తిరుమలేశుడికి పూలమాలల రథాలు
తిరుమలేశుడి బ్రహ్మోత్సవాలకు రాష్ట్రం నలుమూలలనుంచి పూల రథాలు బయలుదేరుతున్నాయి. తిరుమలకు వెళ్లి శ్రీవారికి సేవచేసుకోలేనివారికోసం పన్నెండేళ్లుగా కొండవీటి జ్యోతిర్మయి ట్రస్ట్ ఈ సేవాకార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఔత్సాహికులైన భక్తులు పూలమాలల్ని కట్టి ఇస్తే వాటిని ప్రత్యేక రథాల్లో తీసుకెళ్లి తిరమలలో శ్రీవారి సేవకోసం అందజేయడం ఈ కార్యక్రమం లక్ష్యం. బంతి, చామంతి, లిల్లీ, మరువం, ధవనం, తులసిమాలల్ని కట్టి పంపిచాల్సుంటుంది. 14వ తేదీన హైదరాబాద్ నుంచి, 15వ తేదీన మహబూబ్ నగర్ నుంచి, 16వ తేదీన అనంతపురం నుంచి, 17వ తేదీన కోవూర్ నుంచి, 18న గుంటూరునుంచి, 19న ఒంగోలు నుంచి, 20న రాజమండ్రి నుంచి, 22వ తేదీన విశాఖపట్నంనుంచి శ్రీవారి పూలమాలల రథాలు బయదుదేరతాయి. ఆసక్తి ఉన్నవాళ్లు 9246522132 నెంబర్ కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని నిర్వాహకులు తెలియజేస్తున్నారు.