టీడీపీ నేతపై హత్యాయత్నం.. డీజీపీకి చంద్రబాబు లేఖాస్త్రం 

కర్నూల్ జిల్లాలో టీడీపీ నేత తిక్కారెడ్డికి హత్యాయత్నం జరగడం కలకలం రేపుతోంది. మంత్రాలయం టీడీపీ నేత తిక్కారెడ్డిపై కోసిగి మండలం పెద్ద బొంపల్లి జాతరలో దాడి జరిగింది. తిక్కారెడ్డి వర్గీయులపై వైసీపీ కార్యకర్తలు కర్రలతో దాడి చేశారు. రథోత్సవంలో పాల్గొన్న తిక్కారెడ్డిపై దాడి చేసేందుకు ప్రత్యర్థులు ప్రయత్నించారు. అయితే టీడీపీ కార్యకర్తలు వెంటనే అప్రమత్తమై తిక్కారెడ్డిని కాపాడారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలు కాగా స్థానికులు వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. తిక్కారెడ్డిని చంపాలనే ఈ దాడి చేసినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.  కర్నూలు జిల్లా కోసిగిలో తిక్కారెడ్డిపై దాడి జరగడంపై టీడీపీ సీరియస్ గా స్పందించింది. ఘటనలో చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు డీజీపీ గౌతం సవాంగ్‌కు లేఖ రాశారు. బొంపల్లె ఆలయానికి వెళ్లిన తిక్కారెడ్డిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘటనలో ఐదుగురు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు గాయపడినట్టు లేఖలో చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తల అరాచకాలను అడ్డుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. తిక్కారెడ్డికి తగిన భద్రత కల్పించాలని కోరారు.  గతేడాది ఫిబ్రవరిలోనూ తిక్కారెడ్డిపై వైసీపీ వర్గీయులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని చంద్రబాబు చెప్పారు. అయినా పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం విస్మయానికి గురి చేస్తోందన్నారు. తిక్కారెడ్డికి ఏవిధమైన ప్రమాదం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారాయని, నేరస్థులపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోగా.. మరిన్ని నేరాలకు పాల్పడేలా ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు.   టీడీపీ సీనియర్ నేత తిక్కారెడ్డిపై హత్యాయత్నం జరగడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. గతంలోనూ తిక్కారెడ్డిపై రెండుసార్లు హత్యాయత్నం జరిగినా పోలీసులు భద్రత కల్పించడంలో తీవ్రంగా విఫలమయ్యారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలే తిక్కారెడ్డిని హత్య చేసేందుకు ప్రయత్నించారని లోకేష్ ఆరోపించారు. తిక్కారెడ్డిపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇప్పటికైనా తిక్కారెడ్డికి భద్రత కల్పించాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఫ్యాక్షన్ అనే కత్తికి జగన్ బలిచేస్తున్నారని ఆయన విమర్శలు చేశారు. కత్తిని నమ్ముకుంటే కత్తికే బలికాక తప్పదని హితవు పలికారు. ప్రజలు గెలిపించింది ప్రతిపక్ష నేతలకు హతమార్చడానికా అంటూ జగన్ ప్రభుత్వాన్ని లోకేష్ సూటిగా ప్రశ్నించారు.

ఒమిక్రాన్ తో భారత్‌లో థర్డ్‌ వేవ్‌? WHO అధికారి అలర్ట్..

కొవిడ్ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త  వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 59 దేశాలకు వ్యాపించింది. భారత్‌లో ఇప్పటి వరకు 34 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసింది. ఐర్లాండ్ నుంచి వచ్చిన విజయనగరం వ్యక్తికి ఒమిక్రాన్ నిర్దారణ అయింది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో దేశంలో మూడో వేవ్‌ రాబోతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో డబ్ల్యూహెచ్‌ఓ ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్‌ డాక్టర్‌ పూనమ్‌ ఖేత్రపాల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.  కొత్త వేరియంట్‌ వచ్చినంత మాత్రాన దయనీయమైన పరిస్థితులు తలెత్తుతాయని భావించాల్సిన అవసరం లేదన్నారు పూనమ్‌ ఖేత్రపాల్‌. అయితే, కొంత అనిశ్చితి మాత్రం ఉంటుందని తెలిపారు.  మహమ్మారి ఇంకా అంతం కాలేదని పూనమ్‌ తెలిపారు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కేసులు ప్రమాదకర స్థాయిలో నమోదవుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా దక్షిణాసియా ప్రాంతంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల్ని మరింత పటిష్ఠం చేయాలని సూచించారు. అలాగే వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలన్నారు.   ఇప్పటికే ఒమిక్రాన్‌ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. దీంతో కొత్త వేరియంట్‌ ప్రభావం తీవ్రంగానే ఉండే సూచనలు కనిపిస్తున్నాయని పూనమ్‌ అభిప్రాయపడ్డారు. అయితే, అది ఎలాంటి ప్రభావం అనేది మాత్రం ఇప్పుడే నిర్ధారించలేమన్నారు. మరింత స్పష్టత కోసం ప్రతి దేశం సమగ్రమైన సమాచారం పంపాలని కోరారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్‌ వ్యాప్తి, తీవ్రత, ఇన్ఫెక్షన్‌ రేటు, లక్షణాలను నిర్ధారించడానికి విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయన్నారు.   దక్షిణాఫ్రికా నుంచి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఒమిక్రాన్‌ వల్ల రీఇన్ఫెక్షన్లు అధికంగా నమోదవుతున్నాయని పూనమ్‌ తెలిపారు. అలాగే డెల్టాతో పోలిస్తే వ్యాధి తీవ్రత కూడా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోందన్నారు. కానీ ఇప్పుడే ఓ నిర్ణయానికి రావడం సరికాదన్నారు. ప్రజలంతా కొవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ఖచ్చితంగా ధరించాలని పునమ్ సూచించారు. జాగ్రత్తలు తీసుకోకుంటే పెను ముప్పు తప్పదని హెచ్చరించారు డాక్టర్ పూనమ్ ఖేత్రవాల్. 

వామ్మో.. కేసీఆర్ పాలనపై ఇంత వ్యతిరేకతా! కారుకు మూడో స్థానమేనా? 

తెలంగాణలో కేసీఆర్ కథ ముగిసింది.. ఇదీ కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న ప్రచారం. కేసీఆర్ పాలనపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనే చర్చ సాగుతోంది. హుజురాబాద్ ఉప ఎన్నికలో అది కనిపించింది కూడా. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా కారు పార్టీకి షాకిచ్చారు ఓటర్లు. తర్వాత వరి ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ నిర్లక్ష్యం, వరి సాగు చేయవద్దంటూ కేసీఆర్ ఇచ్చిన ప్రకటనలతో జనాలు భగ్గుమంటున్నారు. దీంతో కేసీఆర్ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందనే ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే తాజాగా వచ్చిన ఓ సర్వే ఫలితాలు ఉన్నాయి. తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై నిర్వహించిన సర్వేలో సంచలన ఫలితాలు వచ్చాయి. కేసీఆర్ కు , టీఆర్ఎస్ కు దిమ్మతిరిగేలా సర్వేలో జనాల నాడీ కనిపించింది.  సీనియర్ జర్నలిస్ట్ కంబాలపల్లి కృష్ణ ఆధ్వర్యంలోని వోటా( వాయిస్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రా) సంస్థ సమగ్ర సర్వే నిర్వహించింది. కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేండ్లు పూర్తైన సందర్భంగా ఈ సర్వే నిర్వహించింది వోటా సంస్థ. డిసెంబర్ 1 నుంచి 10 వరకు పది రోజుల పాటు వివిధ వర్గాల నుంచి సమాచారం సేకరించింది. ఎక్కువగా ఆన్ లైన్ ద్వారా శాంపిల్స్ సేకరించింది. ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్, టెలిగ్రామ్, యూ ట్యూబ్ ద్వారా జరిగిన సర్వేలో వేలాది మంది పాల్గొని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనపై జనాలు ఏమంటున్నారు, ముందస్తు ఎన్నికలు వస్తాయా.. వస్తే ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది, టీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది.. కేటీఆర్ ను సీఎంగా జనాలు కోరుకుంటున్నారా.. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా జనాలు ఏ పార్టీని కోరుకుంటారు అన్న అంశాలపై వోటా సంస్థ సర్వే నిర్వహించింది. వోటా సంస్థ సర్వేలో సంచలన ఫలితాలు వచ్చాయి. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారానికి అనుగుణంగానే సీఎం కేసీఆర్ పాలనపై తెలంగాణ ప్రజలు తీవ్ర కోపంగా ఉన్నారనే విషయం సర్వేలో స్పష్టమైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోతుందని, ఏకంగా మూడో స్థానానికి పడిపోతుందని వోటా సర్వేలో తేలింది. అంతేకాదు టీఆర్ఎస్ లో అసమ్మతి ఖాయమని కూడా మెజార్టీ ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఏడేళ్ల పాలన ఎలా ఉందని ప్రశ్నించగా.. కేసీఆర్ పాలనకు కేవలం 18 మార్కులే వచ్చాయి. కేసీఆర్ పాలన అసలు బాగాలేదని ఏకంగా 50.8 శాతం మంది, బాగా లేదని 20.3 శాతం మంది తీర్పు ఇచ్చారు. 10.9 శాతం మంది కేసీఆర్ పాలన పర్వాలేదన్నారు. ఏకంగా 71 శాతం మంది కేసీఆర్ పాలన బాగా లేదని చెప్పడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది. సీఎం కేసీఆర్ పాలనకు ఎన్ని మార్కులు వేస్తారని ప్రశ్నించగా... కేసీఆర్ పాలనకు కేవలం 25 మార్కులే ఎక్కువ మంది వేశారు. 67.1 శాతం మంది కేసీఆర్ పాలన అట్టర్ ప్లాప్ అంటూ 25 మార్కులు వేశారు. 11.7 శాతం మంది 50 మార్కులు వేయగా.. 7.3 శాతం మంది మాత్రమే 75 మార్కులు వేశారు. 13.9 శాతం మంది మాత్రం కేసీఆర్ పాలనకు ఫుల్ 100 మార్కులు వేశారు. టీఆర్ఎస్ లో అసమ్మతి ఉందని భావిస్తున్నారా అని ప్రశ్నించగా.. ఏకంగా 70 శాతానికి పైగా ఉందని చెప్పారు. 14 శాతం మంది అసమ్మతి గురించి ఏమి తెలియదని చెప్పగా.. 7 శాతం మంది మాత్రమే గులాబీ పార్టీలో అసమ్మతి లేదని చెప్పారు. 70 శాతానికి పైగా జనాలు కారు పార్టీలో అసమ్మతి ఉందని భావించడం షాకింగే. ఇక దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారా అంటే దాదాపు 73 శాతం మంది ఇవ్వరనే చెప్పారు. అంటే కేసీఆర్ హామీలపై జనాలకు పూర్తిగా నమ్మకం పోయిందని తెలుస్తోంది. కేసీఆర్ పాలనపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుండటంతో.. టీఆర్ఎస్ ను ఎవరూ ఓడిస్తారని ప్రశ్నించగా ఆసక్తికరమైన ఫలితం వచ్చింది. కారు పార్టీకి ప్రత్యామ్నాయంగా కమలం పార్టీ వైపు మెజార్టీ జనాలు మొగ్గు చూపారు. బీజేపీ పార్టీకి 48.5 శాతం ఓటర్లు జై కొట్టగా.. కాంగ్రెస్ కు మద్దతుగా 27. 1 శాతం మంది నిలిచారు. టీఆర్ఎస్ ను ఎవరూ ఓడించలేరని 18 శాతం మంది తమ అభిప్రాయం చెప్పారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తే ఎవరికి ఓటు వేస్తారన్న ప్రశ్నకు.. బీజేపీకి 38.4 శాతం , కాంగ్రెస్ కు 37 శాతం మంది ఓటేశారు. అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం దారుణంగా మూడో స్థానానికి పడిపోయింది. ముందస్తు ఎన్నికలు వస్తే గులాబీ పార్టీకి ఓటేస్తామని కేవలం 22.2 శాతం మంది మాత్రమే ఓటేస్తారని చెప్పారు. టీఆర్ఎస్ కు ఎవరూ ఓడిస్తారన్న ప్రశ్నకు బీజేపీకి ఎక్కువ సపోర్ట్ రాగా.. ఎవరికి ఓటు వేస్తారు అన్న ప్రశ్నకు మాత్రం కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా నిలవడం ఆసక్తి రేపుతోంది.  టీఆర్ఎస్ కు సంబంధించి అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. కేటీఆర్ ను సీఎం చేస్తారనే ప్రచారంపై అభిప్రాయం చెప్పాలని కోరగా.. 28 శాతం మంది సరైంది కాదన్నారు. 15.4 శాతం మంది సరైనదని చెప్పారు. కేటీఆర్ ను సీఎం చేసేందుకు ఇంకా టైముందని 17 శాతం మంది చెప్పగా.. దాదాపు 40 శాతం మంది మాత్రం ఎన్నికలకు ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించాలని అభిప్రాయపడ్డారు.టీఆర్ఎస్ లో ముఖ్యమంత్రిగా ఎవరూ బెస్ట్ ఆప్షన్ అన్న ప్రశ్నకు మాత్రం కేసీఆర్ కే ఎక్కువ మంది జై కొట్టారు. కేసీఆరే సీఎంగా బెటరని 45 శాతం మంది చెప్పగా... రెండో స్థానంలో అనూహ్యంగా హరీష్ రావు నిలిచారు. హరీష్ రావుకు 42.5 శాతం మంది ఓటేయగా.. కేటీఆర్ కు కేవలం 10 శాతం మంది మాత్రమే సపోర్ట్ చేశారు. కవిత బెస్ట్ సీఎం ఆప్షన్ అని కేవలం 1.7 శాతం మంది మాత్రమే తమ అభిప్రాయం చెప్పారు.  ఇక హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత కేసీఆర్ గ్రాఫ్ తగ్గిందని 72 శాతం మంది చెప్పగా.. మారలేదని 22. 8 శాతం మంది, పెరిగిందని 4.8 శాతం మంది తమ అభిప్రాయాన్ని సర్వేలో వెల్లడించారు. టీఆర్ఎస్ లో చీలిక వస్తుందా? అని ప్రశ్నించగా.. 45.3 శాతం మంది వస్తుందని, 43 శాతం మంది రాదని చెప్పారు. మొత్తంగా వోటా సంస్థ సర్వే ప్రకారం తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి కౌంట్ డౌన్ మొదలైందని స్పష్టమవుతోంది. కేసీఆర్ పాలనపై జనాలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని, ఎన్నికలు ఎప్పుడొచ్చిని కారు పార్టీకి ఘోర పరాజయం తప్పదని తెలుస్తోంది. గులాబీ పార్టీ ఏకంగా మూడో స్థానానికి పడిపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.

జగనన్న ఉన్నాడు జాగ్రత్త.. లేదంటే అంతేమరి! రోడ్లపై ఫ్లెక్సీల కలకలం..

ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు గురించి ఎంత చెప్పుకుంటే అంత మంచిదేమో. అంత దారుణంగా తయారయ్యాయి రోడ్లు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా గుంతల రోడ్లే. ఏదో పల్లెటూరు రోడ్లు కాదు... రాష్ట్ర రహదారుల పరిస్థితి కూడా అంతే. అడుగుతో గుంతతో వాహనదారులు నరకం చూస్తున్నారు. అధ్వాన్యంగా మారిన రోడ్లతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏపీలో దారుణంగా దెబ్బతిన్న రహదారుల విషయంలో రెండేళ్లుగా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించింది. ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా ముందుకెళ్లింది. రోడ్ల అభివృద్ధికి పెట్రోల్‌పై రెండేళ్లుగా లీటరుకు రూ.2 రూపాయల చొప్పన సెస్‌ వసూలు చేస్తున్నా దాంతో రోడ్లను రిపేర్లు కూడా చేయించలేని దుస్ధితి.  ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో రోడ్లు చాలా వరకు అధ్వానంగా మారాయి. ఎక్కడ రోడ్డుందో.. ఎక్కడ గుంత ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రజలు ఎంత గగ్గోలు పెడుతున్నా జగన్ సర్కారు మాత్రం రోడ్ల బాగు గురించి సరిగ్గా పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో గోదావరి జిల్లాల ప్రజలు జగన్ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే తమ వెటకారంతో జగన్ సర్కారుకు హెచ్చరికలు చేస్తున్నారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలోని ఓ రోడ్డుపై పెట్టిన బోర్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ‘జగన్ అన్న ఉన్నాడు జాగ్రత్త.. రోడ్డు వేసే వరకు ఎవరైనా ఈ బోర్డును తొలగిస్తే వారి కుటుంబం ఈ రోడ్డుపైనే పోతుంది’ అనేలా జగన్ ఫొటోలతో ఫ్లెక్సీ చేయించి బోర్డు పెట్టారు. ఈ ఫొటోలను జనసేన అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసి ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నారు. 

ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు... ఉత్తరాంధ్ర జిల్లాలో వణుకు.. 

ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మన దగ్గరకు వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ లో తొలి ఒమైక్రాన్ కేసు నమోదు అయ్యింది. ఐర్లాండ్ నుంచి విశాఖకు వచ్చిన విజయనగరానికి చెందిన వ్యక్తికి ఒమైక్రాన్ వైరస్ సోకినట్టు నిర్దారణ అయ్యింది. విదేశాల నుంచి వచ్చిన 15 మంది శాంపిళ్లను జీనోమ్ టెస్టింగ్ కోసం పంపితే.. 10 శాంపిళ్లకు నివేదికలు ఆందాయని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 10 కేసుల్లో ఒక కేసు మాత్రమే ఒమైక్రాన్ వైరస్ ఉన్నట్టు గుర్తించారు.  విజయనగరం వాసికి ఒమిక్రాన్ నిర్దారణ కావడంతో ఉత్తరాంధ్ర జిల్లాలో ఆందోళన నెలకొంది. ఒమిక్రాన్ సోకిన వ్యక్తి ఐర్లాండ్ నుంచి వచ్చిన తర్వాత విజయనగరం, విశాఖలో తిరిగారని గుర్తించారు. దీంతో అతను తిరిగిన ప్రాంతాల్లోని ప్రజలు  తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే ప్రజలెవ్వరూ భయాందోళనలు చెందనక్కర్లేదని వైద్యారోగ్య శాఖ భరోసా ఇచ్చింది.   

స్వగ్రామానికి సాయితేజ భౌతికకాయం.. వీర జవాన్ కు ఘన నివాళి

తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన వీర జవాన్ సాయితేజ భౌతికకాయం స్వగ్రామానికి చేరింది. ఢిల్లీ నుంచి విమానంలో బెంగళూరు అర్ధారాత్రికి వచ్చింది తేలుగు తేజం భౌతికకాయం. బెంగుళూరు ఎయిర్ బేస్ నుంచి తెల్లవారుజామున 5:45 గంటలకు స్వగ్రామానికి తరంచారు. కర్ణాటక సరిహద్దులో సాయితేజ మృతదేహానికి ఘన స్వాగతం పలికారు స్నేహితులు, స్థానిక యువకులు. ఊరేగింపు ముందు బైక్ ర్యాలీ ఏర్పాట్లు చేశారు. చీకిలబైలు, వేంపల్లె, చిప్పిలి, మదనపల్లె పట్టణం, అంగళ్లు మీదుగా  28 kms పొడవునా ఊరేగింపుగా స్వగ్రామం ఎగువ రేగడకు సాయితేజ మృతదేహం చేరింది. మధ్యాహ్నం సైనిక అధికార లాంఛనాలతో వీర జవాన్ అంత్యక్రియలు జరుగనున్నాయి. సాయి తేజ చివరి చూపుల కోసం బంధుమిత్రులు, అభిమానులు, ప్రజలు భారీగా తరలివస్తున్నారు.  తమిళనాడులోని కూనురు సమీపంలో బుధవారం మధ్యహ్నం ఆర్మీ హెలికాప్టర్ క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దంపతులు సహా 13 మంది దుర్మరణం చెందారు. ప్రమాదం నుంచి కెప్టెన్ వీరేందర్ సింగ్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనాస్థలిలో లభ్యమైన మృతదేహాలను గుర్తించి వాళ్ల కుటుంబ సభ్యులకు అందించారు. ప్రమాదంలో శరీరాలు పూర్తిగా  కాలిపోవడంతో కొన్ని మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారింది. తెలుగు తేజం సాయితేజ మృతదేహం గుర్తింపు కూడా ఆలస్యమైంది. అయితే ఎట్టకేలకు శుక్రవారం రాత్రి సాయితేజ డెడ్ బాడీని గుర్తించారు. దీంతో అతని మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో సొంతూరు తరలించడానికి సైన్యం ఏర్పాట్లు చేసింది. 

పవన్ దీక్ష ఎవరికోసం.. ఎందుకోసం ?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ప్రతిపక్షాలు ఆందోళన బాట పట్టాయి. ఓ వంక రాష్ట్ర రాజకీయాలలో అత్యంత కీలకంగా మారిన అమరావతి రైతుల మహా పాదయాత్ర తుది దశకు చేరుకుంది. ఈ నెల 17న తిరుపతిలో సభ నిర్వహించేందుకు అమరావతి రైతులు చేస్తున్న ప్రయత్నాలను ప్రభుత్వం అడ్డుకుంటోంది. అదే సమయంలో అమరావతి రైతుల ఆందోళనకు  కౌంటర్’గా ప్రభుత్వ సహకారంతో రాయలసీమ హక్కుల వేదికలు రంగంలోకి దిగుతున్నాయి. రాయలసీమ హక్కుల కోసం డిసెంబరు 13 న రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక ఆద్వర్యంలో విజయవాడలో రాయలసీమ ధర్మపోరాట దీక్షను నిర్వహించాలని నిర్ణయించాయి. మరోవంక 300 రోజులుగా సాగుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ వ్యతిరేక ఆందోళన మరో మలుపు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రయివేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా, బీజేపీ మిత్ర పక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో దీక్ష చేపడుతున్నారు. నిజానికి, కేంద్ర నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలని కోరుతూ 300 రోజులకుగా పైగా కార్మికులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.  బీజేపీకి అనుకూలంగా పనిచేసే సంఘ్ పరివార్ సంస్థలతో సహా వివిధ ప్రజాసంఘాలు,రాజకీయ పార్టీలు, కార్మికుల ఆందోళనలో ప్రత్యక్షంగా, పరోక్షంగ పాల్గొంటున్నాయి. అయినా, కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరణ తప్పదని, తమ నిర్ణయం నుంచి వెనక్కు వెళ్లేది లేదని స్పష్టం చేసింది. పార్లమెంట్’లో తెలుగు దేశం సభ్యులు ఇదే విషయాన్ని, పలు సందర్భాలలో ప్రస్తావించారు. అయినా, కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదు. వివాదస్పద సాగు చట్టాలను ఉపసంహరించుకున్న కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు విషయంలో మాత్రం వెనక్కి తగ్గేదే లేదంటోంది.  ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్  దీక్ష చేపట్టడంలోని అంతర్యం ఏమిటి? ఎందుకోసం? ఎవరి కోసం? జనసేనాని దీక్ష చేపట్టారు? అనే విషయంగా  రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజానికి, పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు ఆందోళనలో ప్రత్యక్షంగా పాల్గొనడం ఇదే మొదటి సారి కాదు.. గతంలో ఆయన విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికులకు సంఘీభావంగా జనసేన నిర్వహించిన సభలోనూ ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆ సందర్భంగా, పవన్ కళ్యాణ్,  కేంద్రం తీసుకున్న నిర్ణయం పైన పోరడటానికి తనకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారు.అంతేకాని,కేంద్రాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేయలేదు.అదే సందర్భంలో ఆయన అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని  రాష్ట్ర ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశారు. అంతేకాదు, అందుకోసం రాష్ట్ర ప్రభుత్వానికి వారం రోజులు గడువు ఇచ్చారు. ఆతర్వాత ఏమి జరిగినా ప్రభుత్వానిదే బాధ్యతని అల్టిమేటం ఇచ్చారు. అయితే, వారాలు నెలలుగా మారినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ కూడా ఆ విషయం మరిచి పోయినట్లే ఉన్నారు. ఇప్పు మళ్ళీ, దీక్షకు దిగారు.  అదలా ఉంటే ఇంతవరకు పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు అంశాన్ని తమ పార్టీ తరపున కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లలేదని  తెలుస్తోంది.  విశాఖ ఉక్కు కర్మాగారం పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లకు ఇచ్చిన ప్రత్యుత్తరాలపై సమాచారం కావాలని విజయవాడకు చెందిన ఇనగంటి రవికుమార్‌ సమాచార హక్కు చట్టం కింద కేంద్ర ఆర్థిక శాఖను కోరారు. ఈ అంశంలో సీఎం వైఎస్‌ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబులకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, అప్పటి సహాయమంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ బదులిచ్చారని ఆ శాఖ అండర్‌ సెక్రటరీ పేర్కొన్నారు. అంటే, పవన్ కళ్యాణ్  కనీసం లేఖ ద్వారా అయినా కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించ లేదని అనుకోవలసి వస్తుంది. ఈ నేపధ్యంలో, పవన్ కళ్యాణ్ దీక్ష ఎవరిని లక్ష్యంగా చేసుకుంటారనేది ఆసక్తి కరంగా మారింది. పవన్ కల్యాణ్ దీక్ష ఎవరి కోసం? ఎందు కోసం? లేక కేవలం ఉనికిని కాపాడుకునే ప్రయత్నమా ? అనే చర్చ జరుగుతోంది.  

నరేంద్ర మోడీ ట్విట్టర్ ఖాతా హ్యాక్.. సామాన్యుల పరిస్థితి ఏంటో?

దేశంలో సైబర్ క్రైమ్ విపరీతంగా పెరిగిపోతోంది. హ్యాకర్ల  బెడద ప్రధానమంత్రి నరేంద్రమోడీని తప్పలేదు. ప్రధాని మోడీ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారు సైబర్ కేటుగాళ్లు. ఆయన వ్యక్తిగత ఖాతాను హ్యాక్ చేసి బిట్‌కాయిన్‌ను ప్రమోట్ చేస్తూ పోస్టు పెట్టారు. ప్రధానమంంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేయడం కలకలం రేపుతోంది.  సోషల్ మీడియాలో వైరల్ అయిన స్క్రీన్‌షాట్ల ప్రకారం ప్రభుత్వం బిట్‌కాయిన్లను అధికారికం చేసిందని, దేశంలోని ప్రతి ఒక్కరికి 500 బిట్‌కాయిన్ల చొప్పున పంచుతోందని పోస్టు చేశారు. దానికింద ఓ స్కామ్ లింకు కూడా ఇచ్చారు. అయితే, కాసేపటికే ఆ ట్వీట్‌ను డిలీట్ చేసినప్పటికీ అప్పటికే స్క్రీన్‌షాట్లు జనాల్లోకి వెళ్లిపోయాయి. అంతేకాదు హ్యాక్‌డ్ హ్యాష్ ట్యాగ్ ఇండియాలో ట్రెండింగ్ అయిపోయింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా కొంతసేపు హ్యాక్ అయిందని, ట్విట్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఖాతాను పునరుద్ధరించినట్టు పీఎంఓ ఇండియా ఈ తెల్లవారుజామున ట్వీట్ చేసింది. హ్యాక్ అయిన సమయంలో షేర్ అయిన ట్వీట్లను పట్టించుకోవద్దని సూచించింది.  అయితే ప్రధాని మోడీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కావడం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. అత్యంత భద్రత ఉండే ప్రధాని వ్యక్తిగత అకౌంట్ కు దిక్కులేకపోతే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది. సైబక్ హ్యాకర్ల నియంత్రణకు మరిన్ని కఠిన చట్టాలు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు, 

భయపెడుతున్న ఒమిక్రాన్.. రాత్రి కర్ఫ్యూపై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్ 

కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో వేగంగా విస్తరిస్తోంది. శనివారం సాయంత్రానికి దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 39కి చేరింది. మహారాష్ట్రలోనే ఇప్పటివరకు 17 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. రాజస్థాన్ లో తొమ్మిది కేసులు నమోదయ్యాయి. గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లోనూ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కట్టడిలోనే ఉన్నప్పటికీ.. కొత్తగా పుట్టుకొచ్చిన ‘ఒమిక్రాన్‌’ వేరియంట్ చాప కింద నీరులా విస్తరిస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది.  కొత్త వేరియంట్‌ కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కొవిడ్‌ నిబంధనలపై నిర్లక్ష్యంగా ఉండొద్దని, వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలపై మరింత దృష్టిపెట్టాలని ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ లేఖ రాశారు. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 27 జిల్లాల్లో గత రెండు వారాలుగా పాజిటివిటీ రేటు పెరుగుతోందని, వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కేంద్రం లేఖలో పేర్కొంది. కేరళ, మిజోరం, సిక్కిం రాష్ట్రాల్లోని 8 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. మిగతా 7 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 19 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 నుంచి 10శాతంగా నమోదైనట్లు పేర్కొంది. ‘‘ఏ జిల్లాలోనైనా కేసులు, పాజిటివిటీ రేటు పెరిగినట్లు కన్పిస్తే.. వెంటనే అక్కడి స్థానిక యంత్రాంగం వ్యూహాత్మక చర్యలు ప్రారంభించాలి. ఆ ప్రాంతాల్లో పరీక్షలు, వ్యాక్సినేషన్‌ పెంచాలి. కంటైన్మెంట్‌ జోన్లుగా పరిగణించి.. అవసరమైతే రాత్రి కర్ఫ్యూ విధించాలి. జనసమూహాలు, పెళ్లిళ్లు, అంత్యక్రియల్లో పాల్గొనేవారిపై పరిమితులు విధించాలి’’ అని రాజేశ్ భూషణ్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. 

దమ్ముందా జగన్.. అఖండ అదుర్స్.. కేటీఆర్ బినామీ ఆయనేనా.. టాప్ న్యూస్@7PM

ఏపీకి ప్రత్యేక హోదా కోసం మీ ఎంపీలను రాజీనామా చేయమనండి.. మా ఎంపీలు కూడా రాజీనామా చేస్తారంటూ ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ విసిరారు.  వైసీపీ అవకాశవాద రాజకీయాలతో రాష్ట్రం భ్రష్టుపట్టి పోతోందన్నారు. ప్రత్యేక హోదాపై కేంద్రం మెడలు వంచుతామని నాడు జగన్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించారు. వైసీపీ ఎంపీలు. ఇప్పుడు ఎందుకు పోరాడరని చంద్రబాబు ప్రశ్నించారు. -------- నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ మూవీని తాను చూసినట్లు తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో అనేది ‘అఖండ’ సినిమాలో చూపించారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఏం జరుగుతోందో దాన్ని ‘అఖండ’ సినిమాలో చూపించారని, సినిమా చాలా బాగుందని చంద్రబాబు ప్రశంసించారు ------- కోర్టులపై జస్టిస్ చంద్రు వ్యాఖ్యలను ఎంపీ రఘురామకృష్ణంరాజు ఖండించారు. జస్టిస్ చంద్రు వ్యాఖ్యలు అవగాహన రాహిత్యంగా ఉన్నాయని తెలిపారు. జగన్ సర్కార్ తీసుకునే ప్రజావ్యతిరేక విధానాలపై జస్టిస్ చంద్రు నిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవుపలికారు. జస్టిస్ చంద్రుతో న్యాయస్థానాలకు వ్యతిరేకంగా జగన్ మాట్లాడించినట్లు ఉందన్నారు. ------- రాజధాని అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ముగింపు సభను ఇండోర్‌గా సభ నిర్వహించాలని జేఏసీ నిర్ణయించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. అమరావతి జేఏసీ అధ్వర్యంలో అఖిలపక్ష భేటీ జరిగింది. టీటీడీ, కాంగ్రెస్, జనసేన, వామపక్షాల, ప్రజా సంఘాల నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. మహాపాదయాత్ర ముగింపు సభకు పోలీసులు అనుమతివ్వడం లేదని ఆయన అన్నారు. -- శ్రీవారు కొలువై ఉన్న తిరుమల కొండకు మూడో ఘాట్ రోడ్డును నిర్మిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టీటీడీ పాలకమండలిర్ణయాలను ఆయన వెల్లడించారు. అన్నమయ్య నడిచొచ్చిన మార్గాన్ని భక్తులకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. జనవరి 13న వైకుంఠ ఏకాదశి దృష్ట్యా 10 రోజులపాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు ----- కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి రైతులు ఆందోళన చేశారు. పంటకు తగిన మద్దతు ధర లేకపోవడంతో ఉల్లిపై పెట్రోల్ పోసి రైతులు నిప్పంటించారు. గిట్టుబాటు ధర కల్పిచటంలో ప్రభుత్వం విఫలమైందంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం ఉల్లిపై స్పందించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్‌ చేశారు.  ---- అమరుల స్థూపం కట్టడానికి తెలంగాణ వాళ్లుపనికి రారా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.  అమరుల స్థూపం కట్టడానికి కూడా పొద్దుటూరు వాళ్లకు కాంట్రాక్ట్  ఇచ్చారన్నారు. ఆంధ్రా కాంట్రాక్టర్ కు ఇచ్చి అమరుల గుండెల్లో గుణపాలు దించారన్నారు.  అయినా అధికార పార్టీ ధనదాహం తీరడం లేదన్నారు. కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్ల కోసమే అమరుల  స్థూపం నిర్మాణం ఆంధ్రావాళ్లకు ఇచ్చారన్నారు --- రైతుల ఉసురు తగిలి టీఆర్ఎస్‌ ప్రభుత్వం కూలిపోతదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో మోతబారి రైతునని చెప్పుకునే సీఎం కేసీఆర్ రైతులు చనిపోతుంటే ఎందుకు స్పందించడం లేదన్నారు. రైతులను సీఎం కేసీఆర్‌ మోసం చేస్తున్నారని ఆరోపించారు. మెదక్ జిల్లా హవేళిఘనపూర్ మండలం బోగడ భూపతిపూర్ ఆత్మహత్య చేసుకున్న రైతు రవి కుటుంబాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల, రఘునందన్‌రావు,  పరామర్శించారు. -- ఆత్మహత్య చేసుకున్న రైతు రవి కుటుంబానికి న్యాయం చేయాలంటూ వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆమెను అదుపులోకి తీసుకుని బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. ఆమెతో పాటు పార్టీకి చెందిన పలువురు నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు మెదక్ జిల్లా హవేలీ ఘన్ పూర్ మండలం బొగుడ భూపతిపూర్ కు చెందిన రవి ఆత్మహత్య చేసుకున్నాడు.  ---- యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రారంభిస్తున్న ప్రాజెక్టులన్నీ తాము అధికారంలో ఉన్నప్పుడు నిర్మించినవని, పనులు చేసినవని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. బీజేపీకి ప్రకటనలు చేయడం తప్ప పనులు చేయడం రాదని, ప్రాజెక్టుల కంటే ఎక్కువ ఖర్చు ప్రకటనలకే కేటాయించారని ఆయన ఎద్దేవా చేశారు.  ---

