగా అత్యంత కీల‌కంగా మారిన ఈట‌ల ఎపిసోడ్‌.. ఇటు రాజేంద‌ర్‌కు, అటు బీజేపీకి ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. భ‌విష్య‌త్తులో ఈట‌ల ముఖ్య‌మంత్రి కావాల‌న్నా.. బీజేపీ ప‌గ్గాలు చేప‌ట్టాల‌న్నా.. కేంద్ర‌మంత్రి అవ్వాల‌న్నా.. హుజురాబాద్‌లో గెల‌వ‌డం త‌ప్ప‌నిస‌రి. ఏమాత్రం తేడా వ‌చ్చినా.. ఇటు వ్య‌క్తిగ‌తంగా, అటు పార్టీ ప‌రంగా.. తీర‌ని న‌ష్టం. 

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు చంద్రబాబు పరామర్శ.. కంటతడి పెట్టిన సీతక్క.. 

తెలంగాణ రాష్ట్రంలోని ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే ధనసరి సీతక్కనను టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. సీతక్క  తల్లి సమ్మక్క హైదరాబాదులోని ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏఐజీకి వెళ్లి సమ్మక్కను చంద్రబాబునాయుడు పరామర్శించారు. ఆమె ఆరోగ్యం గురించి ఎమ్మెల్యే సీతక్కతోనూ, ఏఐజీ వైద్యులతోనూ మాట్లాడారు. సీతక్కకు ధైర్యంగా ఉండాలని చెప్పారు. సీతక్క నిరాడంబరత, ప్రజాసేవ, క్రమశిక్షణ తదితర అంశాలను చంద్రబాబు అక్కడి వైద్యులకు వివరించారు. ఆమె అవలంబిస్తున్న సేవా  కార్యక్రమాలను చంద్రబాబు అభినందించారు. తన గురించి ఏఐజీ వైద్యులకు చంద్రబాబు  ప్రత్యేకంగా వివరించడంతో సీతక్క ఉద్వేగానికి లోనయ్యారు. ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. దీని గురించి ఆమె ట్విట్టర్ లో వెల్లడించారు. తన తల్లిని పరామర్శించడమే కాకుండా, తమకు ధైర్యం చెప్పారని తెలిపారు. చంద్రబాబును సీతక్క తన ఆత్మీయ సోదరుడు అని అభివర్ణించారు. థాంక్స్ అన్నా అంటూ సీతక్క తన ట్విట్టర్ అకౌంట్లో చంద్రబాబు సందర్శన వీడియోను పంచుకున్నారు. సీతక్క తెలుగు దేశం పార్టీలో సుదీర్ఘకాలం పని చేశారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడారు. తెలంగాణలో టీడీపీ ముఖ్య నేతల్లో ఒకరిగా నిలిచిన సీతక్క.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితురాలిగా ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి తెలంగాణ టీడీపీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో... అతనితో పాటు హస్తం గూటికి చేరారు. గత ఎన్నికల్లో ములుగు నుంచి ఘన విజయం సాధించారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఆమె యాక్టివ్ నేతగా ఉన్నారు. కాంగ్రెస్ మహిళా విభాగం జాతీయ కమిటీలో కీలకమైన స్థానంలో ఉన్నారు. కరోనా కల్లోల సమయంలో పేదలకు అండగా నిలుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఎమ్మెల్యే సీతక్క. 

జోరుగా గులాబీ ఆకర్ష్! కారెక్కనున్న కీలక నేతలు...

తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామాలు జరుగుతున్నాయి. మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ బర్తరప్ తర్వాత సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. సొంత పార్టీ పెడతారని భావించిన రాజేందర్.. కమలం గూటికి చేరుతున్నారు. ఈటలతో పాటు మరికొందరు నేతలు బీజేపీకి జై కొట్టబోతున్నారు. ఇప్పటికే తెలంగాణలో దూకుడు పెంచిన కమలానికి.. రాజేందర్ రాక మరింత బూస్ట్ ఇస్తోంది. ఇదే స్పీడుతో టీఆర్ఎస్ లోని అసంతృప్త నేతలను, కాంగ్రెస్ లో ఉన్న బలమైన నేతలను తమ పార్టీలోకి తీసుకువచ్చేందుకు బండి సంజయ్ టీమ్ ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. మాజీ ఎంపీతో పాటు తెలంగాణ కాంగ్రెస్ లో కీలకంగా ఉన్న ఒక ఎమ్మెల్యే త్వరలో కాషాయ జెండా కప్పుకోవడం ఖాయమంటున్నారు. ఈటల రాజేందర్ కార్యాచరణ, బీజేపీ నేతల కదలికలను గమనిస్తున్న గులాబీ బాస్ కూడా తన వ్యూహాలను పదును పెట్టారని తెలుస్తోంది. బీజేపీ ధీటుగా మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ గా ఆయన తెర లేపారని అంటున్నారు. ఈటల రాజేందర్ ఎపిసోడ్ తో బీసీల నుంచి వ్యతిరేకత రావచ్చని భావిస్తున్న కేసీఆర్.. ఆ సామాజిక వర్గాలను చెందిన నేతలకు గాలం వేస్తున్నారని అంటున్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ త్వరలో గులాబీ గూటికి చేరనున్నారని తెలుస్తోంది. రమణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి పార్టీలోకి చేర్చుకునేందుకు గులాబీ బాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెబుతున్నారు. ఈ మేరకు ఎల్.రమణతో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మంతనాలు సాగించినట్లు సమాచారం.  జగిత్యాల నియోజకవర్గానికి చెందిన ఎల్ రమణతో.. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా మాట్లాడారట. పద్మశాలి సామాజికవర్గానికి చెందిన ఎల్‌.రమణకు బీసీ వర్గాల్లో  మంచి గుర్తింపు ఉంది. ఈటల రాజీనామాతో ఖాళీ అయిన బీసీ నాయకుడి స్థానాన్ని మరొక బీసీ నేతతోనే భర్తీ చేయడానికి టీఆర్ఎస్ అధిష్ఠానం వ్యూహ రచన చేస్తోందని తెలుస్తోంది. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఎల్.రమణ... రాష్ట్ర విభజన తర్వాత నుంచి టీటీడీపీ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. ఎల్.రమణతో పాటు పలువురు టీడీపీ నాయకులు టీఆర్ఎస్‌లోకి వెళ్లనున్నారని సమాచారం.ఈ నెల 3న ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. కోవిడ్ కారణంగా వాటి ఎన్నికల ఆలస్యమవుతున్నాయి.  ఎమ్మెల్సీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా... రమణకు ఛాన్స్ ఖాయమంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బీసీ నేత, టీడీపీ మాజీ నేత ఎర్ర శేఖర్ కూడా త్వరలో కారెక్కనున్నారని తెలుస్తోంది. ఉత్తర తెలంగాణలో కీలకమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పట్టుకోల్పోకుండా ఉండేదుకు టీఆర్ఎస్ అధిష్ఠానం ప్రయత్నాలు మొదలుపెట్టిందని తెలుస్తోంది. ఈటల నియోజకవర్గం హుజూరాబాద్ కు చెందిన మాజీ మంత్రి, టీడీపీలో కీలక నేతగా ఉండి ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఇనగాల పెద్దిరెడ్డిని కూడా కారెక్కించేందుకు రంగం సిద్ధమైందంటున్నారు. పెద్దిరెడ్డితో కేసీఆరే స్వయంగా మాట్లాడుతున్నారని తెలుస్తోంది. ఇటీవలే ఈటల రాజేందర్ బీజేపీలో చేరికపై పెద్దిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈటల బీజేపీలోకి వస్తే ఉప్పెన వస్తుందన్నారు. దీంతో పెద్దిరెడ్డి గులాబీ పార్టీలో చేరడం ఖాయమైందనే చర్చే కరీంనగర్ జిల్లాలో జరుగుతోంది.   ఎల్ రమణ, పెద్ది రెడ్డితో పాటు గతంలో టీడీపీలో కీలకంగా ఉంటూ ప్రస్తుతం బీజేపీలో ఉన్న నేతలనతోనూ టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని తెలుస్తోంది. బీజేపీ నేతల తీరుతో అసంతృప్తిగా ఉన్న కొందరు నేతలు.. కేసీఆర్ నుంచి స్పష్టమైన హామీ ఇప్పిస్తే పార్టీలో చేరడానికి సుముఖంగా ఉన్నారని అంటున్నారు. ఈటల రాజేందర్ అధికారికంగా బీజేపీలో చేరిన వెంటనే... గులాబీ పార్టీలోకి వలసలు ఉండేలా వ్యూహం రెడీ చేశారని అంటున్నారు. బీజేపీ దిమ్మతిరిగేలా చేరికల ఉంటాయని కొందరు టీఆర్ఎస్ నేతలు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారంటే.. గులాబీ బాస్ స్కెచ్ భారీగానే ఉందనే చర్చ జరుగుతోంది. 

మీ అన్నకు నువ్వే కాపురం చేయి.. అంటూ వదిన.. 

ముపై గుండ్లు ఒక్క చోట ఉండొచ్చు కానీ.. మూడు శిగలు ఒక చోట ఉంలేవు అంటారు మన పెద్దలు.. అలాగే ఒక ఆడదానికి శత్రువు మరో ఆడదే అంటారు.. అది వంద శాతం నిజమనే అంటారు ఈ వార్త చదివితే.. అన్న సంపాదన అంత చెల్లెలికి సరిపోతుందనుకున్న వదిన, తన తల్లి గోరింటాకు సినిమాలో కంటే ఎక్కువే వేధించారు.. ఇంతకీ ఏం జరిగిందో మీరే చూడండి..  జగిత్యాల జిల్లా.  గొర్రెపల్లి గ్రామం. ఆ యువతీ పేరు  శ్రీదేవి. ఆమె వయసు 21 సంవత్సరాలు.  పదేళ్ల కిందటే ఆ యువతి  తల్లిదండ్రులు  పదేళ్ల క్రితమే అనారోగ్యంతో మృతిచెందారు. అయితే అప్పటి నుంచి అన్న అరవింద్‌తో కలిసి శ్రీదేవి ఉండేది.. ఆ తర్వాత అన్న అరవింద్2కు  అప్పటి నుంచి చెల్లి బాధ్యతలను అరవిందే చూసుకుంటున్నాడు. అయితే ఎనిమిదేళ్ల క్రితం జగిత్యాల జిల్లా గొర్రెపల్లి గ్రామానికి చెందిన తన మేనత్త జాదవ్‌ సెవంతబాయి కూతురు మంజులను అరవింద్‌ పెళ్లి చేసుకున్నాడు. వదిన రాగానే అన్న చెల్లెలా బంధానికి అడ్డుకట్ట వేసింది.. మెల్లిగా శ్రీదేవికి  వదిన వేధింపులు మొదలయ్యాయి.   ఆర్థిక ఇబ్బందుల కారణంగా అరవింద్ ఉపాధి కోసం 2018లో దుబాయ్‌ వెళ్లాడు. శ్రీదేవి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. భార్యా పిల్లలకు తోడుకోసం అరవింద్‌ తన మేనత్తను కూడా హర్కపూర్‌లో తన ఇంట్లో ఉండమని చెప్పాడు. ఈ క్రమంలో అరవింద్ చెల్లెలు శ్రీదేవిని  తమతోపాటు ఉంచుకుని పోషించడం అరవింద్‌ భార్య మంజుల, ఆమె తల్లి సెవంతబాయికి నచ్చేదికాదు. శ్రీదేవి పెళ్లి విషయంలో వారిద్దరూ దుబాయ్‌లో ఉన్న అరవింద్‌తో తరచూ ఫోన్‌లో మాట్లాడేవాళ్ళు, అప్పుడప్పుడు  గొడవ పడుతుండేవారు. ఒక రకంగా టార్చెర్ చేసేవాళ్లు.  ఆమె పెళ్లికి కట్నం ఇవ్వడంతో పాటు వివాహ ఖర్చులకు లక్షల రూపాయలు కావాల్సి వస్తుందని ఘర్షణ పడేవారు.  శ్రీదేవిని ఏమన్నా ఎవరు ఏమనేవాళ్లు లేరు..  ఈ క్రమంలో శ్రీదేవికి ఇటు వదిన నుండి అటు వదిన తల్లి నుండి వేధింపులు ఎక్కువయ్యాయి. అంతే కాదు తనకు పెళ్ళిచేయడం తమ వల్లకాదని.. అందుకే ఎవరితోనైనా లేచిపోవాలని  శ్రీదేవిని మానసింకంగా  హింసించేవారు. నిత్యం వేధించేవారు.  ఏడాది నుండి ఈ వేధింపులు ఎక్కువ కావడంతో వాళ్ళ వేధింపులు భరించలేక శ్రీదేవి ఈ విషయాన్ని తన అన్నకు చెప్పింది. దుబాయ్‌లో కరోనా లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడిన అరవింద్‌ ఈ ఏడాది జనవరిలో స్వగ్రామానికి వచ్చాడు. తన చెల్లిని వేధించిన విషయమై భార్య, మేనత్తతో గొడవ పడ్డాడు. దీంతో భార్య మంజుల, మేనత్త సెవంతబాయి అదే నెలలో తమ ఊరికి వెళ్లిపోయారు. అయినా తరచుగా శ్రీదేవికి ఫోన్‌ చేస్తూ ఆమె కారణంగానే తాము విడిపోయామని వేధించేవారు. శనివారం రాత్రి కూడా శ్రీదేవికి మంజుల ఫోన్‌ చేసింది. ఒక ఆడదానికి మరో ఆడదే శత్రువు అన్నట్లు.. శ్రీదేవి కారణంగా తాను పుట్టింటికి వచ్చాను. ఐదు నెలలైనా మీ అన్న కాపురానికి తీసుకెళ్లడం లేదని శ్రీదేవిని తిట్టిపోసింది. ఇక మీ అన్నతో నువ్వే సంసారం చేయ్‌ అంటూ వదిన సూటిపోటి మాటలు అన్నది. దీంతో మేనత్త కూడా తీవ్రంగా దూషించడంతో మనస్తాపం చెందిన శ్రీదేవి క్షణికావేశంలో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతిచెందింది. అరవింద్‌ ఫిర్యాదు మేరకు మంజుల, సెవంతబాయిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

పోలీస్ కత్తి విసిరాడు.. 3 ఏళ్ళ బాలుడు కంట్లో గుచ్చుకుంది ఇక అంతే.. 

