మీడియాను వదలని రఘురామ.. పరువు నష్టం దావా 

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజును మే 12 వ తేదీన, ఏపీ  సీఐడీ పోలీసులు నాటకీయ పక్కీలో అరెస్ట్ చేశారు. ఆయన తమ హైదరాబాద్ నివాసంలో ఉన్న సమయంలో, ఎలాంటి ముందస్తు సమాచారం, హెచ్చరికలు లేకుండా, ఒక ఎంపీని అరెస్ట్ చేసేముందు అనుసరించవలసిన విధి విధానాలను పాటించ కుండా ఆయన్ని  అరెస్ట్ చేసి అప్పటి కప్పుడు మంగళగిరి తరలించారు. ఏకంగా రాజద్రోహం కేసు పెట్టి, జైలుకు పంపారు. అక్కడి నుంచి, కృష్ణం రాజు అరెస్ట్, తదనంతర  పరిణామాలకు సంబందించిన వార్తలు అటు ప్రధాన మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేంగా ఆయన సాగిస్తున్న న్యాయపోరాటం. లోక్ సభ స్పీకర్ సహా పలువురు ప్రముఖులను కలిసి, తమకు జరిగిన అవమానం, అన్యాయం గురించి వివరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా తీరు తెన్నులను ఎండగడుతున్నారు. ఇలా ఓ వంక న్యాయపోరాటం మరో వంక  రాజకీయ పోరాటం  సాగిస్తున్నారు ఎంపీ రఘురామ రాజు.  ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారంతో, అయన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వార్తలు, వార్త కథనాలు, చర్చలు ప్రసారం చేస్తున్న టీవీ చానల్స్, పై న్యాయ పోరాటం చేసేందుకు సిద్దమవుతున్నారు రఘురామ రాజు. నిజానికి   తప్పుడు సమాచారంతో,ఉద్ద్దేశపూర్వకంగా, తమ  పరువుకు భంగం కలిగించే విధంగా వార్తలు, వార్తా కథనాలు ప్రసారం చేస్తున్నాయని, అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని,ఎంపీ కృష్ణం రాజు, ఆయన తరపు న్యాయవాదులు పత్రికా ముఖంగా పలు సందర్భాలలో హెచ్చరించారు. ఇదే పద్దతి కొనసాగితే పరువు నష్టం దావా వేయవలసి వస్తుందని స్పష్టం చేశారు.   అయినా టీవీ 9 చానల్ తీరు మారక పోవడంతో, ఎంపీ రఘురామా కృష్ణం రాజు, ఆ చానల్’ కు లీగల్ నోటేసు సర్వ్ చేశారు.  ఎంపీ తరపున, హై కోర్టు న్యాయవాది  ఉమేష చంద్ర పీవీజీ, టేవీ9 డైరెక్టర్, జే. జగపతి రావు, సీఇఓ బరన్ దాస్ , మేనేజింగ్  ఎడిటర్ వెళ్ళాం చెరువు రజనీకాంత్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మురళి కృష్ణ కి నోటీసులు  సర్వ్ చేశారు. 12 పేజీల నోటీసులో, న్యాయవాది ఉమేష్ చంద్ర, కృష్ణం రాజు అరెస్ట్ దగ్గర నుంచి జరిగిన సంఘటనలు మొదలు, టీవీ చానల్ ప్రసారం చేసిన వార్తలు, చర్చలకు సంబందించిన వివరాలను పొందు పరిచారు. అందుకు సంబందించిన వీడియో లింకులను జత చేశారు.  ఎంపీ కృష్ణం రాజు, ఎంపీ గానే కాకుండా, ఒక పారిశ్రామిక వేత్తగా సమాజానికి చేస్తున్న సేవను, సమాజం నుంచి పొందుతున్న గౌరవానికి సంబందించిన వివరాలను తెలియ చేశారు. నోటీసులో వివరించిన  విధంగా టీవీ9  ప్రసారాల వలన, ఎంపీ పరువుకు భంగం వాటిల్లింది, కావున, అందుకు బాధ్యులు అయిన వారు వారం రోజులలోగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని,లేని పక్షంలో చట్ట పరమైన  చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారురు. ఇక ఇప్పుడు టీవీ 9 స్పందనపై భవిష్యత్ న్యాయపోరాటం ఆధారపడి ఉంటుంది.

తెలంగాణ లాక్ డౌన్ ఎత్తివేత? మంగళవారం కేబినెట్ భేటీ..

తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేయనున్నారా? పగలంతా సడలింపు ఇచ్చి.. నైట్ కర్ఫ్యూ అమలు చేయనున్నారా? ఈ ప్రశ్నలకు మంగళవారం క్లారిటీ రానుంది. ఈనెల తొమ్మిదో తేది వరకు లాక్ డౌన్ ఉంది. ఆ తర్వాత లాక్ డౌన్ ను పొడిగించాలా లేక ఎత్తి వేయాలా లేక మరింత సడలింపు ఇవ్వాలా అన్న దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇందుకోసం తెలంగాణ మంత్రివర్గ సమావేశం జూన్ 8 న మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు జరుగనున్నది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న భేటీలో రాష్ట్రంలో వైద్యం, కరోనా స్థితిగతులు, ఇరిగేషన్, రైతుబంధు, వ్యవసాయం పనులు, లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అనే అంశాల మీద కేబినెట్ చర్చించే అవకాశమున్నది. లాక్ డౌన్ పొడిగింపుపై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.  రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలో భాగంగా, ప్రాజెక్టుల పనుల పురోగతి, చేపట్టవలసిన చర్యలు, వానాకాలం సాగునీరు, తదితర సంబంధిత అంశాల మీద సమీక్ష జరిగే అవకాశమున్నది.వానాకాలం పంటల సాగు పనులు ప్రారంభమైన నేపథ్యంలో, పంట పెట్టుబడి సాయం రైతుబంధు అందుతున్న విషయం పై, కల్తీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు, ఎరువులు క్రిమిసంహారక మందుల లభ్యత, తదితర వ్యవసాయ సంబంధిత అంశాలపై కేబినెట్ చర్చించే అవకాశమున్నది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పటిష్ట చర్యల కారణంగా రెండవ వేవ్ కరోనా తగ్గుముఖం పడుతున్న పరిస్థితుల్లో, ఇంకా కూడా శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలను సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. థర్డ్ వేవ్ రానున్నదనే వార్తల నేపథ్యంలో, థర్డ్ వేవ్ ను కూడా సమర్థవంతంగా ఎదుర్కునేందుకు రాష్ట్ర వైద్యశాఖ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సన్నద్ధత తగు ఏర్పాట్ల మీద కేబినెట్ చర్చించే అవకాశమున్నది. కరోనా కట్టడికోసం లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో, దాని పర్యవసానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ మేరకు ప్రభావితమైంది అనే అంశాల మీద కేబినెట్ చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటుందని తెలుస్తోంది.  ఇక జూన్ 7 సోమవారం నుంచి  ప్రారంభించాలనుకున్న 19 జిల్లాల్లో 19 డయాగ్నటిక్ సెంటర్లను జూన్ 9 నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో అందరు మంత్రులు ఏక కాలంలో పాల్గొని ఒకే రోజు ఒకే సమయంలో 19 సెంటర్లను ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. ఈ నేపథ్యంలో, మంత్రులు లేని చోట ఇతర ప్రముఖులను ఆహ్వానించి వారి చేతుల మీదుగా డయాగ్నస్టిక్ సెంటర్లను  ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఎవరెవరు ఎక్కడెక్కడ పాల్గొనాలనే విషయం మీద కూడా మంత్రి మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశమున్నది.

బాలికను అత్యాచారం చేసిన నటుడు.. 

దొంగ ల*జ కొడుకులసలే మెసిలే ఈ దుర్ధా లోకం లో తల వంచుకు వెళ్లిపోయావా  నేస్తం..ఈ లోకాని వదిలి..  అన్న మాటలు శ్రీ శ్రీ మహా ప్రస్థానం చదివితే మీకు అర్థం అవుతుంది. ఆ శ్రీ శ్రీ ఎందుకు అలా రాశాడో.. తన కవిత్వం లోని అంతరంగం ఏంటో మహా ప్రస్థానం చదివితే తెలుస్తుంది.. అయితే ఇప్పుడు మనం చదివే ఆ వార్తకి.. పైన చెప్పిన శ్రీ శ్రీ కవిత్వానికి చిన్న లింక్ ఉంది.. అదేంటో చూద్దాం..  నేటి సమాజంలో మహిళలకు పురుషుడి తో దక్కే గౌరవం ఒకవైపు.. ఇదే  సమాజంలో అదే మహిళలపై అత్యాచారాలు, అరాచకాలు, అణిచివేతలు మరోవైపు. ఒక్కటి కాదు రెండు కాదు దాదాపు రోజు వేయిలలో మహిళలపై, చివరికి  బాలికపై నిత్యం దాడులు అరాచకాలు అత్యాచారాలకు పాల్పడుతున్నారు.. కొంత మంది నీచులు అదేపనిగా మహిళలపై అత్యాచారాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్య భారత దేశంలో, తప్పులు చేసిన వాడిని తగలబెట్టడం బోయి.. వాడిని తలెత్తుకునేలా చేస్తున్నాయి ఈ చట్టాలు. తాజాగా ఒక నటుడు ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. అతడు ఓ బుల్లితెర నటుడు, అతని పేరు పెర్ల్ వ్ పూరిని శనివారం ముంబయి పోలీసులు అరెస్ట్‌ చేశారు. నాగిని-3’ ధారావాహికతో ప్రేక్షకాదరణ పొందిన పెర్ల్‌ వ్‌ పూరి.. సీరియల్స్‌లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి తనపై లైంగికదాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఇటీవల ఓ బాలిక వసై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. కాగా, ఈ విషయం గురించి పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ‘ఇది ఇప్పుడు జరిగిన సంఘటన కాదు. పాతది. తాజాగా బాధితురాలు.. నటుడిపై ఫిర్యాదు చేసింది. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెర్ల్ వ్ పూరిపై ఐపీసీ 376, పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేశాం’ అని తెలిపారు.   మరోవైపు ‘నాగిని-3’లో పెర్ల్‌వ్‌ పూరికి సహనటిగా పనిచేసిన అనిత.. ఈ ఘటనపై స్పందించారు. పెర్ల్‌ అలాంటి వ్యక్తి కాదని తెలిపారు. ‘నాకు ఎంతోకాలం నుంచి పరిచయమున్న పెర్ల్‌ వి పూరి గురించి వచ్చిన వార్తలు విని షాక్‌ అయ్యాను. ఇది నిజం కాకపోయి ఉండొచ్చు. పెర్ల్‌ చాలా మంచి వ్యక్తి. త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయని భావిస్తున్నాను’ అని ఆమె తెలిపారు.   

టీటీడీ చైర్మన్ గిరి మళ్లీ రెడ్డికేనా? రేసులో ఉన్నదెవరు..? 

తిరుమల తిరుపతి దేవస్థానానికి త్వరలో కొత్త చైర్మన్ రాబోతున్నారు. ప్రస్తుతం చైర్మన్  వైవీ సుబ్బారెడ్డి పదవి కాలం ఈ నెల 21వ తేదీతో ముగియనుంది. తనకు రెన్యూవల్ వద్దని సీఎం జగన్ కు వైవీ చెప్పారని తెలుస్తోంది. టీటీడీ చైర్మన్ పదవిపై అసంతృప్తిగా ఉన్న సుబ్బారెడ్డి.. మంత్రి కావాలని కోరుకుంటున్నారట. ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్ లోకి తీసుకోవాలని ఆయన జగన్ కు కోరారని.. కాని జగన్ మాత్రం ఆయనను రాజ్యసభకు పంపించే  యోచనలో ఉన్నారని అంటున్నాకు. 2014లో ఒంగోలు ఎంపీగా గెలిచిన వైవీ సుబ్బారెడ్డికి.. 2019లో టికెట్ ఇవ్వలేదు. టీడీపీ నుంచి పార్టీలో చేరిన మాగుంట శ్రీనివాసు రెడ్డికి టికెట్ ఇచ్చారు. జగన్ తీరుపై వైవీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చి కూల్ చేశారని చెబుతారు.  టీటీడీ చైర్మన్ రేసులో హేమాహేమీల పేర్లు వినిపిస్తున్నాయి. నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మేకపాటి తనయుడు గౌతం రెడ్డి మంత్రిగా ఉన్నారు. మళ్ళీ అదే కుటుంబంలోనీ వ్యక్తికి టీటీడీ చైర్మన్ పదవి ఇస్తే అన్ని విధాలుగా విమర్శలు వస్తాయని కొందరు వైసీపీ నేతలు చెబుతున్నారట. తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. మంత్రి పదవి రాలేదనే అసంతృప్తితో ఉన్న భూమన కూడా టీటీడీ చైర్మన్ పదవి కోసం గట్టిగా లాబీయింగ్ చేస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే భూమనకు ముఖ్యమంత్రి జగన్ ఎలాంటి హామీ ఇవ్వలేదని పార్టీ వర్గాల సమాచారం.  టీటీడీ చైర్మన్ పదవిని ఈసారి కూడా రెడ్డికే ఇస్తారా లేక మరో వర్గానికి ఇస్తారా అన్నది ఆసక్తిగా మారింది. జగన్ ప్రభుత్వంలో కీలక నామినేటెడ్ పోస్టులన్ని రెడ్లకే ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటివరకు టీటీడీ చైర్మన్ తో పాటు టీటీడీ ఈవోగా జవహర్ రెడ్డి, అదనపు ఈవోగా ధర్మారెడ్డి ఉన్నారు. దీంతో అనేక రకాల విమర్శలు వచ్చాయి. వేంకటేశ్వర స్వామి వారిని వెంకటేశ్వరరెడ్డి గా మార్చేసారనే విమర్శలు వచ్చాయి. ప్రతిపక్షాలు చేసే విమర్శల ను సీఎం జగన్ మోహన్ రెడ్డి పట్టించుకోరని అంటారు. అయితే  ప్రజల్లో వ్యతిరేక భావన వస్తుందని, ఏ సమస్యనైనా తెగేదాకా లాగ కూడదని పార్టీ అధిష్టానం భావిస్తోందని అంటున్నారు.  తాజాగా  రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ సీవీఎస్ కే శర్మను టీటీడీ చైర్మన్ గా చేస్తే ఎలా ఉంటుంది అని పార్టీ నాయకులు సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిసింది.  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కి అత్యంత ఇష్టమైన, ముఖ్యమైన అధికారిగా శర్మకు పేరుంది. ఆయనను జలయజ్ఞం శర్మ గా పిలిచేవారు. ప్రస్తుత సీఎం జగన్ కు కూడా శర్మతో మంచి సంబంధాలున్నాయి. తన కోసం, తన తండ్రి వైఎస్ రాశేఖరరెడ్డి కోసం సీబీఐ విచారణను ఎదుర్కొని, కోర్టుల చుట్టూ తిరిగిన వారిలో cvsk శర్మ కూడా ఒకరు. తన కోసం, తన కుటుంబం కోసం ఇబ్బందులు పడ్డ ప్రతీ ఐఏఎస్ అధికారి కీ ఏదో ఒక రూపంలో మేలు చేస్తూ వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు శర్మ కోసం ఏమీ చేయలేదని, ఇప్పుడు ఆయనకు ఎంతో కొంత మేలు చేసే అవకాశం వచ్చిందని కొందరు నాయకులు అంటున్నారు. 

లాయర్ ఫీజు 96 లక్షలా! జగన్ సర్కార్ పై హైకోర్టులో పిటిషన్ 

వడ్డించేవాడు మనవాడైతే అడగకుండానే అన్నీ విస్తట్లో పడుతుంటాయి.. ఈ సామెత ఆంధ్రప్రదేశ్ లోని వైపీసీ ప్రభుత్వానికి అతికినట్లు సరిపోయేలా ఉంది. తన అనుకున్న వారందరికి అప్పనంగా ప్రభుత్వ ఖజనా నుంచి డబ్బులు ముట్టచెప్పుతున్నారనే ఆరోపణలు మొదటి నుంచి వస్తున్నాయి. తాజాగా మరో విషయం వెలుగులోనికి వచ్చింది. న్యాయవాది ఫీజు కింద 96 లక్షల రూపాయలు ఇవ్వడం దుమారం రేపుతోంది. రూల్స్ కు విరుద్ధంగా ప్రభుత్వం దుర్వినియోగానికి పాల్పడిందంటూ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది.  సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డికి రూ.96 లక్షలు ఫీజుగా చెల్లించేందుకు పరిపాలన అనుమతి ఇస్తూ ఈ ఏడాది మే 24న ప్రభుత్వం జారీ చేసిన జీవో 239ని సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఏపీ న్యాయవాదుల రుసుముల నిబంధన-43 ఉల్లంఘించేదిగా ఆ జీవో ఉందని హైకోర్టు న్యాయవాది చింతల విజయ్‌కుమార్‌ తరఫున న్యాయవాది వై.కమలారాణి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆ జీవో చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించి, కొట్టేయాలని కోరారు. పురపాలక పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి, ఆర్థికశాఖ కార్యదర్శి, అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథార్టీ(ఏఎంఆర్డీఏ) కమిషనర్‌, అడ్వొకేట్‌ జనరల్‌తో పాటు సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. చట్టవిరుద్ధంగా ఖర్చుచేసే రూ.96 లక్షలకు ప్రతివాదులను బాధ్యులుగా ప్రకటించాలన్నారు పిటిషనర్. వారి నుంచి సొమ్మును రాబట్టాలన్నారు.  రాజధానిని అమరావతి నుంచి మార్చే శాసనాధికారం ప్రభుత్వానికి లేదంటూ  ‘రాజధాని రైతు పరిరక్షణ సమితి’ దాఖలు రిట్ పిటిషన్, హెబియస్‌ కార్పస్‌ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్ల విచారణ సందర్భంగా  ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించినందుకు సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డిని నియమించుకుంది. ఆయనకు ఫీజు కింద  రూ.96 లక్షలు చెల్లింపునకు జీవో ఇచ్చింది ప్రభుత్ంవ. అయితే హెబియస్‌ కార్పస్‌ రిట్‌ పిటిషన్‌ విచారణకు సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి హాజరు కాలేదని పిటిషనరు పేర్కొన్నారు. తక్కువ రుసుముకు రాష్ట్రం తరఫున వాదనలు వినిపించేందుకు సీనియర్‌ న్యాయవాదులు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని గుర్తించడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. ఈనెల 10న ఈ పిటిషన్ పై  హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.

జగన్ కేసుల్లో సీబీఐ సైలెంట్? 

ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన కేసులపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పక్ష పాతం చూపిస్తోంది? విచారణలో కావాలనే జాప్యం చేస్తుందా? కొన్ని కేసుల్లో కౌంటర్లు కూడా వేయడం లేదా? అంటే అవుననే అంటున్నారు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య. సీబీఐ పక్షపాతానికి సంబంధించి కొన్ని ఆధారాలను కూడా ఆయన బయటపెట్టారు.  కొందరు వైసీపీ నేతలు జడ్జిలను తిట్టిన కేసు సీబీఐకి వెళ్లినా.. ఇంకా రిజల్ట్ రాలేదన్నారు వర్ల రామయ్య. దళిత డాక్టర్ సుధాకర్ కేసుపై పోలీసుల దాడి కేసులో హైకోర్టు ఆదేశాలతో సీబీఐ విచారణ జరిగిందన్నారు. కాని ఇంతవరకు ఆ రిపోర్ట్ రాలేదన్నారు. డాక్టర్ సుధాకర్ ఇటీవలే గుండెపోటుతో చనిపోయారు. దివంగత వైఎస్సార్ తమ్ముడు, ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  బాబాయ్ వివేకానంద మర్డర్ కేసును కూడా సీబీఐనే విచారిస్తుందని చెప్పారు రామయ్య. ఈ కేసులోనూ ఎలాంటి పురోగతి లేదన్నారు.   అసలు సీబీఐలో ఏం జరుగుతోందో అర్ధం కావడం లేదని అధికారి వర్ల రామయ్య ప్రశ్నించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ విషయంలో సీబీఐ వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తోందని ఆయన  అసహనం వ్యక్తం చేశారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని అందరూ నమ్ముతారు… పేదవారికి, ధనవంతులకు, అధికారంలో ఉన్నవారికి, లేనివారికీ, అందరికీ చట్టం సమానమే అని చట్టం చెబుతోంది.. కానీ జగన్ విషయంలో మాత్రం సీబీఐ సమ దృష్టితో వ్యవహరించడం లేదనే అనుమానం వస్తుందని వర్ల రామయ్య అన్నారు. జగన్ కోర్టు వాయిదాలకు రాకపోయినా సీబీఐ ఎందుకు నోరు విప్పదని ఆయన ప్రశ్నించారు.కోర్టులో జగన్ కేసుల విచారణ సరిగా జరక్కపోయినా పట్టించుకోదన్నారు. జగన్ విషయంలో  సీబీఐ ఎందుకు సైలెంటుగా ఉంది అని వర్ల రామయ్య నిలదీశారు.

సొంతగూటికి ముకుల్ రాయ్.. బీజేపీకి మమత షాక్ 

పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ నుంచి బీజేపీలోకి వలసల చక్రం పూర్తిగా 360 డిగ్రీలు పూర్తి చేసుకుని రివర్స్ జర్నీ స్టార్ట్ చేసిందా? ఇప్పుడు ఇక  ఇటు నుంచి అటు వలసలు, ఘర్ వాపసీ మొదలవుతోందా? అంటే, కోల్ కతా పొలిటికల్ సర్కిల్స్ నుంచి అవుననే సంకేతాలే వస్తున్నాయి. 2017లో పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ముకుల్ రాయ్’ కాషాయం కట్టడంతో తృణమూల్ నుంచి బీజేపీలోకి వలసలు మొదలయ్యాయి. ఆయనే, వలసలకు శ్రీకారం చుట్టారు. అంతకు ముందు కూడా కొందరు తృణమూల్ నాయకులు కాషాయం కట్టినా, ముకుల్ రాయ్’ తోనే వలసలు  ఊపందుకున్నాయి.  ఇప్పుడు మళ్ళీ ఆయనతోనే, ఘర్ వాపసీ, సొంతింటికి తిరిగిచేరే కార్యక్రమం మొదలయ్యే సంకేతాలు స్పష్ట మవుతున్నాయి.  ఇటీవల కాలంలో ఆయన బీజేపీలో ఉక్కపోతకు గురవుతున్నారని, అటు మీడియా వర్గాల్లో,ఇటు పొలిటికల్ సర్కిల్స్’లో చర్చ జరుగుతోంది. ముదొంచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లుగా, మొన్నటి ఆసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో చేరిన సువేందు అధికారికి బీజేపీ  ఢిల్లీ పెద్దలు పెద్ద పీట వేయడం, ఆయనను, బీజేపీ ఎల్పీ నేతగా,  ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికోవడం ముకుల్ రాయ్’ జీర్ణించుకోలేక పోతున్నారు.  అందుకే ఆయన మళ్ళీ మమత వైపు చూస్తున్నారని  అయన సన్నిహిత వర్గాల సమాచారంగా కోల్‌కతా మీడియా కోడై కూస్తోంది.  ఇటీవల  ముకుల్ రాయ్’ సతీమణి అనారోగ్యంతో కోల్’కతాలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, పార్టీ నూతన ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఆసుపత్రికి వెళ్లి ముకుల్ రాయ్ సతీమణిని పరామర్శించడంతో పాటుగా, ఆయనతో ఏకాంతంగా చర్చలు జరిపినట్లు వార్తలొచ్చాయి. నిజంగా ఆ ఇద్దరు ఏమి మాట్లాడుకున్నారో ఏమో కానీ, ఆ మర్నాడు ఉదయమే  ప్రధాని నరేంద్ర మోడీ ముకుల్ రాయ్’కి ఫోన్ చేసి, అయన భార్య ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఇలా, అభిషేక్ బెనర్జీ, ముకుల్ రాయ్’ని కలవడం ఆ వెంటనే ప్రధాని ఫోన్ చేయడంతో  ఉహాగానాలు మొదలయ్యాయి. నిజానికి, ఈ పరామర్శల కలయికలు యాదృచ్చికంగా జరిగాయా, లేక కోల్’కతా కబురు ఢిల్లీకి చేరి ప్రధాని నేరుగా లైన్’లోకి వచ్చారా అన్నది, ఎవరికీ తెలియక పోయినా, అసెంబ్లీ ఎన్నికలలో మమతా బెనర్జీ, ఘన విజయం సాధించి మూడవసారి అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే సోనాలి గుహ, దిపేందు బిస్వాస్, సరళ మురు, అమల్ ఆచార్య సహా మరికొందరు సొంతగూటికి చేరేందుకు సిద్దమైన నేపధ్యంలో ముకుల్ రాయ్ ఎపిసోడ్’ ప్రాధాన్యతను సంతరించుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అంతే కాకుండా ముకుల్  రాయ్’ కుమారుడు, ఆయనతో పాటుగా బీజేపీలో చేరిన శుభరాంషు, కొద్ది రోజుల క్రితం, బీజేపీకి పేస్బుక్’లో చురక అంటించారు. ‘ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని విమర్శించడం కంటే, ఆత్మపరిశీలన చేసుకోవడం మంచిదని’ ఆయన పార్టీ అధికార ఎఫ్బీలో పేర్కొన్నారు.  మరో వంక మమతా బెనర్జీ కూడా రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు  ముకుల్ రాయ్’ మూల కారణమని భావిస్తున్నారు. ముకుల్ రాయ్’ చేరికతోనే బీజేపీకి ఉపోచ్చిందని, ఆయన్ని వదులుకోవడం పార్టీ చేసిన తప్పని, ఆమె కొంచెం ఆలస్యంగానే అయిన గుర్తించారు.లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా 18 స్థానాలు గెలుచుకుని,  అసెంబ్లీ ఎన్నికల్లోనూ గట్టి పోటీ ఇచ్చింది. ప్రతిపక్షంగా నిలిచింది. అందుకే మమత మళ్ళీ ముకుల్ రాయ్’ని వెనక్కి తెచ్చుకుంటే, బీజేపీ దూకుడుకు చెక్ పెట్టవచ్చని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీని రాయబేరానికి పంపారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా, బెంగాల్లో రివర్స్ ఆకర్ష్’ మొదలైంది... ముకుల్ రాయ్ ఓకే చేస్తే బీజేపీ వాపు తగ్గి అసలు బలం బయట పడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.

చిక్కుల్లో ఏపీ సీఐడీ ఏడీజీ! ఢిల్లీ పోలీసులకు రఘురామ ఫిర్యాదు

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఢిల్లీలో మరో ఫిర్యాదు చేశారు. ఏపీ సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్‌పై పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆయన కంప్లైంట్ ఇచ్చారు.  తన అరెస్ట్‌ సమయంలో స్వాధీనం చేసుకున్న ఐ-ఫోన్‌ నుంచి పలువురికి తప్పుడు మెసేజ్ లు పంపినట్లు ఎంపీ రఘురామ రాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేష్‌, కుటుంబ సభ్యులకు తన వాట్సాప్‌ నెంబర్‌ నుంచి పలుమార్లు సందేశాలు పంపారని, సునీల్‌కుమార్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రఘురామ విజ్ఞప్తి చేశారు.  తన ఫోన్ విషయమై ఇప్పటికే సునీల్‌కుమార్‌కు ఎంపీ రఘురామ లీగల్‌ నోటీసు ఇచ్చారు. తన అరెస్ట్‌ సమయంలో పోలీసులు తీసుకున్న ఐ-ఫోన్‌ను తిరిగి ఇవ్వాలంటూ నోటీసులో ఎంపీ పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న ఐ-ఫోన్‌ను రికార్డుల్లో ఎక్కడా చూపలేదన్న విషయాన్ని కూడా నోటీసులో ఆయన చెప్పుకొచ్చారు. ఫోన్‌లో కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలు ఉన్నాయన్నారు. అంతేకాకుండా స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా తనకు సంబంధించిన చాలా విలువైన సమాచారం ఫోన్‌లోనే ఉందని.. పార్లమెంట్‌ విధులను నిర్వర్తించడానికి ఫోన్ తిరిగి ఇవ్వాలని నోటీసులో తెలిపారు.

ఏపీలో తమిళనాడు తరహా పాలిటిక్స్! బీజేపీ చేతిలో బ్రహ్మాస్త్రం ఉందా? 

బీజేపీ ఫోకసంతా తెలుగు రాష్ట్రాలపైనా ఉందా? ఈటల రాజేందర్ చేరికతో తెలంగాణలో ఆటు మొదలుపెట్టిందా? ఏపీలోనూ బ్రహ్మాస్త్రం తీయబోతుందా? అంటే రాజకీయ, ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే తెలుస్తోంది. ఉత్తరాదిలో బీజేపీ బలం తగ్గిందన్న ప్రచారంతో సౌత్ పైనే కేంద్రం పెద్దలు ప్రత్యేక దృష్టి సారించారని అంటున్నారు. ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. బీజేపీ పెద్దల ఆపరేషన్ వల్లే కొత్త పార్టీ పెట్టాలని భావించిన ఈటల.. కమలం గూటికి జై కొట్టారని తెలుస్తోంది. ఏపీలోనూ తమిళనాడు తరహా పాలిటిక్స్ చేసేందుకు మోడీ టీమ్ స్కెచ్ వేసిందంటున్నారు.  ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పై ఉన్న కేసులను తమకు అనుకూలంగా మలుచుకుని పావులు కదపాలని కమలదళం డిసైడ్ అయిందంటున్నారు. తమిళనాడులో జయలలిత చనిపోగానే.. రాజకీయంగా దూకుడు పెంచింది బీజేపీ. అప్పుడు అధికారంలో ఉన్న అన్నాడీఎంకేను తన గుప్పిట్లో పెట్టుకుంది. జయలలిత స్నేహితురాలు శశికళ జైలుకు వెళ్లడానికి బీజేపీ రాజకీయ ఎత్తుగడే కారణమనే ఆరోపణలు ఉన్నాయి. తమ దారికి రాకపోవడం వల్లే పాత కేసులను తీసి ఆమెను జైలుకు పంపించారని ప్రచారం ఉంది. శశికళ జైలుకు వెళ్లిన తర్వాత అన్నాడీఎంకే నేతలంతా బీజేపీ చెప్పినట్లే నడిచారు. అప్పటి ముఖ్యమంత్రి పళనిస్వామి.. కేంద్రం డైరెక్షన్ లోనే మొత్తం పాలన చేశారని చెబుతారు. అదే సమయంలో తమిళనాడులో పార్టీ బలోపేతానికి బీజేపీ చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేసింది. కొంతవరకు సక్సెస్ అయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోఅన్నాడీఎంకేతో కలిసి పోటీ చేసిన బీజేపీ.. గతంలో కంటే మెరుగైన ఫలితాలే సాధించింది.  ఏపీలోనూ తమిళనాడు తరహా ప్రణాళికలను బీజేపీ పెద్దలు రచిస్తున్నారని తెలుస్తోంది. సీఎం జగన్ పై 18 సీబీఐ, ఈడీ కేసులున్నాయి. ఇప్పుడు జగన్ బెయిల్ పైనే ఉన్నారు. ఇటీవలే జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. దానిపై విచారణ ప్రారంభమైంది. జగన్ తో పాటు సీబీఐ కౌంటర్ కూడా వేశాయి. అయితే తన కౌంటర్ లో సీబీఐ జగన్ బెయిల్ రద్దును వ్యతిరేకించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి కేంద్రంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న జగన్ కు అనుకూలంగా సీబీఐ కౌంటర్ వేస్తుందని అంతా భావించారు. అందుకు విరుద్ధంగా కోర్టు మెరిట్స్ కే సీబీఐ వదిలిపెట్టడంతో ... జగన్ కేసులో ఏదైనా జరగవచ్చని చెబుతున్నారు. కేంద్రం డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి బీజేపీ బ్రహ్మండమైన ప్లాన్ వేసిందంటున్నారు. అక్రమాస్తుల కేసులో ఒకవేళ జగన్ బెయిల్ రద్దైతే.. వెంటనే తమ కార్యచరణకు అమలులో పెట్టనున్నారట కమలనాధులు. దాని ప్రకారం తెలంగాణలో పార్టీ పెట్టిన వైఎస్ షర్మిలను ఏపీలో ప్రయోగించబోతున్నారని తెలుస్తోంది. జగన్ జైలుకు పోతే.. ముఖ్యమంత్రి పదవి కోసం వైసీపీలో పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి ఎప్పటినుంచో సీఎం సీటుపై కన్నేశారని అంటున్నారు. జగన్ కేసుల్లో ఏ2గా ఉన్న విజయసాయి రెడ్డి ఉండనే ఉన్నారు. జగన్ రాజీనామా చేస్తే.. అతని కుటుంబంలోనే ఒకరికి అవకాశం వస్తుందని కొందరు చెబుతున్నారు. ఈ లెక్కన జగన్ భార్య భారతీ రెడ్డి రేసులో ముందుండే అవకాశం ఉంది. ఇక్కడే చక్రం తిప్పేలా బీజేపీ వ్యూహం ఉందంటున్నారు. భారతికి పదవి దక్కకుండా షర్మిలను తెరపైకి తేవాలన్నది కమలం పార్టీ స్కెచ్చట.  ఇప్పటికే జగన్ కుటుంబంతో షర్మిలకు విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. కొంత కాలంకా షర్మిల.. జగన్ ఇంటికి వెళ్లకపోవడం, అతన్ని కలవకపోవడం దీనికి బలాన్నిస్తోంది. ముఖ్యంగా భారతి రెడ్డితో షర్మిలకు తీవ్ర విభేదాలు ఉన్నాయంటున్నారు. ఆమెపై కోపంతోనే షర్మిల కొత్త పార్టీ పెట్టారనే టాక్ కూడా ఉంది. ఇదే అస్త్రంగా ఏపీలో పట్టు సాధించాలని కమలనాధులు పక్కాగా ప్రణాళికలు రచించారని తెలుస్తోంది. గతంలో వైసీపీ కోసం ఏపీలో షర్మిల సుదీర్ఘ పాత్రయాత్ర చేశారు. 2019 ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం సుడిగాలి ప్రచారం చేశారు. 2011లో జగన్ జైలుకు వెళ్లినప్పుడు పార్టీని నిలబెట్టేందుకు షర్మిల కష్టపడ్డారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించారు. అందుకే వైసీపీ నేతల్లో చాలా మంది షర్మిల నాయకత్వాన్ని ఆహ్వానించే అవకాశం ఉంది. వైసీపీ కార్యకర్తల్లోనూ షర్మిలకు పాజిటివ్ టాక్ ఉంది. ఇవన్ని తమకు అనుకూలంగా మలుచుకుని.. షర్మిల ద్వారా తమ రాజకీయ వ్యూహాలను అమలు చేసేందుకు బీజేపీ పెద్దలు వ్యూహరచన చేస్తున్నారని ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది.  మరోవైపు సోమవారం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళుతున్నారని తెలుస్తోంది. తన బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ జరుగుతున్న సమయంలోనే జగన్ ఢిల్లీకి వెళితే.. అది తీవ్ర చర్చగా మారే అవకాశం ఉంది. తన కేసుల గురించి మాట్లాడేందుకే జగన్ వెళ్లారనే విమర్శలు విపక్షాల నుంచి రావడం ఖాయం. మరీ జగన్ ఢిల్లీకి వెళతారా.. వెళితే ఎవరిని కలుస్తారు అన్నది ఆసక్తికరం. చూడాలి మరీ ఏం జరగనుందో.. ఏపీ రాజకీయాలు రానున్న రోజుల్లో ఎటు వైపు దారి తీస్తాయో... తమిళనాడు తరహా పాలిటిక్స్ జరిగితే మాత్రం ఏపీ రాజకీయాలు కీలక మలుపులు తిరగవచ్చు.. 

ఆనందయ్య మందుతో వైసీపీ ఎమ్మెల్యే బిజినెస్!

కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందుపై మళ్లీ వివాదం రాజుకుంది. ఆనందయ్య మందు కోసం రూపొందించారని ప్రచారం జరుగుతున్న వెబ్ సైట్ ఫేక్ అని తేలింది.  ఆనందయ్య మందును ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే అందిస్తారని నాలుగైదు రోజులుగా  ప్రచారం జరుగుతోంది. మందు కోసం  Childeal.comలో బుక్ చేస్తే ఇంటికే మందును పంపిస్తారని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఆనందయ్య మందు కోసం చాలా మంది ఈ వెబ్ సైటులో నమోదు చేసుకున్నారు. మందును  ఫ్రీగా ఇస్తానని ఆనందయ్య చెప్పగా.. ఈ వెబ్ సైట్ లో మాత్రం రేటు కూడా పొందపరిచారు. దీంతో కొందరిలో అనుమానాలు తలెత్తాయి.  ఆనందయ్య మందు పంపిణిపై జరుగుతున్న ప్రచారంపై స్పందించిన  ఏపీ ప్రభుత్వం.. వెబ్ సైట్ పై క్లారిటీ ఇచ్చింది. Childeal.com ద్వారా ఆనందయ్య ఆయుర్వేదం మందును పంపిణీ చేస్తారన్న ప్రచారంలో నిజం లేదని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టం చేసింది. అలాంటి అధికారిక వెబ్‌సైట్ ఏదీ లేదని తేల్చిచెప్పింది. ఇప్పటి వరకు ఏ వెబ్‌సైట్‌కు అనుమతి ఇవ్వలేదని వెల్లడించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు సూచించింది. ఒకవేళ అలాంటి నిర్ణయం ఏదైనా తీసుకుంటే ప్రభుత్వమే అధికారికంగా వెల్లడిస్తుందని తెలిపింది. అయితే Childeal.com వెబ్‌సైట్‌కు సంబంధించి టీడీపీ నేత సోమిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆనందయ్య మందుతో వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. ఆనందయ్య ఉచితంగా ఇస్తున్న మందును రూ.167కు అమ్ముకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. శ్రేషిత టెక్నాలజీ ద్వారా వెబ్‌సైట్‌ను రూపొందించారని.. ఈ కంపెనీలో వైసీపీ నేతలే డైరెక్టర్లుగా ఉన్నారని చెప్పారు. వెబ్‌సైట్‌లో మందు వివరాలు, ధరను పేర్కొన్నారని.. కానీ మళ్లీ డిలీట్ చేశారని ఆరోపించారు. ఆనందయ్య మందు పేరిట ఫేక్ వెబ్‌సైట్ సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి సోమిరెడ్డి డిమాండ్ చేశారు. కోటి మందికి ఆన్‌లైన్‌లో మందు అమ్మి రూ.120 కోట్లు సొమ్ము చేసుకునేందుకు కాకాణి కుటిల ప్రయత్నం చేశారని సోమిరెడ్డి ఆరోపించారు. ఆనందయ్య మందుకు ఫ్యాను గుర్తు పెట్టడం ముఖ్యమంత్రిని దిగజార్చడమే అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే చేస్తున్న ఆగడాలను నిలదీసే దమ్ము, ధైర్యం జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, ఎస్పీ, కలెక్టర్‌లకు లేదన్నారు. సుమోటోగా కుట్రపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే.. తాము మోమోరాండం ఇవ్వడానికి సిద్ధమని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం, హైకోర్టు అనుమతి ఇచ్చింది. నోటిద్వారా తీసుకునే మందు పంపిణీకి మాత్రమే అనుమతి ఉంది. కంటిలో వేసే మందుకు ఇంకా అనుమతి రాలేదు. ఆనందయ్య మందుకు అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో.. పంపిణి మళ్లీ మొదలవుతుందని అంతా భావించారు. మూడు రోజుల క్రితం కృష్ణపట్నం పోర్టులో మందు పంపిణి ప్రారంభమైందని, సోమవారం నుంచి పంపణి చేయనున్నారని వార్తలు వచ్చాయి. ఆన్ లైన్ లో మందు పంపిణికి ఏర్పాట్లు చేసినట్లు నెల్లూరు జిల్లా కలెక్టర్ నుంచి ప్రకటన వచ్చింది.  అంతా సాఫీగా జరుగుతుందనుకుంటున్న సమయంలో సీన్ మొత్తం మారిపోయినట్లు కనిపిస్తోంది. సోమవారం నుంచి ఆనందయ్య మందు పంపిణి కష్టమేనని తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే మందు పంపిణికి సమస్యలు వస్తున్నాయని ఆనందయ్య అనచురులు, కృష్ణపట్నం గ్రామస్తులు చెబుతున్నారు. ఆనందయ్య మందు పంపిణీకి ప్రభుత్వ సహకారం లేదని... మందు పంపిణీ జరగదని.. దయచేసి ఎవరూ కృష్ణపట్నం రావొద్దని ఆనందయ్య సన్నిహితుడు సంపత్ రాజు తెలిపారు. కృష్ణపట్నంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారన్నారు. ఆనందయ్య రోజుకి అయిదు వేల మందికి సరిపడే మందు మాత్రమే తయారు చేయగలరన్నారు. ప్రభుత్వం జిల్లాల వారీగా లక్షల మందికి పంపిణీ చేయమనడం సరికాదన్నారు. ప్రాణాపాయ స్థితిలో వచ్చేవారికి మందు ఇవ్వలేక, ఆనందయ్య కన్నీళ్లు పెట్టుకుంటున్నారన్నారు‌. ప్రభుత్వం సహాకారం అందిస్తేనే మందు పంపిణీ సాధ్యమన్నారు. ఆన్ లైన్‌లో మందు ఇవ్వలేమని సంపత్ రాజు వెల్లడించారు. ఈ మేరక ఆయన విడుదల చేసిన వీడియో వైరల్ గా మారింది. 

