రాష్ట్రంలో డిగ్రీ కాలేజీలకు డిమాండ్
పాత రోజులు గుర్తుకు వచ్చేలా రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలకు మంచి రోజులు వచ్చాయి. కాలేజీల ఫీజు గొడవలతో, ఇంజనీరింగ్ ఫార్మసీ కాలేజీల హవా పూర్తిగా తగ్గినట్లే కనిపిస్తుంది. ఇంజనీరింగ్ ఫార్మసీలలో ఉద్యోగ అవకాశాలు అంతకంతకు తక్కువ కావడం, ఆంద్ర ప్రదేశ్ ,తమిళనాడుల్లోని ఇంజనీరింగ్ కాలేజీల నుండి బయటికి వచ్చినవారు కేవలం 20 శాతం మంది మాత్రమే ఉద్యోగ అర్హతలతో బయటికి వస్తున్నారని మంత్రులు, రాజ్యసభ్యులు ప్రకటించడంతో ప్రజలకు వాటిపై భ్రమలు తొలిగాయనే చెప్పవచ్చు, 2,100 కాలేజీలు డిగ్రీ కోర్సులయిన బిఎ, బికాం, బియస్సీ కలిపి 1,90370 సీట్లు పూర్తయ్యాయి. కామర్స్ మేనేజ్మెంటు సీట్లు మరో 1,37,649 సీట్లు ఫిల్ అయ్యాయి. ఇదివరకటి కంటె కామర్స్ కు క్రేజ్ పెరిగింది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 15 శాతం ఎక్కువ మందితో కళాశాలలు నిండాయని విశ్వవిద్వాలయాలు చెబుతున్నాయి. గతంలో చదువంటే ఇంజనీరింగ్ అనీ, లేదా ఫార్మసీ అను కన్నవారంతా ఇప్పుడు కళ్లు తెరిచాయని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు.