సీమకు సిక్కిం తరహా ప్రత్యేక ప్యాకేజీ?

చిన్న తరహా నీటి ప్రాజెక్టుల మంత్రి టిజి వెంకటేష్‌ కేంద్ర దేశీయవ్యవహారల మంత్రి, ఆంద్రప్రదేశ్‌ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ వాయిలార్‌ రవిని కలిశారు. రాష్ట్రంలో బాగా వెనుక బడిన ప్రాంతంగా రాయలసీమ వుందని ఇదే విషయాన్ని శ్రీకృష్ట కమిటీ కూడా తేల్చిందని ఇందుకు గాను వారు సిక్కిం ప్రభుత్వానికి ఇచ్చిన స్పెషల్‌ ప్యాకేజ్‌ ఇవ్వాలని టిజి వెంకటేష్‌ కోరారు. అలాగే రాయలసీమలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు ఎక్సైజ్‌ సంకం నుండి మినహాయింపు నివ్వాలని కోరారు. రాయలసీమలో అంతులేని ఖనిజసంపద వుందని దాని ద్వారా పరిశ్రమలకు మంచి భవిష్యత్తు ఉంటుందని వారు వివరించారు. అయితే ఇప్పటివరకు పని చేసిన ప్రభుత్వాలేవీ వ్యవసాయ అభివృద్దికి గాని, మంచినీటి సమస్య కు గాని సరైన పరిష్కారం చూపలేకపోయారని టిజి వెంకటేష్‌ ఆరోపించారు. రాష్ట్ర సమైఖ్యంగా వుంటే తమకు ఏ సమస్యా లేదని ఒక వేళ రాష్ట్రం విడిపోతే మాత్రం రాయలసీమను కూడా ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలని, అదే సమయంలో లక్షకోట్లు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేసారు. రాయల సీమలోని 4 జిల్లాలయిన కర్నూలు, అనంతపూర్‌, కడప,చిత్తూర్‌ జిల్లాకు ఒక్కోజిల్లాకు 25,000 వేల కోట్లను అభివృద్దికి కెటాయించాలన్నారు. 1953 లో ఆంద్రరాష్ట్రానికి రాజధానిగా వుందని ఆతరువాత పరిణామాల అనంతరం హైదరాబాద్‌ రాజధాని అయ్యిందని దాంతో రాయలసీమ అభివృద్దికి నోచుకోలేదని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వంతో చిర్చించి నిర్ణయం తీసుకుంటామని వాయిలార్‌ రవి హామీ ఇచ్చారు.

అవగాహన అన్నిటా వుండాలి కదా....!

    జీవవైవిధ్యంపై ప్రజల్లో చైనత్యం కల్సించాల్సిన అవసరం ఉందని హెచ్‌ఐసిసిలో జరుగుతున్న అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సుకు సంబంధించిన అంశాలపై సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షిస్తూ అన్నివర్గాల ప్రజలకు జీవవైవిధ్యం ప్రాధాన్యం గురించి వివరించాల్సిన అవసరం ఉందని, విద్యాసంస్థలు, గ్రామాలు, గిరిజన తండాల్లో ఈ అంశంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఖండాంతర ఖ్యాతి గాంచిన ఒంగోలు ఎద్దులు, పుంగనూరు ఆవులు, నెల్లూరు గొర్రెలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అరుదుగా లభించే పశు పక్ష్యాదుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నిజమే! గిరిజన తండాల్లో జీవవైవిధ్యం గురించి తెలియజేయడమంటే.. వారుండే ప్రకృతి గురించి వారికి చెప్పడమే. ఎందుకంటే ఇప్పటివరకు అడవుల్లో నివసించే గిరిజన తండాల వల్లే కాస్తోకూస్తో అడవులు, అందులోని ప్రాణులు జీవిస్తున్నాయంటే అతిశయోక్తికాదు. నాగరికం నేర్చిన మనిషే వన్యప్రాణులను చంపి తిన్న సంగతి... తింటున్న సంగతి ప్రజలకు తెలిసిన విషయమే. ఎంతో వృక్ష సంపద ఈ తండాలవల్లే రక్షించబడుతోందని చెప్పవచ్చు. ఎద్దులు, ఆవులు, గొర్రెలు, అరుదైన పశుపక్ష్యాదుల గురించి... ఇప్పటికే దేశానికి చెందిన వాటిపై పేటెంట్ల పేరుతో వాటిపై తమకే హక్కువుందని విదేశాలు తమ దుర్భుద్ధిని బయటపెట్టుకున్నాయి. వేప, పసుపు.. ఇలా ఎన్నిటిపైనో.. వాటిపైకన్నుంది... కొత్తగా జాతికే గర్వకారణమై.. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్దిపొందిన ఒంగోలు గిత్తలపై వాటి దృష్టి పడిరది...ఇప్పటికే సంకరం చేసి స్వచ్ఛమైన జాతికి మచ్చ తెస్తున్నారు.. ఇటువంటివాటిని సమర్ధవంతంగా ఎదుర్కోవాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విదేశీ మార్కెట్లతో భారతదేశాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నట్లే... భవిష్యత్‌లో మనకు గుర్తింపుతెచ్చిన ఒంగోలు గిత్తలు.. తదితరాలను వారికి ఉదారంగా మీవేనంటూ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు...మన నాయకులు ప్రజల ఓట్లతో గెలిచినా... ప్రజలనుకంటే... విదేశీ రాజకీయాలనే ఎక్కువగా నమ్ముతారు.... అయినా జీవవైవిధ్యమంటే అన్నివిధాలా వాటిని కాపాడుకోవడం! అది చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తే బావుంటుంది.. అవగాహన అంటే ఎన్నికల సమయంలో కనిపించినట్లుగా కాదు సుమా...!

తమిళనాట రాజకీయాలే వేరు

తమిళనాట రాజకీయాలే వేరు... ఒక సమస్యపై అందరూ ఆవునంటే... వారు కాదంటారు... తమ పనులను చేయించుకోవడంలో అక్కడి నేతలను చూసి మిగతా వారు నేర్చుకోవాలంటే.. అతిశయోక్తికాదేమో! తక్కువ సీట్లున్నా... కేంద్రంలో కీలకపదవులను పొందడంలోనే వారి రాజకీయం తెలుస్తుంది! అంతేకాదు దేశంలోనే భారీ కుంభకోణాల్లో ఒకటైన 2జి కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్ళిన మంత్రికి సైతం కేంద్రంలో నీరాజనాలు పలుకుతున్న తీరును బట్టి తమిళ తంబిల రాజకీయాలను తెలుసుకోవచ్చు. తమిళ రాజకీయాల్లో వృద్ధసింహం కరుణానిధి రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత ఆయన దృష్టాంతా ముఖ్యమంత్రి కుర్చీపైనే...! అందుకే చేతికి ఏ అవకాశం చిక్కినా వదులుకోరు... కుర్చీలో వుండే రాజకీయాలు నడపగల దిట్ట... అందుకే అధికార ఎఐఎడిఎంకె ప్రజావ్యతిరేక కార్యక్రమాలను నిర్వహిస్తోందని... అందుచేత ఇక నుండి... ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు నిరసనగా నల్లచొక్కాలే ధరిస్తానని’ అని కరుణానిధి శపథం చేశారు. మళ్ళీ డిఎంకెకు అధికారంవస్తే అన్ని ప్రజాకార్యక్రమాలే ఉన్నట్లు లెక్క....! ఎలాగో ఆయన నల్లకళ్ళజోడు ధరిస్తారు... ఎదుటివాళ్ళని కళ్ళతో ఎక్కిరిస్తున్నా తెలుసుకోకుండా వుండేందుకు అన్నట్లు... ఇప్పుడు నల్లదుస్తులు...మాత్రమే వేసుకుంటానన్నారు.. ప్రజలు అదృష్టవంతులు... బతికిపోయారు?

మీడియా పాయింట్‌లో మల్లాదికి చుక్కెదురు

మల్లాది విష్ణు, జోగి రమేశ్‌, శ్రీనివాస్‌ ఎమ్మెల్యేలకు శుక్రవారం సెక్రటేరియట్‌లో చుక్కెదురయింది. ఈ ముగ్గురూ మీడియా లాంజ్‌లో విలేకరులతో మాట్లాడారు. లగడపాటి రాజగోపాల్‌ను విమర్శించడం సహించమని, తగిన బుద్ధి చెబుతామని అన్నారు. డిసెంబర్‌ తొమ్మిదోతేదీన మీరే ఈ వివాదాన్ని ప్రారంభించారు? కదా అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు వారు సమాధానం చెబుతూ, సమైక్యాంధ్రను సమర్థిస్తూ మాట్లాడారు. అయితే అక్కడికి వచ్చిన ఒక ముస్లిం తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడడాన్ని సహించలేదు. అసలు తెలంగాణలో ఉండి మీరిలా మాట్లాడి బయటకు పోతారా? అంటూ వివాదానికి దిగే ప్రయత్నం చేశాడు. దీంతో ఎమ్మెల్యేలు అవాక్కయ్యారు. అయితే పక్కనే ఉన్న మీడియా మిత్రులు సెక్రటేరియట్‌లో గొడవ పడకూడదంలూ అతనిని పంపించివేశారు.

మంత్రులకు ఎంపీలకు మధ్య తగవులు

తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన మార్క్‌ రాజకీయాలను ప్రారంభించారు. మంత్రులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి, ఎంపీలను తక్కువ చేయాలని కిరణ్‌ నిర్ణయించినట్లు తెలుస్తున్నది. దీనికిగాను మహబూబ్‌నగర్‌లో జరిగిన ఇందిరమ్మ బాటను వేదికగా చేసుకున్నట్లు తెలుస్తున్నది. సమాచార శాఖ మంత్రికి అధిక ప్రాధాన్యతను ఇచ్చి, ఎంపీలను అసలు పట్టించుకోవడం లేదు. పాలమూర్‌లో ఇది విజయవంతమయితే అన్ని జిల్లాల్లోనూ దీనిని అమలు చేసే ప్రయత్నం జరిగే అవకాశాలున్నాయి. విభజించు పాలించు అన్న సూత్రంతో తెలంగాణలో పార్లమెంట్‌ సభ్యులను మంత్రుల రాజకీయంతో తెలంగాణ వ్యవహారాన్ని అడ్డుకోవాలని కిరణ్‌కుమార్‌రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తున్నది.

ప్రభుత్వ పెద్దలకు ఇంజనీరింగ్‌ ముడుపులు

ఇంజనీరింగ్‌ కాలేజీల టాస్క్‌ఫోర్స్‌ వ్యవహారం ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి మధ్య విభేదాలను తెచ్చిపెట్టింది. ఈ నెల మూడవ తేదీ నుంచి టాస్క్‌ఫోర్స్‌ దాడులు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో జరగాల్సి ఉండగా అనూహ్యంగా వాయిదా పడిరది. గత నెల 30వ తేదీన ముఖ్యమంత్రిని కలిసిన ఇంజనీరింగ్‌ కాలేజీల యాజమాన్యం లోపాయికారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సమాచారం. దీంతో ఉపముఖ్యమంత్రి, ఉన్నత విద్యాశాఖ మంత్రికి తెలియకుండానే టాస్క్‌ఫోర్స్‌ దాడులు నామమాత్రంగానే అదీ కూడా ప్రభుత్వం వద్ద రిజిస్టర్‌ అయినవి మాత్రమే జరపాలని నిర్ణయించారు. ఈ విషయం తనకు తెలియకుండా ఎలా జరిగిందా? అని ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్యమంత్రిపై కినుక వహించారు. అయితే కొన్ని వందల కోట్ల రూపాయలతో ఈ లోపాయికారీ ఒప్పందం జరిగిందని తెలుసుకున్న ఆయన కొంతమంది కాలేజీల యాజమాన్యాలను పిలిచి వాకబు చేసినట్లు సమాచారం. మొత్తం మీద కిరణ్‌కుమార్‌రెడ్డిని మాత్రం తెలంగాణ విషయంలో దామోదర రాజనర్సింహ నిలదీశారు. అసలు ఇందుకు అసలు కారణం ఇంజనీరింగ్‌ టాస్క్‌ఫోర్స్‌ వ్యవహారమే అని తెలుస్తున్నది.

ప్రభుత్వాధినేతకు రూ. 200 కోట్ల మధ్యం ముడుపులు?

మద్యం ధరల పెంపుదలలో కీలక నిర్ణయం తీసుకున్న ఒక ప్రభుత్వాధినేతకు 200 కోట్ల రూపాయల వాటా వచ్చినట్లు తెలుస్తున్నది. అటు ప్రభుత్వానికి, ఇటు మద్యం ఉత్సత్తిదారులకు ఏ విధమైన ఖర్చు లేకుండా మద్యం ప్రియులపై సుమారు 3,500 కోట్ల రూపాయల భారాన్ని వేశారు. దీనిపై ఎక్సైజ్‌ కమిషనర్‌, ఎక్సైజ్‌ ఇన్‌చార్జి మంత్రి పార్థసారథి, ముఖ్యమంత్రితో కలిసి మద్యం ధరలను పెంచేందుకు నిర్ణయించించారు. మద్యం ఉత్పత్తి దారులకు సుమారు 2000 కోట్ల రూపాయలు, ప్రభుత్వానికి 600 కోట్లరూపాయలు, కాగా మిగిలిన మొత్తాన్ని అటు రాజకీయనాయకులకు, ఇటు అధికారులకు ముడుపులుగా ముట్టవచ్చని తెలుస్తున్నది. దీనిలో ప్రభుత్వాధినేతకు వాటా 200 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు కాంగ్రెస్‌ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వాధినేత సోదరుడు ఈ లావాదేవీల విషయంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.

