కాకినాడకు పొంచి ఉన్న ప్రమాదం......

ఒకవైపు జీవవైవిద్య సదస్సుజరుగుతున్నా, దానికి సంబంధించిన ప్రచారానికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న ప్రభుత్వం క్రియలపై మాత్రం ఏమాత్రం శ్రద్ద చూపటం లేదు. అందుకు చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. అందులో  ఒకటి కాకినాడ బీచ్ ప్రాంతాన్ని ఎన్నడూ లేని విధంగా గ్యాసు తవ్వకాలపేరుతో విచ్చలవిడిగా డ్రెడ్జింగ్ పనులతో సముద్రతీరానికి చేటు తెస్తున్నారు. కాకినాడ సముద్రంలో హోప్ ఐలాండ్ లో జరుగుతు ఈ డ్రెడ్జింగ్ పనుల వల్ల రానున్నరోజుల్లో ఏ ఉపద్రవం కాకినాడ సముద్రంలో చెలరేగినా కాకినాడ వాసులకు ముప్ఫు తప్పదు. ఇంతకు ముందు వచ్చిన సునామీ కాకినాడను తాకకుండా బయటపడటానికి కారణం హోప్ ఐలాండ్ వల్లనేనని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఇప్పటికే చేపలవేటకు వెళుతున్నజాలరులకు అక్కడ చేపలు ఏమాత్రం దొరకక వారిజీవనం దెబ్బతింది. అంతే కాకుండా రానున్నరోజుల్లో సముద్ర తీర ప్రాంతాలయిన ఉప్పాడ, ఏటిమొగ్గ, తదితర తీర ప్రాంతాలే కాకుండా కాకినాడ కూడా భారీ ప్రమాదానికి గురి అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే కాకినాడ  సముద్ర మట్టంకంటే దిగువన ఉంది.  ధీంతో ఈ ప్రాంతప్రజలతో పాటు కోస్తా తీర వాసులంతా కలవరపడుతున్నారు. కనుక ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

షర్మిల రాజకీయ శక్తిగా ఎదుగుతుందా ?

చంద్రబాబునాయుడుకు జనంలో వస్తున్న స్పందన చూసి గాభారా పడ్డ వైయస్సార్ కాంగ్రెస్  కూడా  ప్రజలమద్యకు వెళ్లటానికి నిర్ణయించు కున్నారు. అందులో భాగంగానే ఈనెల 18నుండి మరో మహాప్రస్థానం పేరుతో 3000 కిలోమీటర్లకు రోడ్ మ్యాప్ తయారు చేసి, వైయస్సార్ కుమార్తె షర్మిళను రంగంలోకి దించారు. అయితే ఈ ప్రజాప్రస్దానం సుమారు సంవత్సరం వరకు జరుగుతుంది. దాంతో వైసిపి పార్టీలో ఉన్న నాయకులకు, ప్రజలకు, పార్టీ శ్రేణులకందరకూ షర్మిలానే నాయకురాలిగా తెలుస్తుంది. ఎప్పటికో విడుదలయ్యే వైయస్ జగన్ను పార్టీవర్గాలు, నాయకులు, ప్రజలు నాయకుడిగా అంగీకరిస్తారోలేదో అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇదే సమయంలో వైసిపి వర్గాలు చేతనైతే చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ పదేపదే వత్తిడి చేయటానికి కారణం రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పడగొట్టి కేంద్రదాన్ని బ్లాక్ మెయిల్ చెయ్యటానికేనని  తెలుగుదేశం పార్టీనేతలు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా రానున్న రోజుల్లో వైయస్సార్ పార్టీలో నాయకత్వపు చిక్కులు తప్పవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

తెలంగాణాలో ప్రజాయాత్రలు జాన్తానై

పవర్ కోసం మాత్రమే ప్రజయాత్రలు చేపడుతున్నారని అవి ఏ మాత్రం ప్రజలకు ఉపయోగపడవని తెలంగాణ వాదులు వివరిస్తున్నారు. 2014 జరగవలసిన ఎన్నికలకు ముందుగానే కోస్తాంద్రలోని మూడు ప్రధాన పార్టీలు అధికారం కోసం అర్రులు చాస్తూ ముందుకు పోతున్నాయని తెలంగాణ నాయకులు భావిస్తున్నారు. అధికార కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ మూడు నెలల ముందునుండి ఇందిరమ్మ బాటతో జిల్లాల యాత్రకు నడుంబిగించారు. దీన్ని చూసిన ప్రధాన ప్రతిఅక్షం అయిన తెలుగుదేశం పార్టీ అద్యఓడు చంద్రబాబునాయుడు మీకోసం వస్తున్నా అంటూ పాదయాత్ర మొదలు బెట్టారు. దీనికి వస్తున్న ప్రతిస్పందనను చూసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 18 నుండి మరో ప్రస్థానం పేరుతో ఇడుపుల ఫాయనుండి ఇచ్చాపురం వరకు 3000 కిలోమీటర్ల పాదయాత్రను చేపట్టనున్నారు. వైసిపి నేత జగన్ చెంచల్ గూడ జైల్లో ఉన్నందున సోదరి షర్మిల మొదలు పెట్టనున్నారు. అయితే ఈ పోటాపోటీ  యాత్రలన్నీ సీమాంద్రలోనే చెల్లుతాయని, తెలంగాణపై స్పష్టమైన వైఖరి స్పష్టం చేయకుండా  ఆయా పార్టీలు తెలంగాణకు వస్తే నిరసన తప్పదని, వారిని తెలంగాణ ప్రజలు తరిమి కొడతారని, తెలంగాణవాదులు హెచ్చరిస్తున్నారు.

దొంగలకు సెంటిమెంట్లుంటాయ్...........

ప్రకాశ్ సాహు  ఈ పేరు చెప్పగానే గుడితలుపులు గడగడ లాడతాయి. కారణం గుడిలను చోరీ చేయటంలో ఆరితేరిని వాడు. మొదటిసారిగా విజయవాడ కనక దుర్గమ్మ గుడిలో దొంగతనం చేసినప్పుడు బయట పడింది ఇతని పేరు. ఆతరువాత చాలా గుళ్లలో ధొంగతనాల్లో పాలు పంచుకున్నాడని పోలీసులు తెలుసుకున్నారు. చత్తీస్ ఘడ్ కి చెందిన ఇతగాడికి అమ్మవారి నగలంటే చాలా ఇష్టం అట. అంతే కాదు సధరు సాహు అమ్మవారికి దండం పెట్టుకోందే దొంగతనం చేయడంట. ప్రస్తుతానికి ఇతని ఖాతాలో తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన గుడుల దొంగతనంతో పాటు, కెపిహెచ్చ్ బి, జూబ్లిహిల్స్ లో జరిగిన నగల దుకాణాల చోరీలు కూడా సాహు పనేనని పోలీసులు భావిస్తున్నారు. అలాగే ఈ మధ్య జరిగిన లాల్ ధర్వాజ మహంకాళమ్మవారి నగలు కూడా ఇతనికైకర్యమేనని పోలీసులు  సాహుని పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు

షర్మిల రాజకీయ శక్తిగా ఎదుగుతుందా ?

  చంద్రబాబునాయుడుకు జనంలో వస్తున్న స్పందనని చూసి గాభరా పడ్డ వైయస్సార్ కాంగ్రెస్ నేతలు తాము కూడా ప్రజలమద్యకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఈనెల 18నుండి మరో మహాప్రస్థానం పేరుతో 3000 కిలోమీటర్లకు రోడ్ మ్యాప్ తయారు చేసి, వైయస్సార్ కుమార్తె షర్మిళను రంగంలోకి దించారు. అయితే ఈ ప్రజాప్రస్దానం సుమారు సంవత్సరం వరకు జరుగుతుంది. దాంతో వైసిపి పార్టీలో ఉన్న నాయకులకు, ప్రజలకు, పార్టీ శ్రేణులకందరికీ షర్మిల మాత్రమే ప్రథాన నేతగా పార్టీ తరఫున దగ్గరవుతుంది. అదృష్టం బాగుండి జగన్ జైల్లోంచి బైటపడ్తే తను కూడా యాత్రలో పాల్గొంటాడని పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారు. కానీ.. జగన్ విడుదల ఆలస్యమైతే మాత్రం ప్రజల్లో జగన్ తో పోలిస్తే షర్మిలకే ప్రాథాన్యం ఎక్కువగా ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ దూకుడు

  జగన్ అక్రమాస్తుల కేసు విచారణ లో ఈడీ చాలా దూకుడుగా వ్యవహిరిస్తోంది. మరిన్ని ఆస్తుల్ని అటాచ్ చేసేందుకు చకచకా మార్గాల్ని సిద్ధం చేస్తోంది. సిబిఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ ఆధారంగా సమాంతర విచారణ చేపట్టిన ఈడీ తొలివిడతగా కొన్ని ఆస్తుల్ని జప్తు చేసింది. మరో రెండుమూడు వారాల్లో తర్వాతి చార్జ్ షీట్ ని ఆధారం చేసుకుని మరిన్ని ఆస్తుల్ని జప్తు చేసే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. జగన్ కంపెనీలకు సంబంధించిన కోట్ల విలువచేసే ఆస్తుల్ని ఈడీ ఈ నెల నాలుగోతేదీన జప్తు చేసింది. రూల్స్ ప్రకారం నెలరోజుల్లోపే జప్తు చేసిన ఆస్తులకు సంబంధించిన వివరాలను ఊటంకిస్తూ కేసు నమోదుచేయాల్సుంటుంది కనుక దానికి సంబంధించిన వ్యవహారాల్లోనూ ఈడీ తొందరపడుతోంది. వాన్‌పిక్ చార్జిషీటు, సాక్షుల వాంగ్మూలాలను ఇవ్వాల్సిందిగా ఈడీ చేసుకున్న విన్నపాన్ని సీబీఐ ప్రత్యేక కోర్టు మన్నించింది. వాటిని ఇచ్చేందుకు అంగీకరించింది. ఓఎంసీ, ఎమార్, జగతి కేసుల్లో, మనీలాండరింగ్ కేసు, ఫెమా చట్టాల ఉల్లంఘన కేసులపై ఈడీ దృష్టి పెట్టింది. ఆయా కేసుల్లో నిందితులను ప్రశ్నించేందుకు మే నెలలో అనుమతి కోరినపుడు ఈడీకి తాము చెప్పాల్సింది ఏమీ లేదని, తమ వద్ద తగిన సమాచారం కూడా ఏమీ లేదని నిందితులు అభ్యంతరం చెప్పారు. దీనిని కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. వారిని ప్రశ్నించేందుకు ఈడీని అనుమతించింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు, న్యాయ నిపుణులు భావిస్తున్నారు.

మరో పాదయాత్ర ...

రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇందిరమ్మ బాటలో బిజీగా ఉండి ప్రజలతో మమేకమౌతున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 117 రోజుల మీకోసం పాదయాత్రలో ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తమ ఉనికిని ఎక్కడ కోల్పోతామోనన్న ఉలికిపాటుతో వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు  నేడు సమావేశం అయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఉప ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన విషయం విదితమే. కానీ నేడు చంద్రబాబు రాయలసీమలో చేపట్టిన మీకోసం యాత్రకి వస్తున్న ప్రజాసందోహం చూసి వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తాము కూడా ఏదో ఒక ప్రజాయాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు. జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర జగన్ అరెస్టుతో ఆగిపోయింది. జగన్ అరెస్టుతో విజయమ్మ ఓదార్పు యాత్రను కొనసాగించారు. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు తాజాగా వై.ఎస్.ఆర్. కుమార్తె జగన్ సోదరి షర్మిలతో పాదయాత్రలు కొనసాగించాలని నిర్ణయించారు. షర్మిల యాత్ర ఈ నెల పదిహేడో తేదీన కడపజిల్లా ఇడుపుల పాయ నుంచి ప్రారంభిస్తుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

వై.ఎస్ రుణం తీర్చుకున్నానంటున్న కిరణ్..!

వై.ఎస్ రుణాన్ని తీర్చేశానంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పబ్లిగ్గా చెప్పారు. అంతేకాదు ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్న రోశయ్య రుణాన్నికూడా తీర్చేసుకున్నారట. గతంలో వీళ్లద్దరూ పడ్డ బకాయిల్ని తాను తీర్చాల్సొచ్చిందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బహిరంగంగా వెల్లడించారు. ఈ మాటలు విన్నవాళ్లంతా ఆశ్చర్యపోయారు. కిరణ్ నోటి వెంట మరికొన్ని వివరాలు వెల్లడయ్యాకగానీ అసలు విషయం జనానికి అర్థం కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం 2008నుంచీ ఫీ రీఇంబర్స్ మెంట్ పథకాన్ని అమలుచేస్తోంది. దీనికి సంబంధించి వై.ఎస్ హయాంలోగానీ, రోశయ్య హయాంలోగానీ నిధులు విడుదలకాలేదనీ, తాను వచ్చాక పాతబకాయిలన్నీ చెల్లించేశాననీ ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఇప్పటివరకూ దాదాపు 8వేల ఐదొందలకోట్ల రూపాయల బకాయిల్ని తాను క్లియర్ చేసినట్టు ప్రకాశం జిల్లాలో ఏర్పాటుచేసిన ఇందిరమ్మ బాట కార్యక్రమంలో సీఎం చెప్పుకున్నారు.