పిల్లలు అన్నాక  మారాం చేస్తారు అల్లరి కూడా చేస్తారు.. తెలియని ప్రాయం కొంచం పెద్దవాళ్ళు అయితే అర్థం చేసుకుంటారు. కానీ మూడు  ఏళ్ళ పిల్లవాడికి ఏం తెలుస్తుంది. చెప్పండి..  గేమ్ ఆడిస్తాను అని పిలిచాడు..  పిలిచినప్పుడు రాలేదనే కోపంతో ఆ బాలుడిపై  కత్తి విసిరాడు..ఒక పోలీస్ దుర్మార్గుడు..ఆ కత్తి  నేరుగా ఆ బాలుడి కంట్లో గుచ్చుకోవడంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే  ఆ బాలుడిని విశాఖలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు చికిత్స అందించారు. అసలు ఏం జరిగింది.. చివరికి ఆ బాబుకి ఏమైంది అనుకుంటున్నారా..  అయితే మీరే చదవండి..   అది తూర్పుగోదావరి జిల్లా. రామచంద్రాపురం. బ్రాడీపేట ప్రైవేటు ఆసుపత్రుల వీధిలో రాయవరం మండలం పసలపూడి గ్రామానికి చెందిన నల్లమోతు వాణి, తన అమ్మ, తన మూడు సంవత్సరాల కొడుకుతో కలిసి నివాసముంటోంది. విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రామానికి చెందిన డి.రాము రామచంద్రపురం సబ్‌ జైల్‌ హెడ్‌ వార్డర్‌‌గా వర్క్ చేస్తున్నాడు.. అదే వాణి వాళ్ళు ఉండే ఇంటి పై అంతస్తులో అద్దెకు ఉంటున్నారు. వాణి కొడుకు ధన సిద్దేశ్వర్‌. పిల్లవాడికి బోరు కొట్టినప్పుడు తరచూ ఆడుకునేందుకు ఇంటి పై ఉన్న రాము దగ్గరికి పై అంతస్తుకు వెళ్లేవాడు. గత నెల 24న అలా వెళ్లిన ఆ చిన్నారికి సెల్‌ఫోన్‌లో గేమ్స్‌ ఆడిస్తాను రా.. అంటూ రాము పిలిచాడు. కాసేపటి తర్వాత ఆ చిన్నారి అల్లరి చేస్తున్నాడని తన చేతిలో ఉన్న చాకును విసిరాడు. అది బాలుడి ఎడమ కన్నుకు తగిలింది. ఆడుకునేందుకు వెళ్లిన తన కుమారుడి ఏడుపు వినిపించడంతో వాణి పైకి వెళ్లి చూడగా కొడుకు ఎడమ కంటి నుంచి రక్తం కారడాన్ని గమనించి షాకైంది. చిన్నారిని వెంటనే వేమగిరి ఆస్పత్రికి తరలించగా.. వైద్యుల సూచన మేరకు విశాఖపట్నంలోని ఆస్పత్రికి తీసుకెళ్లింది. బాలుడి కంట్లో నరాలు పాడయ్యాయని, కంటిచూపుకే ప్రమాదమని డాక్టర్లు చెబుతున్నారు. వాణి ఫిర్యాదు మేరకు రామచంద్రపురం సీఐ శ్రీనివాస్‌... నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రాహుల్‌గాంధీనే ప్ర‌ధాని.. కాంగ్రెస్‌కు పీకే బంప‌ర్ ఆఫ‌ర్‌..

ప్రశాంత్ కిషోర్. ఇది పేరు కాదు ఓ పొలిటికల్‌ బ్రాండ్‌. దేశంలోనే సంచలనాత్మక వ్యూహకర్త. ఆయ‌న డీల్ ఓకే చేస్తే.. ఇక ఆ పార్టీ గెలిచిన‌ట్టే. ఏపీలో వైఎస్ జగన్, తమిళనాడులో స్టాలిన్, ఢిల్లీలో కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్‌లో మమత బెన‌ర్జీల‌ను.. తన వ్యూహాలతో గెలిపించిన పొలిటిక‌ల్‌ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిషోర్ అలియాస్ పీకే. హోరాహోరీగా సాగిన బెంగాల్ దంగల్ త‌ర్వాత‌ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా విరామం తీసుకుంటాన‌ని ప్ర‌క‌టించిన పీకే.. అంత‌లోనే మ‌న‌సు మార్చుకున్న‌ట్టున్నారు. ఇప్పుడాయ‌న బీజేపీని గ‌ద్దె దింప‌డ‌మే ప‌నిగా పెట్టుకున్న‌ట్టున్నారు. మోదీకి వ్యతిరేకంగా రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిగా చేయాలనే సంకల్పంతో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే, అడ‌గ‌కుండానే కాంగ్రెస్‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. దేశంతో బీజేపీయేత‌ర ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరును ప్రకటింప‌జేస్తే.. తాను కాంగ్రెస్ కోసం ప‌నిచేయ‌డానికి సిద్ద‌మంటూ ప్ర‌క‌టించారు పీకే. మోదీని ఢీకొట్ట గ‌ల స‌త్తా.. విడివిడిగా ప్రాంతీయ పార్టీల‌కు లేవ‌ని.. రాహుల్‌గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ కూట‌మికే అది సాధ్య‌మ‌నేది పీకే అంచ‌నా. 2024లో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని ప్రకటిస్తే ఆయన కోసం పనిచేయడానికి సిద్ధం అంటూ ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన చేశారు. 2019లో కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీయే గ్రాఫ్ వేగంగా తగ్గుతూ వస్తోంది. ప‌లు రాష్ట్రాల్లో అధికారానికి దూర‌మైంది. ద‌క్షిణాదిన ఇంకా కోలుకోనే లేదు. నాటి పెద్ద నోట్ల ర‌ద్దు నుంచి.. నేటి వ్యాక్సిన్ ఉదాసీన‌త వ‌ర‌కూ.. మోదీ ఇమేజ్ దారుణంగా ప‌డిపోతోంది. కేవ‌లం మాట‌ల ప్ర‌ధానిగా.. మాయ‌ల మ‌రాఠీగా ఆయ‌న‌పై ముద్ర ప‌డుతోంది. చేసేది త‌క్కువ‌.. చెప్పేది ఎక్కువ అనే భావ‌న ప్ర‌జ‌ల్లో వ‌చ్చేసింది. అందుకే, ఇటీవ‌ల జ‌రిగిన ప‌లు అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు, క‌ర్ణాట‌క‌, యూపీలో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల సంగ్రామంలోనూ బీజేపీ దారుణ ఫ‌లితాలు చ‌విచూసింది. అయితే, అదే సమయంలో విపక్ష కాంగ్రెస్ సైతం పుంజుకోలేక పోవ‌డం బీజేపీకి అడ్వాంటేజ్‌గా మారుతోంది.  కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం ఎదురుచూస్తోంది. అందుకోసం చేసే ప్ర‌య‌త్నాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. నాయకత్వలేమి కాంగ్రెస్‌ను తీవ్రంగా వేధిస్తోంది. వందేళ్ల చరిత్ర ఉన్నహ‌స్తం పార్టీ.. తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో నెట్టుకొస్తోంది. అధ్య‌క్ష ప‌ద‌వి చేప‌ట్టేదుకు రాహుల్‌గాంధీ మారం చేస్తున్నారు. ప్రియాంకగాంధీ పూర్తి స్థాయిలో రాజ‌కీయ అరంగేట్రం చేయ‌టం లేదు. దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్‌కు ఇప్ప‌టికీ బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉన్నా.. కేడ‌ర్ మాత్రం తీవ్ర నిరుత్సాహంలో కూరుకుపోయి ఉంది. కాంగ్రెస్ పార్టీకి.. బీజేపీ కంటే కాంగ్రెస్ ఉదాసీన వైఖ‌రే బ‌ద్ద‌ శ‌త్రువుగా క‌నిపిస్తోంది. త్వ‌ర‌లో కీల‌క‌మైన‌ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు ఉండ‌టంతో.. ఇంకా ఆల‌స్యం చేస్తే కోలుకోలేని న‌ష్టం త‌ప్ప‌క‌పోవ‌చ్చు. అందుకే, స‌మ‌యం లేదు మిత్ర‌మా అంటూ హ‌స్తం పార్టీకి చేయి అందిస్తున్నారు ప్ర‌శాంత్ కిషోర్‌. మీరు సై అంటే.. తానుసైతం సై సైరా.. అంటూ స్నేహ‌హ‌స్తం చాస్తున్నారు.   2014 లో ఎన్డీయే అధికారంలోకి రావడంలో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారు. మోడీకి పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా ప‌ని చేశారు. అనంతరం బీజేపీకి దూరం అయ్యారు. ఆ త‌ర్వాత ఢిల్లీ, బీహార్‌, యూపీ, ఏపీ, త‌మిళనాడు, బెంగాల్‌.. ఇలా అన్నీ బీజేపీ వ్య‌తిరేక పార్టీల కోస‌మే ప‌ని చేయ‌డంతో.. కాషాయ పార్టీకి అంట‌రానివాడిగా మారిపోయాడు ప్ర‌శాంత్ కిశోర్‌. ప‌ని చేసి చేసి.. ఆయ‌న సైతం బీజేపీ వ్య‌తిరేకిగా మారిపోయారు. ఆ మ‌ధ్య బీహార్‌లో సీఎం నితీశ్‌కుమార్‌ పార్టీలో చేరి.. ఆయ‌న‌తో విభేదాలు వ‌చ్చి.. త‌న‌కు ఈ రాజ‌కీయాలు స‌రిప‌డ‌వంటూ.. బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ఇటీవ‌ల బెంగాల్ దంగ‌ల్‌లో మ‌మ‌త కోసం వ్యూహ‌క‌ర్త‌గా ప‌ని చేశారు. దీదీ కంటే పీకేనే బీజేపీతో గట్టిగా ఫైట్ చేశార‌ని అంటారు. బెంగాల్‌లో బీజేపీ రెండంకెల సీట్ల‌కే ప‌రిమితం అవుతుంద‌ని.. ఒకవేళ బీజేపీకి వంద సీట్లు దాటితే.. తాను ఇక‌పై రాజకీయ వ్యూహాకర్త కొన‌సాగ‌బోనంటూ మోదీ, అమిత్‌షాల‌కు సవాల్ చేసి మ‌రీ బీజేపీని రెండంకెల స్థానాల‌కే ప‌రిమితం చేసి చూపించాడు ప్ర‌శాంత్ కిశోర్‌. అదీ పీకే స్టామినా. అలాంటి ప్ర‌శాంత్ కిశోరే.. ఇప్పుడు స్వ‌యంగా తాను కాంగ్రెస్ కోసం ప‌ని చేస్తాన‌ని.. అయితే.. రాహుల్‌గాంధీని ప్ర‌ధాని అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించాలంటూ కండిష‌న్ పెట్ట‌డం సంచ‌ల‌నంగా మారింది. మ‌రి, పీకే ఆఫ‌ర్‌కు కాంగ్రెస్ పార్టీ సై అంటుందా? దేశ‌వ్యాప్తంగా చ‌తికిల‌ప‌డిన హ‌స్తం పార్టీని మ‌ళ్లీ అధికారంలోకి తీసుకురావ‌డం పీకే వ‌ల్ల అవుతుందా? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్‌.   

