హెలికాప్టర్ ప్రమాదంలో బతికింది ఇతనొక్కడే.. 

తమిళనాడులో జరిగిన సైనిక హెలికాఫ్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ కన్నుమూశారు. ఊటీ సమీపంలో  ఈ మధ్యాహ్నం ఘోర ప్రమాదం సంభవించింది. భారత సైన్యానికి చెందిన ఓ ఆర్మీ హెలికాప్టర్ సాంకేతిక కారణాలతో కూనూరులో కుప్పకూలింది. విల్లింగ్టన్ ఆర్మీ కేంద్రం నుంచి బయల్దేరిన ఎంఐ సిరీస్ హెలికాప్టర్ బయల్దేరిన కాసేపటికే కూలిపోయింది. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ బిపిన్ రావత్, ఆర్మీ అధికారులు, రావత్ కుటుంబ సభ్యులు సహా  మొత్తం 14 మంది ప్రయాణించారు. ఇందులో 13 మంది స్పాట్ లోనే చనిపోయారు. చనిపోయిన వారిలో జనరల్‌ బిపిన్‌ రావత్‌ భార్య మధులిక రావత్‌, బ్రిగేడియర్‌ ఎల్‌ఎస్‌ లిద్ధర్‌, లెఫ్టినెంట్‌ కల్నల్‌ హర్జిందర్‌ సింగ్‌, నాయక్‌ గురుసేవక్‌ సింగ్‌, నాయక్‌ జితేంద్ర కుమార్‌, లాన్స్‌నాయక్‌ వివేక్‌ కుమార్‌, లాన్స్‌నాయక్‌ బి. సాయితేజ, హవల్దార్‌ సత్పాల్ ఉన్నారు.   తమిళనాడులో కూలిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న ఒకరు మాత్రమే బతికి బయటపడ్డారు.  ప్రమాదంలో గాయపడిన అతను వెల్లింగ్టన్ మిలటరీ ఆస్పత్రిలో ఒకరు చికిత్స పొందుతున్నారు. అయితే ఆ వ్యక్తి ఎవరనే విషయంపై ఇప్పటికీ ఓ క్లారిటీ వచ్చింది. వెల్లింగ్టన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ అని తేల్చారు. హెలికాప్టర్ క్రాష్ ఘటనలో సజీవంగా నిలిచిన ఒకే ఒక్కడుగా కెప్టెన్ వరుణ్ సింగ్ నిలిచాడు. 

దేశంలో వైమానిక ప్రమాదంలో చనిపోయిన ప్రముఖులు వీళ్లే...

తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ దుర్మరణం చెందారు. బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్  Mi-17 V5 కూనురు సమీపంలో క్రాష్ అయింది. వెల్లింగ్టన్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ క్రాష్ కావడంతో సీడీఎస్ బిపిన్ రావత్ సహా.. అందులో ప్రయాణిస్తున్న మొత్తం 14 మంది చనిపోయారు. బిపిన్ రావత్ ప్రయాణించిన Mi-17 V5హెలికాప్టర్ భారత వైమానిక దళానికి చెందినది. ఇది రష్యాలో తయారైంది. వీటిని ప్రధానంగా సైనిక రవాణా కోసం వినియోగిస్తారు. Mi-17 V5 హెలికాప్టర్‌కు రెండు ఇంజన్లు ఉంటాయి. ప్రపంచంలోని అధునాతన రవాణా హెలికాప్టర్లలో ఇది ఒకటి. అందుకే సైనిక దళాలను, ఆయుధాలను మోసుకెళ్లడంతోపాటు, అగ్నిమాపక సిబ్బంది తరలింపు, పెట్రోలింగ్, సెర్చ్ ఆపరేషన్స్, రెస్క్యూ కార్యకలాపాల కోసం దీన్ని ఉపయోగిస్తుంటారు.సముద్రాలు, ఎడారి ప్రాంతాలలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించేలా ఈ హెలికాప్టర్‌ను రూపొందించారు.భారత వైమానిక దళం దీనిని వీఐపీ చాపర్‌గా ఉపయోగిస్తుండగా, భారత ప్రభుత్వం వీవీఐపీ చాపర్‌గా వినియోగిస్తుంటుంది. ఎయిర్ స్ట్రిప్ లేని ప్రదేశాలకు ఈ హెలికాప్టర్‌లో వీవీఐపీలను తీసుకెళ్తూ ఉంటారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఈ హెలికాప్టర్ ద్వారా లద్ధాఖ్, కేదార్‌నాథ్ వంటి ప్రాంతాలకు వెళ్లారు. రక్షణ మంత్రి వంటి వీవీఐపీలు ఈ హెలికాప్టర్‌లో మారుమూల ప్రాంతాలకు వెళుతుంటారు.అయితే కొన్నేళ్లుగా ఈ హెలికాప్టర్లు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. భారతదేశంలో జరిగిన విమాన, హెలికాప్టర్‌ ప్రమాదాల్లో పలువురు ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు.  సంజయ్ గాంధీ: హెలికాప్టర్ ప్రమాదంలో  జూన్ 23, 1980న సంజయ్ గాంధీ చనిపోయారు. సంజయ్ గాంధీ నడుపుతున్న విమానం ఢిల్లీలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మరణించారు.ఈ ప్రమాదం అత్యంత వివాదాస్పదం కావడంతోపాటు, చర్చనీయాంశంగా కూడా మారింది. మాధవరావు సింధియా: సెప్టెంబరు 2001న ఉత్తర్‌ప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లా భోగావ్ తహసీల్ సమీపంలో మోటా వద్ద జరిగిన విమాన ప్రమాదంలో కాంగ్రెస్ నాయకుడు మాధవరావు సింధియా మరణించారు. ఒక సభలో పాల్గొనేందుకు జిందాల్ గ్రూప్‌కు చెందిన 10 సీట్ల చార్టర్డ్ విమానంలో కాన్పూర్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానం కూలిపోవడంతో అందులో ఉన్న ఆరుగురు చనిపోయారు.   జీఎంసీ బాలయోగి: 2002 మార్చి3న  ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో బెల్ 206 హెలికాప్టర్ కూలిపోవడంతో లోక్‌సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి మరణించారు.బెల్ 206 అనేది ఒక ప్రైవేట్ హెలికాప్టర్. అందులో బాలయోగి, ఆయన సెక్యురిటీ గార్డ్, ఒక సహాయకుడు ఉన్నారు. హెలికాప్టర్‌ కూలిపోవడానికి సాంకేతిక లోపమే కారణమని గుర్తించారు.  ఓపీ జిందాల్ : 2005 ఏప్రిల్ లో సుప్రసిద్ధ ఉక్కు వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు ఓపీ జిందాల్ విమాన ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదంలో హరియాణా మాజీ ముఖ్యమంత్రి బన్సీలాల్ కుమారుడు సురీందర్ సింగ్, పైలట్ కూడా మరణించారు. చండీగఢ్ నుంచి ఢిల్లీకి వస్తుండగా ఈ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. మరణించేనాటికి ఓపీ జిందాల్ హరియాణ విద్యుత్ శాఖమంత్రిగా పని చేస్తున్నారు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి : 2009 సెప్టెంబర్ 2 హెలికాప్టర్ కూలిన ఘటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి  మరణించారు. 2009 సెప్టెంబర్‌లో నల్లమల అటవీ ప్రాంతం మీదుగా ప్రయాణిస్తున్న ఆయన హెలికాప్టర్ కూలిపోయింది.ఈ ప్రమాదంలో ఆయనతోపాటు మరో నలుగురు మరణించారు. మొదట హెలికాప్టర్ కనిపించకుండా పోయిందని ప్రకటించారు. తర్వాత కూలిపోయినట్లు నిర్ధారించారు.సైన్యం సహాయంతో అటవీ ప్రాంతంలో హెలికాప్టర్‌ శకలాలను గుర్తించారు. కర్నూలుకు 74 కిలోమీటర్ల దూరంలోని రుద్రకొండ కొండపై హెలికాప్టర్ శకలాలు లభ్యమయ్యాయి. దోర్జీ ఖండూ: ఏప్రిల్ 2011లో జరిగిన  హెలికాప్టర్ ప్రమాదంలో అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దోర్జీ ఖండూ  మరణించారు. ఖండూ నాలుగు సీట్ల సింగిల్ ఇంజన్ పవన్ హన్స్ హెలికాప్టర్ AS-B350-B3లో ప్రయాణించారు. తవాంగ్ నుంచి బయలుదేరిన 20 నిమిషాలకే ఆయన హెలికాప్టర్ అదృశ్యమైంది. నాలుగు రోజుల పాటు హెలికాప్టర్ ఆచూకీ దొరకలేదు. అయిదవ రోజున సెర్చ్ టీమ్‌లు హెలికాప్టర్ శకలాలు, అయిదుగురి మృతదేహాలను కనుగొన్నాయి.  

రావత్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు వాసి..హెలికాప్టర్ ప్రమాదంలో సాయితేజ మృతి 

భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ బిపిన్ రావత్ హెలికాప్టర్ కూలిపోయిన ప్రమాదంలో చనిపోయారు. రావత్ తో పాటు ఆర్మీ హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్న మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ వాసి కూడా మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో చిత్తూరు జిల్లాకు చెందిన బి.సాయితేజ అనే లాన్స్ నాయక్ కూడా ఉన్నారు. సాయితేజ స్వస్థలం చిత్తూరు జిల్లా కురబల కోట మండలం ఎగువ రేగడ గ్రామం. ఆయన 2013లో సైన్యంలో చేరారు. సైన్యంలో లాన్స్ నాయక్ ర్యాంకుకు ఎదిగిన సాయితేజ ప్రస్తుతం బిపిన్ రావత్ కు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా కొనసాగుతున్నారు. రావత్ వెంట ఆయన కూడా హెలికాప్టర్ ఎక్కి ప్రమాదానికి గురయ్యారు. సాయి తేజ సోదరుకు కూడా ఆర్మీలోనే ఉన్నారు. ఆయన ప్రస్తుతం సిక్కింలో విధులు నిర్వహిస్తున్నారు. సాయితేజ మరణ వార్తను అతని సోదరుడు తల్లిదండ్రులకు చెప్పినట్లు తెలుస్తోంది.  లాన్స్ నాయక్ సాయితేజ మృతితో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సాయితేజకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత సెప్టెంబరులో వినాయకచవితి సందర్భంగా ఆయన చివరిసారి స్వగ్రామానికి వచ్చినట్టు బంధువులు వెల్లడించారు. జనరల్ బిపిన్ రావత్ తో కలిసి ఢిల్లీ నుంచి వెల్లింగ్టన్ వెళ్లడానికి ముందు సాయి తేడ భార్యకు ఫోన్ చేసి మాట్లాడారని చెబుతున్నారు. 

విశాఖ రైల్వే జోన్ కుదరదట.. జగన్ కు కేంద్రం మరో షాక్ 

ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అనే చేదు కబురు మరో మారు చెప్పింది. ప్రస్తుత వర్షాకాల సమావేశాల ఆరంభంలోనే తెలుగు దేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో చావు కబురు చల్లగా చెప్పారు. అయినా హోదా తెస్తామని హామీ ఇచ్చిఅధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నోరు విప్పలేదు. వైసీపీ ఎంపీలు 22 మందిలో ఏ ఒక్కరూ ఇదేమిటని కేంద్రాన్ని ప్రశ్నించలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయం అయితే చెప్పనే అక్కరలేదు, ఆయన ముందుగానే కాడి వదిలేశారు. కాదంటే, కాసింత గట్టిగా అడిగితే కేంద్రం ఎక్కడ కన్నేర్ర చేస్తుందో, సీబీఐ, ఈడీలు ఎక్కడ ఉచ్చు బిగిస్తాయో అనే భయంతో కావచ్చును కేంద్రం దయ మన ప్రాప్తం అనే వేదాంత ధోరణిలోకి వెళ్లి పోయారు.  ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరోసారి మొండిచేయి చూపింది. ముగిసిన హామీల హామీల జాబితాలలో విశాఖ రైల్వే జోన్ కూడా చేరింది. విశాఖ  రైల్వేజోన్ హామీకి కూడా  కేంద్రం తిలోదకాలు ఇచ్చింది. విశాఖ కేంద్రంగా  రైల్వేజోన్‌పై ఇంకా ఎవరికైనా ఆశలు ఉంటే ఆ ఆశల మీద కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ నీళ్ళు కుమ్మరించారు. ప్రత్యేక హోదా విషయంలో ఎలాగైతే 14 ఆర్థిక సంఘం సిఫార్సులను అడ్డు పెట్టుకుని,కేంద్రం ఇక దేశంలో ఏ రాష్ట్రానికి హోదా ఇచ్చేది లేదని తప్పించుకుందో, అదే విధంగా విశాఖ రైల్వే జోన్ విషయంలోనూ దేశంలో ఇక కొత్త రైల్వే జోన్‌లను ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని తేల్చిచెప్పింది. బీజేపీ ఎంపీ అజయ్‌నిషాద్ ప్రశ్నకు కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ జవాబిచ్చారు. దేశంలో ప్రస్తుతం 17 రైల్వేజోన్లు ఉన్నాయని కేంద్రమంత్రి వెల్లడించారు. విశాఖ రైల్వేజోన్ అంశాన్ని అశ్వనీ వైష్ణవ్ ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్ మేరకు.. మరిన్ని జోన్‌లను ప్రకటించే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. రైల్వేజోన్ సాధ్యాసాధ్యాలపై గతంలో ఓఎస్‌డీని కేంద్రం నియమించింది. రైల్వేజోన్‌పై కేంద్రానికి ఓఎస్‌డీ నివేదిక ఇచ్చింది. అయితే దీనిపై ఎటూ కేంద్రం తేల్చలేదు.మరో వంక ఆత్మ రక్షణలో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గానీ,రాష్ట్ర ప్రభుత్వం గానీ, పార్లమెంట్ సభ్యులు గానీ కేంద్రం పై వత్తిడి చేయలేదు. జగన్ రెడ్డి ప్రభుత్వం అధిఅక్రంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అయినా ఇంత వరకు  కేంద్రం వద్ద రైల్వే జోన్ ప్రస్తవన చేయలేదని,  అందుకే అందుకే కేంద్రం గత తెలుగు దేశం ప్రభుత్వం చేసిన అభ్యర్ధనలను కూడా అటకెక్కించిందని  రైల్వేశాఖ అధికారులు చెబుతున్నారు.ఇక ఏపీలో రైల్వేజోన్ అయ్యే పని కాదని కూడా రైల్వేశాఖ అధికారులు చెబుతున్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం స్పందించని కారణంగానే విశాఖ రైల్వేజోన్‌ను కేంద్రం పక్కన పెట్టిందని రైల్వేశాఖ అధికారులు విమర్శిస్తున్నారు.

బీజేపీ నేతలకు ఢిల్లీ పిలుపు.. కేసీఆర్ కు కౌంట్ డౌనేనా? 

తెలంగాణ బీజేపీ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. ఉభయ తెలుగు రాష్ట్రాల పార్టీ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా రేపు  గురువారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన పార్టీ  ఎంపీలు, ఎమ్మెల్యేలు,ఇతర కీలక నేతలతో సమావేసమవుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం అవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.  హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓడిపోయినప్పటి  నుంచి రాష్ట్రంలో అధికార తెరాస, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే యుద్దవాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షడు కేసీఆర్ కారాణాలు ఏవైనా వరి వివాదాన్ని అస్త్రంగా చేసుకుని కేంద్రంపై యుద్ధాని ప్రకటించారు.  ఢిల్లీ వెళ్లి వట్టి చేతులతో వచ్చారు. పార్లమెంట్ నుంచి తెరాస ఎంపీలు పలాయనం చిత్తగించారు. మరో వంక బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రి, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై బియ్యం కుంభకోణం,భూకుంభకోణం ఆరోపణలు దట్టించిన అస్త్రాలను సంధించారు. ఒక విధంగా తెరాస నాయకత్వం పరిస్థితి తేలుకుట్టిన దొంగాల ఉందని, అందుకే, తండ్రీకొడుకులు ఇద్దరూ సైలెంట్ అయిపోయారని అంటున్నారు.  ఈ నేపధ్యంలో అది కూడా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నా సమయంలో  కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర బీజేపీ నాయకులతో సమావేసం కావడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుందని అంటున్నారు. ఈ భేటీలో రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా నలుగురు ఎంపీలు, ఇప్పటికీ ఢిల్లీ లో ఉన్నారు. ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్, ఈటల రాజేందర్’తో పాటుగా మరో ముగ్గురు సీనియర్ నాయకులు ఈ రోజు రాత్రికి ఢిల్లీ చేరుతున్నట్లు సమాచారం.అదే విధంగా ఇటీవల పార్టీలో చేరిన తెలంగాణ జేఏసీ మాజీ నేత విఠల్, జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న కూడా ఢిల్లీ వెళుతున్నట్లు తెలుస్తోంది.  రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి తరుణ్ చుగ్ కూడా సమావేశంలో పాల్గొంటారు.  అయితే ఈ సమావేశంలో పార్టీ వ్యవహారాలు, అలాగే రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, బీజేపీ పాదయాత్ర, వరి ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరిపై అమిత్‌ షాతో నేతలు చర్చించే అవకాశముందని అంటున్నారు. కేంద్రంపై కయ్యానికి కాలు దువ్వి, కత్తులు దూసిన ముఖ్యమంత్రి కేసీఆర్, తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రి కేటీఆర్,అదే విధంగా ఇతర తెరాస కీలక నేతలు కూడా ఢిల్లీలో ఏమి జరుగుతోంది ? ఎందుకు అమిత్ షా .. రాష్ట్ర నాయకులతో సమావేసమవుతున్నారు .. అంటూ ...ఆరా తీస్తున్నట్లు సమాచారం.

ఆర్మీ ఫ్యామిలీలో పుట్టి.. సీడీఎస్‌గా ఎదిగి.. రావ‌త్ ప్రొఫైల్‌..

బిపిన్ రావ‌త్‌. భార‌త‌దేశ తొలి సీడీఎస్‌. ఆర్మీ కుటుంబంలో జ‌న్మించిన ఆయ‌న‌.. అదే ఆర్మీలో అత్యున్న‌త ప‌ద‌వి చేప‌ట్టారు. త‌మిళ‌నాడులోని కూనురులో హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు. ఆయ‌న కెరీర్‌లో అనేక సంచ‌ల‌నాలు. మ‌య‌న్మార్‌, పాకిస్తాన్‌లో ఇండియ‌న్ ఆర్మీ చేసిన స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌కు మాస్ట‌ర్ మైండ్ ఆయ‌న‌. ఆరేళ్ల క్రితం ఓ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంతో సుర‌క్షితంగా త‌ప్పించుకున్నా.. ఇప్పుడు మాత్రం ఆయ‌న‌కు విధి అనుకూలించ‌లేదు.  ఉత్తరాఖండ్‌లోని పౌరీలో 1958లో జన్మించారు బిపిన్ రావ‌త్‌. తండ్రి లక్ష్మణ్‌ సింగ్‌ రావత్‌ సైన్యంలో లెఫ్టినెంట్‌ జనరల్‌గా రిటైర్ అయ్యారు. తండ్రిలానే పాఠశాల విద్య తర్వాత నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో చేరారు. డిఫెన్స్‌ సర్వీస్‌ స్టాఫ్‌ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. అమెరికాలోని కాన్సాస్‌లో యునైటెడ్‌ స్టేట్స్‌ ఆర్మీ కమాండ్‌ అండ్‌ జనరల్‌ స్టాఫ్‌ కాలేజీలో హైయ్యర్‌ కమాండ్‌ కోర్స్‌ను పూర్తి చేశారు. దేవీ అహల్యా విశ్వవిద్యాలయంలో ఎంఫిల్‌.. మద్రాస్‌ యూనివర్శిటీలో కంప్యూటర్‌ డిప్లొమా కంప్లీట్ చేశారు. 2011లో చౌధరీ చరణ్‌ సింగ్‌ యూనివర్శిటీ నుంచి మిలిటరీ మీడియా అండ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌పై పీహెచ్‌డీ చేసి డాక్ట‌రేట్ పొందారు బిపిన్ రావ‌త్‌.   1978లో సెకండ్‌ లెఫ్టినెంట్‌గా గూర్ఖా రైఫిల్స్‌లో ఆర్మీ కెరీర్‌ ప్రారంభించారు. రావత్‌కు ఉగ్రవాద, వేర్పాటువాద నిరోధక ఆపరేషన్లలో విశేష‌ అనుభవం ఉంది. మేజర్‌గా ఉరీ, జమ్ము అండ్‌ కశ్మీర్‌లో కంపెనీ కమాండ్‌గా వ్యవహరించారు. కల్నల్‌గా గూర్ఖా రైఫిల్స్‌లో పనిచేశారు. కశ్మీర్‌లోని సోపూర్‌లో రాష్ట్రీయ రైఫిల్స్‌ సెక్టార్‌ 5 బాధ్యతలు నిర్వహించారు. ఐక్య‌రాజ్య స‌మితి మెషిన్‌లో భాగంగా కాంగోలో కొన్నాళ్లు పని చేశారు. ఇక్కడ ఆయనకు ఫోర్స్‌ కమాండర్‌ కమెండేషన్‌లు రెండు సార్లు వ‌రించాయి. ఆ త‌ర్వాత‌ ఉరీలో జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ బాధ్యతలు నిర్వహించారు. లెఫ్టినెంట్‌ జనరల్‌ హోదాలో నాగాలాండ్‌లోని టైగర్‌ కోర్‌ బాధ్యతలు చూసుకొన్నారు. అలా అంచ‌లంచ‌లుగా ఎదిగి.. 2017 జనవరి 1న ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు బిపిన్‌ రావత్‌.    రావ‌త్ ఆర్మీ కెరీర్‌లో అనేక సంచ‌ల‌న ఆప‌రేష‌న్లు నిర్వ‌హించారు.  --ప్రస్తుతం బిపిన్‌ రావత్‌  చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా వ్యవహరిస్తున్నారు. భారత్‌కు తొలి సీడీఎస్‌. ఆయన ఫోర్‌స్టార్‌ జనరల్‌. ప్రస్తుతం భారత్‌లో ఆయనే అత్యున్న‌త‌ సైనికాధికారి.  --రావత్‌ను సైన్యంలో పలు కీలక అవార్డులు వరించాయి. పరమ విశిష్ఠ సేవా పతకం, ఉత్తమ యుద్ధ సేవా పతకం, అతి విశిష్ఠ సేవాపతకం, యుద్ధ సేవా మెడల్‌, సేనా మెడల్‌, విశిష్ఠ సేవా పతకం ఆ అవార్డుల్లో కొన్ని.    --2015లో ధింపూర్‌లో టైగర్‌ కోర్‌ బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో మయన్మార్‌లో సర్జికల్‌ స్ట్రైక్స్‌ నిర్వహించారు. 18 మంది భారత జవాన్లను యూఎన్‌ఎల్‌ఎఫ్‌డబ్ల్యూ మిలిటెంట్లు హత్యచేసి మయన్మార్‌ పారిపోయారు. దీంతో భారత సైన్యం సరిహద్దులు దాటి మయన్మార్‌లోకి చొరబడి మరీ మిలిటెంట్లను మట్టుబెట్టింది. ఈ ఆపరేషన్‌లో 21 పారా కమాండోలు పాల్గొన్నారు.     --2015లో ఓ సారి హెలికాప్టర్‌ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకొన్నారు రావ‌త్‌. ఆయన ప్రయాణిస్తున్న చీతా హెలికాప్టర్‌ గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి రావత్‌ స్వల్పగాయాలతో బ‌య‌ట‌ప‌డ్డారు. 

రావ‌త్ క‌న్నుమూత‌.. స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ మొన‌గాడు.. ఏపీకి ఫ‌స‌క్‌.. టాప్‌న్యూస్ @ 7pm

1. తొలి సీడీఎస్ బిపిన్ రావ‌త్ ఆర్మీ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో మృతిచెందిన‌ట్టు ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ ప్ర‌క‌టించింది. రావ‌త్ మ‌ర‌ణంపై ప్ర‌ధాని మోదీతో స‌హా ప్ర‌ముఖులంతా దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. హెలికాఫ్టర్ ప్రమాదంపై భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమైంది.  2. తమిళనాడు కూనూరు సమీపంలో సైనిక హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో 13 మంది కన్నుమూశారు. గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాల‌కు డీఎన్‌ఏ టెస్టులు చేస్తున్నారు. సూలూరు నుంచి వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ కాలేజీలో లెక్చ‌ర్ ఇచ్చేందుకు బిపిన్ రావ‌త్‌ వెళ్తుండగా మధ్యాహ్నం 12:20 నిమిషాలకు హెలికాఫ్టర్ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణాలు క‌నుగొనేందుకు భారత వాయుసేన దర్యాప్తునకు ఆదేశించింది.  3. చీఫ్ ఆఫ్ డిఫెన్స్‌ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ఆరేళ్ల క్రితం ఓ హెలికాఫ్టర్ ప్రమాదం నుంచి తృటిలో బయటపట్టారు. 2015 ఫిబ్రవరి 3న బిపిన్ రావత్ చీతా హెలికాప్టర్‌లో ప్రయాణిస్తుండగా నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో హెలికాప్టర్ కుప్పకూలింది. ఆ ప్రమాదం నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఆ సమయంలో ఆయన లెఫ్టినెంట్ జనరల్‌గా ఉన్నారు. 4. బిపిన్ రావత్ భారత్ సైన్యం నిర్వహించిన కీలక ఆపరేషన్లకు సూత్రదారిగా ఉన్నారు. పాకిస్టాన్ బాలాకోట్ లో భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ కు కర్త, కర్మ,క్రియ బిపిన్ రావతే. చైనా సరిహద్దులోనూ ఆయన ఎన్నో సాహస ఆప‌రేష‌న్లు చేశారు. లద్ధాఖ్ సంక్షోభ సమయంలో బిపిన్ రావత్ త్రివిధ దళాలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేశారు.  5. ఏపీకి కేంద్రం మరోసారి మొండిచేయి చూపింది. దేశంలో ఇక కొత్త రైల్వే జోన్‌లను ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని కేంద్రం తేల్చిచెప్పింది. విశాఖ రైల్వేజోన్ అంశాన్ని కేంద్ర‌మంత్రి అశ్వ‌నీ వైష్ణవ్ ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్ మేరకు.. మరిన్ని జోన్‌లను ప్రకటించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. రైల్వేజోన్‌పై కేంద్రం దగ్గర ఇప్పటివరకూ జగన్ ప్రభుత్వం ప్రస్తావించలేదు. జగన్ ప్రభుత్వం స్పందించని కారణంగానే ఏపీ రైల్వేజోన్‌ను కేంద్రం పక్కన పెట్టిందని రైల్వేశాఖ అధికారులు విమర్శిస్తున్నారు. 6. విపత్తులు సంభవించినప్పుడు బాధితులను ఆదుకోవలసిన ప్రాధమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంటుందని కేంద్ర‌మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ అన్నారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదల నష్టంపై కేంద్ర బృందం నివేదిక సమర్పించిన అనంతరం అదనపు ఆర్థిక సహాయం అందించే విషయాన్ని పరిశీలిస్తామని ఆయ‌న‌ రాజ్యసభలో తెలిపారు. భారీ వర్షాలు, వరదల కారణంగా 25 మంది మరణించినట్లు, రోడ్లు, విద్యుత్‌ వ్యవస్థతోపాటు పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపిందని చెప్పారు. 7. తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల మున్సిపాలిటీల్లో ప్రజాప్రతినిధుల జీతాల పెంపుపై ఈసీ మండిపడింది. ఈసీ ఆగ్రహంతో వెంటనే జీవోను తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేలా.. జిల్లా, మండల పరిషత్‌లకు 250 కోట్ల నిధులను మంజురు చేయడంపై ఎన్నికల సంఘం మందలించింది. వెంటనే నివేదిక పంపాలని పంచాయితీ రాజ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది.  8. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇచ్చారా? విభజన హామీలను నెరవేర్చారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర పరిస్థితుల గురించి ఏనాడైనా కేంద్రమంత్రులతో గాని ప్రధానితో గాని మాట్లాడారా అని నిలదీశారు. ‘‘మీ అంత చేతకాని దద్దమ్మ ఇంకొకరు ఉండరు.. అంటూ మండిప‌డ్డారు. తలతిక్క మాటలు మాట్లాడితే తోలు తీస్తామని హెచ్చరించారు.  9. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులు చేపట్టిన ఉద్యమం 300 రోజులకు చేరింది. గాజువాక సెంటర్‌లో కార్మికులు మహాధర్నా చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు, ఆస్తులను  అమ్మే నైతిక హక్కు ప్రభుత్వాలకు లేదంటూ నినాదాలు చేశారు. కారు చౌకగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం ఎవరి ప్రయోజనం కోసమంటూ ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాల్లో విశాఖ ఉక్కు పరిరక్షణపై ఎంపీలు గళం వినిపించాలని డిమాండ్ చేస్తున్నారు. 10. జీజీహెచ్‌లో వైద్య సేవలు నిలిచిపోయాయి. విధులు బహిష్కరించి జూనియర్ డాక్టర్లు రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. సకాలంలో వైద్య సేవలు అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూడాల సమ్మెపై అధికారులు, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రోగుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. సీఎం బంధువులమని వైద్యులపై కొందరు యువకులు దాడికి పాల్పడటంతో త‌మ‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.  

హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్ మృతి.. 

తమిళనాడులో జరిగిన సైనిక హెలికాఫ్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ కన్నుమూశారని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రకటించింది. బిపిన్ రావత్ మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బిపిన్ రావత్ మరణంతో త్రివిధ దళాలతో తీవ్ర విషాదం అలుముకుంది.  ఆ హెలికాప్ట‌ర్ అత్యంత సుర‌క్షితం.. అయినా, ప్ర‌మాదం? తమిళనాడులోని ఊటీ సమీపంలో  ఈ మధ్యాహ్నం ఘోర ప్రమాదం సంభవించింది. భారత సైన్యానికి చెందిన ఓ ఆర్మీ హెలికాప్టర్ సాంకేతిక కారణాలతో కూనూరులో కుప్పకూలింది. విల్లింగ్టన్ ఆర్మీ కేంద్రం నుంచి బయల్దేరిన ఎంఐ సిరీస్ హెలికాప్టర్ బయల్దేరిన కాసేపటికే కూలిపోయింది. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ బిపిన్ రావత్, మరో ముగ్గురు ఆర్మీ అధికారులు, రావత్ కుటుంబ సభ్యులు సహా  మొత్తం 14 మంది ప్రయాణించారు. ఇందులో 13 మంది స్పాట్ లోనే చనిపోయారు. హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన వారిలో జనరల్‌ బిపిన్‌ రావత్‌ భార్య మధులిక రావత్‌, బ్రిగేడియర్‌ ఎల్‌ఎస్‌ లిద్ధర్‌, లెఫ్టినెంట్‌ కల్నల్‌ హర్జిందర్‌ సింగ్‌, నాయక్‌ గురుసేవక్‌ సింగ్‌, నాయక్‌ జితేంద్ర కుమార్‌, లాన్స్‌నాయక్‌ వివేక్‌ కుమార్‌, లాన్స్‌నాయక్‌ బి. సాయితేజ, హవల్దార్‌ సత్పాల్ ఉన్నారు.   బిపిన్ రావత్ చివరి వార్నింగ్ ఇదే..  వెల్లింగ్టన్‌లో మిలిటరీ కాలేజీలో లెక్చర్‌ ఇచ్చేందుకు ఈ ఉదయం 9 గంటలకు ఢిల్లీలోని ప్రత్యేక విమానంలో వెళ్లిన రావత్‌.. కొద్ది గంటలకే ప్రమాదానికి గురయ్యారు. 9 గంటల ప్రాంతంలో జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణి మధులిక రావత్‌, ఆర్మీ ఉన్నతాధికారులు కలిసి ప్రత్యేక విమానంలో డీల్లీ నుంచి తమిళనాడు బయల్దేరారు. ఉదయం 11.35 గంటలకు సూలూరు ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో ల్యాండ్‌ అయ్యింది.  అక్కడి నుంచి వీరంతా ఎంఐ-17వీఎఫ్‌ హెలికాప్టర్‌లో వెల్లింగ్టన్‌కు బయల్దేరారు. మార్గమధ్యంలో మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో కట్టేరీలోని నంచప్ప చత్రం ప్రాంతంలో వీరు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ఒక్కసారిగా కూలిపోయింది.  బిపిన్ రావత్.. సర్జికల్ స్ట్రైక్ మాస్టర్ మైండ్.. పవర్‌ఫుల్ ఆర్మీ బాస్..

ఆ హెలికాప్ట‌ర్ అత్యంత సుర‌క్షితం.. అయినా, ప్ర‌మాదం?

ర‌ష్య‌న్ మేడ్‌ MI-17v5. అత్యంత సుర‌క్షిత‌మైన‌ హెలికాప్ట‌ర్‌. ప్ర‌ధాని మోదీ సైతం ప‌ర్య‌ట‌న‌ల‌కు ఎంఐ హెలికాప్ట‌రే వాడుతారు. సీడీఎస్ బిపిన్ రావ‌త్ ప్ర‌యాణించి.. ప్ర‌మాదానికి గురైన హెలికాప్ట‌ర్ కూడా ఇదే. ఈ హెలికాప్టర్‌కు ప్రత్యేకమైన రక్షణ కవచాలు అమర్చి ఉంటాయి. ఇన్ఫ్రారెడ్‌ సప్రెసర్లు, జామర్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంధన ట్యాంక్‌ నుంచి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఏర్పాట్లు ఉన్నాయి. సెల్ఫ్‌సీల్డ్‌ ట్యాంక్‌ పేలి మంటలు వ్యాపించకుండా పాలీయూరేథీన్‌ అనే సింథటిక్‌ ఫోమ్‌ రక్షణగా ఉంటుంది. అయినా, కునూరు ఘ‌ట‌న‌లో హెలికాప్ట‌ర్ నుంచి మంట‌లు చెల‌రేగాయ‌ని అంటున్నారు.   MI-17v5 హెలికాప్ట‌ర్‌లో అత్యాధునిక ఏవియానిక్స్‌ ఉండటంతో ఏ వాతావరణ ప‌రిస్థితుల్లో అయినా ఇది పనిచేయగలదు. అడవులు, సముద్ర జలాలు, ఎడారులపై సురక్షితంగా ప్రయాణించేలా దీనిని రూపొందించారు. 36 మంది సైనికులను లేదా 4.5 టన్నుల పేలోడ్‌ను తరలించగలదు. తాజా ఘ‌ట‌న‌లో బిపిన్ రావ‌త్‌తో స‌హా 14 మంది ప్ర‌యాణిస్తున్నారు. అంటే, ఇది ఓవ‌ర్ లోడ్ ఏమీ కాదు. ఈ హెలికాప్ట‌ర్‌ అత్యధికంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో 580 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఆర్మీ ఆప‌రేష‌న్స్‌తో పాటు ప్ర‌కృతి విప‌త్తులు, సహాయక చర్యల్లో కూడా దీనిని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ప్రమాదానికి గురైన హెలికాప్ట‌ర్‌.. సూలూరు ఎయిర్‌ బేస్‌లో వాడుతున్నారు. MI-17v5 సిరీస్‌ హెలికాప్ట‌ర్‌తో ఇప్పటి వరకు ఎలాంటి భారీ ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు. ఇప్పుడు ఏకంగా సీడీఎస్‌ ప్రయాణిస్తు హెలికాప్ట‌రే కుప్ప‌కూల‌డంతో.. ప్రమాదానికి గల కారణాలపై వాయుసేన దర్యాప్తు మొదలుపెట్టింది. సీడీఎస్‌ రావత్‌ బృందం ప్రయాణిస్తున్న ఎంఐ-17వీ5 హెలికాప్టర్‌ను సైనిక రవాణాకు వినియోగించే ఎంఐ-8 హెలికాప్టర్ల నుంచి అభివృద్ధి చేశారు. భారత్‌ మొత్తం 80 హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు రష్యాకు చెందిన రోసోబోర్న్‌ ఎక్స్‌పోర్టుతో 2008లో ఒప్పందం చేసుకొంది. 2013 నాటికి డెలివరీలను పూర్తి చేసింది. మరో 71 హెలికాప్టర్లను వాయుసేన కోసం కొనుగోలు చేసేందుకు సంతకాలు జరిగాయి. చివరిసారిగా 2018లో కొన్ని హెలికాప్టర్లు భారత్‌కు చేరాయి. ఎంఐ-8 ఎయిర్‌ ఫ్రేమ్‌ పైనే 17వీ5 రకాన్ని నిర్మించారు. ఇది మధ్య శ్రేణి కిందకు వస్తుంది.  బిపిన్ రావత్.. సర్జికల్ స్ట్రైక్ మాస్టర్ మైండ్.. పవర్‌ఫుల్ ఆర్మీ బాస్.. బిపిన్ రావత్ చివరి వార్నింగ్ ఇదే.. 

బిపిన్ రావత్ చివరి వార్నింగ్ ఇదే.. 

తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ కూలింది. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ లో భారత్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ బిపిన్ రావత్ ఉన్నారు. ప్రస్తుతం భారత్‌లో అత్యశక్తివంతమైన సైనికాధికారి ఉన్న రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్ అయిందని తెలియగానే దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. త్రివిధ దళాలు షాకయ్యాయి.  ప్రధాని నరేంద్ర మోడీ అత్యవసర కేబినెట్ సమావేశం నిర్వహించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆర్మీ అధికారులతో మాట్లాడుతూ మినిట్ టు మినిట్ పరిస్థితిని పర్యవేక్షించారు. సీడీఎస్ బిపిన్ రావత్ నివాసానికి వెళ్లి... ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు.  బిపిన్ రావత్ భారత్ సైన్యం నిర్వహించిన కీలక ఆపరేషన్లకు సూత్రదారిగా ఉన్నారు. పాకిస్టాన్ బాలాకోట్ లో భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ కు కర్త, కర్మ,క్రియ బిపిన్ రావతే. చైనా సరిహద్దులోనూ ఆయన ఎన్నో సాహస కార్యక్రమాలు చేశారు. సరిహద్దు బలగాలకు ధైర్యంగా నిలిచారు. లద్ధాఖ్ సంక్షోభ సమయంలో బిపిన్ రావత్ త్రివిధ దళాలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేశారు. మూడు దళాలు బీజింగ్‌ను సమిష్టిగా ఎదుర్కొనే వ్యూహంలో బిపిన్ పాత్ర చాలా కీలకం. భారత రక్షణ రంగంలో అతిపెద్ద సంస్కరణలకు బిపిన్ రావత్ మార్గదర్శిగా పేరు తెచ్చుకున్నారు.  బిపిన్ రావత్.. సర్జికల్ స్ట్రైక్ మాస్టర్ మైండ్.. పవర్‌ఫుల్ ఆర్మీ బాస్.. బిపిన్ రావత్ మంగళవారమే  ఓ వార్నింగ్ ఇచ్చారు. జీవాయుధ పోరాటానికి సన్నద్దంగా ఉండాలన్నారు. ప్యానెక్స్-21 ప్రారంభోత్స ఈవెంట్ లో పాల్గొన్న రావత్ ఓ కొత్త విషయాన్ని హైలెట్ చేయాలనుకున్నానని, కొత్త తరహా యుద్ధానికి సన్నద్దం కావాలన్నారు. ఒకవేళ జీవాయుధ పోరాటాలు ప్రారంభం అవుతున్నట్లు గమనిస్తే దాన్ని ఎదుర్కొనేందుకు బలోపేతం కావాలన్నారు. వైరస్ లు, వ్యాధులను తట్టుకునే రీతిలో మన దేశం ప్రిపేర్ కావాలని రావత్ తెలిపారు. జీవాయుధ పోరాటానికి సిద్ధం కావాలని పిలుపిచ్చిన మరుసటి రోజే బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యారు.  బిపిన్ రావత్ చివరి వార్నింగ్ ఇదే.. 