మిషన్ హుజూరాబాద్..  కేసీఆర్ పక్కా స్కెచ్

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేయకముందు నుంచే  ఉప ఎన్నికల వ్యూహంపై కసరత్తు ప్రారంభించిన ముఖ్యమత్రి, తెరాస అధ్యక్షుడు, కేసీఆర్ ఇప్పుడు తమ వ్యూహానికి మరింత పదును పెడుతున్నారు.అలాగే రాజీనామాకు ముందు నుంచే స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరూ, పార్టీ వదిలి పోకుండా ముఖ్యమంత్రి పక్కా ఏర్పాట్లు చేశారని, ప్రతి పదవికి ఒక రేటు ఫిక్స్ చేసి, వారిని పార్టీకి కట్టిపడేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈటల వర్గం ఆరోపిస్తోంది. స్వయంగా ఈటల రాజేందర్ కూడా అలాంటి ఆరోపణలే చేశారు  ఇప్పటికే కోట్లు కుమ్మరించి, స్థానిక ప్రజాప్రతినిధులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, అయితే, హుజురాబాద్ ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఆత్మాభిమానాన్ని చంపుకోరని, తనను వదులుకోరని ఈటల ధీమా వ్యక్తం చేస్తున్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం రాత్రి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఅర్, మంత్రి హరీష్ రావు, కరీంనగర్ మాజీ ఎంపీ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్’ తో ప్రత్యేకంగా హుజురాబాద్ ఉప ఎన్నిక వ్యూహరచన పై చర్చించారు. ఈ సమావేశంలో ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుంది అనే విషయాన్ని పక్కన పెట్టి, ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో నాగార్జున సాగర్, అంతకు ముందు హుజూర్‌నగర్‌, ఉప ఎన్నికలలో అనుసరించిన  వ్యూహాన్ని అనుసరించాలని నిర్ణయించింది. మరోవంక ఆదివారం నుంచే ఎన్నికల కార్యాచరణ ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. హుజూరాబాద్‌, వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, కమలాపూర్‌ మండలాలతో పాటు హుజూరాబాద్‌, జమ్మికుంట పురపాలక సంఘాలుండగా వాటన్నింటికి మంత్రులను ఎన్నికల బాధ్యులుగా నియమించనున్నట్లు తెలిసింది.  అలాగే, మేజర్ పంచాయతీల బాధ్యతలను  ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసుపత్రుల సందర్శన, కొవిడ్ రోగుల పరామర్శ పేరున స్వయంగా కరీంనగర్ జిల్లలో పర్యటనకు వెళుతున్నట్లు సమాచారం.  అయితే ఈటల రాజీనామా చేసినా,వెంటనే ఉప ఎన్నిక జరిగే అవకాశం లేదు. సహజంగా, అసెంబ్లీ  లేదా లోక్ సభ స్థానం ఖాళీ అయిన తర్వాత ఆరు నెలలలోగా ఉపఎన్నిక జరుగుతుంది. అయితే, కరోనా కారణంగా, ఎమ్మెల్సీ ఎన్నికలు సహా అన్ని ఎన్నికలను, కేంద్ర ఎన్నిక సంఘం వాయిదా వేస్తోంది. ఈ నేపధ్యంలో హుజూరాబాద్ ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతుంది అనే విషయంలో స్పష్టత లేదు. మరో వంక ఆరునెలల గడువు లోగా ఉపఎన్నిక జరుగుతుందని అనుకున్నా, అప్పటికి, ప్రస్తుత అసెంబ్లీ గడువు మహాయితే, మరో సంవత్సరానికి కొంచెం అటూ ఇటుగా మాత్రమే  ఉంటుంది.అయినా, ఏ  చిన్న అవకాశాన్ని వదులుకోకుండా  ఇప్పటినుంచే కేసీఆర్ పక్కా ప్రణాళికతో పావులు కడుపుతున్నారంటే, ఉపఎన్నికకు ఆయన ఎంత ప్రధాన్యత ఇస్తున్నారో అర్థమవుతుంది. రెండేండ్లు కూడా గడవు లేని స్థానానికి జరిగే ఉప ఎన్నికకు ముఖ్యమంత్రి ఎందుకు ఇంత  ప్రాధాన్యత ఇస్తున్నారు, అంటే హుజూరాబాద్ ఉపఎన్నిక కేవలం ఉపఎన్నిక మాత్రమే కాదు, రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే ఎన్నికలు కావడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగే ఉపఎన్నికల్లో తెరాసకు ‘దుబ్బాక’ పునరావృతం అయితే, ఇక ఆ తర్వాత బీజీపీ దూకుడును ఎదుర్కోవడం కొంచెం చాలా కష్టం అవుతుంది. ఇప్పటికే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెలంగాణలో బెంగాల్ దూకుడు చూపుతామని చెప్పినట్లు వార్తలొచ్చాయి. ఈ నేపధ్యంలోనే కేసీఆర్, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే వ్యూహంతో పావులు కదుపుతున్నారు.

జైలు భయంతోనే  జగన్ లేఖలు..

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు, ఓ డజనుకు పైగా, అక్రమాస్తులు, క్విట్ ప్రో ... కేసుల్లో ముద్దాయి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి, బెయిలు రద్దయ్యే అవకాశాలున్నాయా? అంటే, అవుననే అంటున్నారు, సిపిఐ జాతీయ కార్యదర్శి కే. నారాయణ. శనివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన జగన్మోహన్ రెడ్డిపై, తీవ్రంగా విరుచుకు పడ్డారు. ముఖ్యంగా, మంచి చెడులు చూడకుండా, అన్ని విషయాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని వైసీపీ సమర్దిస్తోందని, ముఖ్యమంత్రి స్వప్రయోజనాల కోసం కేంద్రం, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని విమర్శించారు.  ప్రదాని మోడీ తీసుకుంటున్న ప్రజావ్యతిరేక  తప్పుడు నిర్ణయాలను సమర్ధిస్తున్న జగన్ రెడ్డి,ఇంతకాలానికి, వ్యాక్సిన్ల కోసం కేంద్రంపై వత్తిడి తెద్దాం, ఒకే స్వరం వినిపిద్దామంటూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాయడం విడ్డూరంగ ఉందని ఆయన తమదైన శైలిలో ఎద్దేవా చేశారు. అక్రమాస్తుల కేసులో బెయిల్ రద్దయ్యే అవకాశాలున్నందున, నలుగురి సానుభూతి పొందేందుకే  జగన్ వాక్సిన్ విషయంలో ‘ఒకే స్వరం’ వినిపిద్దామని కొత్త రాగం ఎత్తుకున్నారని నారాయణ అన్నారు. అందుకే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారని నారాయణ అన్నారు.    'కేసుల విషయంలో జరగబోయే పరిణామాల నుంచి బయటపడేందుకే జగన్ వ్యాక్సిన్ల పేరుతో సీఎంలకు లేఖ రాశారు. నిజంగా వ్యాక్సిన్లపై చిత్తశుద్ధి ఉంటే జార్ఖండ్ సీఎంను ఎందుకు తప్పుబట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం, జీఎస్టీతో పాటు ప్రజావ్యతిరేక విధానాల అంశాల్లో కేంద్రంపై ఎందుకు పోరాటం చేయటం లేదు...? కేంద్రంపై పోరాడే విషయంలో జగన్కు చిత్తశుద్ధి లేదు' అని నారాయణ పేర్కొన్నారు.  జగన్ లేఖపై, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ కూడా, ఇదే విధంగా స్పందించారు. వ్యాక్సిన్ల కొరతకు కారణమైన కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి జగన్ ఎందుకు ప్రశ్నించడం లేదని జైరాం రమేష్ ప్రశ్నించారు. వ్యాక్సిన్’ పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీని ప్రశ్నించేచేందుకు జగన్ రెడ్డికి దిరం లేదా, అని జైరాం రమేష్ సూటిగా ప్రశ్నించారు.

మహిళ శరీరంలో 216 రోజుల పాటు కరోనా వైరస్..

కరోనా ఆ పేరు వింటే  చాలు.. వాళ్ళు గగ్గుర్లు పడుతుంది. కరోనా అంటే మరణ వార్త వినాల్సి వస్తుంది. ఇక  కరోనా వైరస్ చేయని పని లేదు.. ప్రజలను ఎంత వరకు కుదిపేయ్యాలో అంతవరకు కుదిపేసింది. ప్రజలను  అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తూ విలయతాండవం చేస్తుంది.  పలు దశల్లో విరుచుకుపడుతూ సవాళ్లను విసురుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా పేరు చెబితేనే చాలా మంది జనాలు భయపడిపోతున్నారు. చిన్నపిల్లల ఇంట్లోనే దాక్కుంటున్నారంటే నమ్మండి. ఇది కాగా తాజాగా కరోనా వైరస్ గురించి కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. కానీ ఇప్పటివరకు కరోనా మీద సరైన అవగాహనా ఎవరికి లేదనే చెప్పాలి ఎందుకంటే దాదాపు కరోనా ఎటాక్ చేసి సంవత్సరం పైనే అయింది. ఐన ఆ కరోనా మహమ్మారికి సరైన వైద్యం గాని వాక్సిన్ గాని లేదు.. అప్పుడప్పుడు అసలు కరోనా ఉందా అనే అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే ఇంత టెక్నాలజీ ఉన్నా ప్రపంచంలో అంత చిన్న వైరస్ ఇప్పటికి సరైన వైద్యం లేకపోవడమే అందుకు అనుమానం. అయితే  ఈ  క్రమంలోనే ఓ షాకింగ్ విషయం బయటికొచ్చింది. షాకింగ్ అంటే అలాంటిలాంటి షాకింగ్ కాదు దక్షిణాఫ్రికాలో  36 ఏళ్ల హెచ్‌ఐవీ పాజిటివ్ మహిళ 216 రోజులు కరోనాతో బాధపడింది. ఈ కాలంలో వైరస్ ఆ మహిళ శరీరంలో 32 సార్లు మ్యూటేషన్ చెందిందని ఓ స్టడీ వెల్లడించింది. దక్షిణ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. మహిళా శరీరంలో వైరస్ స్పైక్ ప్రోటీన్ కూడా 13 సార్లు మ్యూటేషన్‌ చెందింది. ఇలా జరగడం ద్వారా.. వైరస్ ఆమె శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్‌‌ను తప్పించుకోగలిగింది. ఇక, వైరస్ మరో 19 మూటేషన్‌లో దాని ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చింది. అయితే ఆ మహిళ శరీరంలో మ్యూటేషన్ చెందిన వైరస్ ఇతరులకు సోకిందా? లేదా? అనే దానిపై స్పష్టత లేదని Los Angeles Times రిపోర్ట్ చేసింది. ఇక, ఇందుకు సంబంధించిన అధ్యయనం ప్రీ ప్రింట్ జర్నల్ medRxivayలో పబ్లిష్ అయింది. ఈ అధ్యయనానికి సంబంధించిన రచయిత టూలియో డీ ఓలివైరా మాట్లాడుతూ.. ‘ఒకవేళ ఇలాంటివి మరిన్ని కేసులు గుర్తిస్తే.. వైరస్ న్యూ వేరియంట్స్‌కు హెచ్‌ఐవీ సంక్రమణ మూలంగా మారే అవకాశాన్ని పెంచుతుంది. ఎందుకంటే వీరిలో వైరస్ ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి.. అది వైరస్ మ్యూటేషన్ చెందడానికి అవకాశం ఇస్తుంది’ అని తెలిపారు. ఇక, ఆ మహిళకు చికిత్స అనంతరం కూడా కొన్ని లక్షణాలు ఉన్నట్టుగా నివేదికలు సూచిస్తున్నాయి. ఆమె శరీరంలో వైరస్ అలాగే ఉంది. అయితే ఆమె 300 మంది హెచ్‌ఐవీ పాజిటివ్ ప్రజలపై జరిగిన పరిశోధనల్లో ఆమె పాల్గొనడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.  

మోదీతో జ‌గ‌న్‌రెడ్డి డ‌బుల్ గేమ్‌.. కాళ్ల బేరానికి త్వరలో ఢిల్లీ టూర్?