జడ్జి రామకృష్ణ అరెస్ట్ అసలు కథ ఇది..!

"ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రత్యేక పంథాలో సాగుతోంది. భారత రాజ్యాంగం కంటే, రాజారెడ్డి రాజ్యాంగానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది” ఇది విపక్షాలు చేసే విమర్శ. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు, ప్రదర్శిస్తున్న వికృత, వికార చేష్టలు, ఎవరంటే వారిపై రాజద్రోహం కేసులు పెట్టి వేదిస్తున్న తీరు, అక్రమ కేసులు, అరెస్టులకు సంబంధించి  కోర్టులు ఇస్తున్న సంచలన తీర్పులు, వేస్తున్నమొట్టికాయలు పరిణామాలను గమనిస్తే, నిజంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా, కక్షసాధిపు చర్యలకు పాల్పడుతోందని అనుకోవలసి వస్తోంది. చివరకు సుప్రీం కోర్టు కూడా ‘రాజద్రోహం కేసుల లెక్క తెల్చవల్సిందే’ అని వ్యాఖ్యానించింది, అంటే, పరిస్థితి ఎంత దుర్మార్గ  స్థాయికి  చేరిందో అర్థం చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ విధానాలను, పాలకుల నడవడికను, చివరకు వారి వ్యక్తిగత జీవితానికి సంబందించిన వ్యవహారాలను సైతం పరిధి లోబడి విమర్శించే హక్కు ను రాజ్యాంగమే కల్పించింది. కానీ, జగన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ముఖ్యమంత్రిని ఎవరైనా, ఏదైనా ఒక మాటంటే, ఒక విమర్శ చేస్తే, బ్రిటిష్ పాలకుల చీకటి పాలన తాలుకు  అవశేషంగా మిగిలిన 124 (A) రాజద్రోహం చట్టాన్ని ప్రయోగించి, ప్రజల పీక నొక్కే ప్రయత్నం చేస్తోంది. చివరకు సొంత పార్టీ  ఎంపీనే కాదు, న్యాయమూర్తుల మీద కూడా రాజద్రోహం  కేసులు పెట్టి జైలుకు పంపేందుకు ఏ మాత్రం వెనకాడడం లేదు.  అధికార వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు కంటే ముందే  చిత్తూరు జిల్లా జడ్జి రామకృష్ణను ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పై విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారనే ఆరోపణపై, రాజద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేశారు. సుమారు రెండు నెలలుగా ఆయన జైల్లో ఉన్నారు. అయితే, జడ్జి రామకృష్ణ అరెస్ట్ వెనక అసలు కథ వేరే ఉంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జస్టిస్ రామకృష్ణ, ఎర్ర చందనం కేసులో, సంబంధం ఉన్న పెద్ద రెడ్ల గుట్టును రట్టు చేశారు. అంతే కాకుండా పెద్దలు చెప్పినమాట వినకుండా ఎదురుతిరిగారు. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన మీద ప్రతీకారం తీర్చుకుంటోందని జస్టిస్ రామకృష్ణకు మద్దతుగా నిలిచిన మాలలు ఆరోపిస్తున్నారు.  సపోర్ట్ రామకృష్ణ, అనే హాష్’ట్యాగ్’తో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న వివరాల ప్రకారం,  2012లో కిరణ్ కుమార రెడ్డి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, జస్టిస్ సి.వినాగార్జున రెడ్డి హైకోర్టు జడ్జిగా ఉన్న రోజుల్లో, జస్టిస్ నాగర్జున రెడ్డి సోదరుడు  పవన్ కుమార్ రెడ్డి, రాయచోటి లో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్’ గా అప్పాయింట్ అయ్యారు. ఆయన మెయిన్ బిజినెస్.. ఎర్ర చందనం స్మగ్లింగ్. పవన్ కుమార్ రెడ్డి దగ్గర పని చేస్తున్న డ్రైవర్ రామాంజనేయులు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు‌ పట్టుబడినాడు . అప్పుడు డ్రైవర్ రామంజనేయులు పోలీసులకు తన పేరు బయటపెడతాడేమోనని....పవన్ కుమార్ రెడ్డి భయపడి...ఎర్రచందనం రవాణా చేస్తూ పట్టుబడిన  వాహనం దొంగిలించబడింది అని  ముందు తారీఖుతో పోలీసులకు రిపోర్ట్ చేయమని డ్రైవర్ రామాంజనేయులు మీద వత్తిడి చేశారు. అయితే రామాంజనేయులు నిజం చెప్తేనే ఎప్పటికైన భద్రత అని‌ భావించి పవన్ కుమార్ రెడ్డి డిమాండ్ ను తిరస్కరించాడు. దానితో తన డ్రైవర్ రామాంజనేయులు నోరు విప్పితే తన ఎర్ర చందనం స్మగ్లింగ్ దందా తన అన్న జస్టిస్ నాగార్జున రెడ్డి పరువు ప్రతిష్ఠ లు దెబ్బతింటాయని భావించిన పవన్‌ కుమార్ రెడ్డి డ్రైవర్ రామాంజనేయులుని పెట్రోల్ పోసి తగలపెట్టి హత్య చేయాలని ప్రయత్నిచాడు. అయితే అయన ప్రయత్నం పూర్తిగా ఫలించలేదు,  డ్రైవర్ రామాంజనేయులు కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరాడు. అప్పుడు రాయచోటి సీనియర్ ప్రిన్సిపాల్ సివిల్ జడ్జ్’గా ఉన్న జస్టిస్ రామక్రిష్ణ డ్రైవర్ రామాంజనేయులు మరణవాంగ్మూలం తీసుకోవడానికి ఆసుపత్రికి‌ వచ్చాడు. చావు బ్రతుకుల మద్య ఉన్న డ్రైవర్ రామాంజనేయులు జడ్జ్  రామక్రిష్ణ ముందు అన్ని విషయాలు చెప్పాడు.ఆ వాహనం పవన్ కుమార్ రెడ్డి దే అనీ..అది ఎర్ర చందనం స్మగ్లింగ్ లో‌ పట్టుబడింది అని...కానీ ఆ వాహనం దొంగలు దొంగిలించారని పోలీసులకు తప్పుడు రిపోర్ట్ ఇవ్వమని‌ తన మీద పవన్ కుమార్ రెడ్డి ఒత్తిడి చేయగా డ్రైవర్ రామాంజనేయులు దానికి అంగీకరించక పోవడం వలన పెట్రోల్ పోసి మంటలో హత్య చేయాలని చూశారు అని మరణ వాంగ్మూలం ఇచ్చాడు.ఈ మరణ వాంగ్మూలంలో తన పేరు తీసేయమని పవన్ కుమార్ రెడ్డి జడ్జ్ రామక్రిష్ణ మీద ఒత్తిడి చేశారు.వినకపోతే స్థానిక పోలీస్ ఇన్‌స్పెక్టర్ ముందే జడ్జ్ రామక్రిష్ణ మీద దాడి చేసి కొట్టాడు.ఈ నేపథ్యంలో తన తమ్ముడు పేరును మరణ వాంగ్మూలం నుండి  తొలగించడానికి నిరాకరించిన జడ్జీ రామక్రిష్ణను పవన్ కుమార్ రెడ్డి అన్న హైకోర్టు జస్టిస్ సి‌.వి. నాగార్జున రెడ్డి తన పలుకుబడి ఉపయోగించి సస్పెండ్ చేయించారు.  తరువాత జస్టిస్  రామక్రిష్ణ జస్టిస్ సి.వి.నాగార్జున రెడ్డి పై పార్లమెంట్ ఉభయ సభల్లో అభిశంశన తీర్మానం ప్రవేశ పెట్టే ప్రయత్నం చేశారు. ఎంపీల సంతకాలు  సేకరించారు.  కానీ జస్టిస్ నాగార్జున రెడ్డి ప్రమేయం పలుకుబడి వలన అది‌ సఫలీకృతం కాలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గా జగన్ మోహన్ రెడ్డి గారు పదవి స్వీకరించారు...దళిత మైనారిటీ ఓట్లతో అధికారం లోకి వచ్చి..తన కడప జిల్లా కే చెందిన‌ జస్టిస్ నాగార్జున రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కమిషన్ చైర్మెన్ గా నియమించారు.ఈ అధినాయకుడి చిత్తూరు జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గారు అదే జిల్లాకు చెందిన దళిత జడ్జ్ రామక్రిష్ణ గారి మీద క్రిమినల్ మైండ్ సెట్ తో ఆయన్ను హింసిస్తున్నారు. ఇది సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనం. ఈ కథనం ప్రకారం... జడ్జి రామకృష్ణ అరెస్ట్ వెనక, జగన్ రెడ్డి ప్రభుత్వం అహంకారంతో పాటుగా కుల దురహంకారం కూడా తోడైందనిపిస్తోంది. 

ఆనందయ్య K మందుకు హైకోర్టు అనుమతి.. సర్వేపల్లిలో  పంపిణి షురూ.. 

కృష్ణపట్నం ఆనందయ్య కె మందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  కరోనా బాధితులకు తక్షణమే కె మందును పంపిణీ చేయాలంటూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కంటి చుక్కల మందుకు సంబంధించి రెండు వారాల్లో నివేదిక అందించాలని ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 21కి వాయిదా వేసింది. గతంలో ఆనందయ్య కె మందును ప్రభుత్వం నిలుపుదల చేసింది. కంట్లో వేసే మందుకు సంబంధించిన నివేదికలు రావాల్సి ఉన్నాయంటూ గతంలో ఏపీ ప్రభుత్వం కె మందుకు అనుమతిని ఇవ్వలేదు. ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్‌... మందులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సీసీఆర్‌ఏఎస్‌ నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆనందయ్య ఇస్తున్న మిగిలిన మందుల వల్ల హాని లేదని నివేదికలు తేల్చాయి. సీసీఆర్‌ఏఎస్‌ నివేదిక ప్రకారం ఆనందయ్య మందు వాడితే హాని లేదని నివేదికలు తేల్చాయి.  వివాదంలో సుడిగుండంలో చిక్కుకున్న నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందు జనాలకు అందుబాటులోకి వచ్చింది. ఎట్టకేలకు ఆనందయ్య మందు పంపిణి ప్రారంభమైంది. ముందుగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు అందిస్తున్నారు.  ఆనందయ్య మందు పంపిణీని కార్య‌క్ర‌మంలో  ఎమ్మెల్యే కాకాణి గోవర్ధ‌న్‌రెడ్డి పాల్గొన్నారు. రెండు రకాల ప్యాకెట్లలో మందు అందిస్తున్నారు. ఇప్ప‌టికే కొవిడ్‌ వచ్చిన వారు ఎరుపు రంగు ప్యాకెట్‌ లోని మందు , క‌రోనా రాని వారు నీలం రంగు ప్యాకెట్‌ లోని మందు వాడాలని సూచిస్తున్నారు,  సర్వేపల్లి నియోజకవర్గంలో మొత్తం లక్షా 8 వేల కుటుంబాలకు.. ప్రతి కుటుంబానికి మందు అందించేలా ఏర్పాట్లు చేశారు. వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్కరికి మందు ఇస్తామని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పారు. ఆనందయ్య మందుతో ఎలాంటి దుష్పరిణామాలు లేవని తెలిపారు. సర్వేపల్లిలో మందు పంపిణీతోనే ఆనందయ్య మందు ఆగిపోదని, త్వరలోనే ఇతర జిల్లాలకూ పంపిణీ చేస్తామ‌ని తెలిపారు. అల్లోపతి మందులు వాడుతూనే ఆనందయ్య మందు తీసుకోవాలని తెలిపారు.  తన  ఔషధ పంపిణీలో కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయని, అందుకే సవ్యంగా సాగట్లేదని కృష్ణపట్నం ఆనందయ్య తెలిపారు. మందు తయారీకి అవసరమయ్యే మూలికలు, సామగ్రి సరిగ్గా సమకూరడం లేదని వాపోయారు. మందును తయారు చేసేందుకు యంత్ర సామగ్రిగానీ, విద్యుత్ సదుపాయాలూ లేవన్నారు. మందు తయారీకి ఏపీ ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందట్లేదని ఆయన ఆరోపించారు. అనుమతులైతే ఇచ్చిందిగానీ సాయం మాత్రం చేయలేదన్నారు. ప్రస్తుతం కృష్ణపట్నంలో ఔషధ పంపిణీ కొనసాగుతోందన్నారు. ఇతర ప్రాంతాల వారు రావొద్దన్నారు. ప్రభుత్వం నుంచి సహకారం అందితే ఇతర ప్రాంతాల వారికీ మందును ఇస్తామని చెప్పారు. మరోవైపు సర్వేపల్లి, చంద్రగిరి నియోజకవర్గాల్లోనే మందు పంపిణి చేస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. ఆనందయ్య తయారు చేసిన మందును ఇస్తున్న ప్యాకెట్లపై సీఎం జగన్ ఫోటో ఉంచడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆనందయ్య ఉచితంగా మందు ఇస్తుండగా... వైసీపీ నేతల ఫోటోలు ఎలా పెట్టుకుంటారని ప్రశ్నిస్తున్నారు. మందుపైనా రాజకీయం లబ్ది పొందాలనుకోవడం దుర్మార్గమని మండిపడుతున్నారు.   

ఏపీలో హిట్ల‌ర్‌ రాజ్యం! ప్ర‌శ్నిస్తే కేసులు.. ఎదిరిస్తే సంకెళ్లు..

విశాఖ‌ ల‌క్ష్మీ అప‌ర్ణ ఉదంతం తీవ్ర క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ఏపీలో పోలీస్ రాజ్యంపై మ‌రోసారి తీవ్ర స్థాయిలో చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌తంలో మాస్కులు, పీపీఈ కిట్లు లేవ‌న‌న్నందుకు డాక్ట‌ర్ సుధాక‌ర్‌కు పిచ్చెక్కించడం.. విశాఖ‌లో తెల్ల‌వారుజాము కూల్చివేత‌ల ప‌రంప‌ర కొన‌సాగుతుండ‌టం.. ఇదంతా విశాఖ‌లో పులివెందుల రాజారెడ్డి రాజ్యాంగం అమ‌లు చేయ‌డమేనంటూ టీడీపీ విమ‌ర్శిస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా ఇదే తీరు.. ప్ర‌శ్నిస్తే కేసులు.. ఎదిరిస్తే సంకెళ్లు.. అంటూ మండిప‌డుతోంది. పోలీసు రాజ్యం తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తే అడుగ‌డుగునా ప్ర‌జాస్వామ్యం ఇలానే ప‌రిహసింప‌బ‌డుతుందని.. ప్ర‌జ‌ల ప్రాథ‌మిక హ‌క్కులు హ‌రించ‌బ‌డుతాయ‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. అందుకు.. అనేక ఉదాహ‌ర‌ణ‌లు.    విశాఖ విష‌యానికే వ‌స్తే.. పాపం.. అపోలో ఫార్మ‌సీలో ప‌ని చేసే ల‌క్ష్మీ అప‌ర్ణ చేసిన నేర‌మేంటి? ఫ్రంట్ లైన్ వారియ‌ర్‌గా త‌న‌కు క‌ర్ఫ్యూ స‌మయంలో ప్ర‌యాణించే హ‌క్కు ఉంద‌ని అడ‌గ‌డ‌మే ఆమె చేసిన నేరమా? అన్ని ర‌కాల అనుమ‌తి ప‌త్రాలు ఉన్నా.. వాటిని పోలీసుల‌కు చూపించినా.. ఫైన్ వేయ‌డం.. ఆమెను స్టేష‌న్‌కు త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేయ‌డాన్ని వ్య‌తిరేకించ‌డ‌మే త‌ప్పిద‌మా? ఆ ఘట‌న‌కు సంబంధించి వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది కాబ‌ట్టి స‌రిపోయింది.. లేదంటే ల‌క్ష్మీ అప‌ర్ణ‌దే త‌ప్పు అన్న‌ట్టు ఆమెను ఈపాటికే శిక్షించేవారు కాదా?  ఆమెనే త‌మ‌పై తిర‌గ‌బ‌డింద‌ని.. త‌మ విధుల‌కు ఆటంకం క‌లిగించిందంటూ.. నేరం బాధితురాలిపైనే మోపే ప్ర‌య‌త్నం చేసినా.. ఆ వీడియో చూసిన వాళ్లెవ‌రు పోలీసుల వ‌ర్ష‌న్‌ను న‌మ్మే ప‌రిస్థితి లేదంటున్నారు.  ఫార్మ‌సీ అంటే.. ఎమ‌ర్జెన్సీ స‌ర్వీస్‌. ఆ విష‌యం ఖాకీల‌కూ తెలుసు. ఫార్మ‌సీ అని పేరు చెబితేనే వ‌దిలేయాల్సిన పోలీసులు.. ఆమెను అంత‌లా గుచ్చి గుచ్చి ప్ర‌శ్నించాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది? అంత‌గా ప‌త్రాలు, పంతాల‌కు పోవ‌డం దేనికి? కాసిన్ని ఫైన్ డ‌బ్బుల కోసం ఇంత ర‌చ్చ చేయ‌డం పోలీసుల‌కు అవ‌స‌ర‌మా? అర‌కొర జీతానికి ప‌ని చేసే ఆ యువ‌తి.. చేయ‌ని త‌ప్పున‌కు అంతగా ఫైన్ వేసే స‌రికి భ‌రించ‌లేక‌పోయింది. బాధ‌తో ఆవేశం త‌న్నుకొచ్చింది. అందుకే, అంత‌లా పోలీసుల‌పై తిర‌గ‌బ‌డింది. ఫైన్ ఎందుకు వేశారంటూ నిగ్గ‌దీసి అడిగింది. త‌న హ‌క్కుల కోసం పోరాడింది. పోలీసుల చ‌ర్య‌ను వ్య‌తిరేకించింది. ఆ వీడియో చూసిన వాళ్లంతా ల‌క్ష్మీకి మ‌ద్ద‌తుగానే కామెంట్లు చేస్తున్నారంటే.. ఆమెది త‌ప్పు కాద‌ని ప్ర‌జ‌లు జ‌డ్జిమెంట్ ఇచ్చేసార‌నేగా అర్థం. సోష‌ల్ మీడియా మొత్తం ల‌క్ష్మీకి మ‌ద్ద‌తుగా నిలుస్తోంది. మ‌రి, ఖాకీలు అంత దారుణంగా ఎందుకు ప్ర‌వ‌ర్తించాలనే ప్ర‌శ్నా ఇక్కడ వినిపిస్తోంది. వ‌దిలేస్తే పోయేదానికి.. గుచ్చి గుచ్చి.. ర‌చ్చ ర‌చ్చ చేసి.. వివాదం సృష్టించార‌నే వారూ ఉన్నారు. పోలీసుల‌కు అప‌రిమిత అధికారులు ఇస్తే.. పోలీస్ రాజ్యం తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తే.. ఇలానే ఉంటుంద‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి.  విశాఖ‌లో ప‌రిపాల‌నంతా పోలీసుల క‌నుస‌న్న‌ల్లోనే జ‌రుగుతోంద‌నే విమ‌ర్శ ఉంది. తెల్ల‌వారితే.. ఏ ప్రాంతంలో పోలీసులు మోహ‌రిస్తారో.. ఏ ప్ర‌తిప‌క్ష నాయ‌కుల ఆస్తులు కూల‌గొడ‌తారో.. ఆ మాన‌సిక విక‌లాంగుల భ‌వ‌నాన్ని ధ్వంసం చేస్తారో తెలీని భ‌యాన‌క ప‌రిస్థితి. గ‌తంలో విశాఖలో జ‌రిగిన‌ డాక్ట‌ర్ సుధాక‌ర్ ఎపిసోడ్ గుర్తుకొచ్చి మ‌రింత‌ హ‌డ‌లిపోతున్నారు. మాస్కులు, పీపీఈ కిట్లు అడిగినందుకు.. అత‌న్ని న‌డిరోడ్డుపై చిత‌క్కొట్టి.. పిచ్చివాడిగా ముద్రేసి.. గుండెపోటు వ‌చ్చేలా చేసిన ఉదంతాన్ని గుర్తు చేస్తున్నారు.  ల‌క్ష్మీప్ర‌స‌న్న వ్య‌వ‌హారంపై స్పందించిన టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్‌.. విశాఖ పాలనా రాజధాని అవుతుందో లేదో కానీ వైసీపీ మార్కు పులివెందుల పోలీసింగ్‌తో అరాచకాలకు అడ్డాగా మారిందంటూ విమ‌ర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన అవినీతిని ప్రశ్నిస్తే కేసులు, ఎదిరిస్తే సంకెళ్లు అన్నట్లుగా సాగుతోందని టీడీపీ మండిప‌డుతోంది. ఆనందయ్య మందు పంపిణీలో వైసీపీ నేతలు జోక్యం చేసుకుంటున్నారని.. ఆనందయ్య అనుమతి లేకుండా వెబ్ సైట్ సృష్టించి కోట్లు కొల్లగొట్టాలని ప్లాన్ చేశారని.. దీనిని ప్రశ్నించినందుకే మాజీమంత్రి సోమిరెడ్డిపై అక్రమ కేసులు బనాయించారని త‌ప్పుబ‌డుతోంది. సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళపై కొవిడ్ నిబంధనల పేరుతో మరో అక్రమకేసు బనాయించారన్నారు. విశాఖలో టీడీపీ నేతల ఆస్తులు కూల‌గొట్టార‌ని.. తాజాగా మానసిక వికలాంగుల స్థలాన్ని కబ్జా చేసేందుకు అధికార పార్టీ నేతల యత్నిస్తున్నారని ఆరోపించారు. ఇటీవ‌ల సోష‌ల్ మీడియా పోస్టులు పెట్టారంటూ ఇద్ద‌రిని అరెస్ట్ చేయ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు. ఇక ర‌ఘురామ అరెస్ట్‌, క‌స్ట‌డీలో టార్చ‌ర్ ఎపిసోడ్ తెలిసిందే.  ఇలా ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌తో పాటు సామాన్యుల‌పైనా జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం పోలీస్ రాజ్యాన్ని ప్ర‌యోగించ‌డం దారుణ‌మంటూ టీడీపీతో పాటు నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. చరిత్రలో హిట్లర్ లాంటి నియంతలే కాలగర్భంలో కలిసిపోయారని గుర్తుచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనపై జనం తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఇకనైనా అప్రజాస్వామిక విధానాలను విడనాడాలని హిత‌వు ప‌లుకుతున్నారు. 

మాస్క్ పెట్టుకుంటే ఫైన్! ఎక్కడో తెలుసా... 

కరోనా మహమ్మారితో ప్రపంచమంతా అల్లాడిపోయింది. లక్షలాది మంది చనిపోయారు. కోట్లాది మంది వైరస్ భారీన పడ్డారు. సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్డడంతో దేశాలు కోలుకున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన నిర్వహించాయి. కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్ మెజార్టీ జనాలకు పూర్తి చేసిన దేశాలు క్రమంగా కరోనా ఆంక్షలు సడలిస్తున్నాయి. అయితే మాస్క్ మాత్రం తప్పనిసరి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకే కరోనా తీవ్రత తగ్గినా.. మాస్క్ ధరించని వారికి కొన్ని చోట్ల భారీ మొత్తంలో అధికారులు జరిమానా విధిస్తున్నారు.కాని అమెరికాలోని ఒక ప్రాంతంలో మాత్రం మాస్కు పెట్టుకుంటే ఫైన్ విధిస్తున్నారు . అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న ఫిడిల్‌హెడ్స్ కేఫ్ లో పరిస్థితికి పూర్తిగా భిన్నంగా ఉంది. అక్కడ మాస్క్ ధరిస్తే.. ఫైన్ విధిస్తున్నారు.ఫిడిల్‌హెడ్స్ కేఫ్ యజమాని అక్కడికొచ్చిన కస్టమర్లుకు ఫైన్ వేస్తున్నాడు. కేఫ్‌కు వచ్చిన కస్టమర్లకు ఈ విషయాన్ని ముందే చెబుతున్నాడు కూడా. కేఫ్‌లోని గోడలపై పెద్దపెద్ద అక్షరాలతో ‘ఎవరైనా ఆర్డర్ చేస్తేటపుడు మాస్క్ ధరిస్తే 5 డాలర్లు.. టీకా తీసుకున్న విషయాన్ని గొప్పగా ప్రచారం చేసుకుంటే మరో ఐదు డాలర్ల ఫైన్ విధించబడును’ అని బోర్డు రాసి పెట్టాడు. కేఫ్ యజమాని తీరుపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత అసలు సంగతి తెలుసుకుని షాకయ్యారు.  కేఫ్ యజమాని  స్వచ్ఛంద సంస్థ కోసం ఈ రూల్ పెట్టాడు. మాస్క్ అందరూ ధరిస్తారు కాబట్టి.. స్వచ్ఛంద సంస్థకు ఎక్కువ నిధులు వస్తాయనే ఉద్దేశ్యంతో ఇలా ఏర్పాటు చేశారు. ఈ ఫైన్ సంగతి తెలుసుకుని కస్టమర్లు కూడా యజమానికి మద్దతుగా నిలుస్తున్నారు.  మాస్క్  ధరించి కేఫ్ కు వెళ్లి పోటీపడి మరీ కస్టమర్లు ఫైన్‌లు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్‌గా మారింది.

స్టాలిన్‌ను చూసి నేర్చుకో జ‌గ‌న్‌.. త‌మిళ‌నాట తెలుగుకు పెద్ద‌పీట‌..

తెలుగు భాష‌. తేనెలొలుకు తేట తెలుగు భాష‌. అమ్మ బాష‌. మ‌నంద‌రి భాష‌. అలాంటి తెలుగు భాష‌ను తెలుగు రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చిన్న‌చూపు చూస్తున్నారు. చ‌దువు నేర్వ‌డానికి ప‌నికిరాదంటూ ప‌క్క‌న పెట్టేశారు. ప‌సిపిల్ల‌ల ద‌శ నుంచే తెలుగును దూరం చేసేస్తున్నారు. స్వ‌భాష మీద ఇంతటి కుఠిల ప్ర‌య‌త్నం మ‌రెక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌చ్చు. సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి పాల‌న‌లో మాత్ర‌మే సాధ్యం ఇలాంటి దౌర్భాగ్యం అంటూ తెలుగువాళ్లు వాపోతున్నారు. మ‌న నాయ‌కుడు తెలుగుకు తెగులు ప‌ట్టిస్తుంటే.. ప‌రాయి రాష్ట్రంలో, ప‌ర‌భాష ముఖ్య‌మంత్రి మాత్రం మ‌న తెలుగును అంద‌లం ఎక్కించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.  దేశ భాష‌లందు తెలుగు లెస్సా.. అనే స్పూర్తితో తెలుగు భాష‌కి.. కేంద్ర ప్రభుత్వ అధికార భాష హోదా లభించే విధంగా కృషి చేస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌నంగా మారింది. కేవ‌లం తెలుగు అనే కాదు.. భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూలులో పేర్కొన్న భాషలన్నిటికీ.. అధికార భాష హోదా తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌న్నారు సీఎం స్టాలిన్‌. అంటే, త‌మిళ‌నాడులో త‌మిళంతో పాటు తెలుగుకూ పెద్దపీట వేసేందుకు కృషి చేస్తామ‌ని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చెప్ప‌డం అభినంద‌నీయం. తెలుగు వారంద‌రికీ గ‌ర్వ‌కార‌ణం.  సీఎం పీఠం అధిరోహించ‌న‌ప్ప‌టి నుంచీ స్టాలిన్ ఇలా ప‌లు జ‌నరంజ‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. జ‌య‌ల‌లిత పేరు మీద ఉన్న అమ్మ క్యాంటీన్ల‌ను కొన‌సాగిస్తామ‌ని ప్ర‌క‌టించారు. క‌రోనా క‌ట్ట‌డి కోసం సీఎం నేతృత్వంలో ప్ర‌త్యేక క‌మిటీ ఏర్పాటు చేసి.. అందులో స‌భ్యులుగా ప్ర‌తిప‌క్ష అన్నాడీఎంకే ఎమ్మెల్యేల‌నే తీసుకుని సంచ‌ల‌నం సృష్టించారు. అదే ఏపీలో అయితే.. జ‌గ‌న్‌రెడ్డి సీఎం సీటులో కూర్చోగానే.. పేద‌ల‌కు అన్నంపెట్టే.. అన్నా క్యాంటీన్ల‌ను మూసేయించారు. ప్ర‌తిప‌క్ష నేత‌లే టార్గెట్‌గా కుట్ర‌లు చేస్తూ కేసులు పెడుతున్నారు. అక్క‌డితో సంతృప్తి చెంద‌క‌.. బ‌హుషా తెలుగుదేశంపార్టీలో తెలుగు అనే ప‌దం ఉంద‌ని కాబోలు.. తెలుగు భాష‌ను తెర‌మ‌రుగు చేసేలా.. తెలుగు మీడియం స్కూల్స్ ర‌ద్దు చేసేందుకు దూకుడు ప్ర‌ద‌ర్శించారు. అమ్మ బాష‌ను దూరం చేసే ప్ర‌య‌త్నాన్ని అంతా వ్య‌తిరేకించినా వెన‌క్కి త‌గ్గ‌డం లేదు.   ఏపీలో భాష‌పై కుట్ర ఇలా ఉంటే.. అటు భాషాభిమానం మెండుగా ఉండే త‌మిళులు.. త‌మిళంతో పాటు తెలుగుకూ అధికార భాష‌గా అధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు కృషి చేస్తామ‌న‌డం చిన్న విష‌య‌మేమీ కాదు. ప‌క్క రాష్ట్రం త‌మిళ‌నాడులో తెలుగు భాష‌కు ఇంత‌టి ఆద‌ర‌ణ ల‌భిస్తుంటే.. తెలుగు భాషా ప్రాతిప‌దిక‌న ఏర్ప‌డిన మ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్రం తెలుగును తొక్కేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారని మండిప‌డుతున్నారు. సీఎం జ‌గ‌న్‌రెడ్డి తీసుకున్న అనాలోచిత నిర్ణ‌యం వ‌ల్ల‌.. ప‌సిపిల్ల‌లు తెలుగులో చ‌దువు నేర్చుకునే స‌ద‌వ‌కాశాన్ని కోల్పోయే ప్ర‌మాదం ఉంది. పాఠ‌శాల విద్య ఇంగ్లీష్ మీడియంలో మాత్ర‌మే ఉండాలంటూ జీవో తీసుకొచ్చి దాన్ని ప్ర‌జ‌ల‌పై బ‌ల‌వంతంగా రుద్దు తున్నారు. ప్ర‌తిప‌క్షాల‌తో పాటు భాషాభిమానులు, విజ్ఞులు అంతా జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని గట్టిగా వ్య‌తిరేకించినా.. వారిపై మాట‌ల‌తో ఎదురుదాడి చేశారే కానీ.. తెలుగు మీడియంకు చదువుకు స‌ద‌వ‌కాశం క‌ల్పించ‌నే లేదు. తెలుగు వ‌ద్దు.. ఇంగ్లీష్ ముద్దు.. అన్న‌ట్టుగా ఉంది సీఎం జ‌గ‌న్‌రెడ్డి నిర్ణ‌యాలు అంటూ ప్ర‌జ‌లు మండిప‌డుతున్నా.. ఆయ‌న‌లో మార్పు క‌నిపించ‌డం లేదు. తాజాగా, త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ ఆ రాష్ట్రంలో తెలుగుకు ప్రాధాన్యత ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తుండ‌టాన్ని చూసైనా.. సీఎం జ‌గ‌న్‌రెడ్డి ఆలోచ‌నా విధానం మారితే బాగుండు అంటున్నారు.    త‌మిళులు సైతం తెలుగులో మాట్లాడ‌టానికి చాలా ఇష్ట‌ప‌డ‌తారు. చాలామంది త‌మిళుల‌కు తెలుగు బాగా వ‌చ్చు. మాజీ సీఎం జ‌య‌ల‌లిత తెలుగు భాష‌లో ప్రావీణురాలు. త‌మిళ‌నాడులో సెటిల్ అయిన తెలుగువారంతా తెలుగు మీడియంలో విద్యాభ్యాసం చేయ‌డానికే ఇష్ట‌ప‌డ‌తారు. త‌మిళ‌నాడులోనూ ఇప్ప‌టికీ తెలుగు మీడియం స్కూల్స్ ఉన్నాయంటే న‌మ్మాల్సిందే. అర‌వ రాష్ట్రంలోనే తెలుగుకు అంత ఆద‌ర‌ణ ఉంటే.. మ‌న ఏపీలో మాత్రం భాషనూ రాజ‌కీయం చేస్తూ.. తెలుగు ఉనికినే ప్ర‌శ్నార్థ‌కం చేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయంటూ ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కోర్టులు సైతం తెలుగు మీడియం ర‌ద్దును వ్య‌తిరేకించినా.. పాల‌కుల కుట్ర‌ల‌తో ఇంగ్లీష్ మీడియంకే ప్ర‌యారిటీ ఉంటోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలుగు భాష‌కు జ‌రుగుతున్న అన్యాయాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాటల్లో చెప్పాలంటే.. పరాయి భాష కళ్ల‌ద్దాలు లాంటిది.. మాతృభాష కళ్లు. కళ్లుంటేనే కదా క‌ళ్ల‌ద్దాలు పెట్టుకునేది..!  