ఇంజినీరింగ్ చదువులకు గ్రహణం

  వేలంవెర్రికి వెనకాముందూలేదని వెనకటికొక సామెత.. ఇంజీనిరింగ్ కాలేజీల్ని పెట్టే విషయంలో చాలామంది ఈ సామెతనే అనుసరించారు. రాష్ట్రంలో అసలు చదువంటే ఇంజినీరింగ్ మాత్రమే అన్న ఓ అపోహ కొన్నేళ్లపాటు రాజ్యమేలింది. చదివితే ఇంజినీరింగ్ చదవాలి, చేస్తే సాఫ్ట్ వేర్ జాబ్ చేయాలి అనే గాలివాటానికి కొట్టుకుపోయిన చాలామంది మంది విద్యార్దులు పోలోమని ఇంజినీరింగ్ చదువులకోసం ఎగబడ్డారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకు ఇంటా బైటా ఉన్న డిమాండ్ కారణంగా అప్పట్లో ఇంజినీరింగ్ చదువులు ఎ వన్ చదువులుగా చెలామణీ అయ్యాయి. డిమాండ్ ని తట్టుకోలేక కొత్త కొత్త కాలేజీలు పుట్టుకొచ్చాయ్. నిజానికి భవిష్యత్ ని అంచనా వేసి ఆచితూచి స్పందించాల్సిన ప్రభుత్వం అడ్డగోలుగా అనుమతులిచ్చేసింది. కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చిన కాలేజీల్లోంచి వందలు, వేలు, లక్షలకొద్దీ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు బైటికొచ్చారు. తీరా ఇంజినీరింగ్ పూర్తయ్యాకగానీ అసలు విషయం ఆ కోర్స్ పూర్తి చేసినవాళ్లకు బోధపడలేదు. ఉన్నదాంట్లో సర్దుకుపోయే మనస్తత్వం ఉన్న ఒద్దికైన కొందరు అభ్యర్ధులు తెలివిగా తక్కువజీతమైనా సరే భద్రత ఉంటుందన్న ఉద్దేశంతో ప్రభుత్వోద్యోగాల్లో చేరిపోయారు. ప్రైవేట్ కోర్సులు చేసి ఇరగదీస్తే ఇంకా మంచి ఫ్యూచర్ ఉంటుందనుకుని లక్షలు ఖర్చుపెట్టినవాళ్లు తీరా ఆ కోర్సులు పూర్తయ్యాక మార్కెట్ పరిస్థితిని చూసి చతికిలపడ్డారు. రిసెషన్ పారిపోయిందని కంపెనీలన్నీ పైపైకి చెప్పుకుంటున్నా.. కాస్త ఎక్కువ జీతం తీసుకునే ఉద్యోగుల్ని అవసరాన్నిబట్టి సాగనంపే ప్రయత్నాలు దాదాపుగా అన్ని సంస్థల్లోనూ సాగుతూనే ఉన్నాయ్. కారణాలు ఏవైనా కావొచ్చు.. విషయం మాత్రం ఒక్కటే.. సాగనంపడం.. మంగళం పాడేయడం. ఇంజినీరింగ్ చదువుకున్నోళ్ల పరిస్థితి కాస్త గడ్డుగానే ఉందన్న ప్రచారం ఆనోటా ఈనోటా పాకి చాలామంది చెవుల్లో పడింది. ఇంజినీరింగ్ చదువులకు ఉన్నట్టుండి డిమాండ్ పడిపోయింది. చాలా కాలేజీలు సరైన స్ట్రెంత్ లేక మూతపడే దశకు చేరుకున్నాయి. వంద, నూటయాభై సీట్లుమాత్రమే భర్తీ అయిన కాలేజీలు, సరైన అనుమతులు తీసుకుని తమదగ్గరి చేరిన విద్యార్ధులందరినీ వేరే కాలేజీల్లో కలిపేస్తున్నాయి. ఇప్పటికే రెండొందల ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ఎఐసిటీఈకి తామిక కాలేజీలు నడపలేమని లేఖలు పంపించాయ్. మరో 150 కాలేజీలు ఇలాంటి లేఖల్ని తయారు చేసుకునే దశలో ఉన్నాయ్.. పరిస్థితి ఇంత దారుణంగా తయారు కావడానికి కారణం ఎవరన్న ప్రశ్న ఉదయిస్తే.. నూటికి నూరు శాతం ప్రభుత్వం బాధ్యతారాహిత్యమే అన్న సమాధానం గోడక్కొట్టిన బంతిలా తిరిగొస్తుంది. నిజానికి వేలం వెర్రిగా సాగుతున్న కొత్త కాలేజీల పర్వాన్ని ప్రభుత్వం ముందునుంచే అడ్డుకునుంటే ఈ రోజున ఈ పరిస్థితి ఎదురయ్యేదికాదు. విచ్చలవిడిగా అనుమతులిచ్చుకుంటూ పోతే పరిస్థితి ఇలాగే తయారవుతుందన్న కనీసం జ్ఞానం ఏలికలకు లేకపోతే పాయె కనీసం పాలనాపరమైన నిర్ణయాలు తీసుకునే కీలకస్థానాల్లో ఉన్న అధికారులకైనా ఉండఖ్కర్లేదా..? కరవమంటే కప్పక్కోపం, విడమమంటే పాముక్కోపం, మధ్యలో మనకెందుకు కళ్లు మూసేసుకుని, మనసు చంపేసుకుని రాజకీయనాయకులు చెప్పినట్టు చేస్తే పోలా అనుకునే అధికారుల బాధ్యతా రాహిత్యం ఇప్పుడు ఇంజినీరింగ్ చదువులకు గ్రహణమై గట్టిగా పట్టింది. పట్టు విడిచే రోజు ఎప్పుడొస్తుందో ఏమోనని కాలేజీల యాజమాన్యాలు ఆశగా ఎదురుచూడ్డంతప్ప ప్రస్తుత పరిస్థితుల్లో చేయగలిగిందికూడా ఏమీ లేదన్న సత్యం, అటు ప్రభుత్వానికీ, అధికారులకూ.. ఇటు కాలేజీల యాజమాన్యాలకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది.

రాహుల్ ని కలిసిన కాపునాడు నేతలు

కాపులకు రాజకీయాల్లో జాతీయస్థాయిలో, రాష్ట్ర స్థాయిలో సరైన ప్రాధాన్యం దక్కడంలేదని కాపునాడు నేతలు ఎఐసిసి ప్రథాన కార్యదర్శి రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు. కాపు సామాజికవర్గానికి సంబంధించిన ఓట్లన్నీ దాదాపుగా కాంగ్రెస్ పార్టీకే వేస్తున్నప్పటికీ తమవర్గానికి సరైన ప్రాధాన్యం లేకపోవడం ఆవేదన కలిగిస్తోన్న విషయమని రాహుల్ కి కాపునాడు నేతలు వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో చాలాపెద్ద కాంగ్రెస్ ఓటు బ్యాంక్ గా ఉన్న కాపు వర్గానికి సరైన న్యాయం చేయాలని, అన్ని రకాలుగానూ సౌకర్యాలు కల్పించాలని కాపునాడు నేతలు డిమాండ్ చేశారు. అభ్యర్ధనలపై రాహుల్ కూడా సానుకూలంగానే స్పందించారని కాపునాడు నేతలు చెబుతున్నారు.

బీజేపీ నేతల టార్గెట్ మన్మోహన్

ప్రథాని మన్మోహన్ సింగ్ హైదరాబాదొస్తున్నారు. జీవవైవిధ్య సదస్సులో పాల్గొనేందుకు ఆయన రాష్ట్ర రాజధానికి ప్రయాణం కడుతున్నారు. మన్మోహన్ సింగ్ ని ఇరకాటంలో పెట్టేందుకు, నిరసన తెలిపేందుకు విపక్షాలకు మరో వంక దొరికింది. రెండుసార్లు కేంద్రంలో ప్రభుత్వం నిలబెట్టుకోవడానికి రాష్ట్రాన్నే పావుగా ఉపయోగించుకున్న మన్మోహన్ సర్కారు రాష్ట్రానికి ఒరగబెట్టిందేదీలేదంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న సదస్సుకు హాజరౌతున్న ప్రథానికి అడ్డుకుంటే రాష్ట్రం పరువుపోయినట్టేనన్న భావనకూడా ప్రతిపక్షనేతల్లో వ్యక్తమవుతోంది. అందుకే ప్రథానిని అడ్డుకోకుండా ఏ ఇందిరా పార్క్ దగ్గరో ఓ ధర్నా జరిపి, దాని గురించి సమాచారాన్ని మన్మోహన్ జీ చెవిలో పడేసే ప్రయత్నం గట్టిగా చేస్తామని బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెబుతున్నారు. కర్రా విరక్కూడదు, పామూ చావాలి అన్న పద్ధతిలో రాష్ట్ర బిజేపీ నేతలు మన్మోహన్ సర్కారు పనితీరుని ఏకిపారేయాలని నిర్ణయించుకున్నారు.

ఔను! తెలంగాణా ఎంపిలు అజిత్‌సింగ్‌ను ఇష్టపడుతున్నారు?

తెలంగాణా ప్రత్యేకరాష్ట్రం అంశం ఇప్పట్లో తేలదని అందరికీ అర్థమైంది.  అయితే ప్రత్యేక తెలంగాణా సాధన పేరిట ఏర్పాటైన టిఆర్‌ఎస్‌ ఏమీ సాధించలేకపోవటంతో ఆ ప్రాంతంలో కొత్తదనం కోసం జనం ఎదురుచూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి అజిత్‌సింగ్‌ రాష్ట్రీయలోక్‌దళ్‌పార్టీ (ఆర్‌ఎల్‌డి) తెలంగాణాశాఖను ఏర్పాటు చేశారు. దీని నిమిత్తం ఆయన పర్యటనకు వచ్చారు. వెంటనే కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణా ఎంపిలు అజిత్‌సింగ్‌ను కలవటం, పెద్దహడావుడి చేయటం జరిగాయి. దీన్ని బట్టి ఏమి అర్థమవుతోంది? అని పలువురిని ప్రశ్నిస్తే తెలంగాణా కాంగ్రెస్‌ ఎంపిలు అజిత్‌సింగ్‌ను ఇష్టపడుతున్నారు అని సమాధానం వచ్చింది.  నిజం కూడా అదే. ఎందుకంటే ప్రత్యేకతెలంగాణా ఇవ్వటానికి ఇష్టపడని కాంగ్రెస్‌ ఈ ఎంపిలను పదవి నుంచి తప్పుకోమంటే ప్రత్యామ్నాయంగా అజిత్‌సింగ్‌ను వారు ఎంచుకున్నారు. అజిత్‌సింగ్‌ వెనుక ఉంటే కనీసం రాష్ట్రీయలోక్‌దళ్‌పార్టీ ఆశ్రయమైనా దక్కుతుందన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రత్యేకించి టిఆర్‌ఎస్‌ అంటే ఇష్టపడని వారందరికీ ఆర్‌ఎల్‌డి పెద్దవేదిక కాబోతుంది. ప్రత్యేక రాష్ట్రం కావాల్సిందే అన్న నినాదంతో ఏర్పాటైన తెలంగాణా జెఎసి కూడా అజిత్‌సింగ్‌కు తమ సహకారాన్ని అందిస్తోంది. టిఆర్‌ఎస్‌, బిజెపిలతో పాటు ఆర్‌ఎల్‌డిని కూడా వినియోగించుకుంటామని జెఎసి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ తెలిపారు. దీంతో అజిత్‌సింగ్‌ రాకను ఆయన పరోక్షంగా మద్దతిచ్చారు. ఎంపిలతో పాటు పరోక్షంగా మద్దతు ఇచ్చిన కోదండరామ్‌ అజిత్‌సింగ్‌ను కలిశారు.  అసలు విషయాన్ని పరిశీలిస్తే అజిత్‌సింగ్‌కు కాంగ్రెస్‌ ఇచ్చిన ఆఫర్‌ తెలంగాణా ప్రాంతమని కొత్తవార్తలు వినిపిస్తున్నాయి. తమ పార్టీలో అందరూ బయటికిపోతే తెలంగాణా ప్రాంతంలో 2014లో కొన్ని స్థానాల్లోనైనా విజయం సాధిస్తే ఆర్‌ఎల్‌డి మద్దతు కాంగ్రెస్‌ మిగుల్చుకునేందుకు ఇదో కొత్తవ్యూహమంటున్నారు. ఇదే నిజమైతే కాంగ్రెస్‌ అధిష్టానమే ప్రత్యామ్నాయం కోసం ఆర్‌ఎల్‌డిని ప్రోత్సహిస్తోందని చెప్పుకోవాలి. ఏమైనా తెలంగాణా ఎంపిల వైఖరి గురించి పిసిసి నేతలు పెదవి విప్పలేదంటే ఓరకంగా పై విషయం వాస్తవమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.  

బాబు భవిష్యత్‌కు బంగారుబాట !

రాజకీయాలు అనగానే ప్రజాసేవ అన్న మాట వినిపిస్తుంది. ఈ మాట అన్ననేతలు నిజంగానే ప్రజాసేవ చేస్తున్నారా? లేదా? అన్న విషయం మాత్రం పక్కన పెడితే ప్రజల్లో ఉన్న వారికే ఆదరణ లభిస్తుందని చెప్పాలి. గత ఉపఎన్నికల ఫలితాలు ప్రజల బలం ఏమిటో తెలియజేశాయి.  అందుకని ప్రజల దగ్గరికి వెళ్లటానికి ముందు అధికారపార్టీ కాంగ్రెస్‌ ఇందిరమ్మబాట కార్యక్రమాన్ని చేపట్టింది.  అలానే ఎటువంటి చిన్న అభివృద్థి కార్యక్రమం ఏర్పాటు చేసినా కాంగ్రెస్‌ పెద్దలు క్యూలు కడుతూ మరీ ప్రజల ముందుకు వచ్చేస్తున్నారు.  ఎందుకంటే తమ భవిష్యత్తు ప్రజల చేతిలో ఉందన్న విషయం ఆలస్యంగా గుర్తించినా కాంగ్రెస్‌ కార్యక్రమాల ప్రణాళిక నిరంతరంగానే ఉంది. ఇక ప్రతిపక్షపార్టీగా పేరొందిన తెలుగుదేశం పార్టీ కూడా ఇటీవల ప్రజలను దగ్గర చేసుకోవాలని గుర్తించింది. అందుకే ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మీకోసం వస్తున్నా పాదయాత్రలను నిర్వహిస్తున్నారు. ఈ పాదయాత్రల ద్వారా ఆయన ఇప్పటికే పలురకాల అంశాలపై అథ్యయనం చేస్తున్నారు. అలానే ప్రజలు నిజంగా ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటున్నారు. తెలుసుకున్న సమస్యలపై అప్పటికప్పుడే తన స్పందనను తెలియజేస్తున్నారు. ప్రత్యేకించి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత బాబు పాదయాత్రలకు బలమైన స్పందన తీసుకువస్తోంది. ఈయన ముందుగా ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన రావటం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయవిశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది. తెలుగుదేశం పార్టీపై ఎటువంటి సానుభూతి చూపకుండా ప్రజలు ఓ మంచి నాయకుడిని ఆదరించినట్లు ఉండటం ఈ యాత్ర ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. 62ఏళ్ల వయస్సులోనూ పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గరవ్వాలని బాబు ప్రయత్నించటాన్ని పలువురు అభినందిస్తున్నారు. అంతేకాకుండా స్వాగతిస్తున్నారు కూడా.  ఎప్పుడు రాయలసీమ వెళ్లినా చంద్రబాబు ముందుగా కాంగ్రెస్‌ పార్టీ ఫ్యాక్షనిజం గురించి ప్రస్తావించేవారు. అయితే ఈసారి ఆయన తన ప్రసంగంలో దీనికి ప్రాధాన్యత ఇవ్వకుండా స్థానికంగా ఎదురవుతున్న సవాళ్లు తెలుసుకోవటం రైతులను ఆకట్టుకుంది. అలానే వ్యాపారుల నష్టాలను అడిగి తెలుసుకోవటం వారికి ఆసక్తిని రేపింది. ఇలా తనదైన శైలిని కొంత మార్చుకుంటూ చంద్రబాబు యాత్ర ముందుకు సాగుతోంది. ఇదంతా చూస్తుంటే ఈ యాత్ర బాబు భవిష్యత్‌కు బంగారు బాట కాగలదని విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు. ఇక నిన్నటి దాకా కొత్తపార్టీ అనిపించుకున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కూడా తమకున్న జనబలాన్ని నిలబెట్టుకోవాలని ప్రజల ముందుకు బయలుదేరింది. ఆ  పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి తనకు బదులుగా సోదరి షర్మిలను పంపించేందుకు అనుమతించటంతో ఈ యాత్ర త్వరలో ప్రారంభం కానుంది. చంద్రబాబు మాదిరి సుదీర్ఘయాత్ర కాకుండా 2,500కిలోమీటర్ల మేర ఆమె పాదయాత్ర చేయనున్నారు. ఈ యాత్ర ద్వారా జగన్‌ గతంలో నింపిన ఉత్సాహాన్ని మళ్లీ రేకెత్తించాలని వైకాపా ఆశపడుతోంది. అయితే జగన్‌ చంచల్‌గూడా జైలులో ఉండటం, ఇడి ఆయన ఆస్తుల సీజ్‌పై దృష్టి సారించటం కూడా స్పందన తగ్గటానికి కారణమవ్వొచ్చని రాజకీయపరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కార్యకర్తలను కాపాడుకోవటమే ఈ పార్టీ ప్రధానలక్ష్యం. ఇలా రాష్ట్రంలోని మూడు ప్రధానపార్టీలు ప్రజల ముందు తిరుగుతుంటే భారతీయజనతాపార్టీ మాత్రం రాష్ట్రంలో తన ఉనికిని చాటుకునే చిన్న ప్రయత్నం కూడా చేయటం లేదు. ప్రత్యేకతెలంగాణాకు మద్దతు ఇచ్చినందుకు ఆ పార్టీ తెలంగాణాకే పరిమితం కావొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కనీసం క్యాడర్‌ను పెంచుకునే ప్రయత్నాలు కూడా ఈ పార్టీ చేయటం లేదు. ఇక కమ్యూనిస్టుపార్టీలు ప్రస్తుతం ఉద్యోగసంబంధిత అంశాలపైనే దృష్టిసారిస్తున్నాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయి రాజకీయపట్టు సాధించే దృష్టి ఈ రెండు పార్టీలకు లేకపోవటంతో ఇవి ప్రజలతో మమేకం కాకపోయినా వీటి గురించి చర్చించే వారే పెద్దగా ఉండకపోవచ్చు.

షర్మిల ఓదార్పుయాత్ర? లక్ష్యం చంద్రబాబేనా?

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి సోదరి షర్మిల ఇకపై 2500కిలోమీటర్ల పాదయాత్ర చేయబోతున్నారు. ఆమె యాత్ర ఓదార్పుయాత్ర అని కాసేపు, జనచైతన్యయాత్ర అని మరికాసేపు వైకాపా నేతలు అంటున్నారు.  అయితే అంతిమలక్ష్యం మాత్రం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మీ కోసం వస్తున్న యాత్రకు ప్రత్యామ్నాయం.  బాబు యాత్రల ద్వారా రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదిగితే తమ పార్టీకి భవిష్యత్తు ఉండదన్న భయంతోనే వైకాపా ఈ యాత్రకు శ్రీకారం చుట్టింది. ప్రత్యేకించి చంద్రబాబు తన యాత్రలో స్పందన భారీగా ఉంటుందని ఊహించకుండానే యాత్ర మొదలుపెట్టారు. ఈ వందకిలోమీటర్ల దూరం నడిచేటప్పటికే స్పందన భారీస్థాయిలో కనిపిస్తోంది. దీని వల్ల వైకాపా ఇప్పుడు డిఫెన్సులో పడింది.  ఏ జనబలం చూసుకుని తాము ఇంతకాలం కాంగ్రెస్‌పై పెత్తనం చేసేందుకు ప్రయత్నించామో అది దెబ్బతింటుందనే భయంతోనే ఈ యాత్రను ఆ పార్టీ డిజైన్‌ చేసింది. సుమారు 2,500కిలోమీటర్ల పాదయాత్ర వల్ల ఇప్పుడు పెద్దగా ఒనగూరే ప్రయోజనమేముంటుందనేది ఒకసారి పరిశీలించాలి. జగన్‌ యాత్రలు ఆగిపోవటం వల్ల జనంలో ఉన్న సానుభూతి కొంత వరకూ తగ్గింది. ఉప ఎన్నికల్లో ప్రభావం చూపిన సానుభూతి మళ్లీ అవకాశం వచ్చినప్పుడు కూడగట్టుకోవచ్చు అనుకుంటే బాబు పాదయాత్రలకు స్పందన పెరిగింది. తటస్తులు బయటకు రావటం ప్రారంభించారు. ఈ తటస్థులను చూసుకునే జగన్‌ ధీమాగా ఉండేవారు. ఇప్పుడు బాబు పాదయాత్రలో ఎక్కువమంది తటస్తులున్నారని నివేదికలు వస్తున్నాయి. అంటే ప్రభుత్వ వ్యతిరేకత, లంచగొండితనం, అవినీతి వంటి అంశాలు తటస్థులను ఏదో ఒక పార్టీవైపు నడుపుతాయి. అటువంటి తటస్థులను ఇప్పుడు చంద్రబాబు వైపు చూస్తున్నారని ఓ రహస్యనివేదిక వైకాపాకు అందింది. దీంతో తమకు బలం అనుకున్న తటస్థులు, కార్యకర్తలు చంద్రబాబువైపు మారిపోకుండా ముందస్తు చర్యలు అవసరమని వైకాపా గుర్తించింది. ఈ నేపథ్యంలోనే జగన్‌ రావటం లేదని వెనక్కి వెళ్లిన తటస్థులను, కార్యకర్తలను షర్మిల ఆకట్టుకోగలరని వైకాపానేతలు ఆశిస్తున్నారు. అందుకే ఈ యాత్రల వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఈ యాత్రలే కనుక సక్సెస్‌ అయితే వైకాపాకు ఆదరణ పెరుగుతుంది. ఒకవేళ కాకపోతే వైకాపాపై తగ్గిన నమ్మకం ఎంతో తేల్చుకోవచ్చు. అందుకని ముందుగా ఓదార్పు యాత్ర కింద షర్మిలను పంపిద్దామనుకున్నారు. ఒకవేళ ఉపఎన్నికల్లో మాదిరి షర్మిల ఆవేశపూరిత ప్రసంగాలు పలువురిని ఆకట్టుకుంటే జనచైతన్యయాత్ర అవుతుందని వైకాపానేతలు అనుకుంటున్నారు. అయితే పార్టీ పరిస్థితి, నిజమైన స్పందన ఎటు ఉంది తేల్చుకోవాలంటే షర్మిల యాత్రే కీలకం అన్న నిర్ణయానికి మాత్రం రాజకీయపరిశీలకుల నుంచి మంచి స్పందన వస్తోంది. పరిణతి చెందిన పార్టీలతో సమానంగా తమ పరిస్థితిని అంచనా వేసుకోవటం వైకాపా తీసుకున్న చురుకైనచర్య అని అభివర్ణిస్తున్నారు. అయితే చంద్రబాబు యాత్రపై షర్మిల ప్రభావం ఎంతమాత్రం కనిపించదని అంచనా వేస్తున్నారు.

కస్తుర్బా ఆశ్రమానికి మాయని మచ్చ

జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న కస్తుర్బాఆశ్రమాలు ఇప్పటిదాకా పత్రికల్లో శీర్షికల కింద ఎక్కలేదు.  ఎందుకంటే ఈ ఆశ్రమాలను సేవాదృష్టితో నిర్వహిస్తుండటమే కారణం. ప్రత్యేకించి వచ్చిన మార్పులు సిబ్బంది క్రమశిక్షణ కూడా మార్చేస్తుందనటానికి తాజా ఉదాహరణ ఇది.  కలుషిత ఆహారం తిని విద్యార్థినులు ఆస్వస్తతకు గురయ్యాయి. ఈ వార్త ఆ ఆశ్రమ నిర్వహణకే మాయని మాచ్చ అనటంలో ఎటువంటి సందేహం లేదు.  అనంతపురం జిల్లాలోని నల్లమాడలో ఈ ఘటన జరిగింది. సుమారు 150మంది విద్యార్థినులు అస్వస్తతకు గురవటం సంచలనం.  అసలు నిల్వ ఉండే ఆహారాన్ని విద్యార్థులకు ఎప్పుడూ పెట్టిన దాఖలాలు లేని ఈ ఆశ్రమంలో కలుషిత ఆహారం విద్యార్థినులకు అందించారు. ప్రత్యేకించి సిబ్బంది చేతివాటానికి ఈ సంఘటన నిదర్శనంగా తీసుకోవచ్చు. అనంతపురం జిల్లా అధికారులు ఈ విషయమై అప్రమత్తమయ్యారు. విద్యార్థినులను స్థానిక ఆసుపత్రికి చికిత్త నిమిత్తం తరలించారు. దాని తరువాత అసలు ఈ సంఘటన ఎలా జరిగిందనే పూర్వాపరాలు సేకరిస్తున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఘటన జరిగి ఉంటే తప్పని సరిగా వారిపై చర్య తీసుకునేందుకు వెనుకాడబోమని అనంతపురం జిల్లా అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఏ ఆశ్రమంలోనూ ఇటువంటి ఘటన జరగలేదని, అందుకే ఈ ఆశ్రమ నిర్వహణపై సీరియస్‌గా దృష్టి పెడతామని వారు హెచ్చరించారు.  విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పని లేకుండా అన్ని చర్యలూ తీసుకున్నామని వారు హామీ ఇచ్చారు.

జగన్‌ బయటకు రావటం డౌటేనా? వైకాపాకార్యకర్తల్లో అనుమానాలు

ఇంకో ఐదు నెలల్లో (అక్టోబర్‌ నుంచి 2013మార్చినెల వరకూ) అక్రమాస్తుల నేపథ్యంతో అరెస్టు అయి చంచల్‌గూడాజైలులో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత జగన్మోహనరెడ్డిపై దర్యాప్తు, విచారణ పూర్తి చేయాలని సుప్రీం కోర్టు సిబిఐను ఆదేశించింది. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులు కలవరపడుతున్నారు. ఎందుకంటే తమ పార్టీ అధ్యక్షున్ని ఇన్ని నెలలు జైలులో ఉంచడమే కాకుండా దోషిగా నిరూపిస్తే తమ పరిస్థితి ఏమిటన్నది వారి ఆందోళన. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్మాణబలాన్ని ఎవరూ కాదనలేరని వారు అంగీకరిస్తున్నారు. కానీ, జగన్‌ బయటకు రావటం మాత్రం డౌటేనా అని ప్రశ్నిస్తున్నారు. పూర్తిగా పునాది వేసిన అధ్యక్షుడు జైలులో ఉంటే వైఎస్‌ కుటుంబమే పార్టీ నడపాలంటే కష్టమేమోనని కూడా బయటపడుతున్నారు. అందుకే జిల్లాల్లో వైకాపా కార్యక్రమాలు ఇటీవల కాలం తగ్గాయి. కనీసం సమావేశాలు నిర్వహించటం కూడా మానేశారు. ద్వితీయశ్రేణి నాయకులు తమకున్న సందేహాల వల్ల తమతో పాటు కార్యకర్తలను తిప్పుకోవటమూ తగ్గించేశారు.  దీంతో వారు ఏమి చేయాలో తెలియక, ఖాళీగా ఉండలేక ఇతర పార్టీల కార్యాలయాలు, కలెక్టరేట్‌లు, ప్రభుత్వ కార్యాలయాల బయట తిరుగుతున్నారు. వ్యక్తిగతమైన పనులకు ప్రాధాన్యత ఇస్తూ ఇతరపార్టీల వారితో సఖ్యతగా ఉంటున్నారు. వైకాపా కార్యకర్తల్లో వచ్చిన ఈ మార్పు గమనించిన తెలుగుదేశం పార్టీ నేతలు వారికి దగ్గరయ్యేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పునాదులు బలంగా ఉన్నాయని పరిశీలకులు కూడా గుర్తించారు. ఎందుకంటే ఓ పార్టీని ఎలా నిర్వహించాలో దానికి ఏ మాత్రం తీసిపోకుండా జగన్‌ గట్టి చర్యలు చేపట్టారు.  ఓ కమ్యూనిస్టు పార్టీల సాంప్రదాయ నిర్వహణలో కీలకమైన కమిటీలకూ వైకాపా ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీని నడపటానికి మైసూరారెడ్డి, ఎస్‌విసుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహనరెడ్డి తదితర సీనియర్‌ నాయకులకు బాధ్యతలు అప్పగించారు. వీరు పార్టీని నడపటంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేసేందుకు ప్రణాళికలు కూడా రూపొందిస్తారు. వీరి కార్యక్రమాల డిజైన్‌ను పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి, ఆయన తల్లి, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి, జగన్‌ సోదరి షర్మిల తదితరులు ఆమోదించేలా నిర్మించారు. తాజాగా షర్మిల పాదయాత్రల డిజైన్‌ కూడా వీరు రూపొందించిందే. వయస్సు రీత్యా విజయలక్ష్మికి ఆరోగ్యసమస్యలు ఎదురవకుండా ఉండేందుకు ఈ ప్రయోగం చేపట్టారు. గత ఉపఎన్నికల్లో ప్రభావవంతమైన ప్రసంగాలు చేసిన షర్మిలకు పాదయాత్రల అవకాశం కల్పించటం ఒకరకంగా ఆమెలోని నాయకత్వ లక్షణాలకు ఓ పరీక్షలాంటిదే. ఇందులో కనుక ఆమె విజయవంతమైతే ప్రత్యామ్నాయం దొరుకుతుందని కమిటీ భావిస్తోంది. అందు వల్ల నిర్మాణబలం గురించి అనుమానించకపోయినా పార్టీని నిలబెట్టుకోవాలంటే అవసరమైన డబ్బు జగన్‌ కేసుల వల్ల సీజ్‌ అయితే భవిష్యత్తు ఏమిటని కార్యకర్తలు కలవరపడుతున్నారు. ప్రతీ అంశాన్ని నేడు ప్రభావితం చేస్తున్న డబ్బే ఇడి వల్ల సీజ్‌ అయితే భవిష్యత్తు కార్యక్రమాల కోసం నేతలు ఎంత వరకూ ఖర్చు చేయగలరని కార్యకర్త అనుమానిస్తున్నాడు. దీనికి విజయలక్ష్మి గతంలో సమాధానం ఇచ్చినా నేడు కార్యకర్త స్తబ్దుగా మారటానికి ఇదే కారణమవుతోంది.

బాబు పాదయాత్రలకు ఉలిక్కిపడుతున్న వైకాపా?

తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబునాయుడు సాగిస్తున్న మీ కోసం వస్తున్నా పాదయాత్రలకు మంచిస్పందన లభిస్తోంది. బాబు ఊహించిన దానికన్నా ఎక్కువ ఆదరణ వస్తోందని తెలుగుదేశం శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అయితే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఈ పాదయాత్రలకు ఉలిక్కిపడుతోంది. ప్రత్యేకించి ఈ పార్టీకి కీలకమైన రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి స్పందన రావటం వైకాపాకు అస్సలు మింగుడుపడటం లేదు. పైగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహనరెడ్డి  అక్రమాస్తుల కేసులో అరెస్టు అయి చెంచల్‌గూడా జైలులో ఉన్నారు. ఆయనకు బెయిల్‌ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు తాజాగా నిరాకరించటంతో మరో ఆర్నెళ్లు ఆయన కోసమే వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ఈలోపు క్యాడర్‌ను కట్టడి చేయటం కష్టమని వైకాపా నేతలు ఆందోళన చెందుతున్నారు. అందుకే అత్యవసర సమావేశం కూడా అయ్యారు. ఈ సమావేశంలో తమ క్యాడర్‌ను ఎలా నిలబెట్టుకోవాలనే అంశంపై చర్చించారు. ఇటీవల వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయలక్ష్మి రాష్ట్రంలో తాను పర్యటించినప్పుడు త్వరలో జగన్‌ వచ్చి మిమ్మల్ని కలుస్తాడని చెప్పారు. ఎంత ఆలస్యమైనా సుప్రీంకోర్టు ద్వారా బెయిల్‌ సంపాదించేయగలమన్న ధీమాతోనే ఆమె ఆ మాట ఇచ్చారు. కానీ, పరిస్థితి తారుమారు అయింది. సుప్రీం కోర్టు బెయిల్‌ ఇవ్వటానికి నిరాకరించటంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నేతలు జారుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీరంతా 2014కు వైకాపా అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతో పార్టీలో చేరినవారే. అలానే కొన్నాళ్లు కేసు నడిచినా జగన్‌ బయటికి వచ్చి అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన సొమ్ము బయటపెడతారని కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నమ్మారు. అనుకోకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఇడి) ఈ కేసు దర్యాప్తుతో పాటు అక్రమం అని తేలిన ఆస్తులను సీజ్‌ చేయటం ప్రారంభించింది. దానితో పాటు సుప్రీంకోర్టు కూడా సిబిఐను 2013మార్చిలోపు జగన్‌ కేసును పూర్తిస్థాయి విచారణ చేయమని ఆదేశించింది. ఈ ఆదేశం అందుకున్న సిబిఐ సిబ్బంది కొరతను ఢల్లీిలో తమ విభాగం సహాయంతో తీర్చుకుని సూట్‌కేసు కంపెనీలపై నిఘా పెట్టింది. దీంతో ఈ కంపెనీలకు సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా సిబిఐకు లభ్యమవుతాయన్న నమ్మకం రాష్ట్రవ్యాప్తంగా పెరిగింది.  దీంతో అరదండాలు, సీజ్‌లు పూర్తయ్యాటప్పటికి వైకాపాకు ఉన్న ఆస్తి హారతి కర్పూరం అవుతుందని మేథావులు సైతం తేలుస్తున్నారు. అప్పుడు తిరిగి పాతస్థితికి వచ్చిన జగన్‌ ఏమీ చేయలేరని కూడా వైకాపాలో ఉన్న నేతలు, కార్యకర్తలూ కూడా అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరిగి వెనక్కి వెళదామంటే కాంగ్రెస్‌ మొహం చూడటానికి కార్యకర్తలు ఇష్టపడటం లేదు. ఎందుకంటే జగన్‌తో పాటు కాంగ్రెస్‌ పార్టీ మంత్రుల అవినీతి రచ్చ రచ్చ అవుతోంది. ఈ దశలో ఆశావహంగా తెలుగుదేశం పార్టీ ఒక్కటే వైకాపా కార్యకర్తలను ఆకట్టుకుంటోంది. పైగా, ఆ పార్టీ అధినేత చంద్రబాబు తన పార్టీని పటిష్టం చేసుకునేందుకు పాదయాత్రలు చేయటం వల్ల గ్రామాల్లో కేడర్‌ పెరిగే అవకాశం కనిపిస్తోంది. అలానే ప్రభుత్వ వ్యతిరేకత బాబుకు బాగా ఉపయోగపడగలదని మీడియా కూడా విశ్లేషిస్తోంది.  ఈ నేపథ్యంలో మరో గత్యంతరం లేక తెలుగుదేశం పార్టీ వైపు వైకాపా కార్యకర్తలు దృష్టి సారిస్తున్నారు. ద్వితీయశ్రేణి నేతలు కూడా బాబుకు వస్తున్న స్పందనను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. చివరికి తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలు మాత్రమే 2014 ఎన్నికల్లో పోటీ పడతాయన్న మాట నిజం కాబోతోందని రాజకీయపరిశీలకులు ప్రస్తుత పరిస్థితిని బట్టి స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ వైకాపాగా ఆ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఆ సమయానికి నేతలు మాత్రమే మిగులుతారని కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులు బలంగా నమ్ముతున్నారు. మునిగిపోయే ఓడ నుంచి అధికారంలోకి వచ్చే అవకాశమున్న టిడిపికి వచ్చేయండని అన్ని జిల్లాల్లోని తెలుగుదేశం పార్టీ నేతలు ఆహ్వానం పలుకుతున్నారు. దీంతోతమ వంతు ఎప్పుడు వస్తే అప్పుడు పార్టీ మార్పును ప్రకటించేయవచ్చని ఎదురుచూస్తున్నారు. వైకాపా నేతలు మాత్రం వలసల నివారణకు గట్టిగానే కసరత్తులు చేస్తున్నారు. కార్యకర్తలకు నేతలు టచ్‌లో ఉండాలని వైకాపా ముఖ్యనేతలు వైవిసుబ్బారెడ్డి, మైసూరారెడ్డి తదితరులు కోరుతున్నారు. తక్షణం ఏదో ఒక కార్యక్రమం చేయకపోతే తమ భవిష్యత్తు అగమ్యగోచరమవుతుందన్న పరిశీలకుల సూచనలకు తలగ్గిన ముఖ్యనేతలు మళ్లీ ఓదార్పు యాత్రలు చేపట్టాలని నిర్ణయించారు.  నిన్నటిదాకా జగన్‌ ఈ యాత్రలు చేస్తే ఇకపై విజయమ్మ దాన్ని కొనసాగించాలని, ఇడుపులపాయ నుంచి రాష్ట్రవ్యాప్త పాదయాత్రలకు ఆమెను సన్నద్ధం చేయాలని వైకాపా సమావేశంలో  సూచనలు వచ్చాయట. దీనిపై విజయమ్మ, జగన్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

అనుకున్నామని జరగవు అన్ని...