జగన్ సర్కార్ కు ఎదురు గాలి.. ఒక్క ఛాన్స్ కథ కంచికే 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయా? ఇంతకాలం ఒక లెక్క ఇప్పుడు ఇంకొక లెక్క అన్నట్లుగా రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణలు తెర మీదకు వస్తున్నాయా, జనంతో జగన్ సర్కార్ర్ హనీమూన్ ముగిసినట్లేనా, అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గడచిన రెండున్నర సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసినా ప్రజలు చాలా వరకు చూసి చూడనట్లు వదిలేశారు. అంతగా పట్టించుకోలేదు.  మరో వంక సంక్షేమ పధకాల మాటున ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తూ వచ్చింది. రాజకీయ ప్రత్యర్ధులపై దాడులు చేస్తూ అణచివేత విధానాలతో ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధంగా రాజ్యాంగ విలువలను దోసి రాజని నియంత పాలన సాగిస్తోంది. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ప్రజలు జగన్ ప్రభుత్వం నిజరూపాన్ని కొంచెం ఆలస్యంగానే అయినా గుర్తించారు. మరో వంక ఆర్థిక  క్రమ శిక్షణను పూర్తిగా గాలికి వదిలేసి, రాష్ట్రాన్ని దేశానికే అప్పుల రాజదానిగా చేసిన ప్రభుత్వం, ఖాళీ ఖజానాను నింపుకునేందుకు జనం మీద మోయలేని భారం మోపుతోంది. ఒక చేత్తో ఇచ్చినట్లే ఇచ్చి రెండు చేతులతో జనం జేబులు ఖాళీ చేస్తోందనే అభిప్రాయం రోజు రోజుకు పెరిగి పోతోంది.  నిజానికి జగన్ రెడ్డి ప్రభుత్వం మొదటి నుంచి కూడా చేస్తున్నది అదే, అయితే,ఇంతకాలం  దొరికిన కాడికి అప్పులు చేసి  ప్రజలకు నొప్పి తెలియకుండా అప్పుల భారం నెత్తికి ఎత్తింది. అలాగే ఆస్తులు అమ్మి, కుదువ పెట్టి, అప్పులు చేసింది. ఈ రెండున్నర ఏళ్లలో జగన్ రెడ్డి మూడున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది.ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి ఒక్కని నెత్తిన రూ. 5 లక్షలకు పైగానే అప్పు ఉందని అంచనా. మరో వంక సుమారు, రూ.70 వేల కోట్లకు పైబడిన ప్రభుత్వ ఆస్తులను కుదవ పెట్టి మరీ అప్పులు తెచ్చిందని అధికార వర్గాల సమాచారం. అలాగని పన్నుల భారం తక్కువ అని కాదు. ప్రస్తుత 2021-22 వార్షిక బడ్జెట్’ లో గతసంవత్సరం కంటే  రూ. 27 వేల 900 కోట్లు అదనపు పన్నులు కలిపి మొత్తం రూ.85,280.53కోట్ల పన్నులను ప్రతిపాదించారు. అదిగాక, ఇప్పుడు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పేరుతో కోట్ల రూపాయల భారం  ప్రజల నెత్తిన మోపుతున్నారు.  ఒక్క ఛాన్స్ అని వేడుకుంటూ ఆధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి, ఇపుడు వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీపీ) ఒకే ఒక్క దెబ్బతో పేదల నడ్డి విరిచేందుకు సిద్ధమయ్యారు. అదే విధంగా బస్సు చార్జీలు, విద్యుత్ చార్జీలు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రభుత్వం అదనపు ఆదాయం సమకూర్చు కుంటోంది. ఇలా ప్రభుత్వం పట్ల ప్రజల్లో మొదలైనవయారి వ్యతిరేకత ఇంతై ఇంతింతై అన్నట్లుగా పెరుగుతోంది. మరో వంక ఇదే సమయంలో తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రాధాన కార్యదర్శి లోకేష్  వివిద కార్యక్రమల ద్వారా జనంలోకి దూసుకు పోతున్నారు. తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తల్లో జోష్ పెరిగింది.  అదలా ఉంటే జనసేన మళ్ళీ మరోమారు తెలుగుదేశంతో దగ్గరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ, విశాఖ ఉక్కు విక్రయాన్ని జనసేన వ్యతిరేకిస్తోది. అంతేకాదు, డిసెంబర్ 12న స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులకు మద్దతుగా జనసేనాని పవన్ కల్యాణ్ అమరావతిలో సంఘీభావ దీక్ష చేపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే బీజేపీ దూరంగా ఉంటున్నారు. ఈ నేపధ్యంలో జనసేనతో పాటుగా  వామపక్ష పార్టీలు కూడా తెలుగు దేశంతో జట్టుకట్టే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు. ఏమైనా ఏపీ రాజకీయాల్లోవస్తున్న మార్పులు వైసీపీ ... ఒక్క ఛాన్స్ సర్కార్’ కథ కంచికి  చేరడం ఖాయమని సూచిస్తున్నాయి. 

అమరవీరుల స్థూపంలోనూ కమీషన్లా? కేటీఆర్ అంతగా దిగజారారా? 

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్ టార్గెట్ గా విపక్షాలు దూకుడు పెంచాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేస్తూ కాక రేపుతున్నారు. ఇటీవలే వందల కోట్ల భూ కుంభకోణంలో కేటీఆర్ కీలకంగా ఉన్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ఆ ఆరోపణలు దుమారం రేపుతుంగానే తాజాగా మరో బాంబ్ పేల్చారు రేవంత్ రెడ్డి. అమరవీరుల స్థూపం నిర్మాణంలోనూ ఆంధ్రా కాంట్రాక్టర్లతో కలిసి కేటీఆర్ వందల కోట్ల రూపాయలు స్వాహా చేశారని ఆరోపించారు.  అమరుల స్థూపం కట్టడానికి తెలంగాణ వాళ్లుపనికి రారా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.  అమరుల స్థూపం కట్టడానికి కూడా పొద్దుటూరు వాళ్లకు కాంట్రాక్ట్  ఇచ్చారన్నారు. ఆంధ్రా కాంట్రాక్టర్ కు ఇచ్చి అమరుల గుండెల్లో గుణపాలు దించారన్నారు.  అయినా అధికార పార్టీ ధనదాహం తీరడం లేదన్నారు. కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్ల కోసమే అమరుల  స్థూపం నిర్మాణం ఆంధ్రావాళ్లకు ఇచ్చారన్నారు. ఈ టెండర్ కేపీసీ ప్రాజెక్ట్ లిమిటెడ్ కు ఇచ్చిందన్నారు. ఈ కంపెనీ  పొద్దుటూరుకు చెందిన వ్యక్తిదేదన్నారు.  6 శాతం కన్సల్టెంట్ ఫీజు ఇస్తుందన్నారు రేవంత్ రెడ్డి. రేకులు, ఇనుముతో కట్టిన నిర్మాణానికి 177 కోట్లకు పెంచారన్నారు.  60 కోట్లతో మొదలైన స్థూపం.. రూ.180 కోట్లకు  పెంచారన్నారు. కేటీఆర్ ను మెప్పించి  వ్యయం పెంచుకున్నాడన్నారు. 300 శాతం బడ్జెట్ పెంచారన్నారు. అమరుల స్థూపం దుస్థితి చూస్తే బాధేస్తుందన్నారు. అసలు కేసీఆర్ తెలంగాణ బిడ్డేనా? డీఎన్ఏ టెస్టు చేయించాలన్నారు. నాలుగేళ్లైనా అమరుల స్థూపం ఎందుకు పూర్తికాలేదో విచారణ కమిటీ వేయాలన్నారు.  కమిటీ వేసి ఆలస్యానికి కారకులైన వారిపై   క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు.  ఆంద్రా కాంట్రాక్టర్ కు ఇవ్వడానికి కారణం ఏంటి? తెలియాలన్నారు. ఈ అవినీతికి  కేటీఆర్, అతని  ఫ్రెండ్ తెలుకుంట శ్రీధరే కారణమన్నారు రేవంత్ రెడ్డి. 

ప‌బ్‌లో న్యూడ్ డాన్స్‌లు!.. టాలీవుడ్‌పై పోలీస్ యాక్ష‌న్‌..

ప‌బ్‌లంటేనే అరాచ‌కానికి కేరాఫ్‌గా మారుతున్నాయి. అర్థ‌రాత్రి దాటినా మందు, మ‌జా న‌డిపిస్తున్నారు. కొన్ని ప‌బ్‌ల‌తో డ్ర‌గ్స్ క‌ల్చ‌ర్ డేంజ‌ర్ బెల్స్ మోగిస్తున్నాయి. పోలీసులంటే భ‌యం లేదు. దాడులు చేసినా బెద‌ర‌డం లేదు. క‌స్ట‌మ‌ర్ల‌ను అట్రాక్ట్ చేసేందుకు.. మ‌రింత దిగ‌జారి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. తాజాగా, హైద‌రాబాద్‌, బేగంపేట‌లోని టాలీవుడ్ ప‌బ్‌పై పోలీసులు స‌డెన్‌గా రైడ్ చేశారు. అక్క‌డి సీన్ చూసి అవాక్క‌య్యారు. ఛీ.. వీరు మార‌రు అంటూ మ‌రోసారి కేసు న‌మోదు చేశారు. ఇంత‌కీ, టాలీవుడ్ ప‌బ్‌లో ఏం జ‌రిగింది?  పోలీసులు వ‌చ్చే స‌మ‌యానికి ఏం జ‌రుగుతోంది? హాఫ్ న్యూడ్ డాన్స్‌లు. అదేదో తిరునాళ్ల‌లో రికార్డింగ్ డ్యాన్సులు కావు. హైద‌రాబాద్ ప‌బ్‌లో అర్థ‌న‌గ్న నృత్యాలు. ప‌బ్ అంటే మందు తాగ‌డం.. డ్యాన్స్ చేయ‌డం కామ‌నే. కానీ, ఇది మ‌రీ రొటీన్ అనుకున్నారో ఏమో.. బాయ్స్ అండ్ గ‌ర్ల్స్‌.. టాప్‌లెస్ డ్యాన్సులు చేస్తున్నారు. క‌స్ట‌మ‌ర్ల‌ అర్థ‌న‌గ్న డ్యాన్సులను ప‌బ్ యాజ‌మాన్యామే ఎంక‌రేజ్ చేస్తోంద‌ని అంటున్నారు. అమ్మాయిల‌కు వెయ్యి రూపాయ‌లు ఇచ్చి.. ఇలా పొట్టి డ్రెస్సుల‌తో.. అస‌భ్య నృత్యాలు చేసేలా డీల్ కుదుర్చుకుంటున్నార‌ని తెలుస్తోంది.  బేగంపేట‌లోని టాలీవుడ్ ప‌బ్‌ను గ‌తంలో లిబ్స‌న్ ప‌బ్ పేరుతో నిర్వ‌హించారు. పోలీసులు ఓ సారి సీజ్ చేశారు. నోటీసులు కూడా ఇచ్చారు. ఇటీవల పబ్‌కు వచ్చిన దంపతులపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు సిబ్బంది దాడికి పాల్పడటంతో లిబ్స‌న్‌ పబ్‌ను అర్‌డీఓ ఆదేశాల మేరకు పంజాగుట్ట పోలీసులు సీజ్ చేశారు. అయినా, ఆ ప‌బ్ తీరు మార‌నే లేదు. లేటెస్ట్‌గా లిబ్స‌న్‌ను టాలీవుడ్ ప‌బ్‌గా పేరు మార్చి మ‌రింత చెల‌రేగిపోయారు. దీంతో అర్థ‌రాత్రి వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు టాలీవుడ్ ప‌బ్‌పై మ‌రోసారి స‌డెన్‌గా దాడి చేశారు. ఇటీవ‌లే కేసు అయింది.. ఇప్ప‌ట్లో మ‌ళ్లీ పోలీసులు రార‌ని అనుకున్నారో ఏమో.. ఆ స‌మ‌యంలో ప‌బ్‌లో ఎంజాయ్‌మెంట్ ఓ రేంజ్‌లో న‌డుస్తోంది.  నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న టాలీవుడ్ పబ్‌లో సమయం దాటిన తరువాత కూడా యువతి యువకులు అర్ధనగ్న డ్యాన్స్‌లు చేస్తున్నారు. ఫుల్‌గా తాగి.. ఫుల్ మైకంలో మునిగి.. టాప్‌లెస్‌గా.. హాఫ్ న్యూడ్‌గా.. డ్యాన్స్‌లు చేస్తున్నారు. ఇలా పబ్‌లో వికృత చేష్టలకు పాల్పడుతున్న 9 మంది యువతులు, 34 మంది యువకులను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాలీవుడ్ ప‌బ్‌పై మ‌రో కేసు న‌మోదు చేశారు.   

డ్వాక్రా మహిళలు ఒళ్లు బరువెక్కి కొట్టుకుంటున్నారు.. వైసీసీ సర్పంచ్ అరాచ‌కం

ఏపీలో మ‌హిళ‌ల‌కు గౌర‌వం లేకుండా పోయింది. ఓవైపు మ‌హిళ‌ల‌పై వ‌రుస దాడులు, అఘాయిత్యాలు జ‌రుగుతుంటే.. మ‌రోవైపు వైసీపీ నేత‌లు మ‌హిళ‌ల‌ను చుల‌క‌న‌గా మాట్లాడుతున్నారు. మ‌హిళ‌ల‌తో కొంద‌రు మంత్రులు, ఎమ్మెల్యేల అస‌భ్య ఫోన్‌కాల్స్ వైర‌ల్ కావ‌డం మ‌రింత దారుణం. ఇక కొడాలి నాని లాంటి వాళ్లైతే.. అమ్మ మొగుడులాంటి బూతులు మాట్లాడ‌టానికి ఏమాత్రం వెన‌కాడ‌రు. వైసీపీ పెద్ద‌ల‌నే ఆద‌ర్శంగా తీసుకున్నారో ఏమో.. తాజాగా ఓ వైసీపీ స‌ర్పంచ్ డ్వాక్రా మ‌హిళ‌ల‌ను ఉద్దేశించి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.  గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండల పరిషత్‌ సమావేశంలో కొత్తమల్లాయపాలెం వైసీసీ సర్పంచ్‌ కుందూరి లక్ష్మారెడ్డి మహిళలపై చేసిన వాఖ్యలు కాంట్ర‌వ‌ర్సీగా మారాయి. ఓ సమావేశానికి హోంమంత్రి సుచరిత వచ్చి వెళ్లిన తర్వాత శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. డ్వాక్రా సంఘాలకు సంబంధించిన వీవోఏల అవినీతి అంశంపై చర్చ జరిగింది. యానిమేటర్లు చేసిన అవినీతి, వారి తొలగింపుపై ఓ అధికారి మాట్లాడుతుండ‌గా.. అలాంటి వారిని ఎందుకు తొలగించడంలేదని కొందరు ప్రశ్నించారు.  స‌ర్పంచ్‌ లక్ష్మారెడ్డి కలగజేసుకుని "మహిళలు ఒళ్లు బరువెక్కి కొట్టుకుంటున్నారు. వారే బ్యాంకులకు వెళ్లి డబ్బు వేయకుండా వీవోఏలకు ఎందుకిస్తున్నారు? వీవోఏలు అవినీతి చేసినా మేం సపోర్టుగా ఉంటాం. మా ఓటు బ్యాంకులు వారైతే.. వారిపై ఎలా చర్యలు తీసుకోగలం" అంటూ మాట్లాడటంతో ఒక్క‌సారిగా అక్క‌డున్న వారంతా అవాక్క‌య్యారు. స‌ర్పంచ్ ల‌క్ష్మారెడ్డి వ్యాఖ్య‌లు వైర‌ల్ కావ‌డంతో.. అంతా ఆయ‌న‌పై మండిప‌డుతున్నారు. డ్వాక్రా మ‌హిళ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మ‌హిళ‌లంటే వైసీపీ నాయ‌కుల‌కు ఏమాత్రం మ‌ర్యాద లేదంటూ తిట్టిపోస్తున్నారు. 

వైఎస్ షర్మిల అరెస్ట్.. నిరాహార దీక్ష భగ్నం 

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ దీక్ష చేస్తున్న వైఎస్సార్ టీపీ నాయకురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా  హవేలిఘనపూర్ మండలం బొగుడు భూపతిపూర్‌లో షర్మిల చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం  చేశారు. షర్మిల సహా నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో వైఎస్సార్ టీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. దాదాపు మూడున్నర గంటల పాటు షర్మిల దీక్ష కొనసాగింది.   హవేలిఘనపూర్ మండలం బొగుడు భూపతిపూర్‌లో వరి సాగు చేయవద్దని చెప్పినందుకు రైతు రవి ఆత్మహత్య చేసుకున్నారు. తన ఆవేదనను చెబుతూ సీఎం కేసీఆర్ కు లేఖ రాసి సూసైడ్ చేసుకున్నాడు రవి. ఈ ఘటన తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. రవి కుటుంబాన్ని పరామర్శించేందుకు బొగుడు భూపతిపూర్‌ వెళ్లింది వైఎస్ షర్మిల. రైతు కుటుంబ సభ్యులను ఓదార్చింది. తర్వాత రైతు రవికుమార్‌ కుటుంబానికి న్యాయం చేయాలంటూ అక్కడే దీక్షకు దిగారు షర్మిల. ప్రభుత్వ తీరుతో  రైతు రవికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని, ప్రభుత్వం స్పందించే వరకు నిరాహార దీక్ష చేపడుతానని ఆమె  స్పష్టం చేశారు.  ఆత్మహత్య చేసుకున్న రైతు రవి కుటుంబానికి ప్రభుత్వం రూ. కోటి పరిహారం ఇవ్వాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. పరిహారం ఇచ్చేవరకూ దీక్ష కొనసాగుతుందన్నారు. అప్పటి దాకా ఇక్కడి నుంచి కదిలేది లేదన్నారు. స్వయంగా సీఎం పేరు చెప్పి రైతు రవి ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. రైతులకు సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పి, సీఎం పదవికి రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. 

జై భీమ్ తో జగన్ రెడ్డి మాట్లాడించారా? 

న్యాయ స్థానాలు, ఏపీ హైకోర్టును ఉద్దేశించి  జై భీమ్ ఫేమ్, మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆయన కామెంట్లపై న్యాయ వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎవరినో కావాలనే టార్గెట్ చేసినట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయనే చర్చ సాగుతోంది. కోర్టులపై జస్టిస్ చంద్రు వ్యాఖ్యలను నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఖండించారు. జస్టిస్ చంద్రు వ్యాఖ్యలు చాలా బాధాకరమన్నారు. జస్టిస్ చంద్రు వ్యాఖ్యలు అవగాహన రాహిత్యంగా ఉన్నాయని ఎంపీ రఘురామ అన్నారు. జగన్ సర్కార్ తీసుకునే ప్రజావ్యతిరేక విధానాలపై జస్టిస్ చంద్రు నిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవుపలికారు. జస్టిస్ చంద్రుతో న్యాయస్థానాలకు వ్యతిరేకంగా జగన్ మాట్లాడించినట్లు ఉందన్నారు. ప్రజావ్యతిరేక నిర్ణయాలు కోర్టుల్లో నిలబడవన్న సంగతి జస్టిస్ చంద్రుకు ఎందుకు అర్థం కావడం లేదని ఎంపీ రఘురామ అన్నారు. జస్టిస్ చంద్రు ఏమన్నారంటే..  పౌర హక్కుల అమలు, సామాజిక న్యాయం, జై భీమ్ సినిమాపై విశ్లేషణ అనే అంశంపై విజయవాడ జరిగిన సదస్సుకు ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు జస్టిస్ చంద్రు. ఆ సందర్భంగా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఏపి హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరిస్తోందని అన్నారు.  ఏపిలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఉనికిని కాపాడుకోవడం కోసం ప్రయత్నిసతోందనీ, శతృవులు, ప్రత్యర్ధులతో కాదు న్యాయ వ్యవస్థతో యుద్ధం చేస్తోందన్నారు. అమరావతి భూ కుంభకోణంలో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే హైకోర్టు స్టే ఇచ్చిందన్నారు. కోర్టులు న్యాయం చేయాల్సిందిపోయి ఏదో చేయడానికి ప్రయత్నిస్తోందని జస్టిస్ చంద్రు అన్నారు. రాజధాని పిటిషన్ లకు సంబంధించి బెంచ్ లో ఇద్దరు న్యాయమూర్తులకు అమరావతిలో భూములు కేటాయించారు వారిని తప్పించాలని ప్రభుత్వం కోరితే ధర్మాసనం అంగీకరించలేదన్నారు. ఇక కేసు విచారణ జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఆ బిల్లులను వెనక్కి తీసుకుందన్నారు. ఇలాంటి జడ్జిలు న్యాయ వ్యవస్థలో ఉన్నంత కాలం తమకు న్యాయం జరగదని ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం తీసుకునట్లు ఉందన్నారు జస్టిస్ చంద్రు. సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై వచ్చిన పోస్టుల వ్యవహారాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుని, ఎఫ్ఐఆర్ నమోదు చేయించి సీబీఐకి అప్పగించిందన్నారు జస్టిస్ చంద్రు. నలుగురుని అరెస్టు చేసిన సిబీఐ మరో ఇద్దరిని అరెస్టు చేయడానికి విదేశాలకు వెళ్తున్నారని సోషల్ మీడియాలో చూస్తున్నామన్నారు. కోర్టు తీర్పులను సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు సీబీఐ కేసులు పెట్టి అరెస్టు చేయడం దారుణమన్నారు. ప్రభుత్వంలో ఏదైనా వ్యవస్థ కౌంటర్ ఫైల్ చేయకపోతే వాళ్లకి జరిమానా విధించవచ్చనీ, మొన్న సుప్రీం కోర్టు తమిళనాడు ప్రభుత్వానికి కౌంటర్ వేయకపోతే లక్ష రూపాయల జరిమానా విధించిందని జస్టిస్ చంద్రు గుర్తు చేశారు. 

'అఖండ'కు చంద్ర‌బాబు రివ్యూ.. త‌న‌దైన స్టైల్‌లో రేటింగ్‌..

'అఖండ'. బాల‌కృష్ణ న‌ట విశ్వ‌రూపానికి ప్ర‌తీక‌. రికార్డు క‌లెక్ష‌న్ల‌తో బాక్సులు బ‌ద్ద‌ల‌వుతున్నాయి. బాల‌య్య యాక్టింగ్‌.. యాక్ష‌న్.. అదుర్స్ అనిపిస్తున్నాయి. ఇక‌, అఘోరాగా న‌ట‌సింహం గాండ్రింపు వెండితెర‌పై చూసి తీరాల్సిందే. మ్యూజిక్ మ‌రో లెవ‌ల్‌లో ఉంది. అందుకే, ప‌ది రోజులుగా పూన‌కంతో ఊగిపోతున్నారు బాల‌య్య ఫ్యాన్స్‌. హిందూ సంస్థ‌ల‌న్నీ 'అఖండ'ను భుజాల‌పై మోస్తున్నాయి. ఆ హిట్ టాక్‌తో ముగ్థుడైన చంద్ర‌బాబు.. అఖండ మూవీ చూడ‌కుండా ఉండ‌లేక పోయారు. నిత్యం రాజ‌కీయ కార్య‌క‌లాపాల‌తో ఫుల్ బిజీగా ఉండ‌టం.. సినిమాలు చూసే అల‌వాటు పెద్ద‌గా లేక‌పోవ‌డంతో చంద్ర‌బాబు అత్యంత అరుదుగా మాత్ర‌మే సినిమాలు చూస్తారు. తాజాగా, వియ్యంకుడి సినిమాను చూశారు. బావ‌మ‌రిది మూవీకి త‌న‌దైన స్టైల్‌లో రివ్యూ ఇచ్చారు. ఇంత‌కీ అఖండ‌పై చంద్ర‌బాబు అభిప్రాయం ఏంటంటే.....  నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీగా వచ్చి హిట్ టాక్ తెచ్చుకున్న ‘అఖండ’ మూవీని తాను చూసినట్టు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ‘అఖండ’ సినిమాలో చూపించారని చంద్రబాబు అన్నారు. ఏపీలో ప్రస్తుతం ఏం జరుగుతోందో దాన్ని ‘అఖండ’ సినిమాలో చూపించారని, సినిమా చాలా బాగుందని చంద్రబాబు ప్రశంసించారు. ఆల‌యాల‌పై దాడులు, పేకాట ఆడ‌టం.. లాంటి సీన్స్ అఖండ సినిమాలో ఉంటాయి. రెండేళ్లుగా ఏపీలోనూ ప‌లు ఆల‌యాల‌పై దాడులు జ‌ర‌గ‌డం.. ఆ కేసుల్లో ఇప్ప‌టికీ నిందితుల‌ను ప‌ట్టుకోలేక‌పోవ‌డం.. రాష్ట్రంలో పేకాట శిబిరాలు విచ్చ‌ల‌విడిగా న‌డుస్తుండ‌టం.. ఇలా రాష్ట్ర ప‌రిస్థితులు.. అఖండ మూవీ సీన్లను పోలుస్తూ చంద్ర‌బాబు మాట్లాడారు. సినిమాలో మాదిరే బాల‌కృష్ణ రాజ‌కీయాల్లోనూ అఘోరాగా మారి.. చెడును చీల్చి చెండాడాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

ఈటలతో బండి సంజయ్ వైరమా? ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు అందుకే  వేయలేదా? 

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు విభేదాలున్నాయా? పార్టీలో ఇద్దరి మధ్య ఆదిపత్య పోరు సాగుతుందా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలతో బీజేపీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ అవుననే సమాధానమే వస్తోంది. బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య గ్యాప్ వచ్చిందని కొంత కాలంగా ప్రచారం జరుగుతుండగా.. శుక్రవారం జరిగిన శాసనమండలి ఎమ్మెల్సీ ఎన్నికలతో ఈ అనుమానం మరింత బలపడింది. అధికార పార్టీకి అత్యంత సవాల్ గా నిలిచిన స్థానిక కోటా కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బండి సంజయ్ తన ఓటు హక్కు వినియోగించుకోకపోవడం చర్చగా మారింది.  ఐదు జిల్లాల పరిధిలోని ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరిగింది. ఐదు జిల్లాల్లో ఎన్నికలు జరిగినా.. కరీంనగర్ లో మాత్రమే హోరాహోరీ పోరు సాగింది. మెదక్, నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్ లో విపక్షాల నుంచి పోటీ లేకపోవడంతో అక్కడ అధికార పార్టీ గెలుపుపై ఎవరికి అనుమానాలు లేవు. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో జరిగిన రెండు స్థానాల ఎన్నిక మాత్రం హాట్ హాట్ గా సాగింది. టీఆర్ఎస్ రెబెల్, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి టీఆర్ఎస్ కు చెమటలు పట్టించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ డైరెక్షన్ లోనే రవీందర్ సింగ్ పోటీ చేశారు. సింగ్ గెలుపు కోసం ఈటల తెరవెనుక పెద్ద ఎత్తున కసరత్తు చేశారని తెలుస్తోంది. రవీందర్ సింగ్ విజయం ఖాయమని బహిరంగంగానే ప్రకటించారు ఈటల రాజేందర్. దీంతో రవీందర్ సింగ్ కోసం ఈటల పెద్ద ఎత్తున ఖర్చు కూడా చేశారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకుండా వాళ్ల మద్దతు రవీందర్ సింగ్ కు దక్కేలా ఈటల స్కెచ్ వేశారు. అందుకే కాంగ్రెస్ స్థానిక ప్రజా ప్రతినిధులంతా రవీందర్ సింగ్ కు మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్ నిర్వహించిన క్యాంపులు కూడా రాజేందర్ అరేంజ్ చేశారని అంటున్నారు. టీఆర్ఎస్ ఓటర్లు కూడా కొంత మంది ఈటల రాజేందర్ తో టచ్ లో ఉన్నారని, వాళ్లంతా రవీందర్ సింగ్ కే ఓటేశారని చెబుతున్నారు. ముఖ్యంగా హుజురాబాద్, మానకొండురూ,  చొప్పదండి, హుస్నాబాద్ నియోజకవర్గాల్లోని టీఆర్ఎస్ స్థానిక ప్రజా ప్రతినిధులు.. అధికార పార్టీ క్యాంపులోనే ఉన్నా.. ఓటింగ్ రోజున మాత్రం రవీందర్ సింగ్ కు జై కొట్టారనే ప్రచారం జరుగుతోంది. అందుకే పోలింగ్ ముగియగానే రవీందర్ సింగ్ సంబరాలు చేసుకున్నారని చెబుతున్నారు.  ఇంత హోరాహోరీగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా ఉన్న ఓటు హక్కు ఉన్న బండి సంజయ్ ఓటేయకపోవడం హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ కు షాకివ్వాలని ఈటల రాజేందర్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తే.. బీజేపీ అధ్యక్షుడిగా ఉండి ఓటు వేయకపోవడం ఏంటనే చర్చ సాగుతోంది. కరీంనగర్ పరిధిలో మొత్తం 1324 మంది ఓటర్లు ఉండగా.. 1320 మంది ఓటేశారు. కొందరు సభ్యులు అనారోగ్యంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయినా.. స్ట్రెచర్ పై తీసుకొచ్చి ఓట్లు వేయించింది అధికార పార్టీ. ఓటేయని నలుగురిలో బండి సంజయ్ ఒకరు. మరో ఇద్దరు చనిపోయారు. టీఆర్ఎస్ కు రవీందర్ సింగ్ గట్టి పోటీ ఇచ్చారని తెలిసి, ప్రతి ఓటు కీలకమని తెలిసి కూడా బండి సంజయ్ ఓటేయకపోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అయితే సంజయ్ ఓటింగ్ కు రాకపోవడం వెనుక పెద్ద కథే ఉందంటున్నారు.  రవీందర్ సింగ్ .. ఈటల రాజేందర్ మనిషని అందరికి తెలుసు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని బీజేపీ నిర్ణయించినా.. అందుకు భిన్నంగా రవీందర్ సింగ్ ను ఈటల బరిలో దింపారని అంటున్నారు. ఇప్పటికే హుజురాబాద్ లో గెలుపుతో రాజేందర్ గ్రాఫ్ బాగా పెరిగిపోయింది. బీజేపీలో ఆయనో పవర్ సెంటర్ గా మారారనే చర్చ ఉంది. ఈటల జిల్లాలు కూడా తిరుగుతున్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా ఘన స్వాగతం లభిస్తుంది. ఈ సమయంలో ఎమ్మెల్సీగా రవీందర్ సింగ్ గెలిస్తే.. ఆ క్రేడిట్ అంతా రాజేందర్ కు వెళుతుందని సంజయ్ భావించారని అంటున్నారు. అదే జరిగితే పార్టీలో ఈటల పట్టు మరింత పెరుగుతుందని సంజయ్ భయపడ్డారని, అందుకే రవీందర్ సింగ్ గెలవాలని ఆయన కోరుకోలేదనే చర్చ కరీంనగర్ జిల్లాతో పాటు బీజేపీ వర్గాల్లోనూ సాగుతోంది. రవీందర్ సింగ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయలేదు కాబట్టి.. ఓటు వేయకపోయినా ఎవరూ ప్రశ్నించడానికి ఉండదనే సంజయ్ అలా చేశారంటున్నారు. మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన పరిణామాలతో బీజేపీలో బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య విభేదాలు తీవ్రంగానే ఉన్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి. 

లక్ష్మీనారాయణపై ఏంటా కేసు? ఆయ‌నే ఎందుకు టార్గెట్?

70 ఏళ్ల పైబ‌డిన రిటైర్డ్ ఐఏఎస్ ల‌క్ష్మీనారాయ‌ణ‌. ఉన్న‌తాధికారిగా సుదీర్ఘ అనుభ‌వం. గ‌తంలో చంద్ర‌బాబుకు ఓఎస్డీ. ఆయ‌న‌కు స‌న్నిహితుడు కూడా. ఇదే కార‌ణ‌మే ఏమో.. హైద‌రాబాద్‌లోని ల‌క్ష్మీనారాయ‌ణ ఇంటిపై ఏపీ సీఐడీ అధికారులు స‌డెన్‌గా దాడి చేయ‌డం.. ఓవ‌రాక్ష‌న్ చేయ‌డం.. ఓ మీడియా అధినేత హుటాహుటిన త‌ర‌లిరావ‌డం.. ఇలా హాట్‌హాట్‌గా సాగిందా ఎపిసోడ్‌. సీఐడీ విచార‌ణ‌లో ల‌క్ష్మీనారాయ‌ణ సొమ్మ‌సిల్లిప‌డిపోయేంత‌లా సీఐడీ విచార‌ణ సాగింది. ఇంత‌కీ, ఉన్న‌ట్టుండి రిటైర్డ్ ఐఏఎస్ ల‌క్ష్మీనారాయ‌ణ ఎందుకు ఏపీ సీఐడీకి టార్గెట్ అయ్యారు? ఆయ‌న‌పై పెట్టిన కేసు ఏంటి? అందులో ఈయ‌న రోల్ ఏంటి? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.  చంద్ర‌బాబు ప్రభుత్వ హయాంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ అమలు చేసిన ‘సీమెన్స్‌ ప్రాజెక్టు’ పర్యవేక్షణకు నియమించిన అనేక మంది కమిటీ సభ్యుల్లో రిటైర్డ్ ఐఏఎస్ ల‌క్ష్మీనారాయ‌ణ‌ ఒకరు. నామినేటెడ్‌ డైరెక్టర్‌.  సీమెన్స్‌ ప్రాజెక్టులో అవ‌క‌త‌వ‌క‌లు, అక్ర‌మాలు జ‌రిగాయ‌నేది సీఐడీ అనుమానం. నిజంగానే ఏదైనా తేడా జ‌రిగుంటే.. ప్రాజెక్ట్‌ సీఈవోనో, ఎండీనో ప్రశ్నించాలి. క‌మిటీ స‌భ్యుడు లక్ష్మీనారాయణపై కేసు పెట్ట‌డ‌మే సీఐడీ తీరు అనుమానాస్ప‌దంగా మారింది.  ఎవరిని ఇరికించాలి? ఎవరిపైన ఎలా కేసులు పెట్టాలి? అనేదే లక్ష్యంగా జగన్ అండ్ బ్యాచ్‌.. గత టీడీపీ ప్రభుత్వ కార్యకలాపాల్లో లూప్‌పోల్స్ వెతుకుతోందని అంటారు. అందులో భాగంగా.. నైపుణ్యాభివృద్ధి సంస్థకు-సీమెన్స్‌కు మధ్య జరిగిన ఒప్పందంలో అవకతవకలు జరిగాయంటూ కొన్నాళ్ల కిందట నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ఉన్న చల్లా మధుసూదన్‌ రెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులోనూ లక్ష్మీనారాయణ పేరు లేదు. అనూహ్యంగా.. శుక్రవారం నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్‌ అజయ్‌రెడ్డి మరో ఫిర్యాదు చేశారు. వెంట‌నే సీఐడీ రంగంలోకి దిగింది. ఎఫ్‌ఐఆర్‌లో రెండో నిందితుడిగా లక్ష్మీనారాయణ పేరు చేర్చింది. ఇంటిపై దాడి చేసింది. ఆయ‌న ఆసుప‌త్రి పాలు కావ‌డానికి కార‌ణ‌మైంది.  అస‌లు ఏంటీ సీమెన్స్ ప్రాజెక్ట్?  ఏపీలో యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, ఉద్యోగావకాశాలు పెంపొందించేందుకు గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ‘సీమెన్స్‌’ ప్రాజెక్టు రూపొందించింది. ఈ ప్రాజెక్టును సీమెన్స్‌ కంపెనీ తొలుత గుజరాత్‌లో అమలు చేసింది. అక్కడ మంచి ఫలితాలు రావడంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆ సంస్థను ఏపీకి ఆహ్వానించింది. సీమెన్స్‌-డిజైన్‌టెక్‌ సంస్థలు కలిసి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. నైపుణ్యాభివద్ధి కోసం ఒక సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను నెలకొల్పడం. దానికింద ఐదు టెక్నికల్‌ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేంద్రాలు (టీఎస్‌డీఐ) ఏర్పాటుచేయడం ప్రాజెక్టు ల‌క్ష్యం. ఐదు టీఎస్‌డీఐల ఏర్పాటుకు అయ్యే ఖర్చు 546 కోట్లు. అందులో 90శాతం, అంటే రూ.491కోట్లు సీమెన్స్‌-డిజైన్‌టెక్‌లు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌గా ఇచ్చాయి. 10శాతం నిధులు.. అంటే రూ.55 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖ‌ర్చు చేసింది. మొత్తం ఆరు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి.. వాటి పరిధిలో 34 టీఎస్‌డీఐ కేంద్రాలు నెల‌కొల్పారు. సీమెన్స్‌ ప్రాజెక్టులో భాగంగా 2020 మార్చి నాటికి ఏపీలో మొత్తం 2,11,984 మందికి శిక్షణ ఇచ్చారు.