రూ.50లక్షల అదనపు కట్నం.. ప్రాణాలు విడిచిన డాక్టర్.. 

చదువుకున్న వాడికంటే అదేదో కులం వాడు మేలు అన్నట్లు.. ఎంత సదివిన సంకారం లేని చదువు బూడిదలో పోసిన పన్నీరే అని చెప్పాలి. ఈ మధ్య చదువుకున్నవాడు, చదువుకొని వాడు అని తేడాలు లేకుండా దారుణాలు చేస్తున్నారు.. అవాంఛనీయ సంఘటనలకు అటు పరోక్షంగాను ఇటు ప్రత్యేక్షంగాను పాల్పడుతున్నారు.. చదువెందుకు..? చదువెందుకు? చదువెందుకు రా? అంటే నలుగురిలో దీపమై వెలిగేందుకురా? అన్న పదం పక్కన పెట్టి అధిక కట్నం కావాలి.. పిల్లలను వేదించడాని ఆ చదువును వాడుతున్నారు. నేటి తరం యువత.. తాజాగా డాక్టర్ చదుకున్న వ్యక్తి కూడా అధిక కట్నం కోసం పెళ్లిని వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది.. చూడండి ఏం జరిగిందో..  కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన గంగాధర్‌ నాయక్‌ కడప ఎల్‌ఐసీ కార్యాలయంలో మార్కెటింగ్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మొదటి కుమార్తె లిఖిత (27) తిరుపతి ఎస్వీ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ ఫైనల్ ఇయర్  చదువుతుండగా కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన నూన్‌సావత్‌ శ్రావణ్‌నాయక్‌కు ఇచ్చి 2017లో పెళ్లి జరిపించారు. ఆ సమయంలోనే కట్నంగా 50 తులాల బంగారం ఇచ్చారు.  పెళ్లి జరిగింది. పెళ్లి జరిగితే సెట్ అవుతారు అని అందరు మాట్లాడుకున్నట్లు గానే.. పెళ్లి అనంతరం  శ్రావణ్‌కు ముంబయిలో పీజీ జనరల్ మెడిసిన్ చేసేందుకు సీటు వచ్చింది.. దాంతో భార్యతో కలిసి ముంబై కి మక్కం మార్చారు..అక్కడే కాపురం పెట్టాడు. వీరికి 18 నెలల పాప ఉంది.స్థలం మారగానే అందరిలో మార్పు వచ్చినట్లు.  ముంబయి కె వెళ్లి అక్కడి నీళ్లు పడంగానే  శ్రావణ్‌లో చాలా మార్పు వచ్చింది. చదువుకున్న వ్యక్తి లో కి మూర్ఖుడు బయటపడ్డాడు. ఇచ్చిన కట్నం చాలదంటూ  పుట్టింటి నుంచి రూ.50లక్షల అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్యను వేధించడం స్టార్ట్ చేశాడు. భర్త తీరుతో మనస్తాపం చెందిన లిఖిత గతంలో ఓ సారి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు లిఖితను పుట్టింటికి తీసుకొచ్చేశారు. ఫిబ్రవరి నుంచి ఆమె ప్రొద్దుటూరులోనే ఉంటోంది. ఈ నెల ఒకటో తేదీన శ్రావణ్‌ నాయక్‌ ప్రొద్దుటూరుకు వచ్చి అదనపు కట్నం కావాలని లిఖితను వేధించాడు. తాను కోరినంత కట్నం ఇస్తేనే లిఖితను కాపురానికి తీసుకెళ్తానని లేకపోతో పుట్టింట్లోనే ఉంచుకోవాలని తెగేసి చెప్పాడు. లిఖిత తల్లి దండ్రులను హెచ్చరించి అక్కడి నుండి వెళ్లిపోయాడు. దీంతో మనస్తాపం చెందిన లిఖిత మూడో తేదీన బాత్‌రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన కుమార్తె ఆత్మహత్యకు కారణమైన అల్లుడు శ్రావణ్‌నాయక్‌, అతని తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని లిఖిత తండ్రి గంగాధర్‌ నాయక్‌ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ప్రొద్దుటూరు వన్‌టౌన్ సీఐ నాగరాజు తెలిపారు.