డెంగీ రోగులపై ప్రై వేటు

రాష్ట్రంలోని ప్రయివేటు ఆసుపత్రులు జలగలను కూడా తలదన్నే యత్నం చేస్తున్నాయి. జ్వరం వస్తే చాలు డెంగీ పరీక్షంటూ డబ్బులు గుంజుతున్నారు. అది వైద్యాధికారులకు తెలిసినా రాష్ట్రం అంతటా డేంగీ జ్వరాలపై అవగాహన పెంచే ప్రయత్నమే చేయటం లేదు. జ్వరం వచ్చిన రెండు మూడు రోజులకే రోగులు చనిపోవడంతో పరీక్షలకోసం రోగులు ప్రయివేటు ఆసుపత్రులకు పరుగెడుతున్నారు. ఇదే అవకాశంగా ల్యాబ్‌ టెక్నీషియన్లు డబ్బులు గుంజుతున్నారు. దీనిలో మరో విశేషం ఏమంటే ర్యాపిడ్‌ టెస్టు జరిపిస్తున్నారు. దీనిలో చాలా మందికి డెంగీ లేకపోయినప్పటికీ అది పాజిటివ్‌ గానే చూపుతుంది కచ్చితమైన నిర్ధారణకు రావాలంటే ఎలీషాకిట్‌ ద్వారా మరో సారి పరీక్షించవలసి ఉంది అయితే దాని వరకు వెళ్లకుండానే ప్లేట్‌లెట్స్‌ ఎక్కించాలని చెప్పి మంరింత దోచుకుంటున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వేద్యాధికారులు సరైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు.

కిరణ్‌పై రణభేరి మోగిస్తున్న ఎంపీలు

రాష్ట్రంలో అధికార కాం గస్‌ పార్టీ సభ్యులు ఎప్పుడు ఎవరి తరపున మాట్లాడతారో ప్రజలకు పెద్ద ఫజిల్‌ అయిపోయింది. తెలంగాణకు చెందిన మధు యాష్కీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో చదివినప్పటినుండి ఫ్రెండ్స్‌ మొన్నీ మద్యవరకు ఒకరిని ఒకరు దూషించుకునే పరిస్థితి ఇద్దరికీ లేదు. అయితే రోజులు మారాయి. ముఖ్యమంత్రి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. తెలంగాణ మార్చ్‌ సందర్బంగా నక్లెస్‌ రోడ్‌కి వెళ్లకుండా మధుయాష్కీ మరికొందరు నాయకులు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి ఎదురుగా నిరసన ప్రదర్శన చేస్తుండగా పోలీసులు అరెస్టు చేయడం పై ముఖ్య మంత్రి పై ఆగ్రహం వెళ్లగ్రక్కుతున్నారు. తెలంగాణ ఇవ్వవలసింది కేంద్ర ప్రభుత్వమే అని తెలిసినా మధుయాష్కీ ఇప్పుడు కిరణ్‌కుమార్‌ నే బాద్యులన్నట్లు మాట్లాడుతున్నారు. రవీంద్ర రెడ్డి శాఖాపరమైన అధికారాలను ముఖ్యమంత్రి తగ్గించినప్పటినుండి ఏమాత్రం అవకాశం వచ్చినా కిరణ్‌కుమార్‌పై విమర్శలు చేయడానికి వెనుకాడటం లేదు. ఒకప్పుడు రామచంద్రయ్యకు మంత్రి పదవి ఇవ్వవద్దని అడ్డుకున్న డిఎల్‌ రవీంద్రారెడ్డి ఇప్పుడు అదే రామచంద్రయ్యతో కలసి ముఖ్యమంత్రిని నిలదీస్తున్నారు. ఎవ్వరు ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేసిన వారిదగ్గరకు వెళ్లి మరీ డిఎల్‌ భుజం తట్టి ప్రోత్సహిస్తుంటారు. ఎప్పుడూ తెలంగాణ గురించి పెదవివిప్పనిఉప రాష్ట్రపతి రాజనర్సింహ ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ ఆలపిస్తున్నారు. అయితే ముఖ్య మంత్రి వర్గం కూడా అందుకు ప్రతిస్పందింస్తూ ఎప్పటికప్పుడు కిరణ్‌కుమార్‌కు వెన్ను దన్నుగా ఉంటున్నారు. ముఖ్యమంత్రి, పిసిసి ఛీఫ్‌ ఉప్పు నిప్పుగా ఉండేవారు అయితే అధిష్టానం అక్షింతలు వేసిన కారణంగా ఆయన వెనక్కి తగ్గారు అయినా ముఖ్యమంత్రి కి వ్యతిరేకంగా ఉండే వారిని చాటుమాటుగా కలసి మరీ రెచ్చ గొడుతుంటారు. ఇది రాష్ట్రంలోని కాంగ్రెస్‌ నాయకుల కలహాల కాపురం.