పార్టీ పెట్టడమంటే నేడు డబ్బున్నోళ్ళకు ఓ ఫ్యాషన్‌గా మారినట్లుంది.  అలా పార్టీ పెట్టేందుకు ఏదో ఒక బూచిని సాకుగా చూపిస్తే చాలు...! లోగుట్టు పెరుమాళ్ళకు ఎరుక...! అన్నది మాత్రం నిజం...! అసలు పరమావధి మాత్రం అధికారమే అన్నది జనంకు సైతం తెలిసిన నిజం!  అనుకున్నామని జరగవు అన్ని.. అనుకోలేదని ఆగవు కొన్ని.. అన్న పాట ఇప్పుడు వైఎస్‌ఆర్‌ పార్టీకి సరిగ్గా సరిపోతుంది. పార్టీని ఆట్టహాసంగా ప్రారంభించి... ఇతర పార్టీల్లోని పలువుర్ని ఆకర్షించి.. తమ వైపుకు తిప్పుకున్నా...వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించి సుమారుగా 18నెలలకే నాయకత్వ సమస్య వెంటాడుతోంది.  నాయకుడుగా పార్టీని స్థాపించి ముందుకు నడిపించవలసిన వ్యక్తి అవినీతికేసుల్లో ఇరుక్కుని.. ఐదునెలలుగా జైల్లో మగ్గుతుంటే తాత్కాలికంగా పార్టీని  విజయమ్మ తదితరులు నడుపుతుండటంతో ఇతర పార్టీలనుండి ఆ పార్టీలో చేరిన నాయకులు అసలే పార్టీ గడుకాలంగా వుంటే... ఇప్పుడు పార్టీలో చేరిన మన పరిస్థితి ఏమిటా.. అని మదనపడుతుంటే... రావాలనుకుంటున్నవారు... పార్టీకి మంచిరోజుల కోసం ఎదురుచూస్తున్నారు.. టిడిపి అధినేత వస్తున్న మీకోసం అంటూ పాదయాత్రకు ప్రజల్లో గనుక స్పందన బాగా పెరిగితే పార్టీకి చాలా నష్టమని కొందరు పార్టీ ప్రముఖులు బాధపడుతుంటే...  పరిస్థితిని అంచనావేసేందుకేనేమో త్వరలో కేంద్ర పాలకమండలి, కార్యనిర్వాహక మండలితో గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సమావేశం జరుపనున్నారు. ఎప్పుడు టీవీల్లో, పేపర్లలో కనిపించే కొందరు పెద్దలు ఈ మధ్యకాలంలో ఎప్పుడో తప్ప కనిపించడంలేదు... వారి వాణి వినిపించడంలేదు. పార్టీ నాయకునికి  బెయిల్‌ వస్తుందని ఆశపడితే సుప్రీంకోర్టు బెయిల్‌ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. మళ్ళీ బెయిల్‌ పిటిషన్‌ వేయాలంటే... ఇంకో ఆరునెలల వరకు వేచిచూడవలసిందే. కార్యకర్తల్లో అపనమ్మకం అంటూ ఏర్పడటం ప్రారంభమైతే... అది పెరగుతూనే ఉంటుంది.  విషయం వున్నా లేకపోయినా ఎప్పుడు ప్రతిపక్షాలను తిడుతుకూర్చుంటే... ఫలితముండదని,  అందరిని ముందుకు నడిపే నాయకుడు అవసరమని.. నాయకత్వమంటే కేవలం డబ్బుతో సర్దుబాటు అయ్యేది కాదని, అది కొంతకాలమేనని... నాయకత్వమంటే అభిమానం కూడా కాదని... సరైన రక్షణ కల్పించలేనప్పుడు అభిమానం ఎందుకు పనికిరాదని గతంలో జాతీయ పార్టీలో కలిసిపోయిన ఓ బుల్లి పార్టీ చెప్పకనే చెప్పింది. కనుక  వైఎస్‌ఆర్‌ పార్టీ నాయకుల్లోను, కార్యకర్తల్లోను సమర్ధవంతమైన నాయకత్వ భయం పట్టుకుంది... సమర్ధవంతమైన నాయకత్వంతో పైకి లేచేనా...లేక... బుల్లిపార్టీలా... కనుమరుగయ్యేనా... దీనికి సమాధానం... రాబోయే ఎలక్షన్లల్లో తేలిపోతుందని... సగటు రాజకీయ అభిమానులు అనుకుంటున్నారు.

రియల్టర్ల చేతిలో వినోభా భావే భూదాన భూములు

దేశంలో చాలా మంది నిరుపేదలు తాము బ్రతుకు వెళ్ల దీయాలంటే భూమి ఉంటే సాగుచేసుకుంటామని వినోభాబావే పాదయాత్ర లోచెప్పారు. వారి స్థితిగతులను చూసి చలించిన వినోభాబావే భూదాన యజ్ఞం 1951 లో మొదలు పెట్టారు. 1970 వరకు దేశవ్యాప్తంగా 44 లక్షల ఎకరాలు సేకరించి సుమారు 40 లక్షల మందికి పంచారు. మన రాష్ట్రంలో 1.70 లక్షల ఎకరాలు సేకరించగా 1.26 లక్షల ఎకరాలకు మాత్రమే చట్ట బద్దత ఉంది. పట్టాలు ఇచ్చినా చాలా మందికి సరిహద్దులు చూపక పోవడం, రికార్డులు సరిగా లేక పోవడంతో లబ్ధిదారులు సాగుచేయటానికి ఆటంకంగా మారింది. దీంతో అధికారులు, నాయకులు కలసి ఈ భూములను రియల్‌ వ్యాపారులకు అమ్మేశారు. అయితే వీటిని తిరిగి స్వాదీనం చేసుకుని పేదలకు అప్పగించాలని చర్యలు చేపట్టాలని, డిల్లీలో జరిగిన రాష్ట్రాల రెవెన్యూ మంత్రుల సమావేశంలో కేంద్ర గ్రామీణ మంత్రి జైరాం రమేష్‌ చెప్పారు. భూదాన చట్టం ప్రకారం భూమిని పొందిన లబ్ధిదారులుక్రయవిక్రయాలు చేసేందుకు వీలులేదు. లబ్దిదారుల వంశీయులు తరతరాలుగా అనుభవించడానికి మాత్రమే వీలు కలుగుతుంది. అయితే హైదరాబాద్‌ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లోని చాలా భూములు రియల్టర్ల చేతుల్లోకి వెళ్లి పోయాయి. చట్టాన్ని అతిక్రమించి ఆయా భూములకు రిజిస్ట్రేషన్లు, పాసుపుస్తకాల జారీ కూడా జరిగింది. హైదరాబాద్‌ సరిహద్దు ప్రాంతాలయిన పోచంపల్లి, బీబీనగర్‌, చౌటుప్పల్‌ మండలాల్లోని భూముల్లో ఇంజనీరింగ్‌ కాలేజీలు, రియల్‌ వెంచర్లు వెలిసాయి. భూదాన యజ్ఞ బోర్డు తన లక్ష్యాలను మరచి పోయింది. భూదాన భూములను పట్టించుకోవడం మానేసింది. ఎంతో శ్రమకోర్చి కాలినడకన తిరిగి దళితులకోసం భూదాన యజ్ఞం చేసిన మహనీయుడి ఆశయాల కోసం భూదాన బోర్డు పనిచేయాలని బాధితులు, ప్రజలు కోరుతున్నారు.