ఏపీ సీఎం జ‌గ‌న్‌ ఢిల్లీకి క‌ట్టుబానిస‌.. ఇది విపక్షాల మాట.. కేసుల ఉచ్చు మెడ‌కు బ‌లంగా బిగుసుకుపోయి ఉంది కాబ‌ట్టి.. అందులోనుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి.. ఢిల్లీ పీఠానికి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ క‌ట్ట‌ప్ప వార‌సుడిగా వెట్టిచాకిరి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇందులో నిజ‌మెంత ఉన్నా.. జ‌గ‌న్ చేసే కొన్ని చ‌ర్య‌లు ఆ అనుమానం క‌లిగించేలానే ఉంటున్నాయి. అధికారంలోకి రాగానే ప్ర‌త్యేక హోదాను మర్చిపోవడం, విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు స‌హ‌క‌రించ‌డం.. పార్ల‌మెంట్‌లో ప‌లు బిల్లుల‌కు బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు తెల‌ప‌డం.. మోదీ, అంబానీల మ‌నిషిని ఏపీ నుంచి రాజ్య‌స‌భ‌కు పంపించ‌డం.. ఇవన్ని మోదీ-జ‌గ‌న్‌ల ర‌హ‌స్య బంధానికి సాక్ష్యాలుగా ప్రతిపక్షాలు చెబుతున్నాయి. అయితే.. కేంద్రానికి క‌ట్ట‌ప్ప‌లా సేవ చేస్తూనే.. స‌మ‌యం చిక్కిన‌ప్పుడ‌ల్లా.. అదే క‌ట్ట‌ప్ప‌లా మోడీకి వెన్నుపోటు పొడిచేందుకూ జ‌గ‌న్‌ వెన‌కాడ‌టం లేద‌ని అంటున్నారు.  క‌రోనా స‌మ‌యంలో జ‌రిగిన రెండు ఘ‌ట‌నలు సీఎం జ‌గ‌న్.. క‌ట్ట‌ప్ప వార‌సుడేన‌ని చెప్ప‌డానికి నిద‌ర్శ‌నాలుగా చూపిస్తున్నారు. ఇటీవ‌ల జార్ఖండ్ సీఎం హేమంత్‌ సోరెన్‌.. పీఎం మోదీతో జ‌రిపిన వీడియో కాన్ఫ‌రెన్స్‌పై పెద‌వి విరిచారు. ప్ర‌ధాని తాను చెప్పాల్సిందే చెప్పారు కానీ, త‌మ మాట కూడా వింటే బాగుండంటూ ట్వీట్ చేశారు. సోరెన్ ట్వీట్‌కు ప‌లువురు మ‌ద్ద‌తు కూడా ప‌లికారు. అయితే, ఎవ‌రూ అడ‌గ‌కుండానే.. అందులో త‌న‌కేమాత్రం సంబంధం లేకుండానే.. ట్విట్ట‌ర్‌లో అస‌లేమాత్రం యాక్టివ్‌గా ఉండ‌ని జ‌గ‌న్‌.. జార్ఖండ్ సీఎం హేమంత్‌ సోరెన్ ట్వీట్‌ను త‌ప్పుబ‌ట్టారు. ఇలాంటి క‌రోనా పాండ‌మిక్ టైమ్‌లో ప్ర‌ధానికి అండ‌గా ఉందాం.. రాజ‌కీయాలు వ‌ద్దు బ్ర‌ద‌ర్ అంటూ ఉచిత స‌ల‌హా ఇచ్చారు. జ‌గ‌న్ ట్వీట్‌పై సోరెన్ పార్టీ సైతం ఘాటు రిప్లై ఇవ్వ‌డం.. కేసుల్లో ఇరుక్కుపోయిన మీ భ‌య‌మేంటో అర్థం చేసుకోగ‌ల‌మంటూ సెటైర్లు వేయ‌డం.. జ‌గ‌న్ ప‌రువు వేరే రాష్ట్రంలో బ‌జారు పాల‌వ‌డం తెలిసిందే. ఢిల్లీ పీఠానికి బానిస‌లా మోదీని స‌మ‌ర్థించి.. జ‌గ‌న్ త‌న ప‌రువు తానే తీసుకున్నార‌ని అప్ప‌ట్లోనే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.  ఇక, కేంద్రంతో సీఎం జ‌గ‌న్‌ డ‌బుల్ గేమ్ ఆడుతున్న విష‌యానికి వ‌ద్దాం. క‌రోనా టైమ్‌లో ప్ర‌ధానికి అండగా ఉందామంటూ నీతులు చెప్పిన జ‌గ‌న్‌.. ఇటీవ‌ల కేంద్రానికి వ్య‌తిరేకంగా మిగ‌తా రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌ను రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేశారని అంటున్నారు. వ్యాక్సిన్ విషయంలో గ్లోబల్ టెండర్లపై సీఎం జగన్ అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు. ఏపీ సహా 9 రాష్ట్రాలు వ్యాక్సిన్‌ కోసం గ్లోబల్‌ టెండర్లు పిలిచినా.. ఒక్క బిడ్‌ కూడా రాలేదని లేఖ‌లో వాపోయారు. ‘నా అనుభవంతో చెబుతున్నాను. వ్యాక్సిన్‌ విషయంలో రాష్ట్రాలుగా మనం ఏమీ చెయ్యలేం. చాలా సవాళ్లు ఉన్నాయి. విషయం కేంద్రానికే వదిలేద్దాం. కేంద్ర‌మే ఉచితంగా రాష్ట్రాల‌కు వ్యాక్సిన్లు ఇవ్వాల‌ని కోరుదాం’ అని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు జ‌గ‌న్‌.  సీఎం జ‌గ‌న్ మిగ‌తా ముఖ్య‌మంత్రుల‌కు ఇలా లేఖ రాయ‌డం.. కేంద్రంపై రాష్ట్రాల‌ను రెచ్చ‌గొట్ట‌డమేన‌ని ఆగ్ర‌హించార‌ట ఢిల్లీ పెద్ద‌లు. క‌ట్ట‌ప్ప‌లా బానిస‌గా ప‌డుంటాడ‌ని అనుకుంటే.. అదే క‌ట్ట‌ప్ప‌లా ఇలా వెన్నుపోటు పెడిచే ప్ర‌య‌త్నం చేయ‌డంపై కేంద్ర వ‌ర్గాలు మండిప‌డుతున్నాయ‌ట‌. జ‌రిగిన న‌ష్టాన్ని కాస్త‌ ఆల‌స్యంగా గుర్తించిన జ‌గ‌న్‌.. మ‌ళ్లీ కేంద్రంతో కాళ్ల బేరానికి వ‌స్తున్నాడ‌ట‌. మోడీని మ‌చ్చిక చేసుకునేందుకు.. ఈ నెల 7న సీఎం జ‌గ‌న్ ఢిల్లీ వెళ‌తార‌ని స‌మాచారం. వ్యాక్సిన్‌పై కేంద్ర మంత్రుల్ని జగన్‌ కలిసే అవకాశం ఉందంటున్నారు. అన్ని రాష్ట్రాల సీఎంల‌కు తాను అలా లేఖ ఎందుకు రాయాల్సి వ‌చ్చిందో.. వివ‌ర‌ణ ఇచ్చుకునేందుకే జ‌గ‌న్‌రెడ్డి హ‌స్తిన బాట ప‌డుతున్నార‌ని అంటున్నారు.  త‌న లేఖ‌తో మోదీకి కోప‌మొస్తే.. ఊరుకుంటారా? అనే భ‌యం జ‌గ‌న్‌ను వెంటాడుతోంది. ఓవైపు సీబీఐ కోర్టులో ఎంపీ ర‌ఘురామ వేసిన బెయిల్ ర‌ద్దు పిటిష‌న్‌పై వేగంగా విచార‌ణ జ‌రుగుతోంది. అటు, సీబీఐ సైతం ఆయ‌న‌పై కొత్త‌గా మ‌రో కేసు పెట్టింది. త‌న‌కు వ్య‌తిరేకంగా రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేగంగా మారిపోతోంది. ఈ సంక్లిష్ట‌ స‌మ‌యంలో వ్యాక్సిన్ల‌పై లేఖ రాసి.. ప్ర‌ధానికి కోపం తెప్పించడం.. జ‌గ‌న్ మ‌నుగ‌డ‌కే ప్ర‌మాదం. అందుకే ఆకులు కాలాక‌.. మోడీ చేతులు ప‌ట్టుకునేందుకు ఢిల్లీకి ప‌య‌న‌మ‌వుతున్నార‌ని అంటున్నారు. పాపం.. జ‌గ‌న్‌.. క‌ట్ట‌ప్ప బానిస‌త్వం. ఎన్న‌టికీ విముక్తి లేని ఊడిగం. ప‌గోడికి కూడా రావొద్దు ఆ క‌ష్టం. అంటూ ఎద్దేవా చేస్తోంది ప్ర‌తిప‌క్షం.

ఈటలను ఉతికారేసిన హరీష్..

టీఆర్ఎస్‌ను వీడుతూ కేసీఆర్‌పై దుమ్మెత్తిపోశారు ఈట‌ల రాజేంద‌ర్‌. వెళ్తూ వెళ్తూ ప‌నిలో ప‌నిగా హ‌రీశ్‌రావునూ గొడ‌వ‌లోకి లాగారు. త‌న‌కంటే హ‌రీష్‌రావు కేసీఆర్ చేతిలో ఎక్కువ‌గా అవ‌మానించ‌బ‌డ్డార‌ని.. ఆయ‌న సైతం ఆత్మాభిమానంతో క‌న్నీళ్లు పెట్టారంటూ బాంబు పేల్చి పోయారు. కేసీఆర్‌కు-హ‌రీశ్‌కు బాగా గ్యాప్ వ‌చ్చింద‌ని అన్నారు. ఈట‌ల పేల్చిన ఈ బాంబు.. టీఆర్ఎస్‌లో ప్ర‌కంప‌ణ‌లు సృష్టించింది.  మొద‌టి నుంచీ ఈట‌ల‌, హ‌రీష్ మంచి స్నేహితులుగా ముద్ర‌ప‌డ్డారు. వారిద్ద‌రూ ఒక వ‌ర్గ‌మ‌ని అంటారు. వారం క్రితం ఈట‌ల మాట్లాడుతూ.. త‌న‌పైకి త‌న స్నేహితుడినే ఉసిగొల్పుతున్నారనే వ్యాఖ్య‌లు హ‌రీష్‌రావును ఉద్దేశించే అంటున్నారు. అంత ద‌గ్గ‌రి సంబంధం వారిద్ద‌రిదీ. అందుకే, తామిద్ద‌రినీ కేసీఆర్ చిన్న చూపు చూశాడంటూ ఈట‌ల చెప్పిన మాట‌ల‌ను అంతా న‌మ్మేశారు. రాజేంద‌ర్‌లానే హ‌రీష్‌రావుకు కూడా గులాబీ బాస్ చేతిలో అవ‌మానం జ‌రిగిందంటూ అంతా భావించారు. హ‌రీష్ సైతం ఈట‌ల ఆరోప‌ణ‌ల‌ను ఖండించ‌క‌పోవ‌డంతో.. టీఆర్ఎస్ శ్రేణుల్లో మ‌రింత గంద‌ర‌గోళం.  ఈట‌ల ప్రెస్‌మీట్ ముగియ‌గానే.. టీఆర్ఎస్ నాయకులు సైతం మీడియా ముందుకు వ‌చ్చి కౌంట‌ర్ అటాక్ చేశారు. కానీ, హ‌రీష్‌రావు మాత్రం ఈట‌ల వ్యాఖ్య‌ల‌పై మౌనంగా ఉండిపోయారు. అంటే, మౌనం అర్థ అంగీకార‌మ‌న్న‌ట్టేనా? లేక‌, పూర్తి అంగీకార‌మా? అంటూ చ‌ర్చ మొద‌లైంది. ఒక‌ద‌శ‌లో ఈట‌ల త‌ర్వాత‌ హ‌రీష్‌రావు సైతం పార్టీని వీడుతారా? అనేంత‌గా ఊహాగానాలు వెలువ‌డ్డాయి. ఇలా ఆల‌స్యం అవుతున్నా కొద్దీ.. అనుమానాలు, రూమ‌ర్లు పెరుగుతుండ‌టంతో.. రోజున్న‌ర స‌మ‌యం గ‌డిచాక‌.. లేటెస్ట్‌గా హ‌రీష్‌రావు స్పందించారు.  ఈట‌ల వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు. అదికూడా ప్రెస్‌మీట్ పెట్ట‌కుండా.. త‌న కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న‌ను రిలీజ్ చేశారు. త‌న పేరు ప్ర‌స్తావించ‌డంపై తీవ్ర‌ అభ్యంత‌రం తెలిపారు. త‌న‌ భుజాల మీద తుపాకీ పెట్టాల‌నుకోవ‌డం వికార‌మైన ప్ర‌య‌త్నమంటూ ఈట‌ల‌పై మండిప‌డ్డారు హ‌రీష్‌రావు. అయితే, ఈట‌ల‌ అంత పెద్ద ఆరోప‌ణ‌లు చేస్తే.. హ‌రీష్‌రావు ఇంత ఆల‌స్యంగా రియాక్ట్ అవ‌డంపైనా అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. పార్టీలో ఏదో జ‌రుగుతోంద‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. హ‌రీష్‌రావు విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న య‌ధాత‌దంగా......     "టీఆర్ఎస్‌ పార్టీలో నేను నిబ‌ద్ద‌త, విధేయ‌త‌, క్ర‌మ‌శిక్ష‌ణ ఉన్న‌ కార్య‌క‌ర్త‌ను. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వ‌ర‌కు నాకు పార్టీ ప్ర‌యోజ‌నాలే ప‌ర‌మావ‌ధి. పార్టీ కార్య‌క‌ర్త‌గా ఉన్న నాకు పార్టీ, నాయ‌క‌త్వం ఏ ప‌ని అప్ప‌గించినా దాన్ని పూర్తిచేయ‌డం నా విధి, బాధ్య‌త‌. పార్టీ నాయ‌కుడిగా కేసీఆర్ ఏ ఆదేశం ఇచ్చినా శిర‌సావ‌హించ‌డం నా కార్త‌వ్యంగా భావిస్తాను. కేసీఆర్ గారు పార్టీ అధ్య‌క్షులే కాదు.. నాకు గురువు, నా మార్గ‌ద‌ర్శి, నాకు తండ్రితో స‌మానులు. ఆయ‌న మాట జ‌వ‌దాట‌కుండా న‌డుచుకుంటున్నాను. గ‌తంలో అనేక‌సార్లు ఇదే విష‌యం సుస్ఫ‌ష్టంగా అనేక వేదిక‌ల‌పై చెప్పాను. ఇప్పుడు మ‌రోసారి చెప్తున్న‌. కంఠంలో ఊపిరిఉన్నంత వ‌ర‌కు ఇలాగే న‌డుచుకుంటాను. తాచెడ్డ కోతి వ‌న‌మెల్ల చెరిచింద‌న్న‌ట్టుగా ఉన్న‌ది ఈట‌ల రాజేంద‌ర్ గారి వైఖ‌రి. పార్టీని వీడ‌డానికి ఆయ‌న‌కు అనేక కార‌ణాలుండొచ్చు. పార్టీలో ఉండాలా.. వెళ్లిపోవాలా అన్న‌ది ఆయ‌న ఇష్టం. ఆయ‌న పార్టీని వీడిన టీఆర్ఎస్ పార్టీకి వీస‌మెత్తు న‌ష్టం కూడా లేదు. ఆయ‌న పార్టీకి చేసిన సేవ‌క‌న్నా.. పార్టీ ఆయ‌న‌కు ఇచ్చిన అవ‌కాశాలే ఎక్కువ‌. త‌న స‌మ‌స్య‌ల‌కు , త‌న గొడ‌వ‌కు నైతిక బ‌లం కోసం ప‌దేప‌దే నా పేరును ప్ర‌స్తావించ‌డం ఈట‌ల రాజేంద‌ర్ భావ‌దారిద్య్రానికి, విజ్ఙ‌త‌, విచ‌క్ష‌ణ‌లేమికి నిద‌ర్శ‌నం. నా భుజాల మీద తుపాకి పెట్టాల‌నుకోవ‌డం విఫ‌ల ప్ర‌య‌త్నం మాత్ర‌మే కాదు.. వికార‌మైన ప్ర‌య‌త్నం కూడా. ఆయ‌న మాట‌ల్లో మ‌నో వికార‌మే త‌ప్ప స‌త్యం ఎంత మాత్రం లేదు. నా గురించి ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండిస్తున్న‌…." --త‌న్నీరు హ‌రీష్ రావు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి.

లలిత నువ్వు నా దేవత..వేరే పెళ్లి చేసుకో.. బాబును బాగా చూసుకో.. 

నువ్వు నా దేవత.. నువ్వు నా భార్య కావడం నా అదృష్టం.. కానీ ఏరోజూ నిన్ను సరిగా చూసుకోలేదు.. నన్ను క్షమించు లలిత. నేను చనిపోయిన తర్వాత నువ్వు మరొకరిని పెళ్లి చేసుకోవాలి.. బాబును బాగా పెంచాలి.. నువ్వు ఆనందంగా ఉండాలి. ఇది సినిమా డైలాగ్ కాదు. కానీ గీతాంజలి సినిమాలో స్ట్రెచర్ మీద ఉన్న హీరోయిన్, హీరోతో అన్నట్లు.. అతను తన లేఖలో రాశాడు.. హాస్పిటల్ కి తీసుకెళ్లారు. స్ట్రెచర్ పై ఉన్న అతను తన  భార్యను గుర్తు చేసుకున్న మాటలు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం..?  అది విశాఖపట్నం.  నగరంలోని గోపాలపట్నం. అతని పేరు. అరుణ్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. అతని భార్య పేరు లలిత. వారిద్దరికీ ఓ కొడుకు కూడా ఉన్నాడు. కుటుంబ విషయాల్లో అతనికి భార్యతో మనస్పర్థలు వచ్చాయి. అప్పటినుండి అరుణ్ సోదరుడితో కలిసి పెందుర్తిలో నివాసం ఉంటున్నాడు. గోపాలపట్నంలోని చికెన్ షాప్‌లో పని చేస్తున్నాడు. అతని  భార్య మాడుగుల గ్రామంలో ఉంటుంది. భార్య తిరిగి వస్తుందని అనుకున్నాడు. అయినా ఆమె తిరిగి  రాకపోవడంతో మనస్తాపం చెందిన అరుణ్ మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులోనే ఆత్మహత్యకు యత్నించాడు. చేతి మణికట్టు కోసుకొని ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. గోపాలపట్నం బాజీ జంక్షన్ సబ్ స్టేషన్ వద్ద అరుణ్ అనే యువకుడు చేతి మణికట్టు కోసుకొని ఆత్మహత్యకు యత్నించడం స్థానికంగా కలకలం రేపింది. 108 వాహనంలో ప్రధమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం అరుణ్‌ను కేజీహెచ్‌కు తరలించారు. లో కుటుంబ కలహాలే ఆత్మహత్యా యత్నానికి కారణంగా తెలిసింది.  సూసైడ్ నోట్‌లో భార్య లలితను వేరొక పెళ్లి చేసుకోమని, బాబుని బాగా చూసుకోమని అరుణ్ రాయడం గమనార్హం. ‘లలిత.. నీకు అన్యాయం చేశాను.. మళ్లీ జన్మంటూ ఉంటే నీవే నా భార్య కావాలని కోరుకుంటాను’ అంటూ అరుణ్ సూసైడ్ నోట్‌లో రాశాడు. తాను చనిపోతున్నానని, తనను క్షమించాలని కోరాడు. ఇదిలా ఉంటే.. అరుణ్ గురించి ఆరా తీసేందుకు పోలీసులు ఆస్పత్రికి వెళ్లగా.. ఈలోపే అరుణ్ అక్కడి నుంచి పరారయ్యాడు. అతని గురించి తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. అంతేకాదు.. ఆ సూసైడ్ నోట్‌లో భార్యపై తనకున్న ప్రేమను చాటుకునేలా అరుణ్ కొన్ని వాక్యాలు రాశాడు. అయితే.. అరుణ్ మద్యం మత్తులో ఇలా ఆత్మహత్యకు యత్నించాడా లేక భార్య దూరమై మానసిక ఒత్తిడిలో ఇలా చేశాడా అనేది తెలియాల్సి ఉంది.  

కరోనా తగ్గిందని  సంబర పడకండి ..

కరోనా వచ్చింది ... తగ్గింది ఇక భయం లేదు. మళ్ళీ మాములు జీవితంలోకి వచ్చేసినట్లే, అనుకుంటే మీరు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు. కరోనా తగ్గవచ్చును, పాజిటివ్, నెగిటివ్’గా మారవచ్చును. అయినా, ఉరుకుల, పరుగుల  నార్మల్ లైఫ్ లీడ్ చేస్తామంటే మాత్రం కుదరదు. ఒకసారి కరోనా బారిన పడితే, అది మనల్ని అంత త్వరగా వదలదు. కరోనా వచ్చి తగ్గిన వారిని ఆ ప్రభావం అలా వెంటాడుతూనే ఉంటుందని, వైద్యులు, శాస్త్రవేత్తలు మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు.  కరోనా తగ్గినా తర్వాత కనీసం మూడు నెలలు, వయసు మీద పడిన వారు, బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లెమ్స్ ఉన్న వారయితే, ఇంకా ఎక్కువ కాలం ఇంటి పట్టున విశ్రాంతిగా ఉడడం అవసరం. అంతే కాదు, ఇమ్మ్యూనిటి (రోగ నిరోధక శక్తి)ని పెంచి, శక్తిని ఇచ్చే పోషక విలువలు గల ఆహారం తీసుకోవడం అవసరమని వైద్యులు చెపుతున్నారు.  అయినా, చాలా మంది, కరోనా తగ్గిందనే ధైర్యంతో, రెగ్యులర్ వ్యాపకాలతో బిజీ అయిపోతున్నారు. సైక్లింగ్, ఇతర  శరీర వ్యాయామం చేసి అలసి పోతున్నారు. ఇలా చేయడం వలన మళ్ళీ అనారోగ్యం పాలు కావడమే కాకుండా ప్రాణాలు కూడా  కోల్పోతున్నారు.  ఇందుకు మన ముందే అనేక ఉదాహరణలు ఉన్నాయి.అనేక మంది ప్రముఖ వ్యక్తులు కరోనా తగ్గిన తర్వాత కన్ను మూసిన సంఘటనలు అనేకం చూశాం,  విన్నాం.   ఇప్పడు తాజాగా, బర్డ్ గ్రూప్ ఎగ్జికూటివ్ డైరెక్టర్ అంకూర్ భాటియా, కరోనా వచ్చి తగ్గిన తర్వాత కన్ను మూశారు. ఆయన చనిపోయింది హార్ట్ ఎటాక్ వల్లనే అయినా, అందుకు కరోనా కూడా  కారణం.  అటు విమానయన రంగంలో, ఇటు ఆతిధ్య రంగంలో దూసుకుపోతున్న భాటియా ఈ ఉదయం, సైక్లింగ్ చేస్తూ ఒక్క సారిగా కుప్పకూలిపోయారు. అంటే ఇక లేవలేదు. అయన ఇక లేరు అన్న విషాద వార్తగా మిగిలారు. కేవలం 48 ఏళ్ల వయసులోనే భాటియా కన్ను మూయడానికి హార్ట్ ఎటాక్ కారణం అయినా, ఆయన ఇటీవలనే కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఆయన, రెగ్యులర్ బిజీ లైఫ్’లో మునిగి పోయారు. అందులో భాగంగానే సైక్లింగ్ చేస్తూ, చనిపోయారు.  భాటియా  ఉదంతం ఒక ఉదాహరణ మాత్రామే, మనలో చాలా మంది కరోనా తగ్గిన తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తల విషయంలో అశ్రద్ద చూపుతున్నామని , ఆ విధంగా ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నామని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పడు కొత్తగా ఫంగసులు కరోనా నుంచి కోలుకున్న వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అందరూ కాదు కానీ, కొందరు రంగు రంగుల ఫంగస్’ల బారిన పడుతున్నారు. కరోనా నుంచి బయటపడ్డామని అనుకునేలోగానే,  ఫంగస్ సోకి, మళ్ళీ ఆసుపత్రులకు చేరుతున్నారు.కాబట్టి, కరోనా రాకుండా, రాక ముందు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామో , అంతకంటే ఎక్కవ జాగ్రత్తలు కరోనా తగ్గిన తర్వాత తీసుకోవాలని.. వైద్యులే కాదు భాటియా డెత్ కూడా హెచ్చరిస్తోంది. తస్మాత్ జాగ్రత్త.

ప్రేమించి పెళ్లి.. ఆ తర్వాత అబార్షన్.. కులం పేరుతో.. 

అతని పేరు సాయిరెడ్డి. ఆమె పేరు కృష్ణవేణి. వాళ్లిద్దరూ హైదరాబాద్ పరిచయం అయ్యారు. ఆ పరిచయం వాళ్ళను ప్రేమికుల్ని చేసింది. ఆ తర్వాత ఆ ప్రేమ పెళ్లిగా మారింది. రెండు సంవత్సరాలుగా కాపురం కూడా పెట్టారు. ఓ రోజు సాయిరెడ్డి తన భార్యను అతని ఇంటికి తీసుకెళ్లాడు. కృష్ణవేణి దళిత మహిళా అవ్వడంతో  ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని సాయిరెడ్డి తల్లిదండ్రులు ఆమెను చిత్రహింసలు పెట్టడం స్టార్ట్ చేశారు. విషయం తెలుసుకుంటే ముందు పూర్తి వివరాలు తెలుసుకుందాం..  కృష్ణవేణి హైదదాబాద్ లోని ఓ సెల్ ఫోన్ సెంటర్ లో పని చేస్తుంది. అక్కడే నివాసం ఉంటున్న సాయిరెడ్డి తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరి పరిచయం మూడు ముళ్ళు ఏడు అడుగులు వేశారు. ఆ తర్వాత అక్కడే వారిద్దరు రెండు సంవత్సరాలుగా కాపురం పెట్టారు. గత సంవత్సరం కరోనా సమయంలో తన సొంత గ్రామం అయిన సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం చీమలపాడు గ్రామానికి సాయిరెడ్డి వచ్చాడు. సాయిరెడ్డి ఊరి నీళ్లు పడగానే ఆది సినిమాలో హీరో కు తాను రాయలసీమ బిడ్డను అని గుర్తుకు వచ్చినట్లు.. అతనికి నేను రెడ్డి ని అని గుర్తుకు వచ్చిందో ఏమో.. అప్పటి  నుంచి కృష్ణవేణి ని పట్టించుకోవడం మానేశాడు. దాంతో మనస్థాపం చెందిన యువతి ముషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు అతడిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు. అప్పుడైనా మారుతాడు అనుకుంది ఆమె.. కసాయి వాడు మారుతాడు అని మనం ఎప్పుడు అనుకోవద్దు అని ఆమె అనుకుంటుండగానే. తనలో మరో ట్విస్ట్ ఇచ్చాడు తన భర్త అప్పటికే ఆమె నాలుగు నెలల గర్భవతి. నువ్వు అబార్షన్ చేయించకుంటేనే మా ఊరు తీసుకెళ్తానంటూ చెప్పడంతో ఆమె చేసేది లేక ఒప్పుకుంది. దీంతో ఆమెకు గర్బం తీయించాడు. కొన్ని రోజులకు అతడు ఆమెను తన సొంతూరుకు తీసుకెళ్లాడు. అమ్మాయిది వేరే కులం కావడంతో అబ్బాయి తరఫు తల్లిదండ్రులు ఆమెను కులం పేరుతో దూషించారు. ఇంట్లోకి రానివ్వలేదు. తన సొంత వ్యవసాయ పొలం వద్ద పదిరోజులపాటు ఉండమని చెప్పి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్దామని అతడు ఆమె కు మాయ మాటలు చెప్పి అక్కడే ఉంచాడు. అతడు  ఆమెను మళ్లీ పట్టించుకోకపోవడంతో సాయిరెడ్డి ఇంటి ముందు నిరసన వ్యక్తం చేసింది. తట్టుకోలేక పోయిన సాయిరెడ్డి అతడి కుటుంబసభ్యులు ఆమెను కులం పేరుతో దూషిస్తూ చిత్రహింసలు పెట్టారు. తీవ్రంగా హింసించి వర్షంలో ఆమెను గ్రామ చావిడి వద్ద పడేశారు. వర్షంలో తడుచుకుంటూ ఆమె ఆర్తనాదాలు పట్టించున్న నాథుడే లేడు. గ్రామానికి చెందిన దళితులు ఆమెకు అండగా నిలబడి ఆసుపత్రికి తరలించారు. సాయిరెడ్డి కుటుంబ సభ్యులు కొట్టిన దెబ్బలకు తీవ్ర గాయాలపాలైన ఆమె ప్రస్తుతం నారాయణఖేడ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది. కట్ చేస్తే.. ఈ  విషయం తెలుసుకున్న స్థానిక కేవీపీఎస్ నాయకులు ఆమెకు న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. నిత్యం ప్రజల కోసం పనిచేవర్జికి ఇలాంటి విషయం కొత్త ఏం కాదు. ఈ ఘటన తో అగ్రకుల పెత్తందారుల ఆగడాలు మరోసారి బట్టబయలైందని ఆరోపించారు. ఇది చాలా దారుణమని, దుర్మార్గమైనది.. ప్రేమించి పెళ్లి చేసుకొని మోసం చేసి చిత్ర హింసలకు గురిచేసి హత్యాయత్నం చేసిన సాయిరెడ్డి వారి కుటుంబ సభ్యులందరినీ తక్షణమే అరెస్టు చేయాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం, నిర్భయ చట్టం కింద కేసులు పెట్టి చేసి వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. బాధిత అమ్మాయి కృష్ణవేణికి ప్రభుత్వమే కార్పొరేట్ వైద్యం అందించాలని, వైద్య ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరించాలని, నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) సంగారెడ్డి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.  

మందు పంపిణికి సహకరించని సర్కార్! ఆనందయ్య కన్నీళ్లు..  

హైకోర్టు అనుమతి ఇచ్చింది... ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ చెప్పేసింది.. ఇంకేం కృష్ణపట్నం ఆనందయ్య మందుకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో లక్షలాది మంది కోరుకుంటున్న మందు పంపిణి మళ్లీ మొదలవుతుందని అంతా భావించారు. ఎప్పుడెప్పుడా అని అశగా ఎదురుచూస్తున్నారు. మూడు రోజుల క్రితం కృష్ణపట్నం పోర్టులో మందు పంపిణి ప్రారంభమైందని, సోమవారం నుంచి పంపణి చేయనున్నారని వార్తలు వచ్చాయి. ఆన్ లైన్ లో మందు పంపిణికి ఏర్పాట్లు చేసినట్లు నెల్లూరు జిల్లా కలెక్టర్ నుంచి ప్రకటన వచ్చింది. ఈ ఔష‌ధానికి ‘ఔషధచక్ర’ అని పేరు పెట్టిన‌ట్లు స‌మాచారం.  అంతా సాఫీగా జరుగుతుందనుకుంటున్న సమయంలో సీన్ మొత్తం మారిపోయినట్లు కనిపిస్తోంది. సోమవారం నుంచి ఆనందయ్య మందు పంపిణి కష్టమేనని తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే మందు పంపిణికి సమస్యలు వస్తున్నాయని ఆనందయ్య అనచురులు, కృష్ణపట్నం గ్రామస్తులు చెబుతున్నారు.  ఆనందయ్య మందు పంపిణీకి ప్రభుత్వ సహకారం లేదని... మందు పంపిణీ జరగదని.. దయచేసి ఎవరూ కృష్ణపట్నం రావొద్దని ఆనందయ్య సన్నిహితుడు సంపత్ రాజు తెలిపారు. కృష్ణపట్నంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారన్నారు. ఆనందయ్య రోజుకి అయిదు వేల మందికి సరిపడే మందు మాత్రమే తయారు చేయగలరన్నారు. ప్రభుత్వం జిల్లాల వారీగా లక్షల మందికి పంపిణీ చేయమనడం సరికాదన్నారు. ప్రాణాపాయ స్థితిలో వచ్చేవారికి మందు ఇవ్వలేక, ఆనందయ్య కన్నీళ్లు పెట్టుకుంటున్నారన్నారు‌. ప్రభుత్వం సహాకారం అందిస్తేనే మందు పంపిణీ సాధ్యమన్నారు. ఆన్ లైన్‌లో మందు ఇవ్వలేమని సంపత్ రాజు వెల్లడించారు.ఈ మేరక ఆయన విడుదల చేసిన వీడియో వైరల్ గా మారింది.