ఇకపై సెల్లు బిల్లు మోత

రానున్న కొద్దిరోజుల్లో వినియోగ దారులకు సెల్లు బిల్లు పేలనుంది. 2 జి స్కాం తరువాత అన్ని సెల్‌ ఫోన్‌ కంపెనీలు వేలం పాట ద్వారా ఆర్డర్లు దక్కించుకోవల్సిరావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిరది. ఇదివరలో సెల్‌ కంపెనీల మద్య వున్న పోటీల మూలంగా ఆఫర్లు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం పెద్దమొత్తంలో ప్రభుత్వానికి సొమ్ము చెల్లించి వ్యాపారాలు మొదలు పెట్టినందువల్ల ఇకపై ఆఫర్లు కట్‌ అంటున్నాయి అన్ని కంపెనీలు. ఇప్పటికే అన్ని సెల్‌ఫోన్ల యాజమాన్యాలు నష్టాల ఊబిలో చిక్కుకున్నాయి. ఒక్క ఫారిన్‌ కాల్స్‌ మీద తప్ప అన్నీ కాల్స్‌ మీద నష్టాలు వస్తున్నాయని సెల్‌ఫోన్‌ కంపెనీలు చెబుతున్నాయి. కాబట్టి అన్ని కంపెనీలు ఖర్చు తగ్గించుకునే పనిలో పడ్డాయి. దాంతో రానున్న రోజుల్లో కాల్‌ రేట్లు పెంచే ప్రయత్నం లో అన్ని కంపెనీలు ఉన్నాయి. అంటే ఉప్పు పప్పు, బియ్యం పంచదారతో పాటు చుట్టాల,స్నేహితుల యోగక్షేమాలు కనుక్కోవడం కూడా ఇకపై భారం అన్న మాట.

జర్నలిస్టులా, ఉగ్రవాదులా ?

హైదరాబాద్‌లో జర్నలిస్టులమంటూ ఎక్కడికి పడితే అక్కడికి వెళుతూ విఐపిల దగ్గర ఇంటర్యూలకోసం అంటూ రెక్కీలు నిర్వహిస్తున్నారనే భయంకరమైన నిజాన్ని పోలీసులు బయటపెట్టారు. బెంగుళూరులో ఆగస్టు 31 పోలీసులు అరెస్టు చేసిన నలుగురు ఉగ్రవాదులు చెప్పిన వివరాల ప్రకారం జర్నలిస్టు పేరుతో రెక్కీ నిర్వహించిన ఒబెద్‌ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. హైదరాబాద్‌, బెంగుళూరు, హుబ్లీలలో పెద్దయెత్తున విద్యంసానికి వీరు పధకం పన్నినట్లు పోలుసులు కనుగొన్నారు. హైదరాబాద్‌లోని మక్కామసీదును, హుస్సేన్‌ ఆలంను పేల్చివేయటానికి కుట్ర పన్నినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇకపై జర్నలిస్టు లంతా తప్పనిసరిగా అక్రిడేషన్‌ కార్డులు కలిగి వుండాలని పోలీసులు ప్రకటించారు. ఇంటర్యూల పేరుతో వచ్చిన వారిని జర్నలిస్టులా కాదా అని నిర్ధారణ చేసుకున్న తరువాత మాత్రమే ఇంటర్యూలు ఇవ్వాలని పోలీసులు విఐపిలను హెచ్చరించారు.

జగన్‌కు షాకిచ్చిన ఇ.డి.

నాలుగు నెలలనుండి జగన్‌ బెయిల్‌ కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు, వైసిపి నేతలు,కార్యకర్తలు సానుభూతి పరులు ఈడి హఠాత్‌ నిర్ణయంతో కంగుతిన్నారు. వైసిపినేత జగన్‌ ఇప్పుడప్పుడే బయటకు రారేమో నని భయపడుతున్నారు. జగన్‌ సంస్ధలు, వాటిలో పనిచేస్తున్న సిబ్బంది జీతభత్యాలు ప్రశ్నార్ధకంగా మిగిలాయి. జగన్‌కు చెందిన 51 కోట్ల రూపాయల ఆస్ధులు అటాచ్‌మెంట్‌ జరిగింది. వివరాల్లోకి వెళితే జగతి పబ్లికేషన్స్‌కు చెందిన 14.5 కోట్ల డిపాజిట్‌ను, హెటిరో ఫార్మాకు చెందిన 8.60 కోట్లు, దాని అనుబంధ సంస్ధగా ఉన్న ట్రైటెండో సైసెన్స్‌ 30.33 ఎకరాల భూమి, అరబిందో ఫార్మా మీద ఉన్న 3కోట్ల ఫిక్సిడ్‌ డిపాజిట్‌ను, జగన్‌ నిర్వహణలో ఉన్న జననీ ఇన్‌ప్రా స్ట్రక్చర్‌కు చెందిన 13 ఎకరాల భూమిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్ట్‌రేట్‌ స్వాదీనం చేసుకుంది. జగన్‌ మోహన్‌రెడ్డి మరికొందరు చట్టవిరుద్దంగా మనీలాండరింగ్‌ చేసినందువల్లే ఈడి ఈ పని చేసింది. 29కోట్ల రూపాయలు మేరకే అవినీతి జరిగిందని ఈడి తెలిపినా చట్ట ప్రకారం అవినీతికి రెండు, మూడు రెట్లు ఎక్కువగా ఫైన్‌ చెల్లించాల్సి ఉంటుంది.అందు వల్ల జగన్‌కు చెందిన 51 కోట్ల రూపాయల అటాచ్‌ మెంట్‌ జరిగిందని న్యాయనిపుణులు చెబుతున్నారు.