లెక్చర్‌ ఇవ్వడానికి వెళ్లి.. చావు అంచులకు చేరి.. 

భారత చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌  ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్‌ ఘోర ప్రమాదానికి గురైంది. తమిళనాడులోని కూనూరు సమీపంలో హెలికాప్టర్‌ కుప్పకూలింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో 14 మంది ఉన్నారు.  తమిళనాడులోని వెల్లింగ్టన్‌లో మిలిటరీ కాలేజీలో లెక్చర్‌ ఇచ్చేందుకు ఈ ఉదయం 9 గంటలకు ఢిల్లీలోని ప్రత్యేక విమానంలో వెళ్లిన రావత్‌.. కొద్ది గంటలకే ప్రమాదానికి గురయ్యారు.    ఉదయం 9 గంటల ప్రాంతంలో జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణి మధులిక రావత్‌, ఆర్మీ ఉన్నతాధికారులు కలిసి ప్రత్యేక విమానంలో డీల్లీ నుంచి తమిళనాడు బయల్దేరారు.  ఉదయం 11.35 గంటలకు సూలూరు ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో ల్యాండ్‌ అయ్యింది.  అక్కడి నుంచి వీరంతా ఎంఐ-17వీఎఫ్‌ హెలికాప్టర్‌లో వెల్లింగ్టన్‌కు బయల్దేరారు. వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్‌ సర్వీస్‌ కాలేజీలో లెక్చర్‌ ఇచ్చేందుకు రావత్‌ బయల్దేరారు. మార్గమధ్యంలో మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో కట్టేరీలోని నంచప్ప చత్రం ప్రాంతంలో వీరు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ఒక్కసారిగా కూలిపోయింది.    బిపిన్ రావత్.. సర్జికల్ స్ట్రైక్ మాస్టర్ మైండ్.. పవర్‌ఫుల్ ఆర్మీ బాస్.. అటవీ ప్రాంతంలో చెట్టుపై ఒక్కసారిగా కూలడంతో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో హెలికాప్టర్‌ నుంచి నలుగురు ప్రయాణికులు మండుతూ కిందపడిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.  ప్రమాదం జరిగిన ప్రాంతం వెల్లింగ్టన్‌ ఆర్మీ క్యాంప్‌కు కేవలం 16 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. మరో ఐదు నిమిషాల్లో ఆర్మీ క్యాంప్‌లో హెలికాప్టర్‌ ల్యాండ్‌ అవ్వాల్సి ఉండగా.. అంతలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 

గంటకు 10 కోట్ల తాగుడు.. ఆ నాలుగు జిల్లాలే టాప్‌.. స‌ర్కారు కొత్త టార్గెట్‌..

గంట‌కు 10 కోట్లు.. రోజుకు 84 కోట్లు.. వారానికి 585 కోట్లు.. నెలకు 2,500 కోట్లు.. ఏడాదికి 30,535 కోట్లు.. త‌గ్గేదే లే. మ‌ద్యంపై గతేడాదికంటే 10వేల కోట్లు అద‌న‌పు రాబ‌డి రావాల్సిందే. పేరుకే దశలవారీ మద్య నిషేధం.. అమ్మ‌కాలు మాత్రం త‌గ్గేదే లే. తాగినంతా తాగించు.. తాగ‌కుంటే టార్గెట్లు పెట్టి మ‌రీ తాగించు. క‌లెక్ష‌న్లు త‌గ్గేదే లే. జ‌గ‌న్ స‌ర్కారు మ‌ద్యం పాల‌సీ ఇది. ఎక్సైజ్ అధికారుల‌కు ప్ర‌భుత్వం విధించిన టార్గెట్లు ఇవి.  మద్యంపై వైసీపీ సర్కారు అధికారుల‌కు కొత్త టార్గెట్లు పెట్టింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.20,895 కోట్ల విలువైన మద్యం ఏపీలో అమ్ముడవగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.30,535 కోట్ల సరుకు అమ్మాల‌ని ఆదేశించింది. గతేడాదికంటే 10వేల కోట్ల విలువైన మద్యం అదనంగా సేల్ చేయాల‌ని టార్గెట్ పెట్టింది. మద్య నిషేధం అని చెప్పిన జగన్‌ ప్రభుత్వం.. మద్యం అమ్మకాల్లో మాత్రం రికార్డులు సృష్టిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో మద్యం ద్వారా 18వేల కోట్ల ఆదాయం వస్తే, ఈ ఏడాది 25వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంది.  అమ్మకాల విలువ ఆధారంగా మద్యం షాపులను ఏ, బీ, సీ కేట‌గిరీలుగా ప్రభుత్వం వర్గీకరించింది. అమ్మకాలు ఎక్కువగా ఉంటే ఏ, మధ్యస్తంగా ఉంటే బీ, తక్కువగా ఉంటే సీ కేటగిరీగా విభ‌జించింది. రాష్ట్రంలోని షాపులన్నీ వీలైనంత త్వరగా ఏ-కేటగిరీలోకి వచ్చేయాలని ఒత్తిడి పెంచుతోంది. వారం వారం స‌మీక్ష నిర్వ‌హిస్తోంది. ఏపీలో అన్ని మ‌ద్యం షాపులు క‌లిపి.. నవంబరు 14 నుంచి 20 వరకు 419కోట్లు.. 21 నుంచి 27 వరకు 440 కోట్లు.. నవంబరు 28 నుంచి డిసెంబరు 4 వరకు 441 కోట్ల అమ్మకాలు జరిగినట్టు లెక్కలు తీసింది. అంటే, రోజుకు సగటున 63 కోట్ల విలువైన మద్యం అమ్ముడ‌వుతోంది. ఆ కోటా 84కోట్లకు పెంచాలని స‌ర్కారు ఆదేశాలు జారీ చేసిందని తెలుస్తోంది. జిల్లాల వారీగా టార్గెట్లు పెట్టి మ‌రీ స‌రుకు అమ్మిస్తోంది. గత ప్రభుత్వంలో 4,380 షాపులుంటే వైసీపీ ప్రభుత్వం దశలవారీగా వాటిని 2,934కు తగ్గించింది. పనివేళలు కుదించింది. బెల్టు షాపులు రద్దు చేసింది. ప‌క్క రాష్ట్రాల నుంచి మ‌ద్యం స‌ర‌ఫ‌రా అడ్డుకుంటోంది. ఇన్ని చర్యలు తీసుకుని.. అమ్మకాలు మాత్రం పెంచుతోంది. షాపులు త‌గ్గించి.. సేల్స్ పెంచేసింది. ప్ర‌భుత్వ విధానం వ‌ల్ల ఒక్క‌రంటే ఒక్క‌ర‌న్నా.. తాగుడు త‌గ్గించారా? అంటే డౌటే. ఇలా అయితే ఇక మ‌ద్యపాన నిషేధం ఎలా సాధ్య‌మ‌వుతుంది? జ‌గ‌న్ స‌ర్కారు చెప్పేదొక‌టి.. చేస్తున్న‌దొక‌టి.. అని తేలిపోతోంద‌ని అంతా మండిప‌డుతున్నారు.  సోమవారం-బీరువారం!.. లిక్కర్‌ సేల్స్‌ కోసం క‌లెక్ట‌ర్లు, ఎస్పీలు!

బిపిన్ రావత్.. సర్జికల్ స్ట్రైక్ మాస్టర్ మైండ్.. పవర్‌ఫుల్ ఆర్మీ బాస్..

జనరల్ బిపిన్ రావత్. భారతదేశపు తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌. ప్రస్తుతం భారత్‌లో అత్యశక్తివంతమైన సైనికాధికారి. భారత్‌ రక్షణ రంగంలో అతిపెద్ద సంస్కరణలకు జనరల్ బిపిన్ రావత్ మార్గదర్శి.  భారత్‌లో వేర్వేరు చోట్ల త్రివిధ దళాలకు ఉన్న 17 కమాండ్లను కలిపి ఇంటిగ్రేటెడ్‌ థియేటర్‌ కమాండ్లుగా ఏర్పాటు చేసే గురుతర భాధ్యత ఆయనదే. ఉత్తరాఖండ్‌లోని పౌరీలో రాజ్‌పుత్‌ కుటుంబంలో రావత్ జన్మించారు. ఆయన తండ్రి లక్ష్మణ్‌ సింగ్‌ రావత్‌ భారత సైన్యంలో లెఫ్టినెంట్‌ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. జనరల్ బిపిన్ రావత్ 27వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ నుండి డిసెంబర్ 17, 2016న భారత ఆర్మీ పగ్గాలను స్వీకరించారు. ఆర్మీ చీఫ్ గా పదవి విరమణ చేసిన తర్వాత బిపిన్‌ రావత్‌ ను చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా నియమించింది భారత ప్రభుత్వం. భారత్‌కు తొలి సీడీఎస్‌ ఆయనే. ప్రస్తుతం భారత్‌లో అత్యశక్తివంతమైన సైనికాధికారి రావతే  నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) మరియు ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA) యొక్క పూర్వ విద్యార్థి రావత్.  డిసెంబర్ 1978లో భారత సైన్యంలో చేరాడు.  తన నాలుగు దశాబ్దాల సర్వీసులో, రావత్ బ్రిగేడ్ కమాండర్‌గా, జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ (GOC-C) సదరన్ కమాండ్‌గా, మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టరేట్‌లో జనరల్ స్టాఫ్ ఆఫీసర్ గ్రేడ్ 2, కల్నల్ మిలిటరీ సెక్రటరీ మరియు డిప్యూటీ మిలిటరీ సెక్రటరీగా పనిచేశారు. మిలిటరీ సెక్రటరీ బ్రాంచ్ మరియు జూనియర్ కమాండ్ వింగ్‌లో సీనియర్ ఇన్‌స్ట్రక్టర్ గా పని చేశారు. యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్‌లో కూడా  కొంత కాలం పని చేశారు. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో బహుళజాతి బ్రిగేడ్‌కు నాయకత్వం వహించారు బిపిన్ రావత్.  2016లో భారత సైన్యం నియంత్రణ రేఖ దాటి పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి ప్రవేశించిన 2016 సర్జికల్ స్ట్రైక్స్‌ రూపకర్త కూడా రావతే. న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్ నుండి సర్జికల్ స్ట్రైక్ ను పర్యవేక్షించారు బిపిన్ రావత్. ఈశాన్య ప్రాంతంలో మిలిటెన్సీని తగ్గించడంలో కీలక పాత్ర పోషించారు బిపిన్ రావత్. మయన్మార్‌లోకి 2015 క్రాస్-బోర్డర్ ఆపరేషన్ రావత్ కెరీర్ లో ముఖ్యమైనది. NSCN-K మిలిటెంట్ల ఆకస్మిక దాడికి భారత సైన్యం కౌంటరిచ్చింది. ఆ హెలికాప్ట‌ర్ అత్యంత సుర‌క్షితం.. అయినా, ప్ర‌మాదం? పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా..  రావత్ నేతృత్వంలో భారత సైన్యం పాకిస్థాన్‌పై అత్యంత కఠిన చర్యలు తీసుకుంది. 2019 ఫిబ్రవరిలో భారత వైమానిక దళం బాలాకోట్ దాడులను  నిర్వహించింది. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ సైన్యం కవ్వింపులకు, కాల్పుల విరమణ ఉల్లంఘనలకు బలమైన ప్రతీకారం తీర్చుకున్నారు రావత్. రావత్ హయాంలోనే పాకిస్తాన్ సరిహద్దులో సైన్యం పటిష్టమైన రక్షణను అందించింది.  చైనాకు వ్యతిరేకంగా: డోక్లామ్ ప్రతిష్టంభన నేపథ్యంలో పాకిస్థాన్‌తో పాటు చైనా సరిహద్దు వెంబడి సైనిక వ్యవహారాలను కూడా బిపిన్ రావత్ నిర్వహించారు. క్రమం తప్పకుండా సరిహద్దు సమావేశాలు, పరస్పర చర్యలు మరియు ఉమ్మడి వ్యాయామాల ద్వారా భారతదేశం మరియు చైనా సైన్యాల మధ్య మెరుగైన సంబంధాలను సులభతరం చేశాడు. ఆర్మీ చీఫ్‌గా, జనరల్ రావత్ 2017లో 73 రోజుల పాటు భారత్-భూటాన్-చైనా ట్రై జంక్షన్‌లోని డోక్లామ్ పీఠభూమి వద్ద ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు.  మయన్మార్ సమ్మె: ఈశాన్య ప్రాంతంలో మిలిటెన్సీని తగ్గించడంలో కీలక పాత్ర పోషించారు రావత్.  అతని కెరీర్‌లోని కీలక అంశాల్లో మయన్మార్‌లోకి 2015 క్రాస్-బోర్డర్ ఆపరేషన్ ఒకటి.   NSCN-K మిలిటెంట్ల ఆకస్మిక దాడికి భారత సైన్యం విజయవంతంగా ప్రతిస్పందించింది. ఈ మిషన్ రావత్ పర్యవేక్షణలో దిమాపూర్‌కు చెందిన III కార్ప్స్ యొక్క ఆపరేషన్ కమాండ్ నిర్వహించింది. మయన్మార్ లోపల సర్జికల్ స్ట్రైక్‌ను భారత సైన్యానికి చెందిన సుమారు 70 మంది కమాండోలతో కూడిన క్రాక్ టీమ్ నిర్వహించింది, వారు 40 నిమిషాల్లో ఆపరేషన్‌ను ముగించారు, 38 మంది నాగా తిరుగుబాటుదారులను హతమార్చారు. జూన్ 4న మణిపూర్‌లోని చందేల్ ప్రాంతంలో జరిగిన ఆకస్మిక దాడిలో నాగా తీవ్రవాదులు 18 మంది సైనికులను హతమార్చిన కొన్ని గంటల్లో రావత్ టీమ్ ఆ ఆపరేషన్ ను చేపట్టి విజయవంతంగా ముగించింది.  నాలుగు దశాబ్దాలకు పైగా ఆర్మీకి సేవలు అందించిన జనరల్ బిపిన్ రావత్ కు ఎన్నో అవార్డులు, పురస్కారాలు లభించాయి.  మీరట్‌లోని చౌదరి చరణ్ సింగ్ యూనివర్శిటీ 'మిలిటరీ మీడియా స్ట్రాటజిక్ స్టడీస్'పై చేసిన పరిశోధనలకు జనరల్ బిపిన్ రావత్‌కు 'డాక్టరేట్ ఆఫ్ ఫిలాసఫీ' (పిహెచ్‌డి) ప్రదానం చేసింది. బిపిన్ రావత్‌కు PVSM, UYSM, AVSM, YSM, SM మరియు VSM వంటి అనేక రాష్ట్రపతి అవార్డులు లభించాయి. రెండు సార్లు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కమెండేషన్‌తో పాటు ఆర్మీ కమాండర్ ప్రశంసలను కూడా పొందారు. కాంగోలో UNలో పనిచేస్తున్నప్పుడు రెండుసార్లు ఫోర్స్ కమాండర్ యొక్క ప్రశంసలు అందుకున్నారు బిపిన్ రావత్. 

బాలిక‌పై గ్యాంగ్ రే*ప్‌!.. ఆటో డ్రైవర్ల ఘాతుకం..

ఆమె మైన‌ర్‌. కాలేజీకి వెళ్తుంది. ఆమెతో ఓ ఆటో డ్రైవ‌ర్ ఫ్రెండ్‌షిప్ చేశాడు. మంచిగా మాట్లాడాడు. మాయ‌మాట‌లు చెప్పాడు. ఆ త‌ర్వాత త‌న అస‌లు నైజం బ‌య‌ట‌పెట్టాడు. ఆ బాలిక‌పై అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. వాడొక్క‌డే కాదు. వాడి ఫ్రెండ్స్‌ సైతం ఆ మైన‌ర్‌ను చెరిచారు. నాలుగు రోజుల పాటు ఆ బాలిక‌పై అకృత్యానికి తెగించారు. పోలీసులు మాత్రం ఈ విష‌యాన్ని అధికారికంగా వెల్ల‌డించ‌డం లేదు.  సుల్తాన్‌బజార్‌ పీఎస్‌ పరిధిలో నివాసం ఉంటున్న ఓ బాలిక (17) ఇంటర్‌ చదువుతోంది. కాలేజీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. మధ్యలో ఓ సారి తండ్రితో ఫోన్లో మాట్లాడింది. సాయంత్రం మాత్రం ఇంటికి రాలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్నేహితులు, బంధువుల ఇళ్లలో వెదికారు. అయినా, ఆమె ఆచూకీ తెలియలేదు. అదే రోజు అర్ధరాత్రి బాలిక పేరెంట్స్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు తొలుత మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు.  నాలుగు రోజుల తర్వాత ఆమె చాదర్‌ఘాట్‌లో ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు.. ఆ బాలిక‌ను సుల్తాన్‌బజార్‌ పీఎస్‌కు తీసుకువచ్చారు. ఇన్ని రోజులు అదృశ్యం కావడానికి గల కారణాలపై ఆరా తీశారు. తనకు తెలిసిన ఆటోడ్రైవర్‌ మాయమాటలు చెప్పగా, అతడి వెంట వెళ్లానని చెప్పినట్టు తెలిసింది. నగర శివారు ప్రాంతం మేడిపల్లి ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌.. తనపై లైంగికదాడికి పాల్పడినట్లు ఆమె పోలీసుల విచారణలో వెల్లడించినట్టు స‌మాచారం. మరో నలుగురు ఆటోడ్రైవర్లు కూడా ఒకరికి తెలియకుండా ఒకరు లైంగికదాడికి పాల్పడినట్టు ఆమె పోలీసులకు తెలిపింద‌ని తెలుస్తోంది.  వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాలికను తీసుకెళ్లిన ఆటోడ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారంతో మ‌రో ముగ్గురు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. ఒకడు పరారీలో ఉన్నట్టు సమాచారం. ఆ ఐదుగురు ఆటోడ్రైవర్లపై కిడ్నాప్‌, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. పోలీసులు మాత్రం విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని చెబుతున్నారు. బాధితురాలిని భరోసా సెంటర్‌కు తరలించి అక్కడ విచారిస్తున్నారు.   

టీడీపీ దెబ్బకు దిగొచ్చిన జగన్! ఓటీఎస్ పై వెనకడుగు.. కానీ ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి మరో మారు దిగి వచ్చారు. ప్రజాగ్రహానికి తల వంచారు.ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా, వెల్లువెత్తిన నిరసనలు, జనాగ్రహానికి  ‘జగనన్న’ దిగి వచ్చారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకమని ఓ ముద్దు పేరు తగిలించి, ఎప్పుడో ఏనాడో ఆ నాటి ప్రభుత్వాలు పేద ప్రజలకు వివిధ పథకాల ద్వారా  ఇచ్చిన ఇళ్ళకు, ఇప్పుడు  రూ. 10 వేల  నుంచి రూ.20 వేల వరకు  వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీపీ) చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోమని, లేదంటి రేషన్ సహా సంక్షేమ ఫలాలు అందవని మెడ మీద కత్తి పెట్టి, దుర్మార్గపు వసూళ్ళకు దిగిన జగన్ ప్రభుత్వం, చివరకు దిగి వచ్చింది.  ఇంతవరకు గ్రామ వాలంటీర్ల  గ్రామ సచివాలయ సిబ్బంది, ఇతర ప్రభుత్వ అధికారులకు టార్గెట్లు పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు మెట్టు దిగింది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి,స్వరం మార్చి, ‘”అబ్బే బలవంతం ఏమీలేదు, ఓటీఎస్ వినియోగించుకోవాలా? వద్దా? అనేది ప్రజల ఇష్టమే” అని  చెప్పు కొచ్చారు. ముఖ్యమంత్రి ఈరోజు (బుధవారం)ఓటీఎస్‌ పథకం, గృహనిర్మాణంపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ పథకం గురించి ప్రజలకు పూర్తిస్థాయిలో వివరించి, అర్థం చేయించాలన్న ముఖ్యమంత్రి.. ఈ పథకం పూర్తిగా స్వచ్ఛందమేనని చెప్పారు. ప్రజలు ఈ పథకాన్ని వద్దనుకుంటే అవసరం లేదని చెప్పారు.  మూడు రాజధానుల విషయంలో ఎలాగైతే చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్లుగా వ్యవహరించారో అదే విధంగా ఓటీపీ విషయంలోనూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  ఈ పథకం ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు. ఓటీఎస్ ద్వారా పట్టా పొందితే.. ఆ ఇంటిని అవసరాలకు తనఖా పెట్టుకోవచ్చని, కావాలంటే అమ్ముకునే హక్కు కూడా ఉంటుందని ముఖ్యమంత్రి  చెప్పారు. క్లియర్‌ టైటిల్‌తో రిజిస్ట్రేషన్‌ జరుగుతుందని వెల్లడించారు. ఓటీఎస్‌ పథకం ద్వారా అన్నిరకాల సంపూర్ణహక్కులూ ఇంటి యజమానులకు లభిస్తాయని తెలిపారు. పేదలకు మంచి అవకాశాన్ని కల్పిస్తున్నామన్న జగన్‌.. ఆ అవకాశాలను వాడుకోవాలా? లేదా? అన్నది ప్రజల ఇష్టమేనని చెప్పారు. ఈ పథకం ద్వారా.. రూ.10 వేల కోట్ల భారాన్ని పేదలపై తొలగిస్తున్నామని చెప్పారు. అయితే రూ.10 వేల కోట్ల భారాన్ని తగ్గించి ఓటీపీ పేరున ఏకంగా రూ.60 వేల కోట్ల భారం మోతుతున్న విషయాన్ని మాత్రం చెప్పలేదు సీఎం జగన్ రెడ్డి. ఏది ఏమైనా జనాగ్రహానికి తలొగ్గి ముఖ్యమంత్రి మరోమారు మడమ తిప్పారు. అయితే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం ట్రాక్ రికార్డును గమనిస్తే, ఇది వ్యూహాత్మకంగా వేసిన వెనకడుగే తప్ప, మనసు మారి తీసుకున్న మంచి నిర్ణయం కాదని పరిశీలకులు అంటున్నారు. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతానికి వెనక్కి తగ్గినట్లే తగ్గి, మరో దొంగ దెబ్బ తీసినా ఆశ్చర్య పోనవసరం లేదని కూడా అంటున్నారు.

అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు.. ప్రతిపక్ష ఐక్యత ఎండ మావేనా? 

మరో రెండున్నరసంవత్సరాల తర్వాత జరిగే సార్వత్రిక ఎన్నికల్లో, బీజేపీని ఓడిచి ప్రధాని మోడీని గద్దె దించేందుకు ప్రతిపక్ష పార్టీలు ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభించాయి. ముఖ్యమంగా విపక్షాల ఐక్యత కోసం, ఇటు నుంచి కాంగ్రెస్ అటు నుంచి తృణమూల్ మధ్యలో ఎన్సీపీ..ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిశోర్ పౌరోహిత్యంలో సాగుతున్న ఈ ప్రయత్నాలు ఇంతవరకు అంతగా ఫలించలేదు. ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న విధంగా అటూ ..ఇటూ ఊగుతున్నాయి. ముఖ్యంగా విపక్ష కూటమి నాయకత్వం విషయంలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య సాగుతున్న బిగ్ ఫైట్ ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. జాతీయ స్థాయిలో ఆశక్తికరంగా సాగుతున్న కథలోకి వెళితే ..  తృణమూల్ కాంగ్రెస్ తేల్చి చెప్పింది.కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అంగీకరించేంది లేదని తెగేసి చెప్పింది. విషయం, సందర్భం వేరు కావచ్చును, కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అంగీకరించెడి లేదని, కాంగ్రెస్’ పార్టీ  సెకండ్ ఫెడల్’గా తృణమూల్ పనిచేయదని, పార్టీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ (మమతా బెనర్జీ  మేనల్లుడు)స్పష్టం చేశారు.రాజ్య సభ నుంచి 12 మంది ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్’  విషయంలో పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేసిన అభిషేక్, సభలోపల వెలుపల కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలిసి పోరాటం చేద్దాం, కానీ, కాంగ్రెస్ నాయకత్వాన్ని మాత్రం అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.   మహారాష్ట్ర అధికార కూటమిలోని ఎన్సీపీ, శివసేన పార్టీల మధ్య జాతీయ విపక్ష కూటమి నాయకత్వం విషయంలో భిన్నాభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. మమతా బెనర్జీతో చేతులు కలిపేందుకు సిద్దపడిన ఎన్సీపీ, యూపీఏ ముగిసిన ఆధ్యాయం అన్న మమత అభిప్రాయాన్నే పునరుద్ఘాటించింది. ప్రస్తుత లోక్ సభలో కాంగ్రెస్  సారధ్యంలోని యూపీఏలో కంటే యూపీఏ వెలుపల ఉన్న ప్రతిపక్ష సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉందని, ఆ కారణంగా అందరినీ కలుపుకుని పోయేలా, ఉమ్మడి నాయకత్వంలో కొత్త కూటమి ఏర్పాటు అవసరమని ఎన్సీపీ పేర్కొంది. ఎన్సీపీ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఇదే అభిప్రాయం వ్యక్తమైందని, ఆ పార్టీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ తెలిపారు. సో .. బీజేపీని ఓడించే లక్ష్యంతో ఏర్పడే కూటమిలో, కాంగ్రెస్ పార్టీ నాయకులు (సోనియా , రాహుల్ ) నలుగురిలో నారాయణ గుంపులో గోవింద్ అన్నట్లుగా అందరిలో ఒకరుగా ఉండాలే కానీ,ఎత్తు కుర్చీ ఆశిస్తే కుదరదని శరద్ పవార్ పార్టీ, ఎన్సీపీ కూడా స్పష్టం చేసింది. తృణమూల్ బాణినే వినిపించింది. ఇందుకు కాంగ్రెస్ పార్టీ ఎంత వరకు అంగీకరిస్తుంది, అనేది పక్కన పెడితే, మహ రాష్ట్ర సంకీర్ణంలోనే  భిన్నాభిప్రాయాలున్నాయి.  మహారాష్ట్ర సంకీర్ణ  మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో మరో కీలక భాగస్వామ్య పార్టీ, శివసేన కాంగ్రెస్ పార్టీ లేనిదే ప్రతిపక్షమే లేదని, కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఐ కేంద్రంగానే విపక్షాలు బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం చేయాలని అభిప్రాయ పడుతోంది. శివసేన సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్, మంగళ వారం కాంగేస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలతో పాటుగా విపక్ష్ల పార్టీల ఐక్యత గురించి కూడా చర్చించినట్లు సమాచారం. సమావేశం అనంతరం మీడియా ముందుకు వచ్చిన రౌత్, బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ సహా అన్ని పార్టీలను ఏకం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాం, అని అన్నారు.అదే సమయంలో కాంగ్రెస్ లేకుండా ఏర్పడే  కూటమి బీజేపీని ఓడించలేదు అని కూడా రౌత్ స్పష్టం చేశారు.   మరోవైపు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఇక పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ప్రతి ఎన్నికలోనూ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. మరో వంక మరో రెండు మూడు నెలల్లో ముంబై మహా నగర పాలిక సహా రాష్ట్రంలోని మరి  కొన్ని నగరపాలక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. నిజానికి, ఈ ఎన్నికలే విపక్ష పార్టీల ఐక్యతకు అసలైన లిట్మస్  టెస్ట్ అంటున్నారు.

నటి లహరి కారు బీభత్సం.. బైక‌ర్‌కు తీవ్ర గాయాలు.. వ‌దిలేసిన పోలీసులు..

న‌టి ల‌హ‌రి. టీవీ సీరియ‌ల్స్‌తో బాగానే పాపుల‌ర్‌. చిన్న‌పాటి సెల‌బ్రెటీ స్టేట‌స్‌. సీరియ‌ల్ అనుకున్నారో ఏమో.. రోడ్డు మీద కారేసుకొని య‌మ స్పీడ్‌గా న‌డిపింది. అదుపు త‌ప్పి ఓ బైక‌ర్‌ను ఢీ కొట్టింది. ఇంకేముందు క‌ట్ చేస్తే.. ఆ వ్య‌క్తికి తీవ్ర గాయాల‌య్యాయి. వెంట‌నే బాధితుడిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శంషాబాద్ ద‌గ్గ‌ర జ‌రిగిందీ యాక్సిడెంట్. ఇంత జ‌రిగినా.. న‌టి ల‌హ‌రి పొగ‌రు మాత్రం దిగ‌లేదు. టీవీ న‌టి అయినంత మాత్రాన‌ తానేమ‌న్నా.. సూప‌ర్ ఉమెన్ అనుకున్నారో ఏమో.. యాక్సిడెంట్ చేశాన‌నే ప‌శ్చాత్తాపం ఆమెలో అస‌లేమాత్రం క‌నిపించ‌లేదు. యాక్సిడెంట్‌ స్పాట్‌కు చేరుకున్న పోలీసులతో లహరి వాగ్వాదానికి దిగింది. తన భర్త వచ్చి మాట్లాడతారంటూ కారులోనే ఉండిపోయింది.  ల‌హ‌రిని కారులోంచి దిగాలంటూ పోలీసులు కోరారు. అయినా, ఆమె కిందికి దిగలేదు. దీంతో పోలీసులు ఆమెను కారులోనే పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆమె మద్యం సేవించిందేమోనన్న అనుమానంతో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్ టెస్ట్‌ చేశారు. ల‌హ‌రి మద్యం సేవించలేదని తేలింది.  గాయపడిన వ్యక్తికి ఆస్పత్రి ఖర్చులు భరిస్తామని చెప్పడంతో పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయ‌లేదు. గాయపడిన వ్యక్తి తరఫున ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో లహరిని ఇంటికి పంపించేయ‌డం అనుమానాల‌కు తావిస్తోంది. యాక్సిడెంట్ యాక్సిడెంటే క‌దా? రూల్ ప్ర‌కారం కేసు న‌మోదు చేయాల్సిందేగా? అంటున్నారు కొంద‌రు.

అటు బియ్యం స్మగ్లింగ్... ఇటు భూ కుంభకోణం! కేటీఆర్ కు జైలు ఖాయమేనా? 

తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ టార్గెట్ గా విపక్షాలు దూకుడు పెంచాయి.  వరి ధాన్యం కొనుగోళ్లలో భారీగా అక్రమాలు జరిగాయని, వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని బీజేపీ ఆరోపిస్తోంది. బియ్యం స్మగ్లింగ్ లో కేటీఆర్ హస్తం ఉందని ఆరోపణలు చేశారు ఎంపీ అర్వింద్. బియ్యం స్మగ్లింగ్ ఆరోపణలు కలకలం రేపుతుండగానే..  తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరో బాంబ్ పేల్చారు.  కేటీఆర్ బడా భూస్కాములో చిక్కుకున్నారని ఆరోపించారు. ఈ స్కామ్ కు సంబంధించి ఈడీ విచారణ జరగకుండా  కేంద్రం పెద్దలతో కేసీఆర్ డీల్ కుదుర్చుకున్నారని చెప్పారు. కేటీఆర్ స్కామ్ కు సంబంధించి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఇప్పటికే బియ్యం స్మగ్లింగ్ లో కేటీఆర్ హస్తం ఉందని బీజేపీ ఆరోపిస్తుండగా.. తాజాగా రేవంత్ రెడ్డి చేసిన భూస్కామ్ ఆరోపణలతో గులాబీ పార్టీ షేకవుతోంది.   టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంటును బహిష్కరించడంపై స్పందించిన రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్, బీజేపీ డీల్ లో భాగంగానే ఇది జరిగిందన్నారు. ఒక భూ కుంభకోణంలో మంత్రి కేటీఆర్‌కు నోటీసులు జారీ చేయడాన్ని ఈడీ తాత్కాలికంగా వాయిదా వేసిందని, ఇందుకు బదులుగా.. పార్లమెంటు సజావుగా సాగేలా కేంద్రానికి సహకరించడానికి టీఆర్‌ఎస్‌ ఎంపీలు సమావేశాలను బహిష్కరించారని చెప్పారు. హైదరాబాద్‌ శివారులో దాదాపు రూ.3 వేల కోట్ల విలువైన భూ లావాదేవీల్లో సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుల రియల్‌ ఎస్టేట్‌ సంస్థను, ఇరిగేషన్‌ కాంట్రాక్టులు చేస్తున్న మరో సంస్థను విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చిందని తెలిపారు. ఈ భూములను గతంలో హెచ్‌ఎండీఏ  ఆధ్వర్యంలో వేలం వేసినప్పుడు విదేశాలకు చెందిన ఓ సంస్థ రూ.450 కోట్లకు కొనుగోలు చేసిందన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆ సంస్థను బెదిరించి ఆ భూములను దాదాపు రూ.300 కోట్లకు రాయించుకుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ భూముల విలువ ప్రస్తుతం రూ.3 వేల కోట్ల మేర ఉంటుందన్నారు. టెండర్ల నియమ నిబంధనల ప్రకారం భూములను ఇతర సంస్థలకు బదిలీ చేయడానికి వీల్లేదని, అయినా బదిలీకి మంత్రి కేటీఆర్‌ అనుమతించారని తెలిపారు. ఈ మొత్తం కుంభకోణానికి కేటీఆరే కారణమని ఈడీ తేల్చిందని చెప్పారు.  కేటీఆర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చే క్రమంలో బీజేపీకి, టీఆర్‌ఎస్ కు కొంత గ్యాప్ ఏర్పడిందని, దాంతో ధాన్యం కొనుగోలును అడ్డం పెట్టుకొని ఈడీ నోటీసులు, విచారణ నుంచి తప్పించుకోవడానికి పార్లమెంటు వేదికగా రెండు పార్టీలు నాటకమాడాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వాటి మధ్య రహస్య ఒప్పందంలో భాగంగానే కేటీఆర్‌కు నోటీసులివ్వడాన్ని ఈడీ తాత్కాలికంగా ఆపేసిందని చెప్పారు. దాంతో పార్లమెంటులో ఆందోళనలు విరమించి హైదరాబాద్‌కు రావాలని టీఆర్‌ఎస్‌ ఎంపీలకు సీఎం కేసీఆర్‌ సూచించారని తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని, కేటీఆర్‌ను కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా కాపాడే ప్రయత్నం చేస్తున్నందునే పార్లమెంటు నుంచి ఆ పార్టీ ఎంపీలు వెనక్కి వెళ్లారని అన్నారు. అంతేకాకుండా ఈడీ కేసులను పీఎల్‌ఎంఏ చట్టం కింద కాకుండా ఫెమా చట్టం కిందికి మార్చుకుంటున్నారని ఆరోపించారు. ఈడీ కేసుపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్‌ చేశారు.  మంత్రి కేటీఆర్ డైరెక్షన్ లో బియ్యం స్మగ్లింగ్ లో వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఓ వైపు బీజేపీ ఆరోపిస్తుండగా.. 3 వేల కోట్ల రూపాయల భూస్కామ్ వెనుక కేటీఆర్ ఉన్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రెండు స్కాముల్లోనూ కేటీఆరే కీలక సూత్రదారి అన్న ఆరోపణలు వస్తుండటం రాజకీయంగా కాక రాజేస్తున్నాయి. వీటిపై విచారణ జరిగితే కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమంటున్నారు కాంగ్రెస్ నేతలు. టీఆర్ఎస్ నేతలు మాత్రం విపక్షాల ఆరోపణలను కొట్టివేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారని కౌంటరిస్తున్నారు. గతంలోనూ కేసీఆర్, కేటీఆర్ పై ఎన్నో ఆరోపణలు చేశారని, కాని దేనికి ఆధారాలు చూపలేకపోయారని చెబుతున్నారు. మీడియాలో సంచలనం కోసమే కేటీఆర్ ను టార్గెట్ చేస్తున్నారని గులాబీ లీడర్లు మండిపడుతున్నారు.  

45 BMW ల‌గ్జ‌రీ కార్లు దగ్ధం.. కోట్ల‌లో న‌ష్టం..

ఒక్క BMW కారైనా కొన‌డ‌మే చాలా మందికి స్వ‌ప్నం. ఖ‌రీదైన ల‌గ్జ‌రీ కార్ల‌లో జ‌ర్మ‌నీకి చెందిన బీఎండ‌బ్ల్యూ ఒక‌టి. మినిమం 70 ల‌క్ష‌ల నుంచి ధ‌ర ప్రారంభం. 3 కోట్ల కారు కూడా ఉంది. అంత‌టి ఖ‌రీదైన‌ BMW కార్లు ఒక్క‌సారిగా కాలిబూడిద‌య్యాయి. ఒక‌టి రెండూ కాదు.. ఏకంగా 45 కార్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఆ మంట‌లు ఆర్ప‌డానికి 10 ఫైర్ ఇంజన్లు.. 6 గంట‌ల పాటు శ్ర‌మించాల్సి వ‌చ్చిందంటే ఎంత పెద్ద ప్ర‌మాద‌మో ఊహించ‌వ‌చ్చు. మహారాష్ట్ర నవీ ముంబయిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ బీఎండబ్ల్యూకు చెందిన షోరూం కమ్ గోదాంలో మంటలు చెలరేగాయి. ఘటనలో 45 కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.  తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో షోరూంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. నిమిషాల వ్య‌వ‌ధిలోనే కార్లన్నీ తగలబడ్డాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.  10 అగ్నిమాపక యంత్రాలతో దాదాపు 6 గంటల పాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. అప్పటికీ భారీ నష్టం జరిగింది. కోట్లాది రూపాయ‌ల విలువైన కార్ల‌న్నీ కాలి బూడిద‌య్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జ‌ర‌గ‌క‌పోవ‌డం ఒక్క‌టే గుడ్‌న్యూస్‌. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.