వైయస్‌ విజయలక్ష్మి ఆవేదన

    రాజకీయంగా ఎదుర్కొలేకే కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు జగన్‌పై కుట్రతో మోసపూరితంగా వ్యవహరిస్తున్నాయని, జివో లన్నీ క్యాబినేట్‌ నిర్ణయాల మేరకే జరిగాయని మంత్రులంతా చెబుతుంటే క్యాబినేట్‌ తో సంబంధం లేని జగన్‌ ఎలా బాధ్యుడవుతాడని వైయస్‌ విజలక్ష్మి ప్రశ్నించారు. తెలుగుదేశం నాయకులు కేంద్ర మంత్రి చిదంబరాన్ని, షిండేను కలసి మాట్లాడి అస్దులను అటాచ్‌మెంట్‌ చేయాలని కోరారని అదే సమయంలో చిదంబరంతో చంద్రబాబునాయుడు ఫోన్లో మాట్లాడారని అదిజరిగిన వెంటనే రెండు గంటల్లో అటాచ్‌మెంట్‌ ప్రకటన వెలువడిరదని ఆమె తెలిపారు. ఎవరు ఎవరితో మిలాఖత్‌ అయ్యారో ఇప్పడు ప్రజలందరికీ తెలుస్తుందని విజయలక్ష్మీ అన్నారు. ముఖ్యమంత్రి ఇందరమ్మ బాట, చంద్రబాబు నాయుడు మీకోసం బాటల్లో బిజీ కావడానికి కారణం వారిరువురూ కుమ్మక్కవ్వడమే నని చెబుతున్నారు.

అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌లా మారుతోందా!

ఇంకా నామకరణం కూడా పార్టీ అప్పుడే ఓ అవినీతి బాంబ్‌ను పేల్చింది యుపిఎ సర్కార్‌లో ప్రధాన పార్టీ అయినా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీగారి అల్లుడిపై... అది కూడా మామూలుగా కాదు 300 కోట్లు...    ఇండియన్‌ ఎగైనెస్ట్‌ కరప్షన్‌ సభ్యులు అరవింద్‌ కేజ్రీవాల్‌, ప్రశాంత్‌ భూషణ్‌లు రియల్‌ ఎస్టేట్‌  సంస్థ డిఎల్‌ఎఫ్‌ నుండి వడ్డీలేకుండా  65 కోట్ల రూపాయల రుణం పొందారని,  అలాగే కోట్లాది రూపాయల ఆస్తులను ఎలాంటి పూచీకత్తు లేకుండా  కొనుగోలు చేశారని.. కేవలం మూడేళ్ళ కాలంలో తన ఆస్తులను 50 లక్షల నుండి 300 కోట్ల రూపాయలకు పెంచుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం వాద్రాకు ఐదు కంపెనీలు వున్నాయన్నారు.  ఆయా కంపెనీలు వ్యాపార లావాదేవీల ద్వారా సంపాదిందేమీ లేదని.. వడ్డీ ద్వారా పొందిన ఆదాయమేనని అన్నారు.  దీనిపై స్పందిస్తూ.. సోనియాగాంధీ తీవ్రంగా ఖండిరచారు.  వాద్రా వ్యాపారవేత్త అని ఆయనకు అనేక వ్యాపారాలున్నాయని చెప్పారు. అక్రమాలకు పాల్పడవలసిన అవసరం లేదని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఆరోపణల వెనుక బిజెపి హస్తం ఉందని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధులు విమర్శించారు.  ఈ వ్యవహారంపై విచారణ జరిపితే నిజానిజాలేవో బయటకు వస్తాయని బిజెపి అధికార ప్రతినిధి  ముక్తార్‌ అబ్బాస్‌ సఖ్వీ పేర్కొన్నారు. ఏమిటో... దేశం అవినీతి కేరాఫ్‌ అడ్రస్‌లా మారుతోందేమో అనిపిస్తోంది. ఎంతోమందిపై అవినీతిఆరోపణలు వస్తున్నాయి... దానికి సాక్ష్యాధారాలున్నాయని ఇంకొందరు చెబుతున్నారు. కేవలం రాజకీయ ఆటలకోసం కాకుండా అధికార, ప్రతిపక్ష, మిత్రపక్షమన్న భేదంలేకుండా అవినీతి ఆరోపణలు వచ్చిన లేదా ఎదుర్కొంటున్న అందరిపై త్వరితగతిన విచారణ చేపట్టి నిజాలు బయటకు తీస్తే ఆరోపణలు రుజువైన వారికి రాజకీయబహిష్కరణతో పాటు ఆస్తులను జప్తుచేసి అలా సేకరించిన ఆస్తులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులచే ఓ సంఘం ఏర్పాటుచేసి వారి ద్వారా ప్రజోపయోగ కార్యక్రమాలకు వాటిని నిజాయితీగా, లోపాలు లేకుండా ఖర్చుచేయించేలా చూస్తే దేశం వచ్చే ఐదారేళ్ళలోనే అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని సామాన్య ఆశాజీవి ఆశ. అయితే ఆరోపణల్లో నిజానిజాలు ఎలా వున్నా అవి నిరూపణ కావాలిగా.. కానివ్వాలిగా...! మనది ప్రజాస్వామ్యం...! పాలకుల చేతుల్లో, పార్టీల చేతుల్లో వున్న ప్రజాస్వామ్యం.  

భవిష్యత్‌లో... సామాన్యుడికి అందదేమో!

గుండెసమస్యలు, అధిక బరువుతో బాధపడుతున్నారా..? ఎన్ని మందులు వాడినా ఫలితం కనిపించడం లేదా?  అయితే మీరు తప్పకుండా పుచ్చకాయ తినాల్సిందే...! ఇదే దో కొత్తగా ప్రారంభమైన విదేశీ కంపెనీ ప్రారంభోత్సవ ప్రకటన అనుకుంటున్నారా? అబ్బే కాదండీ...! ఇది లండన్‌కు చెందిన ప్యూర్డు యూనివర్శిటీ  నిపుణులు హృద్రోగం, స్థూలకాయ సమస్యలను తగ్గించే గుణం పుచ్చకాయలో ఉందని వారు చేసిన అధ్యయనంలో వెల్లడైంది. దేహంలోని  కొవ్వు స్థాయిని  పుచ్చకాయ తగ్గిస్తుందని,  దానివల్ల స్థూలకాయం సమస్య ఉండదని, అలాగే  ఆవేశాన్ని తగ్గించే లక్షణం పుచ్చకాయలో ఉందని దీనివల్ల గుండెపోటును నివారిస్తుందని నిపుణులు తమ అధ్యయనంలో గుర్తించారు. ఇప్పుడు మనవాళ్ళు దీనిపై దృష్టి పెడతారు. ఎందుకంటే మన పూర్వీకులు పసుపులో ఔషధగుణాలున్నాయని.. అవి ముఖాన్ని కాంతివంతం చేయడంలో, సౌందర్యపోషణకు పనికి వస్తుందని ముఖంనిండా పసుపురాసుకునేవారు. అది నేటితరంలోని ఎంతోమంది ఎబ్బెట్టుగా ఉండి అంతా... అబద్ధం..! పేస్ట్‌లుగా తయారుచేసి విదేశాలనుండి దిగుమతి అయిన వాటిని అధికమొత్తం డబ్బులు పోసి కొని వాడటం ప్రారంభించారు.  అలాగే పుచ్చకాయపై పరిశోధనలు ఫలితంగా  ఇప్పుడు పుచ్చకాయ సుమారుగా 30 నుండి దొరుకుతుంటే.. రాబోయే కాలంలో మూడొందలు అయినా ఆశ్చర్యపోనక్కరలేదు...! అంటే పుచ్చకాయ కూడా గ్యాస్‌, విద్యుత్‌లా.. మారుతుందేమో...! బడా బడా వ్యాపారవేత్తలు దీనిపై దృష్టిపెడితే.. భవిష్యత్‌లో ఇది సామాన్యునకు అందకపోయినా ఆశ్చర్యపోనక్కరలేదు. మనదేశంలో చాలామందిలో మనవాళ్లు చెప్పింది అంతా అబద్ధంగా అనిపిస్తుంది... అదే  కొత్తసీసాలో పాతసారాలా... అదే విషయం విదేశాల నుండి వచ్చిందనుకోండి అప్పుడది నమ్ముతారు...! ఇటువంటి వాళ్ళు మారరు.. అంతే!

జగన్‌కు జైలే, నో బెయిల్

అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. జగన్ బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. జగన్ బెయిల్ పిటిషన్‌పై కోర్టులో హోరా హోరీ వాదనలు జరిగాయి. జగన్ అరెస్ట్ అక్రమమని వెంటనే బెయిల్ మంజూరు చేయాలని జగన్ తరపు లాయర్ వాదించారు. అయితే జగన్ అక్రమాస్తులపై దర్యాప్తుకు ఇంకా మూడు నెలల సమయం పడుతుందని, ఇప్పటికే మూడు వేల కోట్ల ఆస్తులను కనిపెట్టామని, వేలాది కోట్ల ఆస్తులను దర్యాప్తు చేయాల్సి ఉందని సీబీఐ తరపు న్యాయవాదులు వాదించారు. విదేశీ నిధుల ప్రవాహనం దర్యాప్తు కొనసాగుతుందని కోర్టుకు తెలిపారు. జగన్ కంపెనీల్లోకి వచ్చిన హవాలా మనీ మార్గాలను కొన్నింటిని చేధించామని న్యాయవాది మోహన్ పరాశరణ్, అశోక్‌భట్ వాధించారు. జగన్‌కు బెయిల్ ఇస్తే సాక్షులను తారుమారు చేస్తారన్నారు. జగన్ సహకరిస్తే దర్యాప్తు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉందని లాయర్లు కోర్టులో వాదించారు. సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు జగన్ ఇంత తక్కువ వ్యవధిలో ఇన్ని వేల కోట్ల ఆస్తులను ఎలా సంపాదించగలిగారని జగన్ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు.

ఆదాయం కావాలి కాని....

మంత్రిగారింట్లో పెరటిగోడ గేటు పిల్లల ఆటల్లో ఊడిపోయిందంటే ఆ వార్త ముద్రణ అయ్యేలోపే ఆ గేటు, ఆ గోటున్న గోడను కూడా వెంటనే బాగుచేసేస్తారు.  కాని... కోట్లల్లో... లక్షల్లో... ఆదాయాలను దండుకుంటూ... ఎక్కువ ఆదాయం వస్తూ దేవాదాయశాఖలో కలవని దేవాలయాలను కలుపుకుంటూ.. కనీసం రక్షణచర్యలు కూడా తీసుకోకుండా ఆర్జనపైనే అంతా దృష్టిపెట్టే దేవాదాయశాఖకు నిర్లక్ష్యానికి  భక్తుల నమ్మికకు విఘాతం కలిగించేలా శ్రీశైల మహాక్షేత్రం మహా ప్రాకార కుడ్యం ఉత్తరం వైపు వున్న  శివాజీ గోపురం  కుప్పకూలి కలశాలు సైతం మట్టిలో కూరుకుపోయాయి.   రెండు సంవత్సరాల క్రితం శ్రీకాళహస్తిలోని ఆలయ రాజగోపురం  కుప్పకూలిపోయింది. దాని నిర్మాణానికి ఎంతోమంది దాతలు ముందుకువచ్చినా... దేవాదాయశాఖ, పురావస్తుశాఖల వ్యవహరశైలి వల్ల ఇంకా నిర్మాణానికి నోచుకోనేలేదు. ఇప్పుడు ఈ శ్రీశైలం  ఆలయం శివాజీ గోపురం. రాష్ట్రంలోని పలు దేవాలయాల నుండి ప్రతి ఏడాది వచ్చే సొమ్మును దేవాదాయశాఖకు తరలించుకుని దాన్ని  వివిధ రకాలుగా ఖర్చుచేసే ప్రభుత్వ అధికారులు ఆలయాలను, అందలి ఉద్యోగులను, అర్చకులను మాత్రం పట్టించుకోరు.  చివరకు తమ రాజకీయాలను సైతం దేవాలయాలకు సైతం విస్తరించారు.   మిగిలిన మతాలకు  వాటికి సంబంధించి ప్రత్యేక శాఖ ప్రభుత్వ ఆధీనంలో లేనప్పుడు.. మరి హిందు దేవాలయాలకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక శాఖ ఎందుకు? దాని వల్ల దేవాలయాలకు ఫలితం ఏముంది? రాజకీయ నాయకుల పునరావాస పదవులకు, ప్రభుత్వానికి ఆదాయం కోసం  తప్ప. ప్రభుత్వం నుండి దేవాదాయశాఖను విడదీసి.. దాన్ని స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థగా ఏర్పాటుచేసి ఆయా ఆలయాలకు చెందిన పూర్వీకులను (ఉన్నవారిలో) కొందరిని ఆయా ప్రాంతాలకు ఎన్నుకుంటే ...అది స్వతంత్రంగా... ఆయా ఆలయాల పర్యవేక్షణ, భద్రత, భక్తుల సేవలు తదితరాలు వారే చూసుకుంటారు. .. ఇందులో మాత్రం రాజకీయ  నాయకులకు చోటు వుండకూడదు!  ఆదాయానికి తీసుకనేందుకు ముందుంటారు కాని....మరమ్మతులకు వస్తే మాత్రం వారికి వినపడదు, కనపడదు. నే ఎక్కేబండి జీవితకాలం లేటు అన్నట్లుగా కాకుండా ఇప్పటికైనా నేతలు, అధికారులు మేల్కొని.. రాష్ట్రంలో శిథిలావస్థలో వున్న ఆదాయంతో పనిలేకుండా అన్నిటికి మరమ్మతులు చేయించాలని.. లేదంటే.. ఇది కోట్లాదిమంది భక్తుల నమ్మికను మోసంచేసినట్లవుతుందని... భక్తులు అభిప్రాయపడుతున